సైన్స్ కి ఓ ప్రశ్న..ఓ వాదన?

మనం నివశించే ఈ విశ్వాన్ని ఓ లోకం అనుకొందాం.ఈ విశ్వం తో అసలు పోలికే లేని (absolutely mutually exclusive) వేరొక అధిభౌతిక లోకం ఉందనుకొందాం.అంటే ఆ లోకపు విషయాలు మన ఊహకు కూడా అందవన్న మాట! అంటే మన విశ్వం లో ఉన్న వస్తువులేమీ ఆ విశ్వం లో ఉండవు. ఇక్కడ ఉండే ఆలోచనలు అక్కడ ఉండవు. ఆ లోకపు భౌతిక నియమాలు వేరే. అక్కడి ఊహలూ, పరిభావనలూ ఇక్కడి వాటితో అస్సలు కలవవు అనుకొందాం. ఇక్కడ నిరూపించబడిన విషయాలు అక్కడ నిరూపించబడాలని లేదు.మన మాత్స్ కి అక్కడ ఏమి ఉందో అందను కూడా అందదు అనుకొందాం. 

సైన్స్ ముఖ్యం గా భౌతిక నిరూపణల మీద ఆధారపడుతుంది. మన ఈ లోకం లో నిరూపిపంపబడని విషయాలు నేను పైన చెప్పిన అధిభౌతిక లోకం లో ఉండవచ్చు.
సైన్స్ కి నా ప్రశ్న ఏమిటంటే,……. మనకు ఉనికి ఉన్న ఈ భౌతిక లోకం లో చేసిన ప్రయోగాల ద్వారా నిరూపించలేని విషయం, వేరొక అధిభౌతిక లోకం లో ఖచ్చితం గా ఉండవచ్చు.కానీ మన అస్థిత్వం ఈ లోకానికే పరిమితం. మనిషినుంచీ పుట్టిన సైన్స్ మనిషి కి అస్థిత్వం లేని లోకాలకు వర్తించదు…..కాబట్టీ శాస్త్రీయ నిరూపణలన్నీ(scientific proofs) ఈ అధిభౌతిక ప్రపంచానికి వర్తించవు కదా?
కాబట్టీ సైన్స్, “ఫలానా విషయం నిరూపించబడలేదు”, అని చెప్పినపుడు, “మన ఉనికి ఉన్న భౌతిక లోకం లో మాత్రమే”, అని ఓ డిస్-క్లెయిమర్ తగిలించటం మంచిది.
మనం నాలుగు కొలతల జీవులం (4 dimensional creatures). ఐదో కొలతలో, లేక పన్నెండో కొలతలో ఏమి ఉంటుందో మనం కనిపెట్టిన నాలుగుకొలతల సైన్స్ నిరూపించలేదు కదా!
అటువంటి లోకం ఉన్నంత మాత్రాన మన విశ్వాసులు జబ్బలు చరుచుకోనవసరం లేదు. ఎందుకంటే, ఆ అధి-భౌతిక లోకాన్ని మన విశ్వాసులు కూడా చూడ లేదు. దానిపై విశ్వాసుల నమ్మకం కేవలం కాకతాళీయం మాత్రమే!

అలానే ఆ అధిభౌతిక లోకం లేక పోతే, సైన్స్ కి, “చూశారా నేను ముందే నిరూపించాను!”, అనే హక్కు లేదు. ఎందుకంటే సైన్స్ చూపిన నిరూపణలు ఆ లోకానికి సంబంధించినవి కావు. ఆ నిరూపణలు ఈ లోకానికి సంబంధించినవి.
ఆ అధిభౌతిక లోకం లేనపుడు కూడా ఉందని నమ్మే వారు అంధవిశ్వాసులౌతారు.
ఇదంతా చదివాక పాఠకులు ఓ ప్రశ్న వేయాలి..ఏమిటండీ ఇంకా ఎవరూ అడగటం లేదూ?

రజనీష్ పుస్తకమూ, నా సోదీ, గోలా, మొదలైనవి..

ఈ మధ్య నేను ఓషో అనబడు రజనీశ్ రాసిన The book of secrets ని చదువుతూ..ఊ.. ఉన్నాను.ఇది చాలా పెద్ద పుస్తకం. ఓ హార్డ్ కాపీ లభించటం వలన చదివే సాహసానికి ఒడిగట్టాను. ఓషో చాలా వివాదాస్పదమైన వ్యక్తి. ఇంటర్నెట్ లో ఆయన గురించిన సమాచారం చాలానే లభిస్తుంది. ఆయన ను అభిమానించే వారు కొందరైతే, వ్యతిరేకించే వారు కొందరు. ఆయన కొందరికి భగవాన్ అయితే మరికొందరికి కల్తీ స్వామి. నేను ఈ టపా లో ఓషో వ్యక్తిగత జీవితం గురించి రాయబోవటం లేదు.  ఆయనను ఎక్స్-పోజ్ చేస్తూ ఆయన బాడీ గార్డ్ రాసిన పుస్తకం దగ్గరి నుంచీ, ఆయనను దేవుడి గా స్థుతిస్తూ ఆయన అభిమానులు రాసిన అనేక పుస్తకాల వరకూ నెట్లో లభ్యం.
ఈ టపా , ఓషో పుస్తకం చదువుతూ ఉంటే నాలో కలిగిన ఆలోచనలను, పంచుకోవటానికి రాస్తున్నాను.
ఈ పుస్తకం లో ఓషో, “ఓ మనిషి కి జ్ఞానోదయం కావటానికి అవసరమైన తాంత్రిక పధ్ధతులు”, చెప్తున్నానంటాడు”. ఆయన సమకాలికుడైన జిడ్డు కృష్ణమూర్తి తో పోలిస్తే ఓషో చాలా resourceful. ఆయన తత్వ శాస్త్రం లో post graduate. దేశ విదేశాల తాత్విక ఆధ్యాత్మిక విషయాల గురించిన ఆయన పరిజ్ఞానం అమోఘం.ఆయన ఉపన్యాసాలలోని convincing power అమోఘం! అనేక దృష్టాంత కధలతో ఆయన ప్రవచనాలు చదువరులను కట్టిపడేస్తాయి.
జనాలకు ఏది కావాలో ఆయనకు బాగా తెలుసు. ఎటువంటి జనాలు తన దగ్గరకు వస్తారో కూడా తెలుసు.
ఆధ్యాత్మికత లో పడి ఆయన కోసం వచ్చే వారి లో చాలా మంది ఉన్నత తరగతుల వారు ఉంటారు. వారికి జీవితం లో అన్నీ అమరి ఉంటాయి. ఇక మిగిలింది ఆధ్యాత్మికత, enlightenment, మోక్షం, కైవల్యం.
“ఈ మోక్షం అనేది మానవ ప్రయత్నం తో సాధ్యం కాదు”, అని ఓషో చెబుతారు. ఎందుకంటే ఆ స్థితి లో “నేను” అనేది ఉండకూడదు. మనిషి ప్రయత్నం చేస్తున్నపుడు “నేను” తప్పకుండా ఉంటుంది. అలానే కైవల్యం అనేది కొన్ని రోజుల్లోనో , సంవత్సరాలలోనో సాధించేది కాదు. ఎందుకంటే, అలా సాధించే దానిలో “అహం” అన్నది తప్పకుండా ఉంటుంది. పాత వాసనలు ఉంటాయి.
ఇవన్నీ చెప్పిన ఓషో తన  అభిమానులను నిరాశ పరచదలుచుకోనట్లు కనపడుతుంది. ప్రయత్నం చేయాల్సిందే నంట. ఎందుకంటే ఈ జన్మ లో కాకపోయినా మరో జన్మ లో అయినా ఆ స్థితి నిన్ను వరించినపుడు, నీ వ్యక్తిత్వ వ్యవస్థ అందుకు సిధ్ధం గా ఉంటుందట. అంటే ఈ టెక్నిక్ పని చేయకపోయినా, సేఫ్ గా ఉండటానికి డిక్లెయిమర్ పారేశాడు. లేక పోతే, పక్కా గా ఈ టెక్నిక్స్ పని చేస్తాయని చెబితే, పని చేయని వాళ్ళు వచ్చి నిలదీస్తారు.

ఇక పోతే ఈ పుస్తకం లో వందకు పైగా తాంత్రిక టెక్నిక్స్ ఉన్నాయి-అని ఓషో చెప్పాడు. ఇవి చాలా వరకూ మనిషిని మోక్షానికి ప్రిపేర్ చేసేవట, కానీ వాటి వలన కైవల్యం ప్రాప్తించదట. కానీ వీటి లో కొన్ని(ఓ ఏడు) టెక్నిక్లు సడన్ గా మోక్షాన్ని తెచ్చేస్తాయట. కానె అవి ఏ యేడో ఆయన చెప్పలేదు. చెప్తే తేడా అయిపోద్ది మరి. అవి పని చేయవు గా.
పని లో పని గా జిడ్డు కృష్ణ మూర్తి మీద చెణుకులు. వాళ్ళిద్దరూ కాంపిటీటర్స్ అనుకొంటా! జిడ్డు కృష్ణ మూర్తి ధ్యానం వద్దన్నాడట. కాని ధ్యానంఅనేది ఓ necessary evil అట. జిడ్డు కృష్ణ మూర్తి కి జనాల కు వినోదాత్మకం  గా చెప్పటం రాదట.  (ఇది మాత్రం నిజం! జిడ్డు తో పోలిస్తే, ఓషో చాలా engaging గా చెబుతారు.”కారణ లోకాలూ, సూక్ష్మ లోకాలూ, పునర్జన్మల”, లాంటి మసాలా లేక పోతే, ఆ ప్రసంగాలు జిడ్డు కృష్ణమూర్తి ప్రసంగాల్లా నీరసం గా ఉంటాయి. కరక్టే! రజనీష్ ఎంటీవోడు లాంటోడైతే, జిడ్డు నాగేస్రావు లాంటోడన్న మాట!  ).  కానీ నాదో సందేహం! ఓ సీరియస్ విషయం గురించి సీరియస్ గా ఉన్న వారికి entertaining గా మాట్లాడటం కుదరదేమో!
నాకు ఈ పుస్తకం చదివాక ఓషో ఒకప్పుడు ప్రపంచం లోకెల్లా డబ్బున్న గాడ్-మేన్ ఎందుకయాడో అర్ధమయింది. యూ జీ కృష్ణ మూర్తి ఈ enlightenment బిజినెస్ గురించి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.

ఓషో గారి ప్రకారం శంకరుడు, “జగం మిధ్య అని”, జనాలను ఆధ్యాత్మికత వైపుకి (జనాలకు తెలియకుండానే, వారి అనుమతి లేకుండానే) మళ్ళీంచే  ఓక చిట్కా(device) లా చెప్పాడట! అది సత్యాన్వేషణ లో భాగం గా చెప్పలేదట!అద్వైతాన్ని మొత్తాన్నీ ఓ చిట్కా అనేశాడు!  పాశ్చాత్యులు తప్పుగా, దానిని ఓ తత్వం గా అర్ధం చేసుకొన్నారట!   ఇంతకీ ఈయన చెప్పొచ్చేదేమిటంటే, జనాల మంచి కోరి శంకరుడు జనాలను మభ్యపెట్టాడని. అలానే యేసు క్రీస్తు గురించి కూడా చెప్పారు. Not convincing! శంకరుని లాంటి వారు ఓషోనా ఏమిటి, అలా చెప్పటానికి? ఒక వేళ అలా చెప్పినా దానిని ఈయన సమర్ధించటం నాకు నచ్చలా. అన్వేషకుడు ఎప్పుడూ సత్యం మీదే దృష్టి పెట్టాలి కదా?

నేను ఇంతకు ముందు దొంగ బాబా ల గురించి రాసిన టపాలోని బాబా కంటే, కొన్ని వందల రెట్లు తెలివైన, నిపుణుడైన బాబా గా కనిపించాడు రజనీశ్, ఈ పుస్తకం చదువుతూ ఉంటే!

ఆధ్యాత్మికత అంటే బాగా ఆసక్తి ఉన్న వారు(ప్రత్యక్షానుభవాల పట్ల ఆసక్తి ఉన్నవారు), దానిని నమ్మే వారూ, చక్క గా కృష్ణ భగవానుడి నుంచీ నేరుగా జాలువారిన ది గా చెప్పబడుతున్న, authentic అయిన గీత నే చదువుకోవచ్చు కదా!. “ఇలాంటి మధ్యవర్తుల interpretations మనకి అవసరమా?”, అనిపించింది. చాలా డబ్బులు పోసి మరీ ఇలాంటి వారి ఆశ్రమాలను సపోర్ట్ చేసే వారిని, ఈ గురువులు ఇచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచీ కోలుకోలేక జీవితాంతం బాధపడే వారినీ  గురించి జాలి వేసింది.

ఇక, ఈ పుస్తకం చదివిన తరువాత,  మేధోపరం గా సృష్టి రహస్యాల గురించి తెలుసుకోవాలంటే శాస్త్రీయ పరిశోధనలకు మించిన మార్గం లేదనే నా నమ్మకం మరింత బలపడింది.
ఈ పుస్తకం నెట్లో దొరికింది. సాఫ్ట్-కాపీ ఇక్కడ. Osho_The_Book_of_Secrets. ఆసక్తీ సమయమూ ఉన్న వారు చదువుకోవచ్చు. హెచ్చరిక: చాలా పెద్ద పుస్తకం.

వంద దాటిన నా స్కోర్– రావూరి భరద్వాజ – యండమూరి

TSE-SS

స్వయం ప్రకాశక పుస్తకాల అమ్మకం ఎలా ఉంటుందో కానీ, కినిగె లో,  నా “ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ కథ“, ఈ-పుస్తకం కొనుగోళ్ళు (అద్దెలూ,కొనుగోళ్ళూ కలిపి) వంద దాటింది.. కొనుగోలు దారులకు “రొంబ నండ్రి”.

కానీ ఎవరూ కామెంట్లు పెట్టలా..కామెంటేంత బాలేదనుకొంటా..ప్చ్..

—————————————————————————-

రావూరి భరద్వాజ - పాకుడు రాళ్ళు, చిన్నప్పుడెపుడో చదివాను. ఎంటీఆర్, నాగేస్రావు, సావిత్రి ల ను పోలిన పాత్రలు (లేదా నేను అలా పోల్చుకొన్న పాత్రలు) ఉన్నట్లు గుర్తు. అప్పట్లో యండమూరి రచనా ప్రవాహ ఉధృతి లో కొట్టుకుపోతున్న నేను, పాకుడు రాళ్ళ మీద నుంచీ జారి మళ్ళీ ప్రవాహం లో పడి కొట్టుకొనిపోయాను.
పుస్తకం మీది రావూరి గారి ఫొటో లో అప్పుడు కూడా ఇప్పటిలానే తెల్ల బవిరి గడ్డం, తెల్ల దుస్తులు ఉన్నట్లు గుర్తు. పుస్తకం రాసిన రెండు తరాల తరువాతైనా, ఆయన జీవించి ఉండగానే జ్ఞానపీఠ రావటం సంతోషం కలిగిస్తోంది. మన ప్రభుత్వం వారి పనులు అసలే నెమ్మది అనుకొంటే, అవార్డులు ఇవ్వటం లో ఇంకా స్లో అనుకొంటా!

నాగేస్రావూ, రామా రావూ ఓ వెలుగు వెలిగిన కాలం నాటి సినీ రంగపు వాస్తవ జీవితం, ఈ కాలపు సమాజానికి ఎంత వరకూ relevant? ఆ relevancy ఏదో తగ్గక ముందే, అప్పట్లోనే ఆ అవార్డ్ ఇస్తే, వాళ్ళ సొమ్మేం పోయింది?

ఇంకో విషయం మర్చిపోయా..అలానే, దీన్నిబట్టి చూస్తే, మా యండమూరి బావుక్కూడా, ఇప్పుడు కాక పోయినా, ఓ ఇరవై లేక ముప్పై యేళ్ళ తరువాత, ఆఖరి పోరాటానికి కాక పోయినా, ఏ ఆనందో బ్రహ్మకో, అంతర్ముఖానికో, ఓ జ్ఞానపీఠం వస్తుందని ఆశిస్తాండా!

గురూజీ ల మాటల కు అర్ధాలె వేరులే!

వాక్కు: ఆధ్యాత్మికత అంటే అదేదో హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోవటం కాదు. కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తూనే ఆధ్యాత్మికం గా ఎదగ వచ్చు.

లో వాక్కు: అవును మరి. అందరూ హిమాలయాల కు వెళ్తే, మా సంస్థల లో డబ్బు కట్టి మరీ ఎవరు చేరతారు. అయినా సన్యాసుల దగ్గర డబ్బు ఎందుకుంటుంది. అందుకనే సంసారులని ఈ ఆధ్యాత్మికత లోనికి ఆకర్షించాలి.

భాషణ: మా మార్గం శాస్త్రీయమైనది.
అభిభాషణ:ఈ మధ్య జనాలు చదువుకొని తెలివిమీరి సైన్స్ ని నమ్ముతున్నారు. నా మార్గానికి విశ్వసనీయత రావాలంటే, “అది సైంటిఫిక్” అని చెప్పక తప్పదు. అలానే మత గ్రంధాలు చెప్పిన దానికీ సైన్స్ కీ సామ్యం ఉన్న చోట మత గ్రంధాలను కూడా కోట్ చేస్తుంటాం. సామ్యం లేని చోట దాని గురించి మాట్లాడం.

మాట: సైన్స్ చాలా పరిమితమైనది. దానికి తెలిసింది చాలా తక్కువ. సైన్స్ కి అందని విషయాలు చాలా ఉన్నాయి.

లో మాట: ఎవడన్నా మహిమలని ప్రయోగశాల లో నిరూపించమంటే అదో చిక్కు. సైన్స్ కి అందని విషయాలు నాకు మాత్రం అందుతాయా ఏమిటి?సైన్స్ తనకి తెలియని విషయాలని తెలియదు అని ఒప్పుకొంటుంది. మేము కూడా అలా ఒప్పుకొంటే, ఇక మా దగ్గరికి ఎవరు వస్తారు? జనాలను ఆకర్షించటానికి ఏదో ఓ మహిమ చూపించాలి.

పై గుట్టు: వచ్చే రెండేళ్ళ లో ప్రపంచమంతా నా మార్గాన్ని అనుసరిస్తుంది.నా మార్కు ధ్యానం ప్రపంచం అంతటా విస్తరిస్తుంది.

లో గుట్టు: నాకు ఆత్మ పరిశీలన ఎక్కువ.నాకు పేరు సంపాదించటమంటే ఆశ ఎక్కువని నా ఆత్మ పరిశీలన లో తేలింది.పేరు తో పాటే పవర్ కూడా వస్తుంది.

ఓ మాట: మా సంస్థ డబ్బులను ఆశించదు. ఏదో.. సంస్థ ను నడిపించటానికి కొంచెం ఫీజు తీసుకొంటాం, కొన్నిపుస్తకాలు అమ్ముతాం.
రెండో మాట: నాకు డబ్బు కంటే పేరు మీద మోజెక్కువ. అయినా ఆధ్యాత్మికత కీ సంస్థాగత వ్యవస్థ కీ చుక్కెదురని జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన మాటలు ఈ జనాలకు తెలిస్తే ఇక నా గతేం కాను. ఆ కృష్ణ మూర్తికే తన సమావేశాలకి ఫీజు పెట్టటం తప్పలేదు, ఇక నేనెంత?

నుడి: ఆధ్యాత్మిక సాధన లొ వచ్చే పరిణతి ని బట్టి మేము మాస్టర్ అనీ, మెగా మాస్టర్ అనీ ఇలా అనేక రాంకులు ఇస్తూ ఉంటాము. మా మాస్టర్ల దగ్గర దీక్ష పుచ్చుకొనక పోతే, అలాంటి వారికి మోక్షం రాదు. ఎందుకంటే, తర తరాల మా గురువుల శక్తి మా మాస్టర్ల ద్వారా ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఆ విధం గా అనర్హుల చేతిలోకి ఈ శక్తులు వెళ్ళకుండా కూడ మేము కనిపెడుతూ ఉంటాము.

మున్నుడి:మోక్షాన్ని స్కేలు పెట్టి కొలుస్తామా ఏమిటి? మా సంస్థ లో చేరే వారికి ఒక sense of empowerment కల్పించటానికి ఈ రాంకులు ఇస్తాము. ఏ ఆర్గనైజేషన్ లో అయినా ఈ రాంకులు తప్పని సరే కదా? సమావేశాలలో మాకు ఇబ్బంది కలిగించే ప్రశ్నలు అడిగే వారిని ఈ మాస్టర్ల సహాయం తో అదుపు లో పెట్టవచ్చు.రాంకులు ఇస్తే జనాలు మనకు సంస్థాగతమైన పని చేసి పెడతారు. మనిషికి తగ్గట్టు గా లౌక్యం గా మెలిగితేనే సంస్థ విస్తరిస్తుంది. మా పధ్ధతులు ఎవరైనా ఎలాగైనా పాటించవచ్చంటే, ఇక మా దగ్గరికి వచ్చేదేవరు.అందుకనే మా ద్వారా నేర్చొకొంటేనే ఫలితం వస్తుందని పేటెంట్ పెట్టేశాం. అమెరికా లో అయితే నిజమైన పేటెంట్ నే తీసుకొన్నాం లెండి.అమెరికా వాళ్ళు కూడా మా పధ్ధతిని అనుసరించటానికి సౌకర్యం గా, బైబిల్ నీ, భగవద్గీత నీ వేదాలనీ ముడి పెడుతూ, మా ధ్యానాన్ని fine tune చేసేశాం. అక్కడి సువార్తీకులు ఇక్కడ జనాలని ఆకర్షిస్తుంటే, మేము అక్కడి భక్తులని ఆకర్షిస్తున్నాం.ఇక ఖురాన్ కి కూడా ఏదో ఓ లింకు కనిపెట్టాలి. ఓ ఇద్దరు డాక్టర్లనీ, ఇంకో సైంటిస్ట్ నీ కూడా మన సంస్థలొకి ఆకర్షించగలిగితే జనాలు ఇకా ఎక్కువ గా నమ్ముతారు.  దీక్ష ఇవ్వటానికి ఆధ్యాత్మిక అర్హత ఉండాలి. అయితే అర్హతలు రాజకీయ నాయకులకీ, ప్రముఖులకీ దీక్ష ఇవ్వటానికి మాత్రం అడ్డు రావు.

నా మాట: అద్వైత స్థితి వలన మనుషులు మారి తద్వారా సమాజానికి మేలు జరుగుతుంది.
నీతో మాట: నా దగ్గరికి ఎంతో మంది రాజకీయులు వస్తారు. కాసేపు ప్రశాంతం గా ధ్యానం చేసుకొంటారు. బయటికి వెళ్ళి మామూలు గానే అవినీతి చేస్తారు.
అద్వైత స్థితి పొందిన యూజీ నే చెప్పాడు, ఆ స్థితి వలన ఎటువంటి మత పరమైన, ఆధ్యాత్మికమైన, రాజకీయమైన, సామాజికమైన పర్యవసానాలూ ఉండవని. అదో ప్రత్యేకమైన స్థితి అంతే! సమాంతరం గా మనుషులందరి మేలు కోసం,మనుగడ కోసం జరిగే వ్యవస్థా పరమైన, వ్యక్తిపరమైన ఇతర ప్రయత్నాలు జరుగుతూనే ఉండాలి. కానీ ఈ మాట చెప్తే, పెద్ద పెద్ద వ్యాపార వేత్తలూ, సినిమా నటులూ నాకు డొనేషన్లు ఎలా ఇస్తారు? వారికి మోక్షం చూపిస్తే నే మనకి లాభం. ఆధ్యాత్మికత, క్లిక్ అయితే బాగా లాభ సాటి వ్యాపారం . ఎందుకంటారా? రజనీకాంత్ లా జీవితం లో అత్యున్నత స్థితికి వెళ్ళిన తరువాత, అటువంటి వారు ఓ ఒంటరి తనాన్ని ఫీలవుతారు.ఇక సాధించటానికి ఏమీ మిగిలి ఉండదు. కానీ వారి సక్సెస్ వలన వారి దగ్గర డబ్బు బాగానే ఉంటుంది. వారికి ఇంకా సత్యమనీ, మోక్షమనీ చూపిస్తే, వారు మళ్ళీ తమ పేరాశ ని కొనసాగిస్తారు ఆ ప్రక్రియ లో మనకీ కొంత ముడుతుంది.

జనం తో మాట: నా దగ్గర అద్వైత స్థితి ని సాధించేందుకు టెక్నిక్కులు ఉన్నాయి.
మనలో మాట: ఓ వంద టెక్నిక్కులు చెప్తాం. పని చేసిందనటానికి ప్రమాణాలేమీ ఉందవు. ఎవరో ఒకరి కి ఏదో ఓ కారణం వలన కొంచెం స్వస్థత వస్తే వారే పని చేస్తుందని చెప్తారు. టెక్నిక్కుల వలన ఆ స్థితి కి వెళ్ళ గలిగి తే అది “సమయానికందని స్థితి”  ఎందుకవుతుందీ? ప్రయత్నం వల్ల సాధ్యం కానిది టెక్నిక్ వలన సాధ్యమౌతుందా? ఏదైనా నేను కొంచెం మెరుగు. కొంతమంది బాబాలు డ్రగ్స్ వాడమని సలహా ఇస్తారు.

చివరి మాట: అద్వైత స్థితి తో పరిపూర్ణ సత్యం అవగతమౌతుంది.
చివరాకరి మాట: అద్వైత స్థితి అనేది మనుషుల, ప్రాణుల అస్థిత్వ పరిధిలోనిదే.కానీ అరుదైన అనుభవం.
పరిపూర్ణ సత్యం అనేది మనుషులెవరికీ అనుభవమవ్వదు. ఎందుకంటే అది మనిషి అస్థిత్వ పరిధి కి బయట ఉంది.ఈ సృష్టీ, విశ్వాల అస్థిత్వ పరిధి కి బయట ఉంటుంది. కాబట్టీ అద్వైత అనుభవం వలన పరిపూర్ణ సత్యం తెలియదు. అంటే, పరిపూర్ణ సత్యం నీకెంత అనుభవమో, నాకూ అంతే అనుభవం. నాకూ తెలియదు..కానీ ఈ విషయాన్ని మా పుస్తకాలలో ఎక్కడో ఓ మూల చెబుతాం. రేపు ఎవరైనా జనాలను మోసం చేశామని చట్టపరమైన చర్య తీసుకొంతే ఇది ఓ డిస్క్లెయిమర్ లా పని చేస్తుంది. ఈ తెలుసుకోలేని పరిపూర్ణ సత్యానికీ, తెలిసిన దైనందిన జీవితానికీ మధ్య అనేక అందమైన, హాయిగొల్పే ఊహ లోకాలనీ,మహిమలనీ, పునర్జన్మలనీ కల్పించి జనాలను ప్రలోభ పెట్టటమే మా ప్రజ్ఞ. మా దగ్గరికి వచ్చే కంటే ఇంట్లో భగవన్నామ స్మరణ చేసుకొంటేనో, ధ్యానం చేసుకొంటేనో మానసిక ప్రశాంతత దొరుకుతుంది. కానీ ఈ విషయం చెబితే, ఇంకా మా ప్రత్యేకత కి ఏమౌతుంది? “పరిపూర్ణ సత్యం నాకు అందిన”దని చెప్పుకోవటం లో ఇంకో ఉపయోగం ఏమిటంటే, అప్పటి నుంచీ నేనే దేవుడిని అని కూడా నమ్మబలక వచ్చు.

మనలో దాగున్న రేపిస్ట్

నాకు ఓ ఐదేళ్ళ వయసున్నపుడు, ఓ పల్లెటూరి సినిమా హాలు కి వెళ్ళే వాడిని. సినిమా లో, ఏ గిరిబాబో, సత్యనారాయణో హీరో గారి చెల్లిని రేప్ చెసే వాళ్ళు. రేప్ మొదలవ్వగానే హాల్ అంతా ఈలల తో మారు మోగేది. నాకు ఆ వయసు లో, జనాలు ఎందుకు ఈలలు వేస్తున్నారో అర్ధమయ్యేది కాదు. పాపం విలన్ హీరోయిన్ ని ఆ విధం గా హింసిస్తుంటే, ఈలలు వేసే జనాల మీద కోపం వచ్చేది. అదే జనం,  క్లైమాక్స్ లో విలన్ ని హీరో గారు చితక కొడుతుంటే కూడా ఈలలు వేసే వారు.
సెక్స్ కి ముఖం వాచిన జనాలు అలా చేసే వారా?
ఇంకో సంఘటన. ఓ ఐదేళ్ళ తరువాత ఏదో పట్నం నుంచీ వచ్చిన ఒకావిడ స్లీవ్లెస్ జాకెట్ వేసుకొని వెళ్తోంది. నాకు తెలిసిన పెద్ద వాళ్ళు ఆమె శీలం మీద కామెంట్ చేశారు. కానీ వారికి ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఏ మాత్రం తెలియదు.ఆ సమాజం లో అలాంటి జాకెట్ మామూలు ఆడవారు వేసుకోవక పోవటం వలన ఆ కామెంట్ వచ్చిందా?
ఓ ఇరవై యేళ్ళ కిందట మన సమాజం లో వయసొచ్చిన ఆడ  మగ మధ్య స్నేహాలు ఉండేవి కావు. ఇప్పటికీ పల్లెలలో వారికి ఆడ మగా మధ్య “ప్రణయ సంబంధం కాని స్నేహమంటే”, ఏమిటో తెలియదు. వారికి అటువంటి స్నేహం గురించి వివరిస్తే intellectual గా అర్ధం చేసుకోగలరేమో , కానీ అటువంటి స్నేహం లోని భావోద్వేగాల కు వారు relate చేసుకోలేరు. అది వారి తప్పు కాదు.

ఆడ మగా మధ్య interaction తక్కువ గా ఉండటం, ఇంట్లో ఆడ వారు తక్కువ గా ఉండటం వంటి కారణాల వలన, మగ వాళ్ళ కు ఆడ వారి ఆలోచనలూ, భావోద్వేగాలూ తక్కువ గా తెలిసి, ఆడ వారిని సెక్స్ పరం గా objectify చేయటం జరుగుతుంది. మన సినిమాలు కూడా ఒక ఆడ మగా మధ్య సంబంధం లో ఉండే, “పరిచయం, స్నేహం, భావోద్వేగ సంబంధాలూ” మొదలైన స్థాయి లను వదిలి, నేరు గా తడి చీరల పాటలను చూపెట్టటం వలన, ఆడవారిని objectify చేయటం మరింత పెరుగుతుంది.

మిస్సమ్మ సినిమా కాలం నుంచీ కూడా హీరో హీరోయిన్ ని టీజ్ చేస్తాడు. “ఆడ వారి మాటల కి అర్ధాలే వేరులే!”, అంటాడు. పాత కాలం లో స్త్రీల కి స్వాతంత్ర్యం లేనపుడు, మనసు లోని మాట పై కి నేరు గా వ్యక్తీకరించే వారు కాదేమో! కానీ నేడు ఓ ఆడ పిల్ల, “నో” అన్నదంటే, “కాదనే” అర్ధం. ఈ విషయాన్ని wishful thinking చేసే మగవాళ్ళ కు అర్ధమయ్యేలా చెప్పాలి.
రేప్ అనేది learned behavior అని ఈ మధ్య హిందూ లొ వచ్చిన ఈ ఆర్టికల్ చెప్తుంది:
http://www.thehindu.com/opinion/lead/the-danger-to-women-lurks-within-us/article4242142.ece?homepage=true

ఇది చాలా వరకూ కరక్ట్ కూడా. నేర్చుకొన్న ప్రవర్తనను సరిగ్గా educate చేయటం ద్వారా మార్చ వచ్చు. కానీ కొంతవరకూ రేప్ అనేది బయలాజికల్ గా సంక్రమించిన రోగం కూడా. అనేక జంతువులు రేప్ చేస్తాయి. అలానే కొందరి జీన్స్ లో హింసా, సెక్స్ ఎక్కువ గా ఉంటాయి. అలా అని రేప్ పాపం అలాంటి వారికి అంటకుండా పోదు. తాను బలవంతుడనని పక్క వాడిని కొడితే జైల్లో పెడతారు కదా!

మన దేశం లో “ఆడ మగా మధ్య interaction లేక పోవటం” రేప్ కి ఓ కారణం అయితే(మన దేశం లో ఆడపిల్లల తో మాట్లడ గలిగే సోషల్ స్కిల్ల్స్ ఉన్న మగ వాళ్ళు రేప్ కు తెగబడే అవకాశం తక్కువ), అమెరికా లాంటి దేశాలలో ఈ interaction ఎక్కువై, లవ్ లో రిజెక్ట్ కా బడ్డ వారు కూడా స్త్రీ ద్వేషులు గా మారి రేప్ లు చేస్తున్నారు. బూతు సినిమాలు చూసే వారి వలన కూడా రేప్ లు ఎక్కువవ్తాయని పాశ్చాత్య దేశాలలోని సర్వే లు బయటపెట్టాయి.ఏదేమైనా, ఈ విషయం లో సరైన ప్రవర్తన ఏమిటి (ఆడ మగా ఇరు వైపుల నుండీ) అనేదానికి విస్తృతమైన ప్రచారం కలిపించవలసిన అవసరం ఉంది. అలానే మీడియా, సినిమాలు ప్రచారం చేసే sexist myths లోని డొల్ల తనాన్ని బయట పెట్టాలి.

ఓ మగ వాడు, ఆడ వాళ్ళకి రేప్ గురించి జాగ్రత్తలు చెప్పటం లో ఓ ప్రమాదం ఉంది. ఆడ వారు ముందే అతని ఉద్దేశాలను అనుమానిస్తారు. నమ్మకం లేని చోట మంచి చెప్పినా చెడు అవుతుంది.అలానే మగ వారు కూడా, రేప్ చేసిన వాడిని వదిలేసి, ఆడ వారి దుస్తులనూ, ప్రవర్తననూ తప్పుపట్ట కూడదు.బహుశా అలాతప్పుపట్టటం, “తమ లో అంతర్లీనం గా ఉండే instincts ను రేపిస్టుల instincts తో ఇడెంటిఫై చేసుకోవటం వలన కూడా అవ్వవచ్చును”. ఆడవారికి జాగ్రత్తలు చెప్పే విషయం లో మగ వారి స్వరం, ఆడ వారి శ్రేయోభిలాషులు గా ఉంటే పరవాలేదు. “నే చెప్పింది విన్నారా? ఇప్పుడు అనుభవించండి”, అనే విధం గా ఉన్నపుడే సమస్య. రేప్ జరిగిన పరిస్థితుల కి అతీతం గా రేప్ శిక్షార్హమే! అందులో సందేహం లేదు. అయితే రేప్ కి మరణ శిక్ష వేయాలా వద్దా అనేది, అనేక పరిస్థితులనూ, మోటివ్స్ నీ పరిగణన లోకి తీసుకొని నిర్ణయించాలి.
రోడ్ మీద పోయే జనాలలో అన్ని రకాల వారూ ఉంటారు. అందులో మూర్ఖులు ఓ రకం. యువత డేటింగ్ చేయవచ్చు. కానీ public display of affection ని తగ్గించటం మంచిది. ఏ పల్లెటూరి బైతో, “అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో చూపించే playful behavior ని తన పై ఎందుకు చూపించదు?”, అనుకోవచ్చు. ఏ కరడు గట్టిన సాంప్రదాయ వాదికో వారి ప్రవర్తన చూసి ఒళ్ళు మండ వచ్చు. వారిలో ని విలువలు వారి లోని జంతుప్రవృత్తి  ని నియంత్రించినంత వరకూ పరవా లేదు. అలా కాకపోతే నే సమస్య. చేసే వెధవ పనుల పర్యవసానాన్ని గురించీ, చట్టమూ శిక్షల గురించీ ఆలోచించని మగవాళ్ళు చాలా మందే ఉంటారు. అందని ద్రాక్షల మీద కసి పెంచుకొనే వారు చాలామందే ఉంటారు. కసి అంటే గుర్తుకొచ్చింది, తెలుగు రొమాంటిక్ పాటలలో ఈ పదం చాలానే ఉపయోగిస్తారు. కానీ కసి అనే పదం లో హింస అనేది కూడా ఉందని ఆయా రచయితలకి తట్టిందో లేదో!

రేప్ ఎంత ఆటవికమో, జనాలు గుంపులు గుంపులు గా రోడ్ పైకి వచ్చి, రేపిస్టులని విచారణ లేకుండా ఉరి తీయాలనటం కూడా అంత ఆటవికమే. శిక్షించటానికి నిపుణులు ఉన్న న్యాయవ్యవస్థ ఉంది.వారే అన్ని విషయాలనూ పరిశీలించి సరైన నిర్ణయం తీసుకొంటారు. ఈ విషయం లో రాష్ట్రపతి చేసిన వ్యాఖ్య సరైనదైతే, ఆయన కొడుకు చేసిన వ్యాఖ్య దానికి సరిగ్గా వ్యతిరేకమైనది. ప్రజల ఆందోళన చాలా వరకూ సమర్ధించతగ్గదే! అలా అని ఆందోళన కారులంతా holy cows కాదు.తమ లోని అరాచకాత్వాన్ని బయట పెట్టటానికి ఈ సంఘటనను ఓ సాకు గా ఉపయోగించుకొనే వారూ, vested interests, భోగస్ స్త్రీ వాదులు,సమస్య ల కోసం కాసుకొని కూర్చునే వామ పక్ష వాదులూ కూడా ఉండవచ్చు. ఏదేమైనా, ఈ ఆందోళనల వలన ప్రభుత్వమూ, అది నియమించిన కమీషన్ సరైన ప్రతిపాదనల తో ముందుకు వస్తుందని ఆశిద్దాం.

ఢిల్లీ ఘాతుకం లో మరణించిన ఆ యువతి ఆత్మ కి శాంతి కలగాలని ప్రార్ధిస్తూ..

బురదగుంట – రేప్ ప్రపంచం..

ఢిల్లీ రేప్ సంఘటన సమాజం లో కావలసిన కదలికనే తెచ్చింది. రేపిస్టులను శిక్షించాల్సిందే. బురదగుంటలొంచీ దోమ వచ్చి కుడితే వెంటనే చంపేస్తాం కదా! అయితే ఆ సంఘటన గురించి ధర్మాగ్రహం వ్యక్తం చేస్తున్న మీడియా, రాజకీయ ప్రముఖులను చూస్తే మాత్రం చిరాకు వేస్తుంది.
ఆ బురద గుంత ఏర్పడటానికి ఓ ముఖ్య కారణమే ఈ మీడియా, సామాజిక ప్రముఖులు. రేప్ కి సంబంధించిన behavior patterns సమాజం లొ బలపడటానికి ఈ ప్రముఖులు కూడా ఓ కారణం.
ఈ బురద గుంట కి ప్రముఖుల కాంట్రిబ్యూషన్ ఎక్కడ ఎప్పుడు ఎలా మొదలైంది?

తెలుగు లో “ఓలమ్మీ తిమ్మిరెక్కిందా? అని హీరోయిన్ పిల్ల పిర్ర మీద ఓటిచ్చినపుడు” దానితో మొదలైందేమో!

లేకపోతే,”లే లే లే..నా రాజా!” తో మొదలైందేమో! లేక ఇంకా ముందే మొదలైందేమో! నాకు తెలియదు.
“ఓ సీన్ లో ఆకతాయిల కు క్లాస్ పీకి, మరో ఐదు నిమిషాలలో హీరో గారు బూతు పాటలు పాడినపుడు”, ఈ బురద గుంట కంపు అందరికీ అలవాటైపోయి, వాసన గుర్తు తెలీటం లేదని తెలిసింది.
“హీరోయిన్ ని సినిమా మొత్తం, రేప్ చేయటం మినహా, అన్నిరకాల వేధింపులూ చేసిన హీరో గారు”, మాస్ రాజా అయినపుడు, ఈ గుంటకి జనామోదం కూడా లభించిందని తెలిసింది.

సినిమా ఫంక్షన్లలో,”అర్ధ నగ్న ఐటం డాన్సర్ చుట్టూ, పది మంది మగ డాన్సర్లు చొంగ కారుస్తుంటే”, వేదిక కింద కూర్చొన్న హీరో గారు నిర్వికారం గా చప్పట్లు కొడితే తెలిసింది, “మురుగు గుంట ఓ అభినందించవలసిన విషయం” అని

“సినిమాలు చూసి ఎవరూ చెడిపోరు”, అని ఓ డైరెక్టర్ గారు బుకాయిస్తూంటే తెలిసింది, మురికి గుంట చాలా నిరపాయకరం అని. 

“దిగి దిగు నాగా..” వంటి పాటలు ప్రొడ్యూస్ చేసిన వారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్ద్లు లభించినపుడు, ఈ మురికి గుంటకి మానసరోవరం గా అధికారిక శాంక్షన్ కూడా వచ్చేసింది.

ముందు పేజీలలో తాము ఎడమపక్క పత్రికలమని కోడై కూసే పత్రికలు, వెనుక పేజీలలో సీ గ్రేడ్ సినిమా యాడ్స్ వేసుకొన్నపుడు, మురికి గుంట కంపు పూదోట కంపుని మింగేసింది.

మెరుగైన సమాజం కోసం పాటుపడే చానళ్ళు, బూతు సినిమాల పై ప్రత్యేక కార్య క్రమాలను ప్రసారం చేసినపుడు, మెరుగైన సమాజం బురద గుంట ఉండగానే వస్తుందని తెలిసింది.

“బూతుసినిమాలూ, సైట్లూ సాధారణమని”, డోకు భాష తార పిల్ల చెప్పినపుడు, “ఓ, మురికి వాసన చూసినపుడు, వమనం చేసికోకూడదని”, తెలిసింది.

రాష్ట్ర స్థాయి నాయకుడు అధినేత్రి మైకం లో, “ఇదో చిన్నవిషయం” అన్నప్పుడు, కొన్నాళ్ళకి మురికి గుంటలో పొర్లిన వాడే నాయకత్వానికి అర్హుడేమో అన్న సందేహం వచ్చింది. అప్పుడు “అదో పెద్ద విషయం” అవుతుంది.

ఊళ్ళోని పెద్ద పెద్ద ఇళ్ళలోంచీ డబ్బు అనే పిల్ల కాలువల ద్వారా ఈ మురుగు గుంట నింపబడుతోంది. జీవిక కోసం ఈ పిల్ల కాలువలను నిర్వహించే చిన్న చిన్న ఉద్యోగాలు చాలా మందిమి చేస్తాం. జీవిక కోసం మనం మౌనం గా ఉంటాం. ఈ మురికి గుంటని పూడ్చి వేయాలని గట్టి గా అడగం. అడిగితే మన జీవిక పోతుంది.

కాబట్టీ ప్రముఖులారా, ధర్మాగ్రహం వ్యక్తం చేయకండి. మీరిచ్చే వినోదం వలన కలిగిన సైడ్ ఎఫెక్ట్ ని సెలబ్రేట్ చేసుకోండి.

వాల్ మార్ట్ – సాంకేతిక పరిజ్ఞానం (Technology) – ఉత్పాదకత (productivity) – ప్రయోజనం (Utility) : ఒక పరిశీలన

వాల్-మార్ట్ వలన ఉత్పాదకత (productivity, efficiency) పెరిగి వినియోగదారుడూ, ఉత్పత్తిదారులూ (రైతులూ, పారిశ్రామికులూ) లాభపడతారంటున్నారు. సప్లై చెయిన్ లోని లంకెలు తగ్గిపోయి ధరలు తగ్గుతాయంటున్నారు. గోదాములూ, శీతల గిడ్డంగులూ వచ్చి సంపద ఆదా అవుతుందంటున్నారు.
నాకు ఇండియా లో వాల్ మార్ట్ ప్రవేశం గురించి వ్యతిరేకత లేదు, అనుకూలతా లేదు. ఓపెన్ మైండ్ తో దీని గురించి ఆలోచిద్దామనుకొని, మొదలుపెట్టాను. FDI లూ వాల్-మార్ట్ లూ కొంచెం క్లిష్టమైన విషయాలు కాబట్టీ, నా బుర్ర కి అందేలా ఓ చిన్న ఉదాహరణ గురించి ఆలోచించటం మొదలుపెట్టాను.

అనగనగా ఓ చిన్న పల్లెటూళ్ళో  ఒకే ఒక భూస్వా మి ఉన్నాడనుకొందాం. అతనికి ఓ ఇరవై యెకరాల వరి పొలం ఉంది అనుకొందాం. అంటే ఆ ఊరిలో ఉన్న మొత్తం పొలం ఇరవై ఎకరాలు మాత్రమే! ఆ ఊళ్ళోనే ఓ ఇరవై మంది కూలీలు ఉన్నారని కూడా అనుకొందాం. ఆ ఇరవై కూలీల కూ ఈ ఆసామి పొలం లో పంట  కోస్తే తలొక వెయ్య రూపాయలూ గిడతాయనుకొందాం.  మొత్తానికి ఆసామికి ఓ నాలుగు వందల బస్తాల పంట చేతికి వచ్చింది.  కూలీలకు ఆసామి మొత్తం మీద ఇరవై వేలు చెల్లించవలసి వచ్చింది.
ఓ సంవత్సరం ఆసామీ వరికోత యంత్రాన్ని వాడాలని నిశ్చయించుకొన్నాడు.  ఎందుకంటే ఆ యంత్రం ఎనిమిది వేల బాడుగ లో పంట మొత్తాన్నీ కోసేస్తుంది.  ఆ యంత్రాన్ని నడిపిన వ్యక్తికి ఓ రెండు వేలు ఇస్తే సరిపోతుంది. అంటే మొత్తం ఖర్చు పది వేలు. ఇంటికి 400 బస్తాలూ చేరాయి.
ఈ ఉదాహరణ లో ఉత్పాదకత పెరిగిందా? ఆసామి కి చివరికి వచ్చింది 400 బస్తాలే. కానీ ఖర్చు తగ్గి పది వేలు ఆదా అయింది. దీనిని ఉత్పాదకత అనరు. ఆసామి ఇంటికి ఓ 500 బస్తాల ధాన్యం వస్తే దానిని ఉత్పదకత అంటారు. ఆసామి మెషిన్ వాడటం వలన తనకు మిగిలిన పది వేల తో ఆసామి భార్యకి ఏ చెవి పోగులో చేయిస్తాడు.
ఊరి మొత్తానికి కొత్త టెక్నాలజీ వలన వచ్చిన ప్రయోజనం(utility) ఏమిటి? ఇరవై ఉద్యోగాలు పోయాయి. ఒక ఉద్యోగం వచ్చింది ( మెషిన్ డ్రైవర్ ఉద్యోగం). మెషిన్ డ్రైవర్ కి ఎక్కువ జీతం దక్కింది….సంతోషించవలసిన విషయమే..కొన్నాళ్ళకి ఊళ్ళో కూలీలందరూ మెషిన్ ని తోలటం నేర్చుకొన్నారు. కానీ ఊళ్ళొ ఉంది ఒకే ఆసామీ, ఇరవై ఎకరాల పొలం మాత్రమే! మెషిన్ తోలటానికి ఒకడు చాలు.  మెషిన్ తోలటానికి ఇరవై మందీ పోటీ పడితే, ఆసామీ బేరం చేసి  జీతం తగ్గించి దానిని వెయ్యికి కుదించాడు.(ఇదే లాజిక్ ఐటీ రంగానికి కూడా వర్తిస్తుంది. అందరూ కంప్యూటర్లు నేర్చుకొంటే, లేబర్ సప్లై పెరిగి జీతాలు కొన్నాళ్ళకి గుమాస్తా జీతాల స్థాయికి చేరుతాయి.) అంటే జీతం మళ్ళీ మొదటి, తలా ఒక కూలీ కి ఎంత వచ్చిందో అంతే అయ్యింది. ఈ లోపు ద్రవ్యోల్బణం వలన ఆ వెయ్యి రూపాయలకీ వచ్చే సరుకులు కూడా తగ్గిపోయాయి.
అంటే ఊళ్ళో ఉన్న జనాలు మెషిన్ తోలటం నేర్చుకొని (చదువుకొని) కూడా ఉద్యోగాలు లేకుండా తయారయారు. ఉద్యోగం ఉన్న వాడి జీతం తగ్గి, దాని విలువ పడిపోయింది. ఇక్కడ టెక్నాలజీ వలన ఉత్పాదకత ఏమీ పెరగలేదు.మెషిన్ వచ్చాక కూడా 400 బస్తాలే పండాయి. టెక్నాలజీ సహజ వనరులైన ముడి సరుకుల (పొలం లోని పంట) ని వేగం గా సంపద (ధాన్యం) గా మార్చటం లో తోడ్పడటం మాత్రమే  చేసింది. సెమీకండక్టర్, బయో టెక్నాలజీ, జెనెటిక్స్ వంటి రంగాలలో టెక్నాలజీ నే ప్రధానం. టెక్నాలజీ ఇసుక నుంచీ సెమీకండక్టర్ చిప్స్ ని తయారు చేస్తుంది.ఇక్కడ టెక్నాలజీ లేక పోతే ముడి సరుకైన ఇసుక కి విలువే లేదు.ఉత్పాదన అంతా టెక్నాలజీ వలననే జరుగుతుంది. అలానే, బయోటెక్నాలజీ పంట ని 400 బస్తాల నుంచీ, 600 బస్తాలకు చేరుస్తుంది. (ఉత్పాదకత పెరగటం వలన ధరలు తగ్గుతాయి. కానీ దీనికీ, ఇన్-పుట్ కాస్ట్ తగ్గించి దిగకొట్టబడిన ధరలకీ వ్యత్యాసం చాలా ఉంటుంది.సమాజం పై వాటి ప్రభావం భిన్నం గా ఉంటుంది. ) కానీ, వాల్-మార్ట్ వంటి కంపెనీలు తెచ్చే టెక్నాలజీ వలన ఉత్పాదకత కానీ, ప్రయోజనం కానీ పెరగదు. ఆ సంస్థ,  కొందరు వినియోగదారులకు ఖర్చులను తగ్గించి, తద్వారా తన అదాయాన్ని కూడా పెంచుకొంటుంది.    ఈ ఆదాయం,  తగ్గిన “దళారుల మధ్యవర్తుల, ప్రమేయం”, వలన వచ్చినది. అంటే మధ్యవర్తుల ను బయటికి నెట్టటం ద్వారా ఖర్చు తగ్గించుకొని , తద్వారా లాభ పడి, అందులో కొంత వినియోగ దారులకి విదిలించి, మిగిలిన ఆదాయాన్ని తన దేశానికి తరలించుకుపోతోంది . మొత్తం గా మన సంపద మన దేశం దాటి పోతోంది.

కానీ టెక్నాలజీ ఆధారితమైన ప్రొడక్ట్ కంపెనీ ల వలన  సంపద పెరిగి , ఉత్పాదకత పెరుగుతుంది. వాల్ మార్ట్ వంటి బడా మార్వాడీ బాబుల వలన కాదు.

జాబ్ శాటిస్ఫాక్షన్ – మాస్లొవ్ నీడ్స్ హీరార్కీ.. ..రాజకీయాలూ, సిధ్ధాంతాలూ..

ఇటీవల ప్రైవేటు ఉద్యోగాలలో జీతాలు బాగా వస్తున్నాయి. కానీ జాబ్ శాటిస్ఫాక్షన్  (ఉద్యోగ సంతృప్తి?) తగ్గిపోతోంది. దీనికి కారణాల గురించి ఆలోచిస్తే అబ్రహాం మాస్లోవ్ గారి అవసరాల (Maslow’s hierarchy of needs) సిధ్ధాంతం గుర్తుకొచ్చింది. ఈ సిధ్ధాంతం గురించి నెట్ లో చాలా సమాచారం దొరుకుతుంది. కాబట్టీ దాని గురించి ఆఠే మాట్లాడి మీకు బోర్ కొట్టించను.

స్థూలం గా చూస్తే ఈ సిధ్ధాంతం ప్రకారం మనిషి కి భౌతికమైన అవసరాలూ, తన భవిష్యత్ భద్రత గురించిన అవసరాలూ, ప్రేమించబడటం వంటి భావోద్వేగపరమైన అవసరాలూ,  మర్యాదా మన్ననకు సంబంధిధించిన అవసరాలూ, చివరి గా ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించిన సెల్ఫ్ యాక్చ్యువలైజేషన్ అవసరాలూ ఉంటాయి.
వీటిలో అన్నిటికన్నా కింది స్థాయి లో భౌతిక అవసరాలు ఉంటే,  అదే క్రమం లో ఆత్మ పరమైన అంశాలు పై స్థాయి లో ఉంటాయి. ఈ టపాలో నేను భావోద్వేగ అవసరాల గురించి మాట్లాడ దలచ లేదు. ఎందుకంటే,అవి ఉద్యోగ తృప్తి కి అంతగా సంబంధం ఉన్న అంశాలు కావు.

ఏ మనిషైనా, ముందు గా కింది స్థాయి లోని భౌతిక మైన అవసరాలు తీరిన తరువాతే, పై స్థాయి లోని భద్రత మొదలైన అవసరాల గురించి ఆలోచిస్తాడు. భౌతికమైన అవసరాలు తక్షణ మనుగడ కి సంబంధించిన విషయాలు. మనిషి ప్రస్తుతం ఆహారం లేక పోతే చనిపోతాడు. మనిషి రేపటి తన భద్రత గురించి అలోచించాలంటే, ఈ రోజు బ్రతికి ఉండాలి. ఈ రోజు బ్రతికి లేని మనిషి రేపు బ్రతికి ఉండలేడు కదా? ఇండియాలో చాలా మంది పేదలకు రెక్కాడితే గానీ డొక్కాడదు. వీరికి ఏ పది సంవత్సరాల తరువాతో ప్రభుత్వ దీర్ఘకాలిక ప్రణాళికల ఫలితాల గురించి ఆలోచించే వెసులు బాటు ఉండదు. అందుకే ఎవరు తక్షణం నోటు ఇస్తారో వారికే వోట్ వేస్తారు. అలానే సిధ్ధాంత పరం గా కమిట్ అయ్యి దీర్ఘకాలం ఆలోచించే పార్టీలకి కూడా, ప్రస్తుత ఎన్నికలలో గెలవకపోతే మనుగడ ఉండదు. రేపు మనగలగాలంటే, ఇవాళ ఆ పార్టీలు బతికి బట్టకట్టాలి. అంటే మామూలు జనాల తక్షణావసరాలకి తగ్గట్టు గా తమ  విధానాలు ఉండాలి. భౌతిక అవసరాలు చాలా వరకూ తీరిన మధ్య తరగతి కి, టీవీ (లేక సిస్టం ) ముందు నుంచీ లేవకుండా వోటు-నోటు, జనాకర్షక రాజకీయాలను విమర్శించటం చాలా సులువు.  అర్ధం చేసుకోవటం కొంచెం కష్టం. దేశం లోని పేదరికం తగ్గి సంపద పెరిగితే కానీ జనాలు భవిష్యత్ భద్రత అవసరాల గురించి, దీర్ఘ కాలిక విధానాల కి మద్దతు ఇవ్వరు. కానీ హ్రస్వ దృష్టి తో చేసే జనాకర్షక విధానాల వలన దేశం లో సంపద స్థాయి పెరగదు. ఇదొక విష వలయం. ఈ విష వలయాన్ని ఉత్తరించటానికి జనామోదం గల నిజమైన  నాయకుడు కావాలి.
ఉద్యోగాల విషయం లో దిగువ తరగతి వారు పూట గడవటం కోసం నౌకరీలు చేస్తారు. వీరికి రేపటి గురించి ఎక్కువ గా ఆలోచించే లక్జరీ ఉండదు. మధ్య తరగతి వారు, అందులోనూ తెలుగు వారు ఉద్యోగాలని తమ భవిష్యత్ భద్రత కోసం చేస్తారు. వీరిలో చాలా మంది తమకు ఇష్టమైన, తమ సెల్ఫ్ యాక్చ్యువలైజేషన్ కి ఉపయోగ పడే ఉద్యోగాలు చేయరు. ఏ కొద్ది మంది అదృష్టవంతులో తమ ఇష్టమైన, మరియూ తమ భద్రతావసరాల ను తీర్చే ఉద్యోగాలు చేస్తారు.  ఈ ప్రైవేటు ఉద్యోగాలు చాలా వరకూ తమకు సంబంధించి మర్యాద పరమైన అవసరాలను తీర్చేవి గా ఉండవు. ఉదాహరణ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. ఉద్యోగాల ద్వారా సెక్యూరిటీ పరమైన అవసరాలను అధిగమించి, తమ సృజనాత్మక ఇఛ్ఛలకు  తృప్తి కలిగించే ఉద్యోగాలను పొందటం రాను రానూ కష్టమౌతూంది. దీనికి ముఖ్య కారణం మన కాపిటలిస్ట్ వ్యవస్థ లోని ద్రవ్యోల్బణం, అధిక ధరలూ. ఎవరైనా వచ్చే ఐదేళ్ళ లో తన రొటీన్ ఉద్యోగం ద్వారా తన భద్రతావసరాలకు సరిపడా సంపాదించి, తరువాత తన కు ఇష్టమైన వృత్తిలో కి మారుదామనుకొంటే , అలాంటి ప్లాన్స్ ని, అదుపులో లేని,  ఊహకందని ద్రవ్యోల్బణం తలకిందులు చేస్తుంది. ప్రైవేట్ సంస్థలు, ఉద్యోగ భద్రతా లేమిని ఉద్యోగుల తో పని చేయించటనికి ఒక సాధనం గా వాడుతాయి. “తమకు అసక్తికరమైన విషయాలోని పాషన్ వలన, సకారాత్మకం గా మనుషులు పని చేయటం”, కాపిటలిస్ట్ వ్యవస్థ లో కొంచెం తక్కువే అని చెప్పాలి. (ముఖ్యం గా ఇండియా లోని మధ్య తరగతి ఉద్యోగాల విషయం లో).
ఏ సినిమా స్టార్ల , పొలిటిషియన్ల పిల్లల కో తమ కు ఇష్టమైన తమ సృజనాత్మకతకు అద్దం పట్టే రంగాలలో పని చేసే అదృష్టం దక్కుతుంది. ఎందుకంటే వారి సెక్యూరిటీ నీడ్స్ వారి పెద్దల సంపాదన వలన తీరిపోయి ఉంటాయి కాబట్టీ! కాపిటలిస్ట్ వ్యవస్థ లో మెజారిటీ మధ్య తరగతి ప్రజలు తమ భౌతిక, భద్రత అవసరాలను దాటి, తమ కు తృప్తి నిచ్చే రంగాలలో పని చేసుకోవటం కష్ట సాధ్యమైన, అరుదైన విషయం.
సోషలిస్ట్ వ్యవస్థ, “మనిషి భౌతిక, భద్రత అవసరాలను తన(వ్యవస్థ)కు వదిలి, మనిషి ని తన సెల్ఫ్ యాక్చ్యువలైజేషన్ నీడ్స్ మీద ధ్యాస పెట్టమంటుంది”. అందువలననే కాబోలు ఒకప్పుడు కళాకారులూ, రచయితలూ సోషలిజాన్ని ఎక్కువ గా సమర్ధించే వారు. కానీ, మౌలిక అవసరాలు తీరిన తరువాత, సిన్సియర్ గా పని చేసే వారు చాలా అరుదు గా కనపడతారు. రష్యా అనుభవం ద్వారా తెలిసేదేమంటే, వాస్తవం లో సొషలిస్ట్ వ్యవస్థ కూడా మనిషి కి ఇష్టమైన ఉద్యోగాలను చేసుకోనివ్వకుండా, వ్యవస్థ, తనకి  అవసరమైన ఉద్యోగాలను మనిషి చేత చేయిస్తుంది అని.ఇండియాలాంటి చోట్ల ఇష్టమైన రంగం లో ఉద్యోగం చేయమంటే 90% జనాలు క్రికెట్టూ, సినిమలూ ఎంచుకొంటారు. అప్పుడు మిగిలిన రంగాలలో పని చేయటానికి జనాలు మిగిలి ఉండరు. మనుషుల మెడ పై “జాబ్ ఇన్సెక్యూరిటీ” అనే కత్తి వేలాడక పోతే, రష్యా లో అయినట్లు గా,మనుషుల ఉత్పాదక తగ్గుతుందేమో!

తెలుగు భాష ఎందుకు అంతరించిపోబోతోంది?

ఓ టీవీ చానల్ లో ఇంగ్లీషు మాట లేకుండా తెలుగు ఎంత సేపు మాట్లాడగలరు అనే విషయం పై ఓ పోటీ జరుగుతోంది.
అందులో ఏ ఒక్కరు కూడా పట్టుమని పది సెకండ్లు కూడ మాట్లాడ లేకపోయారు.
ఆ ప్రోగ్రాం చూసి ఓ ఇద్దరు మిత్రులు చర్చించుకొంటున్నారు:
రామాయ్: పరిస్థితి ఈ రకం గా ఉంటే కొన్నాళ్ళ కి తెలుగు భాష అంతరిచిపోతుందేమో అని భయం గా ఉంది.
కిట్టాయ్: ఏమీ దిగులు అవసరం లేదు. పరిణామమనేది అన్ని భాషలకూ సహజం. ఒక భాష అనేది ఇతర భాషలలోని పదాలను కలుపుకొని పోతే నే ఆ భాష పరిపుష్టమౌతుంది.ఇంగ్లీషుని చూడ రాదూ, ప్రపంచం లోని అన్ని భాషల పదాలనూ తన లో కలుపుకొని ఎలా వృధ్ధి చెందినదో!  ఓ విధం గా చూస్తే ఇతర భాషల లో ని పదాలు చేర్చుకొనని భాష మృత భాష అవుతుంది. అది వాడుకలోంచీ పోతుంది.
రామాయ్: కిట్టాయ్, నువ్వు చెప్పే విషయాలన్నీ నిజమే!  కానీ, అవేమీ తెలుగు కి వర్తించవు. ఇంగ్లీషు భాష ప్రపంచాన్నేలే క్రమం లో కొన్ని ఇతర భాషల పదాలను కలుపుకొని పరిపుష్టమయింది. కానీ తెలుగు భాష ప్రపంచాన్ని ఏలటం లేదు. అధికారం డబ్బు ల ప్రవాహం వలన తెలుగు భాష విస్మరించబడుతోంది.
ఒక భాష వృధ్ధిలో కి వచ్చే క్రమం ఇలా ఉంటుంది:
1. మొదట కొద్ది మంది మాట్లాడే నోటి భాష గా మొదలవుతుంది.
2. తరువాత పరిధి విస్తృతమై, జనాల ఆలోచనలలో ఆ భాష కు భాగం ఏర్పడుతుంది. ఈ స్థితి లో అలిఖిత మైన పాటలూ, కథలూ సృష్టించబడతాయి.
3. ఆ పై ఆ భాష అక్షర బధ్ధమై, ఆ భాష లో లిఖిత వాంజ్మయం సృష్టించబడుతుంది.
4. శాస్త్ర సాంకేతికాలలో ఆ భాష స్థానం సంపాదించుతుంది.
5. ఇతర భాషలను ప్రభావితం చేసి, తాను ఇతర భాషల నుంచీ పరిపుష్టమౌతుంది.
6. ఆ భాష సమాజం లోని ప్రజల రోజు వారీ మనుగడకి అవసరం కాబట్టీ, దీర్ఘ కాలం వర్ధిల్లుతుంది.
తెలుగు భాష కు పైన చెప్పిన ఐదో పాయింట్ వర్తించదు కాక వర్తించదు. ఇంగ్లీషు భాష ను తెలుగు కలుపుకొని పోవటం లేదు. ఇంగ్లీషు భాషా ప్రవాహం లో తెలుగు కొట్టుకొని పోతోంది.
అదే ఇంగ్లీషు భాషని తీసుకొంటే పైన చెప్పిన 5,6 స్టేజీ ల లో ఉన్నట్లు స్పష్టమౌతోంది.

ఇక, ఓ భాష అంతరించిపోబోయే క్రమం పైన చెప్పిన క్రమానికి సరిగ్గా వ్యతిరేకం గా  ఇలా ఉంటుంది.
1. మొదట ఆ భాష ను ఉపయోగించి మనుగడ సాగించటం కష్టమౌతుంది.
2. ఆ భాషను వదిలి మనుగడ కోసం వేరే భాషల ను నేర్చుకొనటం వలన, వేరే భాషల అజమాయిషీ ఆ భాష పై ఎక్కువవుతుంది.
3. నెమ్మది గా శాస్త్ర సాంకేతికాల నుంచీ ఆ భాష కనుమరుగౌతుంది.
4. ఆ భాష లో ఉండే సాహిత్యాదులు దిగ నాసిల్లటం మొదలౌతుంది.
5. జనాలు ఆ భాషను వదిలి, ఆలోచన చేయటానికి కూడా ఇతర భాషలను ఆశ్రయిస్తారు.
6. ఆ భాషలో రాయటం అంతరిస్తుంది.
7. ఆ భాషని చదవటం, ఆ తరువాత మాట్లాడటం మానేస్తారు.

తెలుగు, మొదట చెప్పిన ఆరు పాయింట్ల క్రమాన్నీ అనుసరిస్తోందా, లేక తరువాత చెప్పిన ఏడు పాయింట్ల క్రమాన్నీ అనుసరిస్తోందా?   తరువాతి ఏడు పాయింట్ల క్రమాన్ని అనుసరిస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. అంటే తెలుగు అంతరించిపోయే దిశ లో అడుగులేస్తోందన్న మాట.అంతరించటం ఖాయం, “ఎప్పుడు అంతరిస్తుంది?” అన్నదే ప్రశ్న. అన్ని భాషలూ, పది వేల ఏళ్ళ కో, నలభై వేల ఏళ్ళ కో, ఎప్పుడో అప్పుడు అంతరించేవే. కానీ, తెలుగు, సమీప భవిష్యత్తులోనే అంతరించబోతోంది.
ప్రస్తుతానికి యువ తరం లో చాలా మందికి తెలుగు లో రాయటం రాదు. ఇంకొంతమందికి చదవటం రాదు, ఇంగ్లీషు పదాలు లేకుండా మాట్లాడటం రాదు. పట్నాలలో ఉండే చాలా మంది ఆలోచించటం కూడా ఇంగ్లీషులోనే చేస్తున్నారు. తెలుగు భాషలో గత కొన్ని దశాబ్దాలు గా వచ్చిన గొప్ప రచనలు కనపడటం లేదు.  ఇక ముందు పరిస్థితి ఇంకా దిగజారబోతోంది అని తెలుస్తూనే ఉంది. తెలుగు భాషా, సంస్కృతీ ప్రమాణాలు నానాటికీ దిగజారే దిశలోనే వెళ్తున్నాయి. అదే ఆంగ్ల భాష ని తీసుకొంటే, ఆ భాషలో ఇంకా ముందు ముందు ఆధునిక సాహిత్యమూ, సాంకేతిక గ్రంధాలూ వెలువడతాయని చెప్ప వచ్చు. ప్రపంచం లో ఇంకా ఎక్కువ మంది ఆ భాషని నేర్చుకోబోతున్నారని చెప్పవచ్చు. తెలుగు భాష గురించి అలా చెప్ప గలమా? తెలుగు భాష పైన చెప్పిన 7 వ పాయింట్ దిశ గా వేగం గా అడుగులు వేస్తోంది. ఈ స్థితి ని “పైన చెప్పిన ఏడు పాయింట్లకీ పైన ఉన్న”, ఆరు పాయింట్ల లో, ఐదవ పాయింట్(తాను ఇతర భాషల నుంచీ పరిపుష్టమౌతుంది) తో పొరపడటం, భ్రమల లో కాలం గడపటమే! తెలుగు ఇంగ్లీషుని కలుపుకొని పరిపుష్టమౌతోందనుకోవటం, మధ్య తరగతి ఉష్ట్ర పక్షులు తమ తప్పుని కప్పిపుచ్చుకోవటానికి చేసుకొనే ఓ ఆత్మ వంచన మాత్రమే. వాస్తవాన్ని ఎదుర్కొనటానికి ఒప్పుకోని ఒక  బాధ్యతానిరాకరణ మాత్రమే!
కిట్టాయ్: బాగా పొడుగుగానే ఉపన్యాసం ఇచ్చావు కానీ, ఇంతకీ తెలుగు భాష అంతరించకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలో నువ్వే చెప్పు.
రామాయ్: భాష అంతరించటం లేక వృధ్ధి చెందటం అనేది ఒక ప్రయాణం లాంటిది. ఒక భాషని, అది మాట్లాడే జనాల మద్దతు లేకుండా బలవంతం గా బ్రతికించటం చాలా కష్టం. ప్రయాణాన్ని మొదటి అడుగుతో మొదలు పెట్టినట్లే, రిపేరీ ని కూడా పైన చెప్పిన ఏడు పాయింట్లలో మొదటిదైన మనుగడ తో మొదలుపెట్టాలి. ఓ భాష మాట్లాడటం వలన మనిషి మనుగడ పెరిగితే ఆ భాష వృధ్ధి మొదలౌతుంది. ప్రభుత్వాలు ఆ దిశలో చట్టా లు చేయాలి. మేక మీదికి లంఘించిన పులిలా ఇతర భాషలను తింటున్న పరాయి భాషలని నిషేధించాలి.ఇది మరీ “అతి” అనవద్దు. తీవ్రమైన పరిస్థితులలో తీవ్రమైన పరిష్కారాలే అవసరమౌతాయి.   ఇతర భాషలను నేర్చుకోవటాన్ని నిషేధించకపోయినా, వ్యవహారం లో వాటి వాడకాన్ని నిషేధించాలి.తెలుగు భాషలోని ఆంగ్ల పదాలను నెమ్మది గా ఏరి వేయాలి.  ఎందుకంటే పరిస్తితి చాలా తీవ్రం గా ఉంది. నిషేధా నికి తక్కువైన ఏ చర్య ను ఐనా  సమర్ధించే ప్రజల, ప్రభుత్వాల (మన భాషను నిలబెట్టటం లో ఉన్న) చిత్తశుధ్ధిని శంకించాల్సి వస్తుంది. లేక వారివి పై పై కాలక్షేపపు మాటలు అనుకోవలసి వస్తుంది.  లేక అర్ధం లేని అమాయకపు ఆశావాదం అనుకోవాల్సి వస్తుంది.  ఇంకా మన పిల్లల ను విధి గా  తెలుగు మాధ్యమం లో చదివించాలి.

కిట్టాయ్: మరి ఒకప్పుడు సంస్కృతం కూడా, ఇప్పటి ఇంగ్లీషులా తెలుగు ని ప్రభావితం చేసినదే కదా? అలానే ఉర్దూ…. ఏ భాష అధికారం లో ఉంటే ఆ భాష ప్రభావం సహజం అనుకొంటా.
రామాయ్: సంస్కృతం వంటి భాషలు, ఇంగ్లీషులా, ఎప్పుడూ ఎక్కడా బజార్లలో వాడబడలేదు.సంస్కృతం, ఉర్దూ భాషల ప్రభావం ఉన్నా, జనాలెపుడూ ఆయా భాషలలో ఆలోచించలేదు.  కానీ, ఈ రోజు అనేక మంది పట్నపు జనాలు ఇంగ్లీషులోనే ఆలోచిస్తున్నారు. వారికి తెలుగు లో ఆలోచించటం రాదు. ఓ భాష చనిపోవటానికి ఇది ముఖ్యమైన ముందు శకునం.
కిట్టాయ్: మొత్తానికి తెలుగు భాషని బతికించాలని పెద్ద పెద్ద కలలే కంటున్నావు, ప్రభుత్వ బళ్ళ లోనే ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెడుతూ ఉంటే, ఇంకా ఇవన్నీ అయ్యే పనులేనా? ఆ..ఈ తెలుగు  ఛానల్ మార్చి,  స్టార్ టీవీ పెట్టు “బోల్డ్ అండ్ బ్యూటిఫుల్” వస్తుంది.

తా.క. :  ఈ టపా నేనే రాసిన ఓ ఇంగ్లీషు టపా ని నేనే తెలుగు లోకి అనువాదం చేసుకోలేని స్థితి లో నాలో నాపై కలిగిన ఓ ఆక్రోశానికి ఫలితం.

God, Revelations some thoughts…

Some updates..do not have patience to translate into Telugu

Abstract

The perception of epiphanies is considered to be central to the spiritual experience in religious circles.In modern times, people like J Krishnamurti, Ramana Maharshi are believed to perceive epiphanies.

This article tries to explain epiphanies in physical terms. It categorizes the existence into known, unknown and unknowable parts. While the everyday experiences fall into the category of “The Known”, epiphanies and super-natural powers can be viewed as “The Unknown”.  The author argues there is a  part of the existence that will never be known by humans. This part is called “The Unknowable”.

Epiphanies

Epiphanies are also called revelations. Often, they are associated with a self-less state of mind. A common aspect reported about epiphanies is “direct sensory contact with external objects without the mediation of self”. This sensory contact is reported to be more “real” than the everyday reality. The self, mentioned here, is the ‘self-conscious center’ which is made of human thought. The ‘self’ oversees all the actions and thoughts of a person.

Composition of thought

The self is like a spindle woven with the thread of thought. The thought, in turn, is made of mental representations of external objects(eg: hill, tree), like words, images, and other sensory inputs like sounds, touch, smell and temperature.  So, these sensory inputs are representative symbols of the actual real world objects. But, they are not the objects themselves. The symbols are extracted from an already completed interaction with the world. These symbols are of the past. Hence the thought is made of symbols from the past. Though made of thought, the self can view its own thoughts on the screen of consciousness.

The consciousness is like the light of a torch focused on a wall. Sitting inside the boat of the world, the consciousness always travels along with the stream called “the time of the world”, and hence it exists only in ‘present’.  It contains images emanating from the real-time (present) events along with the thoughts of the past and conjectures about the future. If the mind does not store past images, all the thought vanishes.  When the data base of thought does not exist, it can’t conjure future. Then the mind exists in present only. In that case, the consciousness is occupied by things of present alone. The boundaries between past, present and future are created by thought. Thought is stored in memory. The contents stored in the memory act as past. The projections made from the past act as future. When memory vanishes, the thought disappears. When memory vanishes so does the past. Thought disappears along with the past. When past disappears, its projection, i.e. the future also vanishes.

Without thought only ‘present’ exists from an individual’s point of view.  The subjective time vanishes.

The consciousness travels along with external physical sequence of events. So, the consciousness travels with physical time.

Making of thought

Immediately after birth, an infant is not able to differentiate the objects in the external world from it’s self. Initially, when it starts getting sensory inputs, it perceives without recording much.  After sometime it records the images sounds and so on. Once it learns the language, it tags the images, sounds and smells in its mind with the words and symbols of the language it has learnt.  In the process of learning the language, it builds its small mental dictionary of words. Later, as a “grown up”, whenever it perceives an objects, it retrieves the corresponding word from its brain. So, the actual object shares the“screen of the consciousness” of the person with the verbal representation of it (the object) simultaneously. If a person’s vocabulary is week, and he does not know what a particular object is called as, then, he retrieves the image of the object from his mind. This image occupies the stage of his conscious mind along with the real object. There is no point of time where his consciousness is completely occupied with the real-time object without sharing it with a mental image.

Figure1: The Composition of Self

Suppose a person is following a flying bird with concentration. As long as he knows he is watching a bird, his consciousness is shared by the actual real-time bird with his mental representation of it. When the observer watches the bird without any interference from his mental images, he purely perceives the bird. When he is in a state of ‘pure-perception’, he even does not know it is a bird. Pure-perception is a state not colored by thought. So, there does not exist a perceiver in this state. If we take the analogy of

a camcorder, the perceivers mind never directly operates in the simple ‘View only’ mode. The mind always mixes the previously recorded visuals with the real time images.

The Driving force behind ‘self’

Thought makes the self. The self of a man enhances the survival at individual level. Self is the amalgamation of human instincts, emotions, drives and wishes. The thought enabled by self, is used for planning ahead for a rainy day. It helps in better survival of human beings. It enables man to organize. It spurs the scientific inventions and all manmade things. But the flip side of thought is “the formation of a psychological world”. The psychological world separates man from the direct perception of reality. It perpetuates attitudes, feelings by storing their representative symbols in brain.

Epiphany and Effort

Effort in psychological domain can’t make man to get into a self-less state, as the effort originates from the self. Some people stumble into this state due to an unknown reason. Those people need not be pious. They may not be do-gooders. Science has not understood what triggers this state as yet.  In this state, the world appears in a different light. That does not make it a Godly and mystical state.

Epiphanies and social relevance:

Are epiphanies useful in solving any social issue like poverty, environment, at least by making the individual contribute?

According to UG Krishnamurthi, epiphanies do not have ant political, religious or spiritual implications. Further a person may experience epiphanies despite his personality and character. So the societal problems need to be addressed by the political and religious leaders either at a system level or at an individual level.

Epiphany and Animals

Small animals in the lower echelons of evolution do not have thought. So, are they in an epiphany-like state? It is a possibility. Though, there is a difference. In humans, the Epiphany state co-exists with a thoughtful mind. The usual thoughtful mind springs into action on demand from external events. Once the self becomes active, it can retrieve the images stored during epiphany and play it. The playback from epiphany state is not an epiphany, for the self is there playing. In an epiphany state, though the images are stored, they are not played back.  In an epiphany state there is no “knowing”, no “awareness”. It has only “pure-perception”.

Epiphany – Transmission

Can epiphany state be transmitted fully using words? No, epiphany needs absence of thoughts and thus

absence of words.  A wordless state can’t be transmitted using words.

Epiphany – Various Methods

Whether the selfless state can be reached through different methods like drugs, surgery of the brain, genetic engineering, or a new technique of meditation in future is a matter of conjecture.

The Super-natural and “The Unknown” 

Some people claim super natural abilities like telepathy. Scientific consensus eluded these claims. Assuming such abilities exist, they could be due to phenomena not understood by science yet. Some persons  attract iron with their body. Science has not understood the phenomenon yet. This state is also akin to the super natural powers claimed. Science may be able to prove it in the future. With the advent of nuero imaging it will not be impossible to prove or disprove such claims conclusively.  Similar logic applies to all supernatural abilities of humans.

The Unknowable

There is an unknowable part of the existence that humans may never know about. While the unknown part of the existence can be known by the advances in science and technology, unknowable parts can never be known by humans.

Limitations of human organism

Man is a biological organism that exists in a three dimensional world (Including time it’s a four dimensional world. A world with five or more dimensions is beyond the reach and existence of man, though theories like string theory postulate that). Its perceptions are limited by its senses, and its thought is made of electrochemical reactions. Man must have limitations in understanding and proving the phenomena that fall outside physical existence.

The universe made of Time

Big bang theory is the most popular theory that explains the origin of the universe. It proposes, “The space and time are created after the point of singularity,” and “the consequent causal chain has formed the universe that we live in today”. So according to this theory the universe in made ‘of’ time and space. It’s not made ’in’ time and space. The universe is made of the fabric of space-time like a tea cup made of  porcelain. The rules about the forces of the universe are immutable and every rule is causally traced

back to the singularity of big bang theory.  Cause precedes effect. Cause and effect both happen in time. But, before big bang there was no time, there was no space, though that state is a bit difficult to imagine. Thus, there was no cause for the big bang.

The Universe made in Time   

Alternately, it can be assumed that space and time existed before big bang. At this point, additional (five or more) dimensions can be proposed. The creation of universe can be assumed to have been done in the time that pertains to the fifth dimension. Even if the origin of the universe happened in a fifth dimension, still the question of what is the ‘cause of the cause’ that created universe remains. This argument can be extended to any number of dimensions. Assuming many numbers of dimensions does not take away the question “what caused the creator of the universe?”

The statement, “Universe is acausal,” though it sounds a bit awkward, can only answer the question about the origin of the existence.   A thing without start or end is not that usual, but not difficult to explain logically. On the circumference of a ring, we can’t fix a starting point and ending point. They are imaginary.  Modern quantum physics accepts acausal phenomena like vacuum fluctuations which are acausal. Though physical objects look stable, at a  subatomic level virtual particles like electron-positron pairs are acausally created and destroyed on a microseconds scale. The worldly objects are like a river whose shape looks stable but whose content (water) keeps on changing at any point in time. An incident which looks a causal in a three dimensional world may be causal in a higher dimensional world.

Whether the universe is made”of time” or “in time”, the search for the origin of existence ends in an acausal root.

 Time-collapse and super-time

A movie role while being played has its sequence of incidents and thus simulates time. To demonstrate the collapse of time, each frame of a movie role can be cut and all the frames can be spread on the floor of a room laterally. Now, for an observer, all the usually sequential incidents appear at the same instance. From the perspective of the observer, the incidents have no time gap between them. They just exist. The observer has access to any incident irrespective of its sequence. Similarly if we assume a super-time, all the happenings of the universe freeze into a single instance in super-time. They simply exist. They do not have a start or end.

The relation between the Known, The Unknown and The Unknowable

We humans are three dimensional creatures. We do not have access to five dimensions or beyond. We may propose concepts about the metaphysical world that has many dimensions (like string theory). We might prove them theoretically. But, to prove them practically we need to prove the theories about many dimensions in a three dimensional world ultimately. This is an impossible task. Thus, there will always be a world that can’t be perceived or understood by man. That’s the unknowable world or the Metaphysical world. Physical world is run by unchangeable rules. If God made the rules, we do not know why he does not change those rules. If God is part of that unknowable, metaphysical world he also must be undefinable.

Figure 2 : Physical world

Figure3: The existence

The physical world comprises of two parts. The Known and The Unknown.  The progress in science and technology unravels The Unknown and explains it in terms of the known.

The existence is comprised of the physical world and the unknowable metaphysical world. “The Unknowable” can never be touched by the humans.  The epiphanies and supernatural powers manifest within the boundaries of the physical world. Epiphanies are about direct perception. Direct perception with its all visual and audible processes, still falls in the realm of physicality. The triggers to the epiphanies and super natural powers could be either unknown or unknowable. The unknown triggers could be unraveled by science in the future. But the unknowable things that exist in metaphysical realm can never be understood by man.

Is God there?

Before saying yes or no to this question, one needs to define God. If God is indefinable, all aspects of him should be undefined. One can not say, “We can not understand his doings”, and still believe, “God is kind”, “God is powerful”. Etc.

If God is kind, the natural disasters and the subsequent destruction begs an explanation. If God is powerful, then his inability to change rules of nature stands unexplained.

Some people claim God is good, but the problem is with Man. These same people believe Man is made by God. If man is made by God, he owns the responsibility of Man’s deeds also.

One of the disclaimers of the believers is, “as Man has free will, God need not own the misdeeds of Man”. It’s debatable if man has a free-will, as his will is shaped by sundry circumstances and forces of nature.

Assuming man has free will, that free will is given by God. Again, God can not evade the responsibility.

If God is just a mechanism which does it’s action with out like or dislike, then he is similar to a physical rule.

The definition of good and bad are relative and circumstantial. They change depending on place and time. They are man made. They predate to the notion of God. Man has to have an idea of good. After that only he can assume God as an embodiment of goodness.

వినాయక చవితి..అప్పుడూ ..ఇప్పుడూ..

నా చిన్నపుడు వినాయక చవితి అంటే కొంత ఆసక్తీ, కొంత భయమూ.. పొద్దున్నే స్నానమైన తరువాత, పత్రి కోసం పిల్లలందరమూ పెరట్లమీదా, దొడ్ల మీదా పడే వారం. మారేడాకు శివాలయం వెనుక దొరుకుతుంది. శివుడికి ప్రీతి పాత్రమైనది కాబట్టీ ఆయన కొడుకు కి కూడా ఇష్టం, జమ్మి ఆకులు బడి గ్రౌండ్ వెనుక పొదల దగ్గర ఉన్న జమ్మి చెట్టు కొమ్మలను విరగదీస్తే వస్తాయి, వెలగ పళ్ళ కోసం ఆ పక్కనే ఉన్న వెలగ చెట్టు ఎక్కాలి. కానీ ముళ్ళు ఉంటాయి కాబట్టీ ఒక గడ కర్ర తో కొట్ట వలెను.లేక రాళ్ళు రువ్వవలెను. మాలో శీను గాడికి ఆత్ర మెక్కువ. వాడు ఓ పది కాయల పడగొట్టి కానీ ఊరుకొనే వాడు కాదు. కామేశం గాడు వాడిని మందలించే వాడు, “ఒరేయ్, ఈ పళ్ళన్నీ శాస్త్రానికి ఒకటో రెండో అయితే చాలు రా, పండగ ఉద్దేశం ముఖ్యం గా “ఈ పళ్ళూ ఈ ఆకులూ ఉంటాయని తెలవటానికని” మన తెలుగు మాస్టారు చెప్పలా?” అనేవాడు.
ఇలా పత్రి మొత్తం ఓ పైసా కూడా ఖర్చు పెట్టకుండానే సేకరించేవారం. పైసలు ఖర్చు పెట్టేది మాత్రం వినాయకుడి బొమ్మకీ, ఆయన గొడుగుకీ. అప్పట్లో పర్యావరణ స్పృహ ఇప్పటి లా లేదు, కాబట్టీ బజార్లో రంగు గణేశులే దొరికే వారు. వినాయకుడి పాదాల దగ్గర ఎలుక లేకుంటే, ఆ బొమ్మ కొనకూడదు! వినాయకుడికి పైన చతురస్రాకారం లో ఉండే ఒక చక్క ఫ్రేం వేలాడదీసే వాళ్ళం (దీనిని ఏమంటారో మరిచి పోయాను. ఎవరికైనా గుర్తుంటే చెప్పండి). దానికి,  కరకట్ట కింది మొక్క జొన్న తోటలలోంచీ తెచ్చిన కండులను కట్టే వాళ్ళం. ఇంకా ఆకులను గుచ్చే వాళ్ళం.
వినాయకుడి కోసం ఇంట్లో శాశ్వతం గా ఒక పీట ఉండేది.
వంటింట్లో కుడుములూ ఉండ్రాళ్ళూ తయారవుతూ ఉండేవి. కానీ వాటిని తినటానికి లేదు. పూజ అయేదాకా ఇంట్లో ఎవరూ ఏమీ తినకూడదని పెద్దవారి ఆజ్ఞ.  “ఊరికినే వంట గది చుట్టూ తిరగకపోతే, పుస్తకాలకి కాస్త పసుపు రాసి, “ఓం” రాసుకోవచ్చు గా!”, అని ఓ కేక. “అవును, పుస్తకాలు పూజ దగ్గర పెడితే ఆ సంవత్సరం మంచి మార్కులు వస్తాయి. పూజ దగ్గర పుస్తకాలు పెట్టాలంటే వాటికి పసుపు రాయాలి. “ఓం” అని తెలుగు లో రాయాలి, అప్పటికి సంస్కృతం “ఓం” ఎలా రాయాలో తెలియదు మరి!
పూజ మొదలవుతుంది. కడుపులో వినాయకుడి వాహనాలు పరుగెడుతున్నా, శ్రధ్ధగా మంత్రాలు వినేవాడిని. వినాయక వ్రత కల్పం కధ పుస్తకం ఓ “యాంటిక్”. అది పది సంవత్సరాల నుండీ వస్తున్న ఓ వారసత్వ సంపద.  ముందు స్తోత్రం. తరువాత పూజ..
బిళ్వ పత్రం..ఆ మారేడాకు ఇలా ఇయ్..
సరే..ఆ శమీ పత్రం ..జమ్మి ఆకు..
కదళీ ఫలం..అరటి పండు ఏదీ..?
దర్భ..గడ్డిపోచ..ఇంకా..బదరీ పత్రం..రేగు ఆకు..
ఇలా పూజ చేసే పెద్దలకి అందిస్తూ ఉండే వాళ్ళం. దానితో ఏ పత్రం అంటే ఏమిటో, సంస్కృతం అప్పటికి చదవక పోయినా, కొంత అర్ధమయేది. మరుసటి సంవత్సరానికి కొంత గుర్తుండేది. మధ్య మధ్య లో ఇంట్లో పిల్లలకి ఏదో ఒక అల్లరి పని కి తిట్లు పడేవి. తరువాత పెద్ద వాళ్ళ సమర్ధన, “ఈ రోజు తిట్టించుకొంటే మంచిదే లేవే!”, అని.

“ఓ బొజ్జ గణపయ్య, నీ బంటు నేనయ్య
ఉండ్రాళ్ళ తద్ది కీ..”
అంటూ తెలుగు లో పద్యాలు కూడా ఉండేవి..మధ్యాహ్నం ఏ రెండింటికో వ్రతం పూర్తి అయ్యేది. కడుపు నక నక లాడుతూ ఉంటే ఉండ్రాళ్ళూ, కుడుములూ లాగించి, గారెల పైన పడే వాళ్ళం.
ఓ సంవత్సరం వ్రత కల్పం పుస్తకం పోయింది. కొత్త వ్రత కల్పం పుస్తకం మార్కెట్ లో కొంటే, చాలా చిన్నదైపోయింది. అంతా షార్ట్-కట్..అంతేనా?, కథ మారిపోయింది. అంతకు ముందు ఉండే మూల కథ  మారకపోయినా, కొన్ని చిన్న మార్పులు వచ్చాయి.

సాయంత్రం వినాయక చవితి పందిళ్ళ లో ఘంటసాల భక్తి పాటలు పెట్టే వారు. హరి కథా కాలక్షేపం జరిగేది. హరి కధ చెప్పే ఆయన(భారతం చెప్పే భాగవతార్) పద్యాలు చదువుతూ మధ్య మధ్య లో అనేక (సంబంధం ఉండీ ఉండని) పిట్ట కథలలోకి దిగుతూ అలరించే వాడు. అసలు కథ భారతమైనా, అసలు కథ కంటే ఆ పిట్ట కథలే బాగుండేవి. ఉదాహరణ కి శల్యుడు మేకపోతు గాంభీర్యం చూపించాడు అని, మేకపోతు గాంభీర్యమంటే ఏమిటొ వివరించటానికి పులీ, మేకా, గుహా..కథ వినిపించే వారు. మధ్య మధ్య న పద్యాలు పాడుతూ, చేతి లో చిడతలు(?) వాయిస్తూ చిన్న పాటి చిందులు కూడ వేసే వారు.   ఇప్పుడు హరి కధ చెప్పే వారు రాష్ట్రం లో ఎంత మంది మిగిలి ఉన్నారో!

********************

కాలం తో పాటు వినాయక వ్రతం లోనూ, నా లోనూ కూడా మార్పులు వచ్చాయి.
నేను సాంప్రదాయక దేవుడిని నమ్మటం మానేశాను. పట్టణాలకు చేరాను. ఇప్పుడు బజారుకెళ్ళటం ఇంత పత్రి కొనుక్కొని రావటం. ఆ పత్రి లో ఏముందో కూడా ఒక్కోసారి తెలియదు.(మన సంచి లో తక్కువా, రోడ్డు పై కాళ్ళకింద నలుగుతూ ఎక్కువా ఉంటోంది పత్రి ఈ మధ్యన ). ఐదు నిమిషాలలో చదివి పారేయగల వినాయక వ్రత కల్పాలు వచ్చాయి.
వ్రతానికి కూర్చొంటే ( :-( పాపం నేను), ఇంగ్లీషు మీడియం లో చదివిన పట్నపు శ్రీమతి చదివే స్తోత్రం కర్ణ కఠోరం గా వినపడి, ఆగలేక నేనే సరిగా చదివి దాని అర్ధాన్ని వివరించటం. పిల్లలకి వినాయక కథ ని “టాం అండ్ జెర్రీ” తరహా లో వినిపించటం. కావలసిన ఫల పత్రాల లో ఒకటీ పత్రి లో కనిపించదు (ఏక వింశతి పత్రాణి). అన్నీ కలిపి వినాయకుడి ముందు పెట్టి, శ్లోకం చదవటం.  ..ఇదీ పరిస్థితి.నాస్తికులు కూడా త్యాగరాయ కృతిని విని ఆనందించినట్లు, నేను కూడ వినాయక పూజను చేసి సంతోషించటం నేర్చుకొన్నాను.

పిల్లలు ఆకలి కి తట్టుకోలేరు కాబట్టీ వాళ్ళకి పొదున్నే బొజ్జ నింపేయటం మంచిది. ఇక వాళ్ళ బొజ్జ నిండా ప్రశ్నలే!
“డాడీ! గణేశా ని అంత చిన్న జెర్రీ ఎలా మోయగలుగుతుంది?”, లాంటి ప్రశ్న లకి సమధానం ఇవ్వటం.

ఇక ముందు ముందు ఎలా మారబోతోందో ఈ వ్రతం..ఇంటర్నెట్ సైట్లు పెట్టుకొని అయిందనిపించటం, మాల్స్ లో పత్రి విక్రయించటం, పత్రి వేసే యంత్రాలూ, మంత్రాలు చదివే యంత్రాలూ వగైరా వస్తాయేమో!కెల్లాగ్స్ కుడుముల పాక్ నీ, ఎంటీ ఆర్ ఉండ్రాళ్ళ రీఫిల్ నీ వాడవలసి వస్తుందేమో!
…ఆ పూజకి వేళయినట్లుంది, “వ్రతానికి రండీ..” అని వినిపిస్తోంది దేవుడి గది లోనుంచీ.
ఇక ఉంటానండీ. నండ్రి. ధన్యవాదగళు!

రచయిత గా నేను అందుకొన్న మొదటి..

రచయిత గా నేను అందుకొన్న మొదటి..పారితోషికం.

ఓ మూడు నెలల కిందట కినిగే కిరణ్ గారి నుంచీ ఓ మెయిల్ వచ్చింది.. “మీరు కినిగె లో పెట్టిన పుస్తకానికి వచ్చిన పారితోషికాన్ని మీ అకౌంటు కు ట్రాన్స్-ఫర్ చేయాలి. మీ  బాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వండి “, అని. కినిగే లో నా పుస్తకం “ఒక తెలుగు సాఫ్ట్-వేర్ ఇంజినీర్ కథ”, ని పెట్టినపుడు  ఆ పుస్తకం అమ్ముడు పోగా వచ్చిన సొమ్ము లో నాకు కూడా కొంత వస్తుందని తెలిసింది. కానీ నేను దానిని సీరియస్ గా తీసుకోలేదు. వెంటనే మరచి పోయాను.
అంతకు ఓ ఆరునెలల ముందు, నాగార్జునాచారి గారి సలహా మీద రహమానుద్దీన్ గారిని సంప్రదిస్తే “స్వయం ప్రకాశకమైన” పుస్తకాలను అప్పుడప్పుడే కినిగె లో అనుమతిస్తున్నాము. మీ పుస్తకాన్ని పంపించండి” అని చెప్పారు.
నేను ఎలానో కుస్తీపట్టి ఒక “పీడీ ఎఫ్” డాక్యుమెంట్ చేసి పంపిస్తే, కిరణ్ గారు వెంటనే కొన్ని సలహాలతో స్పందించారు. తరువాత ప్రతిని సరి చేసి పంపాను. పుస్తకాన్ని కినిగె లోకి ఎక్కించిన తరువాత దానిని గురించి మరిచే పోయాను.
కిరణ్ గారి నుంచీ వచ్చిన మెయిల్ చూసి చాలా సంతోషమయింది. “పరవాలేదు, పొద్దున్నుంచీ సాయంత్రం వరకూ చాకిరీ చేసే ఉద్యోగాలలోనే కాకుండా, మనం మిగిలిన పనులు చేసినా కొద్దో గొప్పో రూకలు రాలతాయన్న మాట”, అంపించింది.
రచయితలు తమ పుస్తకాలను తామే డబ్బులు పెట్టి , చేతి చమురు కొంత వదుల్చుకొని , పంచిపెట్టవలసిన ఈ తెలుగు దేశం లో, “పక్కింటావిడ తో కబుర్లు చెప్పటం వలన డబ్బులు వస్తే మావిడకి ఎంత సంతోషం వస్తుందో”,”ఉబుసుపోక పుస్తకం రాసి, దాని వలన డబ్బులు కూడా రావటం”, నాకు అంతే సంతోషాన్ని ఇచ్చింది.

“సరే, ఒక ముచ్చట తీరిపోయింది”, అనుకొన్నా! మనమేమైనా పేరు గన్న చేయి తిరిగిన రచయితలమా? పాడా?! నేను మొట్ట మొదట గిలికిన పుస్తకమే ఈ సాఫ్ట్-వేర్ కథ.
కానీ ఈ ముచ్చట మూణ్ణాళ్ళది కాదు. మరోసారి కూడా తీరింది. మళ్ళీ ఓ మూడునెలలోనే ఇంకొక విడత డబ్బు బట్వాడా అయింది. అంతకు ముందు కంటె ఎక్కువ గా.
ఇంటర్నెట్ వినియోగం ఆంధ్ర దేశం లో పెరగబోతోంది. తెలుగు చదవటాన్ని  కుర్ర తరాలకు అలవాటు చేయగలిగితే, నిస్సందేహం గా ఇంటర్నెట్ పబ్లిషింగ్ కి తెలుగు లో భవిష్యత్తు ఉంటుంది. ఒక సారి పెట్టిన పుస్తకాన్ని ఎన్ని కాపీలయినా విక్రయించవచ్చు (కాపీలని కొన్న వారు వాటిని ఎంతమంది తో అయినా పంచుకోవచ్చుననుకోండి!)
తెలుగు లో రచనలు చేయటం ద్వారా ఈ రోజుల్లో జీవితాన్ని గడపలేమనే విషయం తెలిసినదే. కానీ మీరు అందులో వెచ్చించిన సమయానికీ శ్రమకూ కొద్దిగానైనా సాఫల్యత చేకూరాలంటే మీరు కూడా మీ పుస్తకాన్ని కినిగె లో పెట్టి చూడవచ్చు.

మొదట్లో పుస్తకం పెట్టి మరిచిపోయిన నేను, ఈ మధ్య నా కినిగే అకవుంట్ ప్రతి రోజూ చూసుకొంటున్నాను, “ఈ రోజు ఎవరైనా పుస్తకం కొన్నారా?”, అని.  కొంతమంది టైంపాస్ కి  ఏ రోజు కారోజు పేపర్లో తమ షేర్ విలువను చూసుకొన్నట్లుగా, ఇది ఒక  మంచి కాలక్షేపమే!

PS:  ఈ నా పుస్తకానికి పరిచయం రాసిపెట్టమని రాజశేఖర రాజు గారిని వేడుకొన్నాను,..నా వేడుకోలు ఎప్పటికి ఫలియించునో ఏమో!

నాకు తెలిసిన ఒక దొం.క. (దొంగ కమ్యూనిస్టు) కథ

మొన్నామధ్య య.రమణ గారి బ్లాగు లో దొంగ కమ్యూనిస్టుల గురించి కొంత చర్చ నడిచింది. నాకు నిజ జీవితం లో చాలా మంది ఇటువంటి దొంగ కమ్యూనిస్టులు తారసపడ్డారు. అలాంటి  ప్రొఫైల్ ఒకటి ఇక్కడ. ఇది ప్రత్యేకం గా ఎవరో ఒకరి గురించి మాత్రం కాదు.అంటే, ఈ టపా కేక. (కేవలం కల్పితం).
****************
కా|| శేషగిరి రావు గారు మధ్య కోస్తా లోని ఒక చిన్న రైతు కుటుంబం లో జన్మించారు. ఆ రోజుల్లో ఆ ప్రాంతం లో కమ్యూనిస్టు ఉద్యమం బలం గా ఉండేది. ఆ జిల్లాలో కమ్యూనిస్టులు అందరూ కా|| కోటయ్య గారి అనుచరులే. కాశే గారి నాన్న “కోటయ్య గారి నాన్న గారి కి” అనుచరుడు.అందు వలన కాశే కూడా కాకో గారి నాయకత్వం లో పార్టీ లో చేరి పని చేయటం మొదలు పెట్టాడు.  కాశే నాన్న ఒక బక్క రైతు. ఆయన అరెకరం వాడు.
కాశే అనతి కాలం లోనే తాలూకా స్థాయి నాయకుడయ్యాడు. ముఖ్యం గా దళితుల్లో ఆయన పలుకుబడి ఎక్కువ. కాకపోతే ఆయన ఇంటికి వచ్చిన దళితులు మాత్రం వరండాలో కింద కూర్చోవాల్సి వచ్చేది. దళితులకి వేరే ఇత్తడి చెంబు లో మంచి నీరు ఎత్తి పోసి వారికి మర్యాద చేసే వాడు. ఆ రోజుల్లో స్టీలు గ్లాసులను ఇంట్లోని వారికి మాత్రమే ఉపయోగించేవారు.
కాశే అక్కడి ఒక జమీందారుకి వ్యతిరేకం గా పోరాడి తదుపరి భూ సంస్కరణలలో తాను కూడా కొంత భూమి సంపాదించగలిగాడు. పార్టీ లో తనకున్న పలుకుబడి అందుకు ఉపకరించిందనుకోండి!
కొంత కాలానికి తెలంగాణ సాయుధపోరాటం ఊపందుకుంది.  పార్టీ అతనిని నైజాముకు పంపింది. అయితే కాశే కార్య రంగం తెలంగాణ పల్లెల లో లేదు. ఆయన అనతి కాలం లోనే హైదరాబాదు కు మారాడు.
కాశే అక్కడి రోజుకూలి కార్మికులకి చేబదుళ్ళిచ్చి సహాయ పడేవాడు. కాశే మంచి మాటకారీ, ఉత్సాహవంతుడు. పార్టీ లో క్షేత్ర స్థాయి లో జనాలను సమీకరించటం లో ఆయనకున్న ప్రతిభ గొప్పది.  పార్టీ లో ఆయనకున్న అనుభవం ఆయనకు తరువాత చాలా ఉపయోగ పడింది.
త్వరలోనే ఒక ఫైనాన్స్ కంపెనీ మొదలుపట్టిన కాశే, సమాంతరం గా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ని కూడా ప్రారంభించాడు. అ సంస్థ ని విస్తరించటం లో అతని పార్టీ అనుభవం ఎంతైనా ఉపయోగ పడింది.
తన వ్యాపారాల్తో సమయం చిక్కక కాశే పార్టీ కి దూరమయ్యాడు. అంతే గానీ పార్టీ మీది వ్యతిరేకత తో కాదు.
కాశే వ్యక్తిగతం గా చాలా సరదా మనిషి. ఆయనకు అక్కినేని నాగేశ్వర రావంటే మక్కువ ఎక్కువ. తెలిసిన మిత్రులు ఎవరన్నా, “బాగానే సంపాదించినట్లున్నావే?!”, అంటే.
సంపాదించకపోతే ఎలా?, అక్కినేని నాగేశ్వరరావంతటి వాడు ఓ ఇంటర్వ్యూలో, “డబ్బులేక పోతే నీ మొహం ఎవడు చూస్తాడు?”, అన్నాడు..అని చెప్తాడు.
కాశే కి రష్యా అంటే చాలా ఇష్టం (సినీ హీరో ల అభిమానులకి వారి హీరో అంటే ఇష్టమున్నట్లు). అమెరికా కుట్ర వలననే అక్కడి కమ్యూ నిజం పడిపోయిందని కాశే నమ్ముతాడు. ఇప్పటికీ  కాశే విశాలాంధ్ర, ప్రజాశక్తి పేపర్లని క్రమం తప్పకుండా వేయించుకొంటాదు. ఆ పేపర్లకి ఆయన, తన “ఓం సాయి రియల్ ఎస్టేట్”, ప్రకటనలు కూడా ఇస్తాడు. ప్రైవేట్ గా, “ఆ..ఏదో, పార్టీ అంటే అభిమానం కొద్దీ ఈ ప్రకటనలను ఇస్తాను, కానీ ఈ పేపర్లను ఎవరు చదువుతున్నారు?”, అంటాడు.
కాశే కి వయసు పైబడింది. ఆధ్యాత్మికత ఎక్కువయింది. ఆయన దృష్టి లో లెనిన్ స్టాలిన్ లు దేవుళ్ళే.వారిని పూజించటం వ్యక్తి పూజ కాదు. ఈ మధ్య కొత్త దేవుళ్ళు కూడా ఆయన లిస్టులో చేరారు. వారి లో బెంగళూరు బాబా కూడా ఒకరు. బెంగళూరంటే గుర్తుకొచ్చింది, మొన్నో రోజు ఆయన, చిన్నకొడుకుకి కర్నాటక లో ఓ మూడొందల ఎకరాలూ రెండో మనవడికి ఒరిస్సా లో ఓ రెండొందల ఎకరాలూ,  రాసిచ్చాడు.

కాశే దగ్గర ఒకరిద్దరు రచయితలు కూడా తచ్చాడుతున్నారు. ఒక రచయిత ఆయన షష్టి పూర్తికి మంచి స్థుతినే రాసి పెట్టాడు:

వామ పక్షమున పుట్టిన భావ విప్లవ వాది
లక్ష్మీ పుత్రుడైన భూమి పుత్రుండు
పేదవారి పట్ల పెద్ద చేయి
అపర కుబేరుడే ఈ శేష గిరి.

ఈ కవిత ని ఫ్రేము కట్టించి వరండా లో పెట్టించాడు కాశే. తన ఇంటికి వచ్చిన పాత మిత్రులకు ఆ ఫ్రేం ని గర్వం గా చూపిస్తూ ఉంటాడు.

వ్యక్తిత్వం (personality), శీలం (character), దార్శనికత్వం(visionary) గట్రా..!

ఈ రోజు టీవీ ఛానల్స్ ను తిప్పుతూ కూర్చొంటే, ఓ ఛానల్ లో personality development కోర్స్ గురించిన ప్రకటన వస్తోంది. “వార్నీ! వ్యక్తిత్వం అనేది ఒకటి ఉంటుందని తెలుసు, కానీ, దానిని అభివృధ్ధి కూడా చేసుకోవచ్చునన్న మాట. అదీ… , ఏదో కోర్స్ లో చేరి”, అనుకొంటూ ఉండగా, అదే చానల్ లో అబ్రహాం లింకన్, గాంధీజీ వంటి వారి గుణగణా లను మనం ఎలా పొందవచ్చు అనే విషయం మీద ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రాం మొదలైంది.
నాకు, “గాంధీ గారికీ, లింకన్ గారికీ, వీరి కోర్స్ కి వెళ్ళకుండానే ఆయా లక్షణాలు వచ్చాయి కదా!”, అనే ఆలోచన వచ్చింది.
“ఈ కోర్స్ ల లో ఉపయోగకరమైన మాటలు చెప్తారు. వాటిని ఆచరించాలా లేదా అనేది వ్యక్తి యొక్క ఇష్టం.ఏదేమైనా గుర్రాన్ని నీళ్ళ వద్దకు గైకొని(?) పోగలం, దీనికి నీటిని త్రాపలేము. నీటి వద్దకు తీసికొని పోవటం పెద్ద విద్య కాదు. దానికి త్రాపటమే కష్టమైన విద్య. (మార్క్స్ గారి ప్రకారం, ఉన్నటువంటి సమాజ వ్యవస్థ ఎలా ఉంది అని తెలుకోగలగటం పెద్ద విద్యకాదు. దానిని మార్చటమే అసలు విషయం. . కానీ ఈ రెండో విషయం లోనే విఫలమైంది ఆయన సిధ్ధాంతం ). ఆ బాధ్యతను ఈ కోర్స్ లు తీసుకోలేవు కదా!”, అనుకొని చానల్ మార్చాను.
ఈ చానల్ లో ఒక కారెక్టర్ ఆర్టిస్ట్, తన తదుపరి తెలుగు చిత్ర రాజమునందు తాను పోషించబోవు “కారెక్టర్” గురించి విశదీకరించుచున్నాడు.
“సినిమాలలో హీరో, హీరోయిన్ ల పక్కన ఉండే పాత్రలనే కారెక్టర్ ఆర్టిస్ట్ అని ఎందుకంటారో! హీరో, హీరోయిన్ ల కు కారెక్టర్ ఉండదా?! దాని అవసరం నేటి హీరో, హీరోయిన్ ల కు లేదా?” ఈ రీతిన పరిపరి విధముల నా తలంపులు (తల వంపులు కాదని మనవి!) పోవుచుండ నా మది లో ఓ ప్రశ్న తటిల్లత వోలె మెరిసినది.
“అసలు వ్యక్తిత్వమునకూ, శీలమునకూ వ్యత్యాసం ఏమి? నీటి వద్దకు తీసుకొనిపోబడిన అశ్వమునకు శీలము ఉండిన చో దానికి నీటిని త్రాగించుటకు కష్టపడవలసిన అవసరము ఉన్నదా?”

వేరొక చానల్ లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భం గా బోసు బాబు నాయకత్వ లక్షణాల గురించి చూపిస్తున్నాడు. అటువంటి నాయకులు ఇప్పుడు ఎందుకు లేరు? నాయకులు కూడా కొన్ని పరిస్థితులలో,అవసరాన్ని బట్టి కొన్ని కాలాల లోనే తయారౌతారా?  ఏ కాలానికి తగ్గ నాయకుడు ఆ కాలానుగుణం గా వస్తారా? అన్ని కాలాలకూ వర్తించే సర్వకాలీన నాయకుడు అంటూ ఉండదా?
*************
వ్యక్తిత్వము అను మాట వ్యక్తి నుంచీ వచ్చింది. వ్యక్తం అయిన వాడు వ్యక్తి. అంటే బయటికి వ్యక్త పరచబడని ఆలోచనలు, ఆవేశాలు వ్యక్తిత్వం లో భాగం కావు.personality అనే ఇంగ్లీషు ముక్క కు మూలం కూడా mask అని అర్ధం వచ్చే లాటిన్ ముక్కలో ఉంది.

సాధారణం గా మనం వ్యక్తిత్వాన్ని, కారెక్టర్నీ మనం పాజిటివ్ సెన్స్ లోనే వాడుతాం. మనమొక మనిషికి వ్యక్తిత్వం ఉంది అంటే, అతనికి మంచి వ్యక్తిత్వం ఉంది అనేఅర్ధం లో ఉపయోగిస్తాం. అలానే, కారెక్టర్ అనే పదాన్ని కూడా ఉపయోగిస్తాం.

ఒక మనిషి మాటా, అతని పాండిత్యమూ, హాస్య చతురతా,అందం, ఒడ్డూ పొడుగూ మున్నగునవన్నీ అతని వ్యక్తిత్వం లో ని భాగాలు. అలానే పదుగురికీ తెలిసేటట్లు అతను చేసే మంచి పనులూ, చెడ్డపనులూ, దానాలూ, మోసాలూ ఇవికూడా అతని వ్యక్తిత్వం లోని అంశాలే. వ్యక్తిత్వం లోనే సకారాత్మక వ్యక్తిత్వమూ, నకారాత్మక వ్యక్తిత్వమూ ఉంటాయి. ఏ మనిషి వ్యక్తిత్వం లోనూ అన్నీ మంచి విషయాలే ఉండవనేది తెలిన విషయమే. (ఏది మంచి? ఏది కాదు? అనే దానిని తేల్చటం ఓ బ్రహ్మ విద్య అనుకోండి!).
వ్యక్తిత్వం అనేది చాలా వరకూ, “మనుషుల మధ్య అస్థిత్వం లోకి వచ్చే”, విషయం (interpersonal issue). మనకు పక్క వాడి తో పరిచయం లేనపుడు, వాడి వ్యక్తిత్వం ఏదైతే మనకెందుకు? అయితే, దీనికి సెలబ్రిటీ ల వ్యక్తిత్వం ఒక మినహాయింపు. అది one way traffic లాంటిది. వాళ్ళ ని మన జీవితం లో కలిసే అవకాశం లేక పోయినా, వాళ్ళ వ్యక్తిత్వం గురించి మనకి ఆసక్తి ఉంటుంది.

బయటికి కనపడని మనుషుల చెడు ఆలోచనలూ, వారు చాటు మాటు గా చేసే చెడు పనులూ, లేక మంచి పనులూ వారి వ్యక్తిత్వం లో భాగమవ్వాలంటే, అవి బయట పడి నలుగురికీ తెలవాలి. వ్యక్తిత్వం అనే సులువైన విషయాన్ని, మన self అనే విషయం చాలా సంక్లిష్టం చేస్తుంది.
మనం నలుగురికీ మన గురించిన మంచి మాత్రమే తెలియాలనుకొంటాం. దానితో తగిన ఇమేజ్ చూపించటానికి ప్రయత్నిస్తాం. మన గురించిన చెడుని దాచుకొని, మంచి నలుగురుకీ తెలిసే లా ప్రవర్తిస్తాం. ఇది పరిణామ శాస్త్రం ప్రకారం మన వ్యక్తిగత మనుగడ కి అవసరం కూడా.ఎందుకంటే, చెడ్డ పేరు ఉన్నవారిని సమాజం కష్టపెడుతుంది కనుక.
ఒక్కోసారి మనం లోకానికి, మన గురించిన చెడు ని కూడా తెలియ చేస్తాం. మనం మంచి అనుకొన్న విషయాన్ని లోకం చెడు అనుకొన్నపుడు ఇది జరుగుతుంది.  ఒక్కోసారి మనం కప్పెట్టిన చెడు ని లోకం కనిపెట్టి బయటకు లాగుతుంది.
మనిషి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవటానికి ముఖ్య కారణాలన్నీ లౌకిక మైనవి (డబ్బూ, అధికారమూ, పేరూ వగైరాలు).
ఇక శీలం (character) అనేది  స్వభావ సిధ్ధమైన గుణాన్ని తెలియ చేస్తుంది. మనిషి “ముసుగు వేసుకోని” స్వరూపమే అతని శీలం.(ఒక మనిషి తన మనసు లోపల రహస్యం గా చేసే ఆలోచనలు కూడా అతని కారెక్టర్ లో భాగమే. ఈ రహస్య ఆలోచనలు ఇతరులకు ఎప్పటికీ తెలియక పోవచ్చు. కానీ ఆ మనిషి దీర్ఘకాలిక బాహ్య ప్రవర్తన ద్వారా అతని ఆలోచనలను కొంత వరకూ అంచనా వేయగలం.   ఆలోచనలు కూడా మనిషి శీలం లో భాగం కాబట్టీ, మనిషి కారెక్టర్ పూర్తి గా ఇతరులకు ఎప్పటికీ తెలియక పోవచ్చు. ఎందుకంటే, మనిషి తన ఆప్త మితౄలకు కూడా చెప్పుకోలేని కొన్ని రహస్య అలోచనలను కలిగి ఉండగలడు.రహస్యమైన పనులు చేయగలడు. ఆ ఆలోచనలను బహిర్గతం చేయటానికి అతని అంతరాత్మా, విలువలూ అంగీకరించకపోవచ్చు.మనిషి అచేతన(unconscious) లో అతనికే తెలియని భావాలుండవచ్చు.  ఇంకా, మానసిక వ్యాధి గ్రస్తుల ప్రవర్తనా, ఆలోచనలూ ఒక మిస్టరీనే! )

శీలం బయటి వత్తిడులని తట్టుకొనే resilience ని కూడా కలిగి ఉంటుంది.కారెక్టర్ ఉన్నవ్యక్తి తాను నమ్మిన విలువలను ఎన్ని కష్టాలకైనా ఓర్చి నెగ్గించుకొంటాడు. అలా అని మొండి పంతం పట్టే వారంతా కారెక్టర్ ఉన్న వారు కాదు. వ్యక్తిగతగా తన మాటే నెగ్గాలనుకొనే వారు మంకు మనుషులు మాత్రమే!    నీతీ , నిజాయితీ ధైర్యం లాంటివి ఒక మనిషి లో ఉంటే ఉంటాయి. లేక పోతే లేదు. వీటిని core characteristics అనుకొందాం.  వీటిని పెంపొందించుకోవటం చాల కష్టం. ఈ కాలం లో ఏ మనిషీ వీటిని పెంపొందించుకోవటానికి ప్రయత్నించటం కుదరదు. ఎందుకంటే మన సమాజం లో వీటి వలన ఒరిగేది ఏమీ లేదు. ఒక్కోసారి మనిషి ఈ లక్షణాలని నటించటం ద్వారా లబ్ధి పొందటానికి ప్రయత్నించ వచ్చు. నటించినంత మాత్రాన ఆ లక్షణాన్ని కలిగిఉన్నట్లు కాదు.

కారెక్టర్ లో కూడా మంచీ చెడూ రెండూ ఉంటాయి. ఒక మాఫియా డాన్ చెడు కారెక్టర్ ని కలిగి ఉంటే, ఒక స్టేట్స్-మాన్ మంచి కారెక్టర్ ని కలిగి ఉంటాడు.
వ్యక్తిత్వ వికాసం కోర్స్ లు ఏతా వాతా చెప్పేదేమంటే, మనం వ్యక్త పరిచే బాహ్య (superficial) ప్రవర్తనను సాధ్యమైనంత లాభదాయకం గా మార్చుకొమ్మని. ఇది చాల వరకూ కుదిరే విషయమే! ఒక ప్రవర్తననను చాలా కాలం వ్యక్తపరచగ , వ్యక్త పరచగా, కొంత కాలానికి అది మన నిజ స్వభావం లో ఒక భాగమైపోతుంది(internalization). నాకు “థాంక్స్” అని చెప్పటం కొత్తలో చాలా ఇబ్బంది గా ఉండేది. కానీ ఓ నాలుగైదేళ్ళ కు అలవాటైపోయి, థాంక్స్ చెప్పకుండా ఉంటే ఇబ్బంది గా అనిపిస్తోంది.
వ్యక్తిత్వ కోర్స్ ల తో ఇబ్బందేమిటంటే, ఇవి సమాజానికి మొత్తం గా ఉపయోగ పడే compassion వంటి లక్షణాలని internalize చేసుకోమని చెప్పవు. వ్యక్తి కి ఉపయోగ పడే  “చొరవ” వాటి లక్షణాల గిరించి మాత్రమే చెబుతాయి.ఒక ఇంటర్వ్యూ కి ఎవరూ వ్యక్తిత్వ కోర్స్ తీసుకోకుండా హాజరయారనుకొందాం. అప్పుడు ఒక అభ్యర్ధికి ఆ ఉద్యోగం వచ్చే అవకాశం X అనుకొందాం. కొన్నాళ్ళకు ఆ ఇంటర్వ్యూ కి అందరూ ఆ పర్సనాలిటీ కోర్స్ చదివి, తరువాత అటెండ్ అయారనుకొందాం. అప్పుడు కూడ ఒక అభ్యర్ధికి ఆ ఉద్యోగం వచ్చే అవకాశం X గానే ఉంటుంది. అంటె ఇలాంటి కోర్స్ ల వలన వచ్చే మొత్తం ప్రయోజనం సున్నా! కోర్స్ ట్రైనింగ్ ఇచ్చే వాడి జేబు లోనికి మాత్రం పైసలు వచ్చాయి. వాడికి ఉపాధి దొరికింది. ఉద్యోగాల సంఖ్య పెరగనంత వరకూ ఇలాంటి కోర్స్ ల వలన వ్యవస్థ స్థాయి లో వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. అయితే వృత్తి విద్యా నైపుణ్యాన్ని పెంచే కోర్స్ లు ఈ లాజిక్ కి మినహాయింపు. వాటి వలన కనీసం నైపుణ్యం పెరిగి ఉత్పాదకత పెరుగుతుంది.

ఒక మనిషికి గొప్ప కారెక్టర్ ఉండి, సరైన వ్యక్తిత్వం ఉండక పోవచ్చు. మన పల్లెల లోని రైతులు చాలా మంది ఈ కోవకే వస్తారు. (ఈ విషయం లో నాకు చార్లెస్ డికెన్స్ great expectations నవల లోని పిప్ పాత్ర గుర్తుకు వస్తుంది.) వీరు సరిగా మాట్లాడటం నేర్చుకొంటే వీరు మంచి వ్యక్తిత్వం కలవారౌతారు .
మరి కొంత మందికి గొప్ప వ్యక్తిత్వం ఉండి, మంచి శీలం లేక పోవచ్చు. బిల్ క్లింటన్లూ, రిసెషన్లను కొని తెచ్చిన హెడ్జ్ ఫండ్ మానేజర్లూ ఈ కోవ కి చెందిన వారే! గొప్ప నెగటివ్ కారెక్టర్ అంటే గాడ్-ఫాదర్ పాత్ర గుర్తుకు వస్తుంది.గొప్ప నెగటివ్ వ్యక్తిత్వం అంటే , ప్రతి విషయానికీ బూతులు తిట్టే ఆటగాళ్ళు (భజ్జీ లాంటి వారు, మెకన్రో లాంటి వారు) గుర్తుకు వస్తారు.  జార్జ్ బుష్ కి మంచి కారెక్టర్ ఉంది కానీ, వ్యక్తిత్వం లేదని నా అనుమానం.
గొప్ప వ్యక్తిత్వమూ శీలమూ ఉన్న వారు చాలా అరుదు. నాకు ఈ విషయం లో ఛత్రపతి  శివాజీ గుర్తుకొస్తాడు. “గడ్ ఆలా, పరూ సిమ్హ్ గేలా!”, అన్న ఆయన వ్యక్తీ కరణా, యుధ్ధాలలో చిక్కిన ముస్లిం స్త్రీలను ఆయన గౌరవించిన విధానం ఆయన వ్యక్తిత్వాని కి సూచికలైతే, ఔరంగజేబుని ఎదిరించి నిలుపుకొన్న సార్వ భౌమత్వం ఆయన సమరశీలతకు ఒక తార్కాణం.

నెగటివ్ కారక్టరూ, నెగటివ్ పెర్సనాలిటీ రెండూ కలిగి ఉన్న వ్యక్తికి ఒక ఉదాహరణ  హిట్లర్ అని అనిపిస్తుంది . దీనికి వివరణ అవసరమా!
వ్యక్తిత్వమూ శీలమూ లేని faceless people  సమాజం నిండా ఉంటారు కదా?వారి ప్రవర్తనా ఇష్టాఇష్టాలూ పరిస్థితుల ప్రకారం, స్వప్రయోజనం ప్రకారం మారిపోతూ ఉంటాయి.చదువుకొన్న, అభివృధ్ధి చెందిన మానవ సమూహాలలో మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఎక్కువ గా ఉండే అవకాశం ఉంది. అలానే, కష్టాలు పడుతున్న, వెనుకబడిన సమూహాలలో కారెక్టర్ ఉన్న మనుషులు ఎక్కువ గా ఉండవచ్చు.వెనుకబడిన సమూహాలలో గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులకు వారి స్థాయికి మించిన జనాదరణ లభిస్తుంది, మన ఒలింపిక్ మెడల్ విజేతలకు లభించినట్లు గా.   అమెరికా వంటి దేశాలలో ఒలింపిక్ విన్నర్స్ కి లభించే గుర్తింపు కంటే, మన దేశం లో మన విన్నర్స్ కి లభించే ఆదరణ చాలా రెట్లు ఎక్కువ కదా? ఏ చెట్టూ లేని చోట ఆముదం చెత్టే మహా వృక్షం. అలానే వెనుకబడిన వర్గాలలోని వ్యక్తిత్వమున్న నాయకులూ, కరిష్మా ఉన్న నాయకులూ ఆయా వర్గాల అస్థిత్వం (identity) లో ఒక భాగమైపోయి, ఆయా వర్గాలలో ఎక్కువ జనాదరణని పొందుతారు.ఇదే సూత్రం ప్రకారం, అభివృధ్ధి చెందిన వర్గాలలోని కారెక్టర్ ఉన్న వ్యక్తులు కూడా ఎక్కువ ఆదరణ ని పొందాలి. కానీ అలా జరగదు. ఎందుకంటే, కారెక్టర్ అనేది నలుగురికీ సులువు గా తెలిసే వ్యక్తమైన విషయం కాదు కాబట్టీ.

నాయకునికి గొప్ప శీలమూ, వ్యక్తిత్వమూ తప్పని సరి. ఇంకా నాయకుడనే వాడు గొప్ప దార్శనికుడై ఉండాలి. అతనికి ఆవేశమూ ఆలోచనా సమపాళ్ళ లో ఉండటమే కాకుండా, తన ఆలోచనలనూ, కలలనూ “నిజం” గా మలచుకొనే క్రియాశీలత ఉండాలి(ఈ లెక్క ప్రకారం thought leadership అనేది ఒక పెద్ద మిధ్య). సమాజపు విలువల కన్నా ఒక మెట్టు పైన ఉన్న విలువలను ప్రతిపాదించి కూడ వాటిని నిజం గా మలచగల సమర్ధత ఉండాలి. (conceptual గా ఈ విలువల స్థాయి కి ఒక అంతం అంటూ ఉందదు. ఒక విలువ కన్నా పైస్థాయి లో వేరొక విలువ ఉంటుంది. ఏ స్థాయి విలువ సమాజానికి సరిపోతుందనేదీ, అవసరమనేదీ, ఆచరణీయమనేదీ నాయకుడు నిర్ణయించుకోవాలి. అలానే కింది స్థాయి విలువల పై “చలం” గారి లా చిన్న చూపు తగదు. కింది స్థాయి విలువలు ఏర్పడిన పరిస్థితులనూ, అనివార్యతను సానుభూతి తో అర్ధం చేసుకోవాలి. నాయకుడు, తన విలువలను, ఒంటరి ఉలిపి కట్టె లా తాను మాత్రం పాటిస్తే చాలదు. తాను మాత్రమే పాటిస్తే అతనికి గొప్ప కారెక్టర్ ఉండవచ్చు. కానీ ఆ విలువలను సమాజం లో చెలామణి లోనికి తే గలిగినపుడే అతను అసలైన నాయకుడవుతాడు.)
ఈ రోజుల్లో గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకులు ఎక్కడన్నా ఒకరు తగులుతారు (నాకు గుర్తుకు వచ్చే వారు జైపాల్ రెడ్డి, జై రాం రమేష్ , సుబ్రమణ్య స్వామి ). గొప్ప శీలం ఉన్న నాయకులు చాలా  తక్కువ (అన్నా హజారే గుర్తుకు వస్తున్నాడు.ఇది నా నమ్మకం మాత్రమే! ఒక మనిషి కారెక్టర్ దీర్ఘకాలం లోనే బయటపడుతుంది). నాయకత్వానికి కావలసిన క్రియాశీలత చాలామంది లో ఉంటుంది. ముఖ్యం గా కార్పొరేట్ నాయకులలో ఇది మెండు. కానీ, కారెక్టర్ విషయం లో సందేహాలుంటున్నాయి. cultivated personality చాలా మందికి ఉంటుంది. కానీ అసలైన వ్యక్తిత్వం ఉండేది ఎందరికి?
“శీలం అనేది కష్టాల వలన పెంపొందుతుంద”నేది ఒక బలమైన నమ్మకం. resilience అనేది శీలానికి ఉండే ఒక ముఖ్య లక్షణం.వ్యక్తిత్వాన్ని ఒక కుండ తో పోల్చవచ్చు. కోర్స్ ల ద్వారా నేర్చుకొనే వ్యక్తిత్వం ఏ కుండ లో పోస్తే ఆ కుండ ఆకారం తీసుకొనే నీటి లాంటిదైతే, అ కుండ కు ఇనుముతో చేసినట్లు గట్టితనాన్ని ప్రసాదించేదే మంచి కారెక్టర్. కానీ ఈ ఆధునిక సమాజం లో జనాలు మరీ కష్టాలు పడే రోజులు పోయాయి. నాయకులు జనాల లోంచే వస్తారు. జనాలు తిరుగుబాట్లు చేయకుండా ఉండటానికి , లేక ఓట్ల కోసం, ప్రజాస్వామ్య నాయకులు జనాలకు కావలసిన కనీసావసరాలను కొంతైనా కల్పిస్తున్నారు. దీని వలన కావచ్చు, గొప్ప కష్టాలలోంచీ వచ్చే, సమ్మెట దెబ్బలు పడిన ఇనుము లాంటి కారెక్టర్ ఉన్న నాయకులు రావటం లేదు.

మన వ్యవస్థలకు ఎటువంటి నాయకులు అవసరం?రాజకీయాలలో ఓట్లు పట్టే వాడే నిజమైన నాయకుడు. వచ్చే ఎన్నికలను గెలవ లేని వాడికి ఎంత గొప్ప కారెక్టర్ ఉన్నా ఏమి లాభం? కార్పొరేట్ వ్యవస్థ లో మదుపరుల డబ్బుని పెంచే నాయకుడు కావాలి.అది ఏ మార్గం ద్వారా పెరిగిందనేది అనవసరం. కొత్త కొత్త సృజనాత్మక ఉత్పత్తులు తయారు చేసే, రిస్క్ చేసే నాయకుడు మనకు అవసరం లేదు. మనకు తెలిసిన, అలవాటైన సేవల ద్వారా నాలుగు రాళ్ళూ సంపాదించగలిగితే చాలు. దీనికి ఒక కారెక్టర్ ఉన్న నాయకుడు అవసరం లేదు. స్వంత నిర్ణయాలు తీసుకొని వాటికి కట్టుబడే వాడు ఈ వ్యవస్థ లో చాలా ప్రమాద కరం. ఒక cultivated personality ఉన్న నాయకుడు చాలు. భారతీయ కార్పొరేట్ వ్యవస్థ లో, బాస్ నిర్ణయమే చివరికి శిరోధార్యం.flexibility ఉన్న వాళ్ళు కావాలి. అంటే కారెక్టర్ అనవసరం. ఐ టీ సేవల రంగం లో అయితే, ఈ రోజు జావా నేర్చుకొమ్మంటే నేర్చుకోవాలి, రేపు సీ నేర్చుకొమ్మంటే నేర్షుకోవాలి అంటే సర్దుకుపోయే తత్వం ప్రధానం. సర్దుకుపోయే తత్వం వ్యక్తిగత మనుగడ కి ఉపయోగమేమో కానీ, అది ఒక నాయకత్వ లక్షణం కాదు. నాయకుడు బలమైన సంకల్పం కలవాడై, తాను అనుకొన్నదానికోసం మనసు మారకుండా నిలబడే దృఢ చిత్తుడై ఉండాలి. కానీ ఇలాంటి  గుణాలు ఏ రంగం లోనూ ప్రోత్సహించబడటం లేదు.  ఇటువంటి వాతావరణం లో నాయకుడి అవసరం ఎందుకు ఉంటుంది?  సినిమాలలో జనం తమని identify చేసుకొన గలిగిన కారెక్టర్ ఉన్నవాడే హీరో. వాడికి సున్నితమైన లక్షణాలు ఎలా అబ్బుతాయి? మన సమాజానికి నాయకుల అవసరం ఉన్నట్లు కనపడదు. స్వతంత్రం రావటం తోనే ఆ అవసరం తీరిపోయిందేమో!

నేను రాయకూడదనుకొన్న కథ:

=                                                     టెర్రరిస్టులు

“మొత్తానికి అయిపోయింది..డైవోర్స్ కి ఒప్పుకొన్నాడు. “డీవీ” కేసు పెడతానన్న తరవాత దారిలోకి వచ్చాడు గురుడు.. ఎలిమొనీ అదీ కూడా బాగానే వచ్చేటట్లు చూడవచ్చు” అంది స్వేచ్చ,  కాలా పానీ పబ్ లోకి అడుగుపెడ్తూ.

“మరి మహేష్ తో  నిశ్చితార్ధమెప్పుడు?” అంది అమె స్నేహితురాలు కావ్య.

“చూడాలి వచ్చే మార్చి లో కావచ్చు”, అంటూ, “ఆ బైతు గాడు చూడు నన్ను ఎలా తినేసేలా చూస్తున్నాడో?”, అని పబ్ బయట ఆమెనే చూస్తున్న ఒక అల్పజీవిని చూపిస్తూ పెదవి విరిచింది. స్వేచ్చ అసలే అంద గత్తె. ఆపై స్లీవ్లెస్ టాప్ పై మినీ వేసుకొంది. టాప్ నుంచీ క్లీవేజ్ కనపడుతూ, వచ్చేపోయే మగ పురుగుల మతి పోగొడుతోంది.

“ఆ బైతు గాడేమో గానీ వాడి పక్కన ఉన్న ఇద్దరూ పరవాలేదు”, కావ్య అంది .

ఆ ఇద్దరూ కూడా తన వైపే చూస్తూ ఉండటం గమనించి, స్వేచ్చ వాళ్ళ అటెన్షన్ ని ఒకింత గర్వం గా ఎంజాయ్ చేస్తూనే, మనసులోంచీ వచ్చే ఆనందాన్ని నొక్కి పట్టింది. కిందిపెదాన్ని పై పెదిమ తో అదిమి పెట్టింది.

పబ్ లో డ్రింక్స్ వాసన, సిగరేట్ పొగ వాసన, మాటవినిపించని సంగీతపు కలా పోసన, మొత్తానికి అది ఆధునికత అనబడే క్షుద్రదేవతోపాసన!

పబ్ లో మగవాళ్ళందరి దృష్టీ స్వేచ్చ వైపే! ఆమె వాళ్ళ చూపులని ఎన్ జాయ్ చేస్తూనే,

“ఎలాచూస్తున్నారో చొంగలు కారుస్తూ..!ఏదేమైనా నావి కిల్లర్ లుక్స్..”, అనుకొంది.

ఇద్దరు  పత్రికా రిపోర్టర్లు మూడో పేజీ కోసం పబ్ లో ని అమ్మాయిల పర్మిషన్ తీసుకొని వారి అందాన్ని కెమేరాలలో బంధిస్తున్నాడు.  అమ్మాయిలు పోజ్ ఇస్తున్నారు.

******************

శ్రీనివాసులు కి సింగరాయకొండ తో పోలిస్తే హైదరాబాద్ స్వర్గం లా అనిపిస్తోంది.  అతనిది సింగరాయ కొండ దగ్గరి ఒక ఊరు. ఇంకా కేబుల్ టీవీ వ్యాపించనంత మారుమూల ఊరు. హైదరాబాద్ అమ్మాయిలు చాలా ఫాస్ట్ గానూ, అప్సరసల్లానూ అని పిస్తున్నారు. వాళ్ళ డ్రెస్ చాలా బోల్డ్ గా అనిపిస్తుంది అతని కి. జబ్బలూ పిక్కలూ కనపడేలా డ్రెస్ చేసుకొనే ఆడవాళ్ళ ని నోరు వెళ్ళబెట్టుకొని చూస్తున్నాడు శ్రీనివాసులు. ఇంతకు ముందు అలాంటి ఆడ వాళ్ళని సినిమాలలో మాత్రమే చూశాడు. వాళ్ళ ఊళ్ళో ఓ వృత్తి లో ఉన్న ఆడవాళ్ళు మాత్రమే అలాంటి దుస్తులు వేసుకొంటారు. వాళ్ళ ఊరి దగ్గరలోని ఒక కాలేజీ లో “ఎం సీ యే” అయిన తరువాత ఉద్యోగాన్వేషణ లో భాగ్యనగరి చేరుకొన్నాడతను. ఇంత పెద్ద నగరానికి రావటం అదే మొదటి సారి అతనికి.  ఒక రూం మేట్ రమణ. అతను “ఎం సీ యే”, లో శ్రీనివాసులు కి క్లాస్-మేటే, వాళ్ళది విజయవాడ. ఇంకొక రూం-మేట్ రవి జాబ్ చేస్తున్నాడు. అతని అసలు ఊరు బెంగుళూరు.

రమణ,”బాబాయ్, ఇక్కడ పబ్బులు చాలా ఉంటాయి. నాకు పబ్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది. ఏదైనా పబ్ కి వెళ్దామా?”, అన్నాడు.

“ఆ.. పబ్ లో ఏం ఉంటుంది? ఇక్కడ మనం రూం లో తాగే బీర కాయలనే, ఓ నాలుగు రెట్లు పైసలు వదలగొట్టుకొని అక్కడ తాగుతాం, అంతే!”, అన్నాడు పబ్ ల విషయం  తెలిసిన రవి.

“ఈ ఒక్క సారి కి మాత్రమే వెళ్దాం. పబ్ లు ఎలా ఉంటాయో తెలుస్తుంది కదా!”, అన్నాడు శ్రీనివాసులు. అతనికి పబ్ ల లో కనపడబోయే కురచదుస్తుల ఆడవాళ్ళు కళ్ళముందు కనపడసాగారు.

రమణ, “కానీ శీనూ, నువ్వు మాత్రం తాగొద్దురా! ఒరే,   ఫేర్వెల్ పార్టీ అప్పుడు సగం బీర్ బాటిల్ తాగి నానా యాగీ చేశాడు వీడు. మామూలు గా ఇలా మెత్త గా నోట్లో నాలుక లేనట్లు కనపడతాడా! తాగితే మాత్రం మనిషి కాదు”, అన్నాడు.

” అరే! నేను చాలా మిస్ అయ్యానన్న మాట! అలా అయితే ఇవాళ శీను తాగాల్సిందే!”, అన్నాడు రవి.

********************

పబ్ కి అటాచ్ అయి ఉన్న డిస్కో లో డాన్స్ లు మొదలయ్యాయి. స్వేచ్చ కావ్య తో కలిసి కాలు కదుపుతోంది. రెండు చేతులూ పైకెత్తి కనురెప్పలు కిందికి దించి తననే చూసుకొంటూ తన నడుము ఊపుతూ మూవ్ మెంట్స్ ఇస్తోందామె.

“ఎక్కడికి పోతావు చిన్నవాడా! నా చూపులలో చిక్కుకున్న..!” కొత్త రిమిక్స్ ఫాస్ట్ బీట్ లో సాగుతోంది.

కూర్చొన్నవాళ్ళంతా రెప్పవేయటం మర్చిపోయినట్లు చూస్తున్నారు.  శ్రీనివాసులూ మిత్రులూ ఒకటేబుల్ దగ్గరకు చేరారు.

అమె ని చూసి రమణ తనలో ,”ఆహా ఏమి ఆ జబ్బల నునుపు, వాటిని ఒక్క సారి నిమిరితే ఎంత బాగుంటుందో!” అనుకొంటున్నాడు.

రవి చూపులు ఆమె క్లీవేజ్ లో చిక్కుకొని ఏవో ఊహా లోకాల్లో తేలియాడుతున్నాయి.

శీను నోరు సగం తెరిచి చూస్తున్నాడు. అతనికి అక్కడి చెవులు చిల్లులు పడే మ్యూజిక్ ఏ మాత్రం వినపడటం లేదు.

ముందు గా రవి తేరుకొని, ” పబ్ కి వచ్చింది తాగటానికి రా బయ్. నోరెళ్ళబెట్టటానికి కాదు. ఇవాళ శీను తాగి ఏం చేస్తాడో చూడాలి”, అని, వెయిటర్ కి ఆర్డర్ ఇచ్చాడు.

సైడ్ డిష్ తింటూ ముగ్గురూతాగుతున్నారు. మ్యూజిక్ లో బీట్ పెరుగుతోంది. డాన్స్ వేగం పెరుగుతోంది. స్వేచ్చ నడుము ఊపు జోరందుకుంది.

“వీడు తాగితే యాగీ చేస్తాడన్నావ్. ఏమీ చెయ్యటం లేదు?”, అన్నాడు రవి, రమణ తో.

శీను అదేమీ పట్టించుకోకుండా, “నేను ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకొంటాను,ఆ డాన్సూ,  అ నవ్వూ ఆ బిగబట్టిన పెదాలూ, అంతా నా కోసమే!  “, అన్నాడు సీరియస్ గా.

రమణ మొహం లో గాభరా.

రవి, “బౌన్సర్లు బయట పడేస్తారు. గమ్మునుండు. అవును, నువ్వు తాగితే యాగీ ఏదో చేస్తావంట కదా!”, అన్నాడు.

శీను లేచి డాన్స్ ఫ్లోర్ మీదికి వెళ్ళి, స్వేచ్చ ని సమీపించాడు. ఆమె ముఖం లోని ప్రశ్నార్ధకాన్ని పట్టించుకోకుండా పెదాలు కలిపాడు. వళ్ళంతా తేళ్ళూ జెర్రులూ పాకినట్లై, ఆమె పెద్ద గా అరిచింది.  పబ్ అంతా కలకలం రేగింది. తేరుకొన్న పేజ్ 3 ఫొటోగ్రాఫర్లు కెమేరాలు క్లిక్ మనిపించటం మొదలు పట్టారు. బౌన్సర్లు వచ్చారు. రమణా రవీ, వాళ్ళ తొ వాదిస్తున్నారు. వాళ్ళు చచ్చిన ఎలుకను విసిరేసినట్లు శీను ని పబ్ బయటికి విసిరేశారు.

**************

శీను పొద్దున్నే బధ్ధకం గా లేచి రూం లోని టీవీ ఆన్ చేశాడు. రాత్రి తాగిన హాంగోవర్ ఇంకా దిగలా.
టీవీ లో వార్తా స్రవంతి.
“నగరం లోని పబ్ లో రేప్ ప్రయత్నం. పరారీ లో దుండగుడు”
శీను స్వేచ్చని ముద్దు పెట్టుకొంటున్న ఫొటో లని మార్చి మార్చి చూపిస్తున్నారు.
చానల్ మార్చాడు.
అక్కడ చర్చ జరుగుతోంది. మహిళాసంఘం అధ్యక్షురాలు “మన సమాజం లో స్త్రీ లకు రక్షణ కరువైందని” వాపోతోంది.
ఒక స్త్రీ వాది, “మగ బుధ్ధి గురించి గట్టిగా నిరసిస్తోంది”.
మామూలు గా శాంతం గా ఉండే ఒక రచయిత్రి ఆవేశం గా, “దుండగుడిని కాల్చిపారేయాల్సిందే”, నంటోంది.
ప్రతిపక్ష నేత, “మహిళలను కాపాడటం లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నాడు.
వేరే అధినాయకుడు తమ పార్టీ అధికారం లోకి వస్తే రేప్ చేసిన వాళ్ళకి మరణ శిక్ష పడేలా చట్టం తెస్తామని హామీ ఇస్తున్నాడు.
అధికార పక్ష ప్రతినిధి,ప్రభుత్వం నేరస్తులను త్వరగా పట్టుకోవటానికి ఏ ఏ ప్రయత్నాలు చేస్తోందో వివరిస్తున్నాడు.
ఇంకో చానల్ లో విలేకరులు పోలీస్ కమీషనర్ ని అడుగుతున్నారు, ” ఈ మధ్య దోపిడీ దొంగలు నగరం లో విచ్చలవిడి గా దొంగతనాలు చేసినా మీరు పట్టుకోలేక పోయారు. ఇప్పుడు రేపిస్టులను ఏమీ చేయలేకపోతున్నారు. ఇది లా అండ్ ఆర్డర్ వైఫల్యం కాదా. పోలీసు యంత్రాంగం ఏమి చేస్తోంది?”

శీను కంగారు గా రూమేట్స్ ని లేపాడు. విషయం తెలిసిన మిగిలిన ఇద్దరూ వాడిని ఆడి పోసుకొన్నారు. “ఈ ఉపద్రవానికి కారణం నువ్వే. నీ వంకర బుధ్ధి వలన నే ఈ ప్రమాదం ముంచుకొచ్చింది”, అన్నారు.
“పోలీసులు వస్తే నీతో పాటు మా ఇద్దరినీ కూడా బొక్క లో వేస్తారు, కాబట్టీ మేము మా ఊళ్ళ కు పోతున్నాం”, అన్నారు.

వెళ్తూ వెళ్తూ, “ఓ రెండ్రోజులు పోతే అంతా సద్దుమణుగుతుంది. అప్పుడు చేయాల్సిన దాని గురించి ఆలోచించవచ్చు. బెయిలో గియిలో ఏదో ఉంటుంది. అప్పటి దాకా నువ్వు రూం బయటికి రావద్దు.”, అన్నాడు రవి.

********************

టీవీ లో పబ్ సంఘటనకు వ్యతిరేకం గా వివిధ ప్రజా సంఘాలు చేస్తున్న ప్రదర్శనలు చూపిస్తున్నారు.

అది చూస్తున్న “సీ ఎం” ఆందోళన గా ఉన్నారు. అసలే ఎన్నికల సంవత్సరం.

హోం మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్లు వినపడుతున్నాయి.కొన్ని పత్రికలు “హోం మంత్రి కీ రేపిస్ట్ కీ బంధుత్వముందనీ, అందువలననే, పోలీసులు నిందితుడి పట్టుకోవటం లో అలసత్వం చూపిస్తున్నారనీ”, తప్పుడు ప్రచారం మొదలుపెట్టాయి.
ముఖ్యమంత్రి హోం మంత్రి ని పిలిపించుకొన్నాడు. సమావేశం నుంచీ బయటికి వచ్చిన తరువాత హోం మంత్రి “డీ జీ పీ” కి ఫోన్ చేశాడు. “ఎలా ఐనా పట్టుకోవాలి. వియ్ నీడ్ హిం డెడ్ ఆర్ అలివ్”, అన్నాడు.
అది జరిగిన మరుసటి రోజు సాయం కాలం చానళ్ళనీ గోల పెట్టాయి, ” పబ్ రేప్ సంఘటన లోనిందితుడి కాల్చివేత. నగరం లోని ఓ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు. నిందితుడి ప్రతిఘటన. పోలీసుల కాల్పులు”.

***********
“ఇంటి వెనుకే ఓ చెరువుంది సర్! అతను గోడదాటి చెరువులోకి దూకి పారిపోయే అవకాశం ఉంది. ఇప్పటి కే చాలా అన్-పాపులర్ అయి ఉన్నాం.చాన్స్ తీసుకోదలచలేదు”, హోం మంత్రి తో “డీ జీ పీ” అంటున్నాడు, ఫోన్ లో.

కాళీపట్నం రామా రావు గారి “చావు” కథ., నా అనుభూతి

తెలుగు సాహిత్యం సీరియస్ గా చదివే వారి లో, “కాళీపట్నం రామా రావు(కా.రా. మాస్టారు) గారి పేరు తెలియని వారు”, అరుదు.  మొదట, “కుటుంబ పరమైన కథల” తో తన రచనా జీవితన్ని మొదలుపెట్టిన ఆయన, మధ్య లో వామ పక్ష భావజాలానికి దగ్గరగా రచనలు చేశారు. చివరిదశ లో సిధ్ధాంత పరిధులకి లోబడని రచనలను కూడా చేస్తున్నారు.ఆయన కథ ల లో సునిశితమైన విశ్లేషణ ఉంటుంది. చిన్న పరిధి లో అయినా చాలా గొప్ప రచనలు చేశారు.
ఈ టపా ఆయన 1971 లో రాసిన “చావు” కథ గురించి. అయితే, ఇది ఆ కథ కు పరిచయం ఎంత మాత్రం కాదు. పరిచయం చేసే అర్హతా స్థాయీ నాకు లేవు. ఆ కథ చదివేటపుడు నాలో కలిగిన భావాలను పంచుకోవటానికి మాత్రమే ఈ టపా.
కారా మాస్టారు నిజజీవితం లో లెక్కల మాస్టారు. నాకు ఈ విషయం ఆయన కథలలో కనపడుతుంది (లేక నేను ఊహించుకొన్నానేమో!) ఆయన కథలలో ని మాటలు ఆచితూచి లెక్కపెట్టి వాడినట్లు గా ఉంటాయి. కధలు సాధారణం గా చాలా సీరియస్ గా ఉంటాయి. రావి శాస్త్రి వంటి వారి రచనలలో ఉండే entertaining quality ఈ కథల లో ఉండదు. ఒక మాట ఎక్కువ గానీ, వేరొక మాట తక్కువ గానీ వాడినట్లు మన కు ఎక్కడా అనిపించదు.
క్రికెట్ ఆడేటపుడు రాహుల్ ద్రవిడ్ వంటి బాట్స్-మేన్ text book strokes కొడతారని అంటారు. కారా మాస్టారి కథలు నాకు చాలా అథెంటిక్ గానూ, text book కథలు గానూ అనిపించాయి. చావు కథ ఆయన మార్కు కథలలో అగ్ర స్థానం లో ఉంటుంది. ఆయన “యజ్ఞం” కథ గురించి చాలా మందికి రివ్యూల ద్వారానో ఇతరత్రానో తెలుసు. నాకు “చావు కథ యజ్ఞం కథ కి ఏ మాత్రం తీసిపోని కథ”, అనిపించటం కూడా ఈ టపా రాయటానికి ఒక కారణం.

ఈ కథా స్థలం ఉత్తరాంధ్ర లోని ఒక మాల పేట .( పల్లెటూర్లూ,మాల పల్లెలూ, కులాలూ, దారిద్ర్యమూ పడని వారు ఇక్కడి తో ఈ టపా చదవటం ఆపేయ వచ్చు). నారమ్మ అనే ఒక ముసలామె చనిపోతుంది. మాలపేట లోని జనమందరూ (మొగుడూ పెళ్ళాలూ,కుర్రవాళ్ళూ) కూలికి పక్క ఊరికి వెళ్తారు. ఇళ్ళ లో పిల్లా జెల్లా, ముసలీ ముతకా మాత్రమే ఉంటారు (ఈ నాడు పట్టణాల లో ఉన్నట్లు గా). అది చలి కాలం. అసలే ముసలిదైన నారమ్మ , అ చలికి పై లోకాలకు వెళ్ళిపోతుంది. ఇంట్లో ఉన్న నారమ్మ మనవరాలు సిమ్మాద్రి దాని దోస్తుల్తో కలిసి పక్క ఊరు వెళ్ళి అక్కడి కి కూలికి వెళ్ళిన తన ఊరి జనాలకి “నారమ్మ మరణం” గురించి చెబుతుంది.
ఊరి జనాలు ఇళ్ళ కు చేరి, ముసలామె ని ఖననం ఎలా చేయటమా అని ఆలోచన లో పడతారు. గుంపులో ని నారమ్మ సమకాలీనుడైన సూరయ్య, (అతనే కుల పెద్ద) ,ఆమె జీవితం లోని ఘట్టాలను గురించీ, ఆమె వ్యక్తిత్వం గురించీ చిన్న చిన్న సంఘటనల తో వివరిస్తూ ఉంటాడు.
చలికాలం అవటం మూలాన, ముసలామె ను దహనం చేయటానికి కట్టెలు దొరకవు, కన్నయ్య అనే అతను ఒక బారిక (ముఠా మేస్త్రి?). అతనిని కట్టెలను తీసుకొని రమ్మని, ఊరిలోని పెద్ద కులాల మనుషుల ఇళ్ళకు  పంపిస్తారు. కానీ కట్టెలు ఎక్కడా దొరకవు. ఊరిపెద్దల మాటలు వారి కుల వివక్షను బహిర్గతం చేస్తాయి.
అప్పా రావు ఆత్మ గౌరవంకల, కొంచెం దూకుడు కల కుర్రకారు.ఊరిలోని పెద్ద మనుషులు నిమ్న కులస్థులను అణచిపట్టటమే కాక వీలు చిక్కినపుడు, తమది కాని సొమ్మును చేజిక్కించు కొన్నారనే ఎరుక అప్పా రావుకీ కుర్ర కారు కీ ఉంటుంది.
ఊళ్ళో పెద్దలెవరూ ముసలామె దహనానికి కట్టెలు ఇవ్వలేదని తెలిసి, కుర్రవాళ్ళంతా ఆవేశం తో కట్టెల కోసం ఊరి లోకి వెళ్తారు. ఈ లోపల సూరయ్య అక్కడ పోగయిన జనాలతో ఆ ఊరి ఆర్ధిక సంబంధాల చరిత్ర గురించి వివరిస్తాడు. ఒకప్పుడు అన్ని కులాలకీ కొద్దో గొప్పో ఆస్థి ఉండేదనీ, నూతన ఆర్ధిక వ్యవస్థ ( 70 ల లో ని మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ) వలన బలవంతులూ, సరైన సంబంధాలు కలవారి దగ్గర సంపద పోగుపడుతోందనీ వివరిస్తూ ఉంటాదు.
హఠాత్తుగా కుర్రాళ్ళు కట్టెల మోపులు తెచ్చి పడవేస్తారు. అవి సంగ్రహించిన కట్టెలు. కట్టెలు సంగ్రహించటం లోని న్యాయాన్యా ల గురించిన చర్చ తరువాత, కుర్రకారు తమ మాట నెగ్గించుకొని ఆ కట్టెల తో  ఖననం చేస్తారు. ఇదీ సంగ్రహం గా కథ.
ఇది చాలా పెద్ద కథ. పదుల సంఖ్య లో పాత్రలు ఉంటాయి. కథ చలికాలం లో జరుగుతుంది. నాకైతే, కధ చదివినంత సేపూ చలి చలి గా అనిపించింది. పాత్రల వస్త్రధారణా  (బట్టలు ఉన్న పాత్రలకు), వారి మాండలికం, మాటా, మాట విరుపూ అన్నీ సజీవం గా ఉంటాయి. కథలు అందమయిన విషయాల గురించి రాయాలనే ఆలోచన కి ఈ కథ ఒక పెద్ద చెంప పెట్టు. ఈ కథ లో చనిపోయిన నారమ్మ దేహం మలమూత్రాల లో పడి దుర్వాసన వెలువరిస్తూ ఉంటుంది. కానీ మనకు ఆమె పట్ల  దుర్వాసన కు అతీతమయిన మానవతా స్పందన ఏదో కలుగుతుంది.
మాస్టారు మాటలు చాలా precision తో వాడతారు. మచ్చుకి కొన్ని..
“..అప్పుడప్పుడే విచ్చుతున్న మగ గొంతు”.

సమయం తో పాటు జనాలలో వచ్చిన పరిణామాన్ని సూచించే ఒక వాక్యం..
“..అయితే అప్పటి నాయుళ్ళు ఇప్పట్నాటి కరువుగొట్టు నాయాళ్ళు కారు. “ఆపు” ఉంచిన పెండ్లి కెళ్ళినా, ఏదో పేదా రోదా కడుపు జరగని గుంట పాపల్లెమ్మని సూసీ చూణ్ణట్టు, ఓ కసురు గసిరి, ఒగ్గీసీవోరు.”

కటిక పేదరికం లోం కూడా సమాజంపు ఆచారాలనూ కట్టు బాట్లనూ ఒదులుకోలేని పేద మనుషులు కపడుతూఉంటారు. ముసలామె ను కప్పెట్టటానికి ఆచారం అడ్డొస్తుంది.

“నారమ్మ కు కుర్ర తనం లో పట్ట రాని చోట జలగలు పట్టటం, సూరయ్య ఆ ప్రదేశం పై చుట్ట నమిలి ఉమ్మేయటం”, మాస్టారు ఏ ఉద్దేశం తో రాశారో కానీ, నాకు మాత్రం titillating  గా అనిపించింది (ఈ విషయం గురించి చెప్పటం (మోటు సరసం) సూరయ్య స్వభావానికి సరిపోయినా).
ఈ కథలోనూ, యజ్ఞం కథలోనూ, “నెహ్రూ హయాం లోని మిశ్రమ ఆర్ధిక విధానాల వలన  చిన్న కమతాలు కలిగిన దళిత కులాలు, భూమిని కోల్పోయి దిగజారాయని”, రాశారు మాస్టారు. ఉత్తరాంధ్ర సంగతి  నాకు తెలియదు కానీ మధ్యాంధ్ర లో దళితులకి నలభైలలో కానీ యాభైలలో కానీ చిన్న కమతాలు కూడా ఉన్న దాఖలాలు లేవు. డెభ్భై ల చివరికి వచ్చేటప్పటికి పట్టా భూములూ, జమీందార్ల భూములూ పంచి పెట్టటం వలన వారికి కూడ కొంచమైనా భూ వసతి ఏర్పడింది. తొంభైల చివరికి పల్లెలలోని దళితులలో కూడా టీచర్లూ, గుమాస్తాలూ వంటి మధ్య తరగతి ఏర్పడి, వారిలో కూడా మధ్య తరగతి భూ-యాజమాన్యం వచ్చింది.
కథ మొత్తం మనకు దృశ్య పరం గా కన్నుల ముందు తిరుగుతూ ఉంటుంది. చెట్టూ, పుట్టా, గొడ్డూ గోదా, ఎండా అన్నీ నిజ జీవితపు ముసుగు వేసుకొని కనపడతాయి.
మొత్తానికి ఉత్తరాంధ్ర లోని ఒకప్పటి పల్లెటూరి సామాజిక వ్యవస్థనీ అందులోని దోపిడీనీ, దానిలో వస్తున్న ఒక మార్పునీ కళ్ళ కు కట్టిన కథ “చావు”.

ఆధుని’కులం’ – కినిగె లో నా కధా సంకలనం.

ఇందుమూలం గా యావదాంధ్ర మహాజనులకూ తెలియజేయునదేమనగా,

ఆర్యపుత్రులారా, ద్రావిడ పుత్రులారా, తెలుగు బిడ్డలారా!

కినిగె లో నా కథా సంకలనం ఆధుని’కులం’, ప్రచురించటమైనది.

http://kinige.com/kbook.php?id=1011
ఆసక్తి కలవారు చదువగలరు.

ఇట్లు మీ

ప్రేమ రాహిత్యం, వస్తు రాహిత్యం , నా తికమకలూ, కొంత విశ్లేషణ..

నాకు తెలిసిన ఒకాయన బాగా ఆస్థిపరుడు. ఎప్పూడూ AC కారుల్లోనే తిరుగుతూ ఉండగల ఆస్థి ఆయనది. ఇద్దరు ముగ్గురు నౌకర్లను పెట్టుకోగలిగిన స్తోమతుంది.  కానీ, ఆయన తన కొడుకుకి ఒక డొక్కు సైకిల్ ఇచ్చి మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తీసుకొని రమ్మంటాడు. ఆ కుర్రవాడు అయిష్టం గానే కూరగాయలకి వెళ్తుంటాడు.
ఆయనని అదేమని అడిగితే, “తాను ఎంతో శ్రమ కోర్చి ఆ ఆస్థి సంపాదించాననీ, శ్రమ విలువ తెలియాలంటే, తన కొడుకు ని కూడా జీవితం లోని కష్టం సుఖం తెలిసేటట్లు పెంచాలనీ”, చెప్పాడు. ఇప్పుడు కుర్రవాడిని కొంచెం కష్టం తెలిసేటట్లు పెంచితే అతను పెద్దయాక కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కోవటానికి ఇప్పటి తన పెంపకం ఉపయోగపడుతుందని కూడా పెద్దాయన ఆలోచన.
అయితే ఇదే తర్కాన్ని ప్రేమ కి కూడ ఉపయోగించవచ్చా? చిన్నప్పుడు పెద్ద వాళ్ళ ప్రేమ కి నోచుకోని పిల్లలు, పెద్దయాక ప్రేమలో విఫలమైతే దానిని సులువు గా తట్టుకోగలరా? చిన్నప్పుడు పిల్లలు ప్రేమ రాహిత్యం లో పెరగటం మానసికం గా ఏ మాత్రం ఆరోగ్యదాయకం కాదనేది ఇంగిత జ్ఞానం. మనస్తత్వ శాస్త్ర వేత్తలు చెప్పేది కూడా ఇదే!
మరి కష్టాల విషయం లో “సరి” అయిన తర్కం, ప్రేమ విషయం లో ఎందుకు పని చేయదు? ఒక పిల్ల వాడిని TV ప్రోగ్రాంలు చూడనీయకుండా పెంచామనుకోండి. వేరొకడిని ముందు నుంచీ TV ని అందుబాటులో ఉంచుతూ పెంచామనుకొందాం.  TV చూడని వాడికి హఠాత్తుగా ఒక రోజు TV ఎదురయిందనుకొందాం. మనం ఇద్దరినీ ఒక గది లో పెట్టి , పక్క రూం లో TV ఉంచి, ఇద్దరికీ TV ని చూడకుండా నియంత్రించుకోమని అడిగామనుకొందాం! అప్పుడు… రోజూ TV చూసే వాడి తో పోలిస్తే అప్పుడే TV చూడటం మొదలు పెట్టిన వాడికి తనను తాను TV చూడకుండా ఆపుకోవటం చాలా కష్టమౌతుంది. ఇది కూడా కామన్ సెన్స్.
ఇక వస్తు వ్యామోహం విషయాన్ని కొంచెం సేపు పక్కన పెట్టి, మళ్ళీ ప్రేమ విషయానికి వద్దాం. పిల్లలు పెద్దల ప్రేమకు నోచుకొనకపోవటం ఒక తీరని లోపం. ఒక కోరిక తీరని స్థితి. అలాంటి పిల్లలకి యుక్త వయసు వచ్చాక, సహచరులు (opposite sex) కొంచెం  ఆసక్తి చూపించినా అది ప్రేమ లానే అనిపించి వారు నిలువెత్తు భావావేశ పరం గా చిక్కుకొని పోయే ప్రమాదం ఉంటుంది. TV చూడని వాడు మొదటి సారి చూసినపుడు నియంత్రించుకోలేడు కదా! ఇదీ అలానే!
ఇక్కడ ఇంకొక సంశయం! చిన్నప్పటి నుంచీ కష్టాలు పడేవారు, పెద్దయాక కష్టాలను విజయవంతం గా ఎదుర్కోగలరు. అలానే చిన్నప్పుడు ఆదరణ కు నోచుకోని వారు పెద్దయాక ప్రేమ వైఫల్యాన్ని సులువుగా ఎదుర్కోగలరా?
వస్తువుల లేమి వలన మనుషుల శీలం (character) ఓటిది అవదు. పైగా దృఢమౌతుంది.. కానీ ప్రేమ రాహిత్యం వలన మనుషుల మనస్తత్వం ఓటికుండలా బలహీనమౌతుంది. ఎందుకంటే, మానవ సంబంధాల వలన భావోద్వేగాలు ప్రభావితమౌతాయి. వస్తువుల లేమి వలన మన భావోద్వేగాలు లోతుగా ప్రభావితమవ్వవు. ప్రేమ అనేది మనిషి మనసు కి తిండి లాంటిది. తిండి తినకపోతే శరీరం ఎలా కృశించిపోతుందో, ప్రేమకు నోచుకోని మనసుకూడా అలానే న్యూనతకు లోనవుతుంది. మన శరీర ఆరోగ్యాన్ని “మనం ఆహారాన్ని ఏ పాత్రలో తిన్నాం” అనే విషయం నిర్ణయించజాలదు. అదే విధం గా  వస్తు సంపద లేమి మన మనసు యొక్క ఆరోగ్యాన్ని నిర్ణయించదు.  పై పెచ్చు లేమి నేర్పిన పాఠాలు తరువాత ఉపయోగపడతాయి. చిన్నప్పుడు మూకుడు లో అన్నం తిన్న వాడు తరువాత అన్నాన్ని ఏ పాత్రలోనైనా తినగలడు.
చిన్నప్పటి ప్రేమ రాహిత్యం వలన యుక్త వయసులో ప్రేమ లో పడే వారి మనసు బలహీనం గా ఉంటుంది. వారికి చిన్నప్పుడే ప్రేమ లేమి తెలియటం వలన, పెద్దయాక మానవ సంబంధాలలో, నమ్మకం తో ముందుకి పోరు. మానవ సంబంధాలకు నమ్మకం ముఖ్యం. కాబట్టీ, వీరు ఆయా సంబంధాలలో విఫలమయే అవకాశం ఎక్కువ.  కాకపోతే, అంతకు ముందే చిన్నప్పటి అనుభవం వలన ఈ వైఫల్యాన్ని వీరు త్వరగానే జీర్ణించుకొంటారు. అదే, చిన్నప్పుడు ప్రేమ రాహిత్యాన్ని చవి చూడని వారు,  పెద్దయాక సంబంధాలలో విశ్వాసం తో పురోగమిస్తారు. అయితే మొదటి వైఫల్యం వలన వీరికి కలిగే మనస్థాపం చాలా ఎక్కువ గా ఉంటుంది. కానీ వీరి వ్యక్తిత్వం దృఢం గా ఉంటుంది. కంచు పాత్ర కి దెబ్బ ఎక్కువ తగిలినా తట్టుకొన్నట్లు, వీరికి మొదటి వైఫల్యం వలన బాధ ఎక్కువ కలిగినా తట్టుకొంటారు. అదే ప్రేమ రాహిత్యం తో పెరిగిన వారికి మొదటి ప్రణయం లో తగిలిన దెబ్బ పెద్దగా అనిపించదు (వీరికి ప్రేమేఛ్ఛ ఎక్కువగా ఉన్నా, అది సఫలం కాదేమోననే అపనమ్మకం కూడా ఉంటుంది (once bitten, twice shy).చిన్నప్పుడే దెబ్బలు తిని ఉండటం వలన, వీరు మళ్ళీ దెబ్బ తగులుతుందేమో అనే సందేహం తోనే సంబంధాలు నెరపటం వలనా). కానీ వీరు గాజు పాత్ర లాంటి వారు. తగిలిన చిన్న దెబ్బ ను కూడా తట్టుకొనే శక్తి వీరికి చాలా తక్కువ గా ఉంటుంది.

ఇంతకీ నేను చెప్పొచ్చేదేమంటే..ఇక ఏమీ లేదు!

ఓ రెండేళ్ళ క్రితం, రోజూ ఆఫీస్ కి వెళ్తూ వస్తూ ఉండేవాడిని. జీవితపు బండి ని ఇష్టం లేని ఎద్దులా రొటీన్ గా లాగుతూ ఉండేవాడిని. జీవితం, “రసం పీలిచిన తరువాతి చెరుకు పిప్పిలా, ధాన్యపు మిల్లు గొట్టం నుంచీ బయటకు వచ్చే ఊక లా” ఉండేది. కుక్క, మాంసం లేని ఎముక ని పదే పదే కొరికినట్లు, నేను కూడా జీవితాన్ని ఏదో ఓ తెలియని ఆశ తో జీవించేవాడిని. ఆంధ్ర లో గడచిపోయిన మంచి కాలేజీ రోజులని గుర్తుకు తెచ్చుకొంటూ ఉండేవాడిని.  అప్పుడప్పుడూ బెంగళూరు లో తెలుగు పత్రికలు కొని డల్ గా ఉండే జీవితం లో కొంచెం తెలుగు తనం నింపటానికి ప్రయత్నించే వాడిని.
ఓ రోజు ఓ స్నేహితుడి ద్వారా తెలుగు బ్లాగులు పరిచయమయ్యాయి. దానితో, జీవితపుబండి మళ్ళీ “వోల్వో” బస్సులా పరిగెత్తడం మొదలు పెట్టింది. అంతకు ముందు ఎద్దుల బండి రోజుల్లో, బోర్ పోగొట్టుకోవటానికి, నేను ఒక కథ రాసుకొన్నాను. దానిని అప్పుడప్పుడూ నేనే చదువు కొని, “నేను రచయితనై పోయానోచ్!!” అనుకొని మురుసు కొని, మళ్ళీ ఆ ఠావులను  అల్మైరా లో పెట్టేస్తుండేవాడిని. బ్లాగులు పరిచయమైనాక ఓ రోజు, “నా కథ ని బ్లాగు లో పెట్టి ఎందుకు జనాలని భయపెట్టకూడదు?” అనిపించింది. కానీ, “నేను మాయల మరాఠీని చూపెట్టబోతే, జనాలకి లంబూ జంబూ లు కనపడతారేమో ననిపించి”, కొంత కాలం ఆగాను. ఈ అగిన కాలం లో కొన్ని శాంపుల్ బ్లాగులు చూసిన తరువాత ధైర్యం వచ్చేసింది, నా కథ చేత కూడా స్టేజ్ షో ఇప్పించవచ్చని.

కథ డ్రాఫ్ట్ ని తయారు చేసి పబ్లిష్ బటన్ నొక్కబోతూండగా ఒకటే పీకుడు మనసులో, “నువ్వు ఎందుకు నీ బ్లాగు ని పబ్లిష్ చేయాలనుకొంటున్నావు?”, అని.
“ఎందుకో ఒక అందుకు లేవాయ్!”, అని నాకు నేనే సమాధానం చెప్పుకొని అప్పటికి పబ్లిష్ బటన్ నొక్కేశాను.
కానీ కొన్ని రోజులు బ్లాగిన తరువాత నాకు అర్ధమైంది ఏమిటంటే, “మనిషి ఇతర మనుషుల మనసుల్లో, ఆలోచనల లో జీవించాలనుకొంటాడు. ఒక మనిషి జీవితం లో, ఇతర మనుషుల మనసుల్లో (దృష్టిలో) జీవించని భాగానికి అతి తక్కువ విలువ ఇచ్చుకొంటాడు. జీవితాన్ని మనం మన ఇంటి కుర్చీలోనూ, ఆఫీసు సీటులోనూ, ఇంటికీ ఆఫీసుకీ పోయే కారులోనూ జీవించం…కాదు కాదు జీవించమా అంటే జీవిస్తాం. కానీ మన మానసిక జీవితాన్ని మాత్రం ఎక్కువ భాగం ఇతరుల దృష్టి అనే రంగస్థలం పై జీవిస్తాం. “పుట్టలోన చెదలు పుట్టవా? గిట్టవా!” అని వేమన అన్నాడంటే దానర్ధం చెదలు భౌతికం గా జీవించలేదని కాదు. అవి మన మానసిక జీవితం పై ఏవిధమైన ప్రభావాన్నీ చూపించలేక పోయాయనే! తన బంధువుల యొక్కా, స్నేహితుల యొక్కా, చుట్టు పక్కల వారి యొక్కా మానసిక ప్రపంచం లో చోటు లేని వాడు జీవించనట్లే లెక్క.
అంటే.. దీనర్ధం ఏమిటంటే, ప్రతీ మనిషి కీ “గుర్తింపు” కావాలనే “కోరిక” ఉంటుంది. కానీ అ గుర్తింపును ఇచ్చేవారు మాత్రం ఇతరులే! గుర్తింపు థియేటర్ కి తళం చెవి మాత్రం మనచేతిలో లేదు. అది జనాల చేతిలో ఉంది. ఆ గుర్తింపు పాజిటివ్ అయితే మంచిది., నెగటివ్ అయినా పరవాలేదు. కానీ ఏ గుర్తింపైనా పరవాలేదు. మా కాలేజీ రోజుల్లో కొందరు మంచి మార్కులు తెచ్చుకొని క్లాసులోని అమ్మాయిల దృష్టి లో పడేవారు, మార్కులు తెచ్చుకోలేని కొందరు జులాయి పనులు చేసో, రౌడీలు గానో అమ్మాయిల దృష్టి లో పడాలని ప్రయత్నించే వారు. అలానే బ్లాగులు కూడా! ఎవరూ పట్టించుకోని బ్లాగు చనిపోయినట్లే లెక్క!
“ఘటం చిద్యాత్
పటం బిద్యాత్
ఏనకే ప్రకారేణ
ప్రసిధ్ధః  పురుషా భవేత్!”
అంటే, సెంటర్లో కుండ పగుల కొట్టికానీ, పోస్టర్ ని చింపి ఐనా సరే అందరి దృష్టి లో పడమని చెప్పినాడండీ పద్య కారుడు!
అవుతే, గుర్తింపు ని ఒక్కొకరూ ఒక్కో మార్గం లో కోరుకొంటారు. ఒకరు గొప్ప క్రీడా  కారుడవ్వాలనుకొంటే, ఇంకొకరు పాపులర్ సినేమా స్టారు కావాలనుకొంటారు, ఇంకొకరు పేద్ద రచయిత కావాలనుకొంటారు. వీరికి  ఆయా మార్గాలు ముఖ్యమా, లేక లక్ష్యమైన గుర్తింపు ముఖ్యమా?
ఆయా మార్గాలలో ఎందుకు గుర్తింపు కోరుకొంటారంటే, ఆ మార్గాలు వారికి ఇష్టమైనవి కాబట్టీ. ఆ మార్గాలలో గుర్తింపు వస్తే, వారు జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే, పెద్ద కష్ట పడనవసరం లేకుండా గుర్తింపు సాధించవచ్చు. క్రికెట్ క్రీడాకరుడవాలనుకొన్నవాడు రచయిత గా గుర్తింపు సాధించాలంటే అందుకు మానసికం గా అతను చాలా శ్రమ చేయవలసి వస్తుంది. అదే క్రికెట్ ఆటగాడు గా ఆడుతూ పాడుతూ శ్రమ పడుతాడు.
ఇక్కడ ఇంకొక తిరకాసు ఉంది. జీవితంలోని మార్గాలు అన్నీ, ఒక మెట్టు కింది స్థాయిలో లక్ష్యాలే. క్రికెట్ క్రీడాకారుడి గా గుర్తింపు అనేది ఒక లక్ష్యమైతే, అందుకు మార్గమైన క్రికెట్ ప్రాక్టీస్ కూడా, ఒక మెట్టు దిగువ స్థాయి లో, ఒక లక్ష్యమే! క్రికెట్ ప్రాక్టీస్ అనే లక్ష్యం చేరే మార్గం లో మళ్ళీ “బధ్ధకం లేకపోవటం”, “ఫిట్నెస్ మెయింటేన్ చేయటం” అనే విషయాలు ఉంటాయి. ఏ మనిషికైనా ఒక గమ్యా నికి అన్ని స్థాయి మెట్లలోనూ  అనందకరమైన విషయాలే ఉండవు. ఏదో ఒక స్థాయి లో ఆ మనిషి ఇష్టం లేని విషయం కూడా ఉంటుంది. కానీ గమ్యం పై మక్కువ తో ఆ ఇష్టం లేని కష్టమైన విషయాన్ని కూడా అతను భరించగలుగుతాడు.
పై విషయాలన్నీ ఏ కెరీర్ కౌన్సిలర్ అయినా పుంఖాను పుంఖాలు గా చెప్తాడు. వీళ్ళు చెప్పని విషయాన్ని ఒక దాన్ని చెప్ప దలచుకొన్నాను. చదవండి….

ఒక నిజాయితీ కల రాజకీయ నాయకుడు ఉన్నాడనుకొందాం. అతను, ఉదాహరణకి ఒక లక్ష్యాన్ని సాధించే ఉద్దేశం తో ఒక పార్టీ పెట్టాడనుకొందాం. ఆ లక్ష్యం, “రాజకీయాధికారం ద్వారా, ఒక సమాజం లోని 70% మందికి ఉద్యోగాలు ఇవ్వటం” అనుకొందాం ఆ పార్టీ పెట్టే ముందు, తన లక్ష్యం పూర్తి అయేంతవరకే తాను రాజకీయాలలో ఉంటానని అతను ప్రకటించాడనుకొందాం. ఎందుకంటే అతనికి రాజకీయాధికారం కంటే, 70 శాతం మందికి ఉద్యోగాలివ్వటమే ముఖ్యం. తన లక్ష్యం నెరవేరాక అతనికి అధికారం తో సంబంధం లేదు. కానీ నిజ జీవితం లో చాలా మంది మంచి రాజకీయ నాయకులు తమ మొదటి రాజకీయ  లక్ష్యాలు నెరవేరాక కూడా తమ అధికారాన్ని వదులుకోలేరు. అంటే, రాజకీయాధికారమే అసలు లక్ష్యమైపోతుందన్నమాట!  ఇది అన్ని రంగాలకీ వర్తిస్తుంది. అధికారమూ, గుర్తింపూ, డబ్బు సంపాదనా (ఈ మూడిటికీ అవినాభావ సంబంధం ఉంది అనేది తెలిసిన విషయమే కదా!) మొదలైనవి ముందు కొన్ని మార్గాలద్వారానే వస్తే రుచిస్తాయి. కానీ వాటి రుచి మరిగిన తరువాత వాటిని వదులుకోవటం కష్టమైపోతుంది. వాటికి వ్యసనం లాంటి నైజం ఉంది.
ముందు మన ఆలోచనలను పదుగురితో పంచుకోవటం కోసం బ్లాగు మొదలెడతాం. కానీ మన ఆలోచనలన్నీ మన అనుభవాలలోంచీ వస్తాయి. మన అనుభవాలేమో పరిమితం. కాబట్టీ, మన ఆలోచనలూ పరిమితం . ఒక స్థాయి తరువాత మన ఆలోచనలు పునరుక్తి అవుతాయి. అది మన స్వప్రేమ వలన మన కి బోర్ కలిగించక పోవచ్చు . కానీ చదివే వారికి విసుగు తెప్పిస్తాయి. ముఖ్యం గా రచయితలూ కళా కారుల విషయం లో ఇది మరీ వర్తిస్తుంది. కళాకారులు తమ తొలి సృజనలలో, తమ వ్యక్తిత్వం లోని వైవిధ్యాన్నీ, ఆలోచనలలోని కొత్తదనాన్నీ ప్రతిఫ్లిస్తారు. కానీ వారి వ్యక్తిత్వపు పెరామీటర్స్ మారేవి కావు. కాబట్టీ, వారి రచనలలో ఒకే పాటర్న్ వచ్చి పునరుక్తి ఉంటుంది.(శాస్త్రవేత్త లకీ, ఇంజినీర్లకీ ఈ సూత్రం వర్తించదు. ఎందుకంటే వారి పాటర్న్ వారి వ్యక్తిత్వానికి బాహ్యం గా వస్తువులలో ఉంటుంది. బుర్రలో సమాచారాన్ని వారు ఎల్లప్పుడూ అప్డేట్ చేయాల్సి ఉంటుంది.) ఒకే రచయిత రాసిన కథల సంపుటు ల లో మనం అతని/ఆవిడ పాటర్న్ ని సులువు గా పట్టేయగలం కదా!  కనీసం ఈ కళాకారులు వేరు వేరు ప్రదేశాలు చూడటం, కొత్త పుస్తకాలు చదవటం, అనేక కొత్త అనుభవాలను ఆహ్వానించటం చేసే వారైతే,(వారి వ్యక్తిత్వాన్ని బట్టి వారి కళలోని పాటర్న్ రిపీట్ అయినా), కంటెంట్ వైవిధ్యం గా ఉంటుంది.ఈ “వ్యక్తిత్వ ఆధారమైన పాటర్న్ రిపీట్ అవటం”, మనకు కమర్షియల్ సినిమాలూ వగైరా ల లో కనిపించదు. ఎందుకంటే, అక్కడ డబ్బు రాలటానికి వైవిధ్యాన్ని చూపించాలి. కాకపోతే, వాటి లో కమర్షియల్ ఫార్మాట్ ఒకటే ఉంటుంది. ఈ ఫార్మాట్ కాలాన్ని బట్టి పరిణామం చెందుతూ ఉంటుంది. కానీ, నిజ జీవితం లో అనేక ప్రదేశాలు చూడాలన్నా, వైవిధ్యమైన అనుభవాలు పొందాలన్నా డబ్బు చాలా అవసరం. మన తెలుగు మధ్య తరగతి జీవితం లో అంత డబ్బు ఎందుకు ఉంటుంది?
ఇంతకీ నేను చెప్పొచ్చేదేమంటే, బ్లాగు రచయితల బుర్రలలో కొంతకాలం వరకూ సరుకు ఉంటుంది. ఆ సరుకు అయిపోయిన తరువాత మళ్ళీ దానిని నింపుకోవటానికి ప్రయత్నించాలి. ఇది నిజజీవితానుభవాల ద్వారా కావచ్చు, పుస్తక పఠనం ద్వారా కావచ్చు. అలా నింపుకోలేక పోతే, వారు “చెప్పినదే చెప్పటానికి” అవకాశం ఎక్కువ ఉంటుంది. సరుకు అయిపోయినపుడు మనం ఎందుకు బ్లాగటాన్ని ఆపం? రాజకీయ నాయకుడు అసలు లక్ష్యం కంటే అధికారానికి అలవాటు పడిపోయినట్లు, మనం కూడా తోటి బ్లాగరులు ఇచ్చే గుర్తింపుకీ, వారి కామెంట్లకీ, రేటింగ్లకీ, మెచ్చుకోళ్ళకీ, నొచ్చుకోళ్ళకీ అలవాటుపడిపోయి ఉంటాం.ఆ అలవాటు మానటం కష్టమైపోతుంది. ఒక స్థాయి తరువాత, ఏదో ఒకటి బ్లాగటమే ముఖ్యం అవుతుంది. ఏమి బ్లాగాం అన్నది ముఖ్యం కాదు. నా గత నాలుగైదు నెలల టపాలలో నేను దీనిని విస్పష్టం గా గమనించాను. నాకు నా బుర్ర ని మళ్ళీ రీచార్జ్ చేసుకొనే తీరిక కానీ, అవకాశం కానీ, ఓపిక కానీ కనపడటం లేదు. కాబట్టీ ప్రస్తుతానికి బ్లాగ్లోకానికి బై.

బ్లాగ్లోకం లో నాకు పరిచయమైన,అవ్వని, నన్ను ప్రోత్సహించిన, ప్రోత్సహించని, పట్టించుకొన్న, పట్టించుకోని అందరు బ్లాగరులకూ, కామెంటరులకూ, తుంటరులకూ, ఒంటరులకూ, బుధ్ధిమంతులకూ “ఐపీ ఐపీ” కీ నా ధన్యవాదాలు!

బ్లాగుల లో కొత్త వారి తో ఎందుకు కబుర్లు చెప్తాం?

ప్ర: మనం రోడ్డు మీద నడుస్తున్నామనుకోండి, ఎదురు గా ఒక కొత్త మనిషి వస్తే అతని తో మాట్లాడం. మరి బ్లాగుల్లో కొత్త మనుషుల తో ఎందుకు మాట్లాడుతాం?
జ: రోడ్డు మీద పోయే ఎదుటి మనిషి ఆలోచనలు మనకు తెలియవు కనుకా, బ్లాగుల్లో బ్లాగరులు తమ ఆలోచనలను చెప్తారు కనుకా..
ప్ర: RF ID ల ద్వారా షాపింగ్ బుట్ట లో వస్తువుల విషయాలు తెలిసినట్లు గా, రోడ్ మీద పోయే వ్యక్తి ఆలోచనలు తెలీపతీ  ద్వారా తెలిసినవనుకోండి, అప్పుడు వెళ్ళి రోడ్ మీది వ్యక్తి తో గల గలా మాట్లాడేస్తామా?
జ: బ్లాగ్ రాసిన వ్యక్తి, లేక కామెంటిన వ్యక్తీ నలుగురూ తను రాసినది చదివి తనకి సమాధానం చెప్పాలని రాస్తాడు. రోడ్డు మీద పోయే వ్యక్తి నిన్నేమైనా బొట్టూ కాటుక పెట్టి తనతో మాట్లాడ మన్నాడా?
ప్ర: అంటే, సదరు బ్లాగ్ స్వంత దారులు దారే పోయే వారిని బొట్టు పెట్టి పిలిచి మాట్లాడిస్తున్నారా?  బ్లాగులు రాసే వారు మాట్లాడే వారి కోసం మొఖం వాచిపోయి ఉన్నారా?
జ: ఒక రకం గా అంతే! నిజ జీవితం లో హాయి గా జనాల్తో కబుర్లు చెప్పుకొంటూ సంతోషం గా ఉన్న వాడికి (ఆ స్టేజ్ లో), బ్లాగులు రాయటానికి ఆసక్తి ఎందుకు ఉంటుంది? ఒక పల్లెటూరి అరుగులపై ఊళ్ళోవారి తో హాయిగా కబుర్లు చెప్పుకొనే వ్యక్తి ని బ్లాగులు రాయమనండి. “అదేంటబ్బాయ్, కొత్తోళ్ళ తో ఆలోచన ఎలా చేస్తాం?”, అని అనకపోతే నన్నడగండి. నిజ జీవితం లో కబుర్లు చెప్పుకోవటానికీ, తమ ఆలోచనలు పంచుకోవటానికీ అవకాశం లేని వారూ, గుర్తింపు కరువైన వారు బ్లాగులు రాసే అవకాశం మెండు.
ప్ర: మరి సెలబ్రిటీలు గుర్తింపు కోసం మొఖం వాచి పోయి ఉన్నారంటావా? వాళ్ళెందుకు బ్లాగుతారు?
జ: వాళ్ళు రాసేది మామూలు గుర్తింపు కోసం కాదు. ఒకటి తమ ఆలోచనలని జనాల మీదికి వదలటానికి, రెండు తమ ఆలోచనలు గుర్తింపు పొందటానికి. ఒక నటుడి గా గుర్తింపు తెచ్చుకొన్న వాడి ఆలోచనలకి గుర్తింపు ఉండక పోవచ్చు. బ్లాగుల ద్వారా ఆ లోపం తీరుతుంది. అక్కడ కూడా కమ్యూనికేషన్ అనేది one sided గా ఉంటుంది. చదువరుల అమోదం కోసం సెలబ్రిటీ లు ఎదురు చూడరు.వారికి ఆ ఆమోదం అప్పటికే తమ తమ రంగాలలో వచ్చి ఉంటుంది. చదువరుల స్పందన కోసం అసలే పట్టించుకోరు. కామెంటరుల కామెంట్లకి సెలబ్రిటీలు స్పందించటం చాలా తక్కువ. కారణం, ఒకటి, కామెంటిన వారు తమ గోటికి సరి కారనే పరోక్ష భావం (inherent attitude) అయితే, రెండోది తమ గుర్తింపు కోరిక అప్పటికే తీరి పోయి ఉండటం.  ఇక సెలబ్రిటీ బ్లాగ్ లకి ఎక్కువ గా కామెంట్స్ రావటం వలన అందరి కామెంట్ల కీ స్పందించటం కుదరదు కూడా!
ప్ర: మొత్తానికి బ్లాగులు రాయటం ఒక ఆధునిక లోపాన్ని కప్పిపుచ్చుకోవటానికి అంటావ్?
జ: అంతే! సైకాలజిస్టుల కాడినుంచీ మారేజ్ కౌన్సిలర్ల దాకా అందరూ ఈ కోవలోకే వస్తారు. బ్లాగుల ద్వారా వ్యక్తి గత జీవితం గురించి రాసే వారికి వాటి అవసరం ఎక్కువ.ఆ లోపాన్ని బ్లాగులు తీరుస్తున్నాయి.  రోడ్డున పోయే వాడి తో తమ వ్యక్తి గత జీవితం గురించి చర్చించే వాడిని ఏమనాలి?
ప్ర: మరీ కోస్తున్నావ్. నిజ జీవితానికీ బ్లాగు జీవితానికీ తేడా లేదా? నిజ జీవితం లో అలా చర్చిస్తే చాలా రిస్కు కదా. కొత్త వారు మన జీవితాలతో ఆడుకొంటారు. బ్లాగుల్లో ఊరూ పేరూ లేకుండా చర్చిస్తే మనకొచ్చే నష్టమేమిటి? ఊరూ పేరూ తెలిసినా, ఎక్కడెక్కడో ఉండే బ్లాగరులు చేయగలిగేదేమిటి?ఓ.., తెగ చెప్పటం కాదు. మరి, నువ్వు బ్లాగు ఎందుకు నడుపుతున్నా..?
జ: నేనూ ఇప్పటి దాకా చెప్పిన వాటికి అతీతుడిని కాదు. అయిన నా గుర్తింపు కుతి కొంతవరకూ తీరిపోయినట్లుంది, పైగా చెప్పటానికి బుర్రలో ఏమీ మిగల లా..అప్పుడప్పుడూ పనిలేక బోర్ పోవటం కోసం రాస్తున్నా.ఇక,దుకాణం మూసేద్దా మనుకొంటున్నా..

ప్ర: అందరూ నీ లాంటి పనిలేని వాళ్ళు కాదు. ఏదో ఒక ఆశయం తో, లేక ఒక ఐడియాలజీ కోసమో సైట్లు నడిపే వారూ ఉంటారు. ప్రత్యేక మైన ఆడియన్స్ కోసం, రైతులకోసం, సైన్స్ కోసం ఇలా ఒక కారణం కోసం బ్లాగులు నడిపే వారు ఉంటారు.ఒక ఊరి విషయాలు తెలుపుతూ, సినిమా విషయాల కోసం ఇలా నడిపే వారూ ఉంటారు. మరి వారిని గురించి ఏమంటావు?
జ: వారు ధన్య జీవులు. వారిని నడిపించమంటాను.

మీకు మహదేవన్ ఇష్టమా..? ఇళయరాజా ఇష్టమా..?

సంగీతం గురించి నాకు పెద్ద గా తెలియదు, కానీ, సినీ సంగీతం లో (ఇప్పటిది కాదండోయ్, ఓ పదీ పదిహేనేళ్ళ కిందటిది..) నాకు ఇద్దరు దర్శకులు నచ్చుతారు. ఒకరు మామ మహదేవన్, రెండవ వారు ఇళయ రాజా. సినిమాల లో పాటలు సందర్భాని (situation)కి అనుగుణం గా తయారవుతాయి (ఇప్పటి సినిమాలలో అలా కాదనుకోండి). సినిమా దర్శకుడు ఒక సన్నివేశం, ఆ సన్నివేశం లోని భావోద్వేగ వాతావరణాన్ని పాట రచయితకీ, సంగీత దర్శకుడికీ వివరిస్తే, ఆ మూడ్ రక్తి కట్టేటట్లు గా పాట తయారవాలి.
ఇక్కడ పాటల రచయిత ముందు పాట రాస్తే, తరువాత ఆ పాటకి సంగీత దర్శకుడు బాణీ కట్ట వచ్చు. రెండవ పధ్ధతి, “సంగీత దర్శకుడు బాణీ ని కుదిరిస్తే రచయిత దానికి పాట రాసి ఇవ్వటం.”
సినిమా డైరెక్టర్ సన్నివేశాన్ని చెప్పినపుడు, సంగీత దర్శకుడు అందులో అంతర్లీనం గా ఉండే మూడ్ ని మాత్రమే తన బాణీ తో సృష్టించగలడు. మూడ్ ఒక రూపం రంగూ రుచీ లేకుండా ఉండి, ఇతమిధ్ధం గా ఉండదు.ఉత్సాహమైన మూడో, విషాదమైన విషయమో, భక్తి వాతావరణమో..ఇలా ఒక మూడ్ ఉంటుంది..అంతే!  ఆ మూడ్ ని ఎలివేట్ చేసి, దానికి ఒక భావాన్ని ఇచ్చి, దానికి గుణ గణాలనీ లక్షణాలనీ ఇచ్చి, సొబగులు అద్దేది సాహిత్యం.  మబ్బు చినుకు అయినట్లు, సాహిత్యం వలన సన్నివేశం లోని మూడ్, ఒక ప్రత్యేక భావావేశం అవుతుంది. ఆ మూడ్ కి ఒక అస్థిత్వం వస్తుంది. ఒక రేంజ్ వస్తుంది.
అయితే బాణీ కి పాటను రాస్తే బాగుంటుందా? సాహిత్యానికి బాణీ కడితే బాగుంటుందా? ఏది మంచిది?
ఇళయరాజా బాణీ ని ముందు ఇచ్చి దానికి సాహిత్యం రాయించుకొనే వారు. మహదేవన్ సాహిత్యాన్ని తెచ్చుకొని దానికి బాణీ ని సమకూర్చే వారు. బాణీ కి సాహిత్యాన్ని సమకూర్చటం లో భావానికి పరిధులు ఎక్కువ ఉన్నాయి . ఎందుకంటే, ఆ బాణీ కి సరిపోయిన పదాలనే రచయిత వేయాలి. ఇందువలనే అనుకొంటా ఇళయ రాజ పాటలలో మూడ్ బాగా రిచ్ గా ఉంటుంది. కానీ వాటి వలన “ఇదీ అని మనం వేలు పెట్టి స్పృశించదగ్గ”, భావోద్వేగం రాదు. బాణీ కి రాసి మెప్పించాలంటే రచయిత కష్ట పడాలి. (సరళత కోసం కాసేపు వేటూరి వంటి రచయితలు రాయలేదనుకొందాం. వేటూరి వంటి వారు బాణీ ఇచ్చినా సమర్ధవంతం గా పాట రాయగలరు.అనువాద చిత్రాలలో నటీ నటుల పెదాల కదలికల కి అనుగుణం గా పాట ఉండాలి కాబట్టీ, వాటిలో పరిమితులు ఇంకా ఎక్కువ. ఏ శ్రీ శ్రీ లాంటి వారో అటువంటి పాటలకు కొంత న్యాయం చేయగలిగారు.  )
ఉదాహరణ కు ఈ ఇళయ రాజా పాట వినండి.మూడ్ బానే ఉంటుంది. దానికి ఇళయ రాజా అనేక వన్నె చిన్నెలను అద్దారు. కానీ, ‘భావో’ద్వేగం లేదు.
శ్రీ శ్రీ కవిత్వాన్నైనా ఒక పాఠం లా చదువుతూ పోతే దాని లో పెద్ద మూడ్ ఉండదు. కానీ దానికి ఒక బాణీ ని సమకూర్చితే దానిలోని భావానికి ఒక మూడ్ వచ్చి ఉద్వేగం వస్తుంది. మహదేవన్,  వార్తాపత్రిక సంపాదకీయానికి కి కూడా బాణీ కట్టగల సమర్ధుడని ప్రతీతి. రాసిన పాట కు దానిలోని భావానికి, ఆ భావాలలోని nuances కి తగిన మూడ్ ని సృష్టిస్తూ బాణీ కట్టాలంటే సంగీత దర్శకుడు కష్టపడాలి. అందుకే నాకు ఇళయ రాజా, మహదేవన్ ల లో మహదేవన్ అంటే ఎక్కువ గౌరవం. మహదేవన్ సాహిత్యానికి న్యాయం చేకూర్చిన పాట ఇక్కడ ఒకటి .

సినిమా చూడకుండా ఈ పాట వింటే, “కమల మృదులమైన ఆమె చరణాలూ,… రసవేదాలైన ఆ పాదాలూ,….మన హృదయలోలకాన్ని ఉర్రూతలూగిస్తాయి కదా..!” (అన్నట్లు, ఎప్పుడూ అలనల్లని తెలుగు పదాలతో పాటలు రాసే ఆత్రేయ , ఈ పాటలో కొంచెం ఎక్కువే సంస్కృతం వాడారు మరి ఎందుకో..! ఇది ఆయన చివరి రోజులలో రాసిన పాట.)

మామా, రాజా ఇద్దరూ సంగీత పరికరాలను తక్కువ గానే వాడే వారు. వారివాయిద్యాలలో ఎక్కువగా దేశీవే ఉండేవి. ఇద్దరి పాటలలోనూ శబ్ధం సాహిత్యాన్ని మింగేసేది కాదు.అయినా, ఎవరి గొప్పవారిదే!

మామ మహదేవన్ మలయాళీ అయినా భావం తెలుసుకొని బాణీ కట్టే వాడు. ఆయన చేసిన శంకరాభరణం లాంటి కొన్ని ప్రయోగాలని పక్కన పెడితే, ఆయనవి ఎక్కువ గా పల్లెటూరి పాటలు ఉంటాయి. ఆ పాటలు వింటూ ఉంటే అచ్చం గా ఒక తెలుగు పల్లెకు వెళ్ళొచ్చిన అనుభూతి కలుగుతుంది.

మరి మీకు మహదేవన్ అంటే ఇష్టమా? లేక ఇళయరాజా అంటే ఇష్టమా?..అదేనండీ ఎవరి పాటలు ఇష్టం?

నాకు నచ్చిన మనుషులూ, విషయాలూ, వంటలూ..

ఈ మధ్య సమాజం గురించీ, వ్యవస్థా ఇజమూ అదీ ఇదీ అని వాగి వాగి బోర్ కొట్టింది. సమాజానికి మనుగడ సాగించే సత్తా ఉంటే, అది ఉన్నత శిఖరాలకు చేరుకొంటుంది, లేక పోతే, చంకనాకి పోతుంది. సమాజం గురించి ఓ తెగ అర్ధం చేసుకొని, వ్యక్తిగతం గా గానీ , సామూహికం గా గానీ సాధించేది ప్రస్తుతానికి నాకు కనపడటం లా..
కాబట్టీ, సమాజమూ వ్యవస్థా వగైరాలను కాసేపు పక్కనపెట్టి, నాకు ఇష్టమైన విషయాల గురించి మీతో పంచుకొంటే, రోజు గడిచే సరికి, నాకు కాస్త ఆనందమైనా మిగులుతుంది. అందుకే, నాకు ఇష్టమైన విషయాల గురించి ఈ టపాలో రాస్తాను. మీకు ఇష్టమైన వారి గురించీ, విషయాల గురించీ మీరు టపా కామెంట్లలో తెలుపండేం? ఇవి ఎక్కువ గా తెలుగు ప్రపంచం నుంచే అయి ఉంటాయి. వీరు మీకు ఎందుకు నచ్చారు అని అడిగితే, నేను ఆటే సమాధానం చెప్పలేను. కానీ, కొంచెం వివరించటానికి ప్రయత్నిస్తాను.
నాకు నచ్చిన వ్యక్తులు:

1. గాయకుడు : బాల మురళి
ఆ గొంతు లోని లోతూ గాంభీర్యం వేరెవరికి ఉన్నాయి?
2. సినిమా గాయకుడు: ఘంటసాల, బాలు
ఘంటసాల గారి గాత్రం ఎవరికి ఇష్టముండదు? కానీ, కొన్ని రకాల పాటలు పాడటం లో ఆయనకు పరిమితులు ఉన్నాయనుకొంటాను.

బాలు గారు తెలుగు సినిమా పాటలలో సాహిత్యానికీ, సంగీతానికీ ఉన్న చివరి గౌరవప్రదమైన లంకె.

జేసు దాసు స్వరం బానే ఉటుంది గానీ, అయన పట్టి పట్టి పాడటం, ఉఛ్ఛారణా దోషాలూ నాకు పట్టివేస్తాయి!
3. గాయని : సుబ్బులక్ష్మి
భజగోవిందం విని ఇంకా ఆవిడ అభిమాని గా మారక పోతే ఎలా?  ఆమె గొంతు లో ఉన్న “అతెంటిసిటీ”. ఒక్కో సారి ఆమె గొంతు గయ్యాళి గా వినపడటానికి నాది బాధ్యతా?
4. సినిమా గాయని
చిత్ర: ఎప్పుడన్నా ఒక్క పదం మలయాళం వాసన వచ్చినా, చిత్ర స్వరం అంటే మక్కువే!
అడవి రాముడు, యమగోల కాలం లో సుశీల “కై ,కై ” గొంతు వింటే చాలా కంపరం. జానకి పరవాలా! కానీ, ఆమె కొంచెం కైపు పాటలూ, చిన్న పిల్లల పాటలూ పాడేది. (వైరుధ్యం చూడండి). తరువాత “నా గొంతు శృతిలోనా..” అంటూ మొదలైన చిత్ర గొంతుకి నేను దాసోహం!

లతా మంగేష్కర్ పాత పాటలు బానే పాడేది. కానీ ఇప్పటి 18 యేళ్ళ హీరోయిన్లకు పాడితే, ఆమె స్వరం లోని వయసు మీరిన లక్షణం బయటపడుతోంది!
5. రాజకీయ నాయకుడు : సుందయయ్య, చంద్ర బాబు నాయుడు.
సుందరయ్య: అధికారపక్షం వారి నుంచీ కూడా గౌరవాన్ని పొందిన ఏకైక నాయకుడు. అలా గౌరవం ఇచ్చే వారు ఈ రోజులలో లేరనుకోండి.
చంద్ర బాబు: దీర్ఘకాలిక పధకాలు పెట్టటం, సంస్థలు నెలకొల్పటం, పార్టీకీ ప్రభుత్వానికీ మధ్య కొంత విభజన పాటించటం. మిగిలిన అన్ని విషయాలలో ఈయన కూడా సగటు రాజకీయ నాయకుడే!

పీ వీ ఒక నిజాయితీ దూరదృష్టీ కల తెలుగు ప్రధాన మంత్రి గా ఇష్టమే కానీ, ఆయనను ఒక గొప్ప నాయకుడనవచ్చునా?
6. నటుడు : N.T.R., చిరంజీవి.
నాకు ఊహ తెలిసేటప్పటికి నాటకాలు అటకెక్కాయి. అవి అప్పుడప్పుడూ మూలిగే మూలుగు వినపడేది. కాబట్టీ నాటకాలలో ఎవరు గొప్ప నటుడో చెప్పలేను. సినిమాలలో రామారావు చివరి సినిమాలు ఆడుతున్నాయి. అవి ఇప్పుడు చూస్తే కామెడీ గా ఉంటాయి . కానీ, ఆయన నటించిన పౌరాణికాలు చూసినపుడు అనిపించింది, “న భూతో న భవిష్యతి”. N.T.R. లాంటి నటుడు ఇక ముందు పుట్టబోడు. అది ఆయన గొప్ప కాదు. తెలుగు భాషా సంస్కృతీ అడుగంటి పోతున్న దశలో, మళ్ళీ అలాంటి నటన ఇక సంభవం కాదు.
చిరంజీవి మొదటి సినిమాలూ, బాపూ, విశ్వనాధ్, బాలచందర్ వంటి వారి దర్శకత్వం లో ఆయన నటన చూసినపుడు, చాలా సులువు గా అర్ధమౌతుంది, “ఆయనకున్న ప్రతిభేమిటో”. కానీ, ఎక్కడా..! మన వీరాభిమానులూ, వ్యాపార సూత్రాలూ ఆయనని ఒక మెగా స్టార్ ని చేసి, ఆయనలోని నటుడిని నొక్కేశాయి.
7. కవి: శ్రీ, శ్రీ, ఆత్రేయ
నాకు అర్ధమయ్యే సామాన్యమైన భాష లో అసామాన్యమైన భావాలను వ్యక్తీకరించిన మహా కవి. N.T.R లానే మరో శ్రీ శ్రీ పుట్టబోడు, అవే కారణాల వలన.

శ్రీ శ్రీ గొప్పదనానికి భాషమీద ఆయనకు ఉన్న పట్టు ఒక కారణమైతే, అత్రేయ “సినిమనసు” పాటలకు, కారణం భాష లో ఆయనకు ఉన్న పొదుపు. ఆయన పాటలు రాసినా వాటిలో కవిత్వం ఉంది కాబట్టీ, నా దృష్టి లో ఆయన కూడ కవే!

8. నటి: సావిత్రి
ఇప్పటి నటీమణుల లా శరీర కదలికల ద్వారా కాకుండా, ముఖ కవళికల ద్వారా నటన చేసినందుకు.
9. రచయిత: కొడవటిగంటి. కుటుంబ రావు, రా.వి. శాస్త్రి.
కొ.కు: రచనకి సంబంధించిన అనేకానేక ప్రక్రియలలో సాధికారమైన ఆధునిక రచనలు చేయటమే కాకుండా, అనేక తాత్విక, శాస్త్ర సంబంధమైన వ్యాసాలు రాసినందుకు.
రావి శాస్త్రి: రావిశాస్త్రి లా రాయాలంటే ఆయన మళ్ళీ పుట్టాలిసిందే. అనితరసాధ్యమైన, ప్రవాహసదృశమైన, కవితాత్మకమైన ఆయన శైలి.  ఆయన రచనలలో అట్టడుగు లోకపు వాస్తవ చిత్రణ ఉంటుంది. ఈ అట్టడుగు స్థాయి వారి (మెజారిటీ ప్రజల) జీవిత వాస్తవ చిత్రణ ఎర్ర రచయితల(కారా మేస్టారు ఇంకొక ఉదహరణ) రచనలలోనే ఎక్కువ గా ఎందుకు ఉంటుంది? మార్క్సిస్టు వాస్తవాన్ని చూపించాలంటే, ముందు వాస్తవాన్ని చూపించాలి, తరువాత దానికి ఎర్ర రంగు అద్దాలి. కానీ మిగిలిన నిబధ్ధత లేని రచయితలకి వాస్తవాన్ని చూపించవలసిన ఆగత్యం కూడా ఉండదనుకొంటా!

10. సినిమా దర్శకుడు : విశ్వనాధ్, బాలచందర్
కొంచెం డీసెంట్ గా సినిమాలు తీసే దర్శకులని మన చిత్రసీమా, ప్రేక్షకులూ బతకనివ్వరు. ఎప్పుడన్నా విశ్వనాధ్ వంటి వారినీ, అప్పుడప్పుడూ బాలచందర్ వంటి వారినీ బతకనిస్తుంది. బాలచందర్ వి చాల వరకూ డబ్బింగ్ లూ, రీమేక్ లే. కానీ వాటిలో విషయం ఉంటుంది. లోతు ఉంటుంది. మరో చరిత్ర వంటి సినిమాలకి ఒక surreal aura ఉంది. మన మనసు లోలోపలి భావాలను, ఉద్వేగాలనూ, రహస్య వాంఛలనూ, తాత్కాలికం గా నైనా, బయట పడేటట్లు చేసే శక్తి బాలచందర్ సినిమాలకు ఉంది.

తమిళం లో భాగ్య రాజా సినిమాలు కూడా బానే ఉంటాయి. బాలచందర్ సినిమా లు చూస్తే వాటిలోని ఇష్యూస్ ఈ రోజు కి కూడా రిలవెంట్ గానే ఉంటాయి. కానీ భాగ్య రాజా సినిమాలు  ఇప్పుడు చూస్తే, కాలదోషం పట్టినట్లు కనిపిస్తాయి. భాగ్య రాజా సినిమా ల లో ఒక రకమైన వెకిలి తనం కూడా ఉంటుంది.

11. సినిమా: మిస్సమ్మ
సునిసితమైన హాస్యం. ఆ హాస్యం, మరి, ఎవరి  మానస పుత్రికో! మిస్సమ్మ దర్శకుడు LV ప్రసాద్ అని మాత్రమే తెలుసు. ఇది కాక బాలచందర్ సినిమాలు చాలా వరకూ నచ్చుతాయి.

12. అధ్యాత్మిక వ్యక్తి: U.G. కృష్ణమూర్తి.
అధ్యాత్మిక వ్యాపారం చేయని ఒక అరుదైన ఆధునిక మనిషి.
13. ఊరు:  మా ఊరు.
కృష్ణ పక్కన ఉంది. మన మహా నగరాలను, వాటిలోని మనుషులనూ చూశాక, మా ఊరంటే ఇష్టం ఇంకా ఎక్కువైంది. విదేశాలా..అవి మనుషులున్న ఎడారులు!
14. ఆహారం : ఆవకాయ ముక్క, పెరుగు.
ఫైవ్ స్టార్ హోటల్లో వంటకాలన్నీ దీని ముందు దిగదుడుపే!

15. కూర: చిక్కుడు కాయ
గోరుచిక్కుడు కాయ అంటే మాత్రం అయిష్టం.

మా నాయనమ్మ వండుతూ ఉండే సీమతుమ్మ(సీమ చింత?) పప్పుల కూర.  వగరు పప్పులు వాడితే కూర మరింత బాగుండేది.

16.పండు : రసం మామిడి కాయ, లిచీ

పళ్ళన్నీ ఇష్టమే! ముఖ్యం గా పైవి. ఒక్క బొప్పాయ కాయ తప్ప అన్నీ ఇష్టమే!

ఏవిటో! నేను అభిమానిద్దామన్నా, తెలుగు వారిలో నాకు శాస్త్రవేత్తలూ,సాంకేతికులూ దొరకటం లేదు. K.L. రావు, యెల్లాప్రగడ సుబ్బా రావు, నాయుడమ్మా వంటి వారి పేర్లు తెలుసు గానీ, వారిని ఎందుకు అభిమానించాలో ఇక్కడ ఓ రెండు ముక్కలు కూడా రాయలేను. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి ఓ రెండు ముక్కలు రాయగలను . కానీ ఆయన పూర్తి గా తెలుగు వాడు కాదనుకొంటా!   వై వీ రెడ్డీ, దువ్వూరి సుబ్బారావు, విజయ రామా రావూ, KLN ప్రసాద్  వంటి బ్యూరోక్రాట్ల గురించి నేను రాసే దాని కన్నా గూగుల్ చేస్తే బాగుంటుంది. నాకు వారి గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకొనేంత పరిజ్ఞానం లేదు.

కూచిపూడి నృత్యం వంటివి చూడటానికి బాగుంటుంటాయి, కానీ వాటి గురించీ, ఆయా కళా కారుల గురించీ నా అభిప్రాయం చెప్పేంత పరిజ్ఞానం నాకు లేదు.  వెంపటి చిన సత్యం గారి నాట్యం గురించి నా అభిప్రాయం వినటానికి ఎంత తప్పు గా ఉంటుందో!

———————————————————————————————

ఇంగ్లీష్, హిందీ సినిమాలు నేను చూసేది తక్కువ. నేను చూసినంతలో.. నాకు తెలిసినంత లో…

హిందీ నటుదు: సంజీవ్ కుమార్
సహజ నటుడు. ఆయన భాషా, డిక్షన్ గురించి మనం ఎక్కువ గా మాట్లాడలేం కదా?
హిందీ నటి:స్మితా పాటిల్
ఇంకోసారి..సహజనటి. మామూలు నిజ జీవితం లోని మనిషి లా కనపడటం.

హిందీ సినిమ: షోలే
ఇంతకంటే గొప్ప సినిమాలు చూసినట్లు గుర్తు లేదు. నసీరుద్దీన్ షా ఆర్ట్ సినిమాలు సగం సగం చూశాను. రిత్విక్ ఘటక్ సినిమాలూ, మృణాల్ సేన్ సినిమాలూ కొంచెం, కొంచెం చూశాను. ప్యాసా కొంచెం చూశాను.నాకు ఈ విషయం లో అర్హత లేదు.

ఇంగ్లీష్ రచయిత: మాం, డికెన్స్, చెకోవ్
డికెన్స్ great expectation చదివి ఆయన అభిమానినయాను. అందులో హీరోయిన్ హృదయాన్ని ఆయన మలిచిన తీరు అద్భుతం.

నిన్న మొన్నటి దాకా మన సమాజపు విలువలు, ముప్పైవ నలభైవ దశకం లో పాశ్చాత్య సమాజపు మొరాలిటీనీ వాతావరణాన్ని పోలి ఉన్నదనుకొంటా. అందు వలననే  నాకు “మాం” రచనలలోని పాత్రలు చాలా దగ్గరగా అనిపిస్తాయి.

చెకోవ్ రచనలలో ఉన్న pathos చాలా ఇష్టం.

సరేనండీ , ఇప్పటికే చాలా బోర్ కొట్టించేసి ఉంటాను. మళ్ళీ తరువాత…. మీరు తేరుకొన్న తరువాత బోర్ కొట్టిస్తాను.ధన్యవాదాలు.

వేడి తక్కువ గానూ, వెలుగు ఎక్కువ గానూ

సామాజిక వ్యవస్థ వ్యక్తిని ప్రభావితం చేస్తే వ్యక్తి “సామాజిక వ్యవస్థ” ని ప్రభావితం చేస్తాడు. ఇవి ఇలా సైక్లికల్ గా కొనసాగుతాయనేది పాత చింత కాయ పచ్చడి. రష్యా లో కమ్యూనిజం పడిపోవటానికి కారణాల్లో అక్కడ అధికారం లో ఉన్న వారు తమ అధికారాన్ని దుర్వినియోగం చెయ్యటం ఒకటి. “వారికి ప్రత్యేక మైన దుకాణాలు తెరవటం, తక్కువ రేట్లకి అమ్మటం”, జరిగిందనే విషయం ఆ కాలంలో అక్కడ ఉండి వచ్చిన వారు చెప్పారు.

ప్రజాస్వామ్యం లో అధికారం లో ఉన్న వారి తప్పులను ఎత్తి చూపటానికి ప్రతిపక్షపార్టీలు ఉంటాయి. ఏక పార్టీ పాలన లో, దిగువున ఉండే తమ పార్టీ సభ్యులకి కొన్ని తాయిలాలు వేస్తే తాము అధికారం లో ఉండవచ్చు. తరువాత వారిని ప్రశ్నించేవారే ఉండరు. వారి పైఅదుపు ఉండదు. వారికి బాధ్యతలూ , జవాబుదారీ తనమూ ఉండవు. అధికార స్థాయి లో నైతిక విలువలు లేని వారు ఉంటే దానిని దుర్వినియోగ పరుస్తారు. రష్యాలో కూడా ఇదే జరిగింది. విలువలు ఉన్న వారు అధికార స్థాయి లో కొన్ని వందల యేళ్ళు నిరాటంకం గా ఉంటే అప్పుడు సమాజ వ్యవస్థ (నా దృష్టి లో మంచిదైన కమ్యూనిస్టు వ్యవస్థ) కూడా వ్యక్తులందరినీ విలువలు కలవారి గా మార్చేదేమో! కానీ దురదృష్ట వశాత్తూ అలా జరుగలేదు.

వ్యక్తులలో విలువలు ఎలా పెరుగుతాయి? వ్యక్తులలో విలువలు అక్కడి సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక వ్యవస్థల వలన ప్రభావితం చేయబడతాయి. విద్యా వ్యవస్థ అన్ని రంగాలనుంచీ మంచి విలువలను గ్రహించి, వాటిని మనసులో నాటుతుంది. ఏవి మంచి విలువలు? సమాజ దీర్ఘకాలిక మనుగడ కి ఉపయోగ పడేవి మంచి విలువలు. విద్యా వ్యవస్థ నాటిన విలువలకి సమాజం లో రివార్డ్ ఉండేటట్లు అక్కడి రాజకీయ నాయకత్వం చూడాలి. ఈ విధం గా క్రమానుగతం గా మనుషుల నైతిక స్థాయి పెరగాలి. కొన్ని కొన్ని సార్లు తాత్కాలికం గా ఈ నైతిక స్థాయి తగ్గినా, దీర్ఘకాలికం గా ఈ నైతిక స్థాయి పెరగాలి. ఎందుకంటే, ఈ నైతిక విలువల మూలాలు మనుగడ లో ఉన్నాయి. ఒక వేళ వ్యక్తుల ఈ నైతిక విలువలు ఎక్కువ కాలం దిగజారుతూ పోతే, మనిషి మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది.

మనుషులకి తగిన నైతిక స్థాయి రాకుండా, వారి భావజాలం లో ఔన్నత్యం రాకుండా, వారి కోపాన్నీ ద్వేషాన్నీ ఒక అస్త్రం గా ఉపయోగించుకొని, సోషలిస్టు వ్యవస్థని తీసుకొని వచ్చినా అది ఎక్కువ కాలం నిలబడదు. ఒక సారి ఆ వ్యవస్థ శోష వచ్చి పడిపోయిందంటే, ప్రజలకి దాని మీద అపనమ్మకం ఏర్పడుతుంది. రష్యా పతనం తరువాత జరిగినది అదే! దీని వలన వారి ఆదర్శ రాజ్య స్థాపన మరింత వెనుకకి పోయింది. అది నెమ్మది గా పరిణామం చెందుతూ రావాలే కానీ, హింస తో బలవంతం గా రుద్దబడకూడదు.

ఇక ఈ టపా కి ప్రేరేపించినది శ్రీకాంత్ గారి బ్లాగు లో కుమార్ గారు ఇచ్చిన ఒక లింక్: http://www.telegraph.co.uk/news/politics/9061328/The-lessons-of-the-fall-of-communism-have-still-not-been-learnt.html

ఈ లింకు లో జానెట్ గారు ఏమి చెబుతోందంటే, “విలువలు అనేవి వ్యక్తులలో ఉంటాయి. అవి ఆర్ధిక వ్యవస్థలో ఉంటాయని కమ్యూనిజం తప్పుగా అనుకొంది. కమ్యూనిస్ట్ సమాజం లో (అధికారం లో ఉన్న వ్యక్తులకు విలువలు లేక పోవటం వలన అక్కడి వ్యవస్థ కుప్ప కూలింది”, అని. ఈ వాదన లో సగం నిజం ఉంది. అదేమిటంటే, విలువలు వ్యక్తుల ద్వారానే operate అవుతాయి, వ్యక్తుల విలువల లేమి వలన వ్యవస్థలు పడతాయి. అది కమ్యూనిజమైనా, కాపిటలిజమైనా సరే! కూలిన తరువాత అన్నివ్యవస్థలూ సమానమే! అందమైన బిల్డింగ్ కూలినా, మామూలు బిల్డింగ్ కూలినా,.. కూలిన తరువాత అంతా సమానమే కదా!

ఆవిడ వాదన లో లోపం “నైతికత అనేది వ్యవస్థలో లేదనుకోవటం” లో ఉంది. వ్యవస్థ యొక్క మెకానిజం లో కూడా నైతికత ఉంటుంది. “తయారు చేసిన దానిని లాభాపేక్ష లేకుండా పంచుకోవాలి”, అనే వ్యవస్థ తో పోలిస్తే, “డిమాండ్ పెరిగితే రేటు పెంచే వ్యవస్థ లో” నైతికత తక్కువే కదా? విలువలు ఉన్న వ్యవస్థ మేలిమి ఎప్పుడు తెలుస్తుంది?వ్యక్తులు అందరూ మంచి వారైనపుడు తెలుస్తుంది.

ఒక సమాజం లోని వ్యక్తులు దాదాపు అందరూ మంచి వారనుకొందాం. సగం మంది కాపిటలిజాన్ని నిజాయితీగా అమలు చేస్తున్నారనుకొందాం. ఇంకొక సగం నిజాయితీగా కమ్యూనిజాన్ని అమలు చేస్తున్నారనుకొందాం. అసలైన కాపిటలిజం లో కంపెనీలు డిమాండ్ ని బట్టి ధరను పెంచుతూ పోవచ్చు. వినియోగదారుడు భరించలేక కొనటం తగ్గించినపుడే ధరల పెరుగుదల అనేది తగ్గుతుంది. ఈ లోపు కంపెనీలు డబ్బు చాలా వెనుకేసుకొంటాయి. నష్టాలొస్తే కంపెనీ ని మూసివేస్తారు. లాభాలు వస్తే దోపిడీ కొనసాగుతూనే ఉంటుంది. కంపెనీ పెద్దదై “మోనోపొలీ” సాధిస్తుంది. చిన్న చిన్న కంపెనీలను కలుపుకొంటుంది. అసలు సిసలైన పెట్టుబడిదారీ లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు.రెగ్యులేషన్స్ ఉండవు. మార్కెట్ డైనమిక్సే ధరలని నిర్ణయిస్తాయి. కాబట్టీ “మోనోపొలీ” అనేది నేరం కాదు. డబ్బు సంపాదించిన కంపెనీలూ వ్యక్తులూ డబ్బు విరివి గా ఖర్చుపెట్టి ద్రవ్యోల్బణం పెంచుతారు. సామాన్య మానవుడి బతుకు కష్టమౌతుంది. కానీ నిజాయితీ గా కాపిటలిజాన్ని నమ్మి అమలు చేస్తున్న వ్యక్తులకు ఇందులో తప్పేమీ కనిపించదు.

నిజాయితీ పరులైన వ్యక్తులు కమ్యూనిజాన్ని అమలు చేస్తున్నపుడు, అక్కడ జనాల మౌలిక అవసరాలు తీరతాయి. ప్రజలు అవసరానికి మించి కష్టాలు పడనవసరం లేదు. కంపెనీలు పెట్టలేరు కాబట్టీ ఆవిధమైన దోపిడీ, ద్రవ్యోల్బణమూ ఉండవు. సమాజం లో డబ్బు చలామణి అవసరమైనంత వరకే ఉంటుంది. కష్టపడి పని చేసెవాడికి ఎక్కువ జీతం ఉంటుంది. కానీ వాడు డబ్బు కూడబెట్టి దానిని వారసులకి ఇవ్వలేడు. ఎందుకంటే వారసత్వం రద్దు చేయబడుతుంది. పరిపూర్ణ సమానత్వం ఉండదు. వృత్తిని బట్టి డబ్బులు ఎక్కువో తక్కువో వస్తాయి. కానీ సంపద ఒకే చోట కొండలు గా పోగుపడదు.

ఈ రెండూ పోల్చి చూసినపుడు, “వ్యవస్థ మెకానిజం” లో కూడ ఎక్కువ నీతివంతమైన వ్యవస్థలు ఉంటాయని బోధపడుతుంది. కమ్యూనిజం ఎక్కువ నైతిక మైనదని అర్ధమౌతుంది.

కొంతమంది కమ్యూనిస్టు వాదులు “కాపిటలిస్ట్ సమర్ధకులు కాపిటల్, మనిఫెస్టో చదవటం లేదు కాబట్టీ, కాపిటలిస్ట్ సమర్ధుకులకి కమ్యూనిజం సరిగా అర్ధం కాలేదు”, అంటారు. వెంటనే కాపిటలిస్టుల వాదన ఏమిటంటే, కమ్యూనిస్టు సమర్ధకులకు కాపిటలిజం అర్ధం కావటం లేదని. కానీ మార్క్స్ తన పుస్తకాలు రాసినది కాపిటలిస్ట్ వ్యవస్థలోనే. ఆయన పుస్తకాల నిండా కాపిటలిజం విశ్లేషణే ఉంటుంది. ఆయనకు కాపిటలిజంగురించి తెలియదని చెప్పటం సాహసమే!

కమ్యూనిజం ఒక మతం వంటిదే, అంటారు ఇంకొందరు. దానికి లేని గొప్పదనాన్ని ఎందుకు ఆపాదించాలి? నాకు అది సామాజిక రాజకీయ సిధ్ధాంతం మాత్రమే అనిపిస్తుంది. ఆ సిధ్ధాంతం లో తప్పులుండవచ్చు, ఒప్పులుండవచ్చు. అది వేరే విషయం.

శ్రీరాం గారు, “పాశ్చాత్య మేధావులకి, ఒకప్పుడు వారి ప్రభుత్వాలు మనలని దోచుకొన్నది గుర్తుకు రాలేదా?”, అని అడిగారు. ఒక్కసారి మానిఫెస్టో, లో india అని సెర్చ్ కొట్టంది, తెలుస్తుంది . ఆ చిన్న పుస్తకం లోనే “అక్కడి పెట్టుబడి దారులు మన దేశాలని దోచుకొంటున్నారని మార్క్స్ చెప్పాడు. ఇప్పుడు నన్ను ఎవరైనా, “నువ్వు అన్నీ మార్క్సిజం లోనే ఉన్నాయి అంటున్నావంటే”, ఇక నేను చెప్పేదేమీ లేదు!

అలానే స్పెషలైజేషన్ పెరిగే కొద్దీ,ఉద్యోగుల జీవితం సుఖప్రదమవ్వక పోగా, వారి కష్టాలు పెరుగుతాయనీ అన్నాడు. టెక్నాలజీ పెరిగినపుడు, సహజ వనరులను సంపద గా మార్చే ప్రక్రియ వేగవంతమై, మెజారిటీ జనాలు సుఖ పడాలి. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఉద్యోగుల, జనాల కష్టాలు పెరుగుతున్నాయనేది నిజం. జీవన వ్యయం పెరిగి చాలా మంది మధ్య తరగతి లోంచీ దిగువ మధ్య తరగతికి తోసి వేయబడుతున్నారు (ఈ రోజుల్లో భార్యా భర్తలు ఇద్దరూ పని చేస్తున్నా కూడా!) అలానే “ఐటీ” రంగం లోని వారు అది వచ్చిన కొత్తలో ఎగువ మధ్య తరగతి లో ఉండే వారు. ఇప్పుడు మామూలు మధ్యతరగతి గా తయారయ్యారు.

శ్రీకాంత్ గారు, “రష్యా పతమమైనపుడు చాల చర్చలు జరిగాయి, ఇక ఇప్పుడు అనవసరం అన్నారు. “, అయితే, “చచ్చిన కుక్కను ఎందుకు తన్నుతున్నారు?”

చివరి గా నేనేమీ కమ్యూనిస్ట్ ని కాదు. “దానిలోని లోపాలు” అని నేననుకొన్న వాటిని గురించి చాలా టపాలలో రాశాను. అందుకనే నా మీదకి దండెత్తి రాకుండా, రాజు గారు చెప్పినట్లు, “వేడి తక్కువ గానూ, వెలుగు ఎక్కువ గానూ”, వచ్చేటట్లు చర్చిస్తే బాగుంటుంది. అసలు చర్చే అవసరం లేదంటారా, ఇక సెలవు!

Covert Powden: My primary value is “Truth as perceived by me”. At times if  the Truth  is  in favor of communism, I support communism. At some other time if the Truth is in favor of capitalism , then I do not hesitate to support capitalism. It’s my subjective Truth. I do not have access to absolute Truth, after all

చింత చెట్టు మీద కాకుల సమావేశం

“కావ్ ..కావ్..ఈ కాకేదో తేడాగా ఉంది..అందరూ రండీ..”, అని కూసింది హెడ్ కాకి.
వెంటనే ఆ చుట్టు పక్కల ఊళ్ళలోని కాకులన్నీ  వచ్చి ఆ ఊరి బయటి చింత చెట్టు మీద వాలిపోయాయి.
“ఏమిటి విషయం?”, అంది ఒక “గుంపులో గోవిందయ్య” కాకి.
“చూడండి. దీని కూత తేడా గా ఉంది. పైగా ఇది ఏమందో తెలుసా..? “కమ్యూనిజం ఆచరణ లో విఫలమైతే అయిందేమో గానీ, సిధ్ధాంతం మంచిదేనట”, అంది హెడ్ కాకి.
“వార్నీ! అయితే దీనిని పొడవాలిసిందే..!తన్నాల్సిందే..!తన్నండి..తన్నండి”, కాకులన్నీ తమ ఇనప గోళ్ళతో ఆ ఎర్ర కాకిని ఎగిరి తన్న సాగాయి.
“ఇంకా ఏమందో తెలుసా? మన వేదాలలో మంచీ చెడూ రెండూ ఉన్నాయట! వర్ణ వ్యవస్థ వేదాల వలనే వచ్చిందట! ఈ విషయాలని వీళ్ళ ముత్తాత నిరూపించాడట. ఇప్పుడు మళ్ళీ చర్చ అనవసరం అంటూ,  కావాలంటే ఇంటర్నెట్లో చూసుకోమని వేదాల ఇంగ్లీషు తర్జుమా కి లింకులు కూడా ఇచ్చింది!”, హెడ్ కాకి అరిచింది.
“తప్పు రా ఎర్ర కాకీ. వేదాలలో అంతా మంచే ఉంది. వేదాలూ గీతా అన్ని వర్ణాలూ సమానమనే చెప్పాయి. ఆచరణలో విఫలమైతే వేదాలదా బాధ్యతా..? వాటిలో అనేక కనిపెట్టబడని నిగూఢార్ధాలున్నాయి.గురజాడ వంటి మహా కవి, “అన్నీ మన వేదాలలోనే ఉన్నాయిష”, అని చెప్పలేదా? అయినా వేదాల ను ప్రశ్నించటానికి నువ్వెంతా నీ అనుభవమెంతా? పిల్ల కాకీ!” అని , మిగిలిన కాకులతో, ” వీడిని మళ్ళీ మీ వాడి ముక్కులతో పొడవండి…కావ్..కావ్..వీడు “ఐ ఎస్ ఐ” ఏజంటైనా ఉండాలి లేక చైనా ఏజంటైనా ఉండాలి,” అంది గుంపులో గోవిందయ్య కాకి.

హెడ్ కాకి: విమానాలూ, అణు బాంబులూ గట్రా మన వేద కాలం లోనే ఉన్నాయని నేనంటే, “అప్పటి డిజైన్లు మొన్నీ మధ్య పరీక్షిస్తే ఫెయిలయ్యాయని” చెప్తోంది. ఇంకా..”మన వాళ్ళ ఫేక్ రెజ్యూం లలా, అవి ఫేక్ డిజైన్లా?” అని వెక్కిరిస్తోంది. పైపెచ్చు. “విమానాలు ఆ కాలం లోనే ఉంటే వాటి అవశేషాలు పురావస్తు తవ్వకాలలో ఎందుకు బయట పడలేదు?” అంటోంది. నేనన్నాను, “పురావస్తు తవ్వకాలలో బయట పడటానికి అవేమన్నా భౌతిక వస్తువులా? మన రుషుల మంత్ర శక్తి తో ఉద్భవించిన అధిభౌతిక వస్తువులు కదా?” …. దానికి ఈ పిల్ల వెధవ ఏమందో తెలుసా?..” మీ వాదనలకి ,మీ వ్యక్తిగత నమ్మకాల ఆధారం లేని ఏదైనా నిరూపణ చూపించండి!”.
“అదేమి కూసినా, నువ్వు బాగా సమధానం చెప్పావు. వీడు మన పూర్వీకుల ఈకలు పీకుతున్నాడు , కాబట్టీ, వీడి ఈకలు పీకండి,” అని మిగిలిన కాకులకి పిలుపునిచ్చింది గు.గో. కాకి.
హెడ్ కాకి మళ్ళీ కావ్ భాష లో చెప్పింది, “ఇది దళితులను అంటరాని వారి గా చూడటం అమానవీయం”, అని కూడా అంది.
“ఇది దీనికి వచ్చిన ఆలోచన కాదు. ఆ తమిళ రామస్వామో, లేక తెలుగు రామస్వామో చెప్పిన మాటలను విని చెడిపోయింది. ఆ రామ స్వాములను లోకమంతా మరిచిపోయింది. కానీ, ఇది మరిచిపోలేదు. ఇంకా నయం.. దీనికి కొ.కు, శ్రీ శ్రీ లాంటి వారి ఆలోచనలు తెలియవనుకొంటాను. తెలిస్తే కొంప మునుగుతుంది. ఈ లోపే, తన్నండి, పొడవండి.”
” ఇది ఈ మధ్య “కాకిత్వ వాదం” అదీ ఇదీ అని పేలుతోంది”
గు.గో కాకి పెద్ద గా అరిచింది, “అయితే దీనికి ఇన్నయ్య జబ్బు అయినా పట్టి ఉండాలి, లేక రాయో రప్పో తగిలి ఉండాలి. ముక్కులకి పదును పెట్టి మరీ దీనిని పొడవండి”
“అంతే కాదు, అప్పుడప్పుడూ దళిత-బహుజనులు అనే పదం వాడుతోంది”
“అమ్మో! అయితే అయిలయ్య రోగం పట్టుకొంది దీనికి. దీనిని చీరాల్సిందే! ఇంకా నయం “జై తెలంగాణా..” అని పాట పాడటం లేదు!”
“”జై తెలంగాణ..”, అని పాట పాడటం లేదు . కానీ, “చీ కొట్టినా పోవేరా ఆంధ్రోడా?”, అంటోంది.”, అంది హెడ్ కాకి.
“ఇది చాలా డేంజర్. దీనిని చెట్టుమీదినుంచీ తోసేయండి!, కాదు..కాదు..కానీ మనం సమైక్య వాదులం కదా! కాబట్టీ, చెట్టు మీదే ఉంచి ముక్కు తో పొడవండి”
“ఇది తనకు “అమెరికా పురం” లో ఎద్దు ను పొడవటానికి చాన్స్ వచ్చినా వెళ్ళలేదంట. అమెరికా పురం వెళ్ళిన కాకులన్నిటికీ కొంచెం స్వార్ధం ఎక్కువ అంటోంది”
గు. గో కాకి, వెటకారం గా ఎర్ర కాకి కళ్ళలోకి చూసి, ” ఛా.! మీ ఊరు కాకవరం లో ఎవరూ స్వార్ధపరులు లేరా?” అని ఎగిరి తన్నింది ఎర్ర కాకిని.
ఇంతలో ఒక అమాయకపు కాకి మెత్త గా గొంతు సవరించుకొని, “దాని పైత్యమేదో అది కూస్తుంది. ఇంతోటి దానికి దానిని ఎగిరి తన్నటం అవసరమా?”, అంది.
“దాని పైత్యం కూయటం లో ఉంటే, మా పైత్యం దానిని ఎగిరి తన్నటం లో ఉంది”, అని కాకులన్నీ అమాయకపు కాకిని ఎగిరి తన్నాయి. అమాయకపు  కాకి కి “ఉలిపి కట్టె” అని పేరు పెట్టాయి. అమాయకపు కాకి మిగిలిన కాకులను intolerant bunch అని తిట్టుకొంటూ ఎగిరిపోయింది.
ఇంతలో అక్కడ గొర్రెలను కాసుకొంటున్న కాపరి ఒకడు ఓ రాయి తీసుకొని, “ఛీ, కాకి గోల!”, అని చింత చెట్టు మీదికి విసిరాడు. ఆ రాయి కాకులకి తగలకుండా దూరం గా పోయింది. కాకులన్నీ ఒక్కొక్కటీ జారుకోవటం మొదలు పెట్టాయి.
“మా పిల్లల కి దొండ పండు తేవాలి”, అని ఓకాకి అంటే, “మా ఆయనకి ఎద్దు పుండు చూపెట్టాలి “, అని ఇంకొక కాకి అంది.
గొర్రెల బుడ్డోడు ఈ సారి గురి తప్పకుండా విసిరాడు. అప్పటికే కాకులన్నీ జారుకున్నాయి.
“కుహూ, కుహూ”, అంటూ ఓ నల్లటి సన్నటి పక్షి బయట పడింది చింత చెట్టులోంచీ!

కమ్యూనిజం, కాపిటలిజం, బొందలపాటి వాదం.. (seriously :-) )

ఈ మధ్య మన బ్లాగులలో కమ్యూనిస్టులకీ, వాళ్ళని వ్యతిరేకించే వారికీ మధ్య వాగ్యుధ్ధాలూ, దూషణ, భూషణ , తిరస్కారములూ నడుస్తున్నాయి. వాటిని చూసినప్పుడు, కాసేపు ఆవేశం గా కమ్మీ భాయీలని చీల్చి చెండాడుదాం అనిపిస్తుంది. కానీ, ఇంతలోనే వారి వాదనలో అసలు సబబు లేకుండా పోలేదు కదా అనిపిస్తుంది. ఇంకాసేపు వారి వ్యతిరేక వర్గాన్ని విమర్శించుదాం అనిపిస్తుంది. కానీ వారి విమర్శలు కొన్ని కూడా సహేతుకమే కదా అనిపిస్తుంది. ఆ.. మనకెందుకు లే “గో.పి” లా కూర్చుందాం అని మరి కొంత సేపు అనిపిస్తుంది.
మొత్తానికి ఈ పీకులాట లో నా స్థానం ఏమిటో చెప్పేస్తే పోలా, ఈ రోజు కొంచెం టైం చిక్కింది కదా అని,ఈ టపా వేస్తున్నాను.

1.తప్పదు. విశ్లేషణ మొదలు పెట్టటానికి జంతువుల దగ్గరికి వెళ్ళి ఆ గెడ్డపాయన డార్విన్ ని లాక్కొని రావలసిందే! (ఏమిటో ఖర్మ, నాకు అందరూ గెడ్డపాళ్ళే దొరుకుతారు). గుంపులు గుంపులు గా ఉండే క్షీరదాలైన జంతువులలోంచీ మనిషి జాతి పరిణామం చెందింది అని ఆయన చెప్పాడు. మనిషి జంతువు స్థితి లో ఉన్నపుడు సమాజం ఉండేది. అంటే సమాజం సహజమైనదే. ఇక్కడ సహజమైనది అంటే, మనిషి తన ఆలోచన తో “నిర్మించనిది”. (డార్వినిజం పై నాది “నమ్మకం” మాత్రమే! డార్విన్ గారి సిధ్ధాంతాలని నేను వ్యక్తిగతం గా నిరూపించి నిగ్గు తేల్చుకోలేదు :-) )
2. జంతువు నుంచీ మనిషి గా మారే క్రమం లో మనిషి లో మొదటి గా “నేను” అనే ఒక self-conscious center ఏర్పడింది. ఇది ఆలోచనల తో చేయబడిన ఒక దారబ్బంతి లాంటిది. ఆలోచనలు అంటే, ఈ నేను అనేది గడచి పోయిన కాలం తో చేయబడినది. memories తో చేయబడినది. ఇది ఒక సాఫ్ట్వేర్ లాంటిది. భౌతికం గా చూస్తే, చెప్పుకోవటానికి ఏమీ ఉండదు. కానీ సిస్టం ఆన్ చేస్తే దీనిదే హవా!
3. ఆలోచనల తో కూడిన “నేను” చింపాంజీల లాంటి జంతువులలో కూడా ఉంటుంది కానీ, ప్రస్తుతానికి దానిని పక్కన పెడదాం. ఈ “నేను” ఏర్పడక ముందు మనిషి “ఆ క్షణం” లో జీవించేవాడు. పరిస్థితులూ, తన instincts మొదలైనవి ఆడించినట్లు ఆడే వాడు. జీవితం చాలా simple గా ఉండేది.
4.”నేను” గారు ఏర్పడటం మనిషి మనుగడ లో పెద్ద మైలు రాయి. ఎందుకంటే, అంతకు ముందు వ్యక్తి గత స్థాయి లో మనిషి మనుగడ గురించి plan చేసి, పట్టించుకొనే పదార్ధం లేదు. “నేను” గారు, “వచ్చే వేసవి కాలం లో food ఎలా దొరుకుతుంది?” వంటి అనేక సమస్యల గురించి ఆలోచించి, దానికి ప్లాన్ చేయటం మొదలు పట్టారు.(The selfish gene అని ఓ అమెరికా ఆయన ఒక పుస్తకం రాసుళ్ళా! )
అలానే, అనేక వైజ్ఞానిక మైన ఆవిష్కరణలూ, సాంకేతిక ఉపకరణాలు కనిపెట్టబడటానికి కూడా ఈ “నేను” గారూ, ఆయనకి ఉన్న అతిశయమే కారణం.
5. ఈ “నేను” గారి వలన మనిషికి “సాఫ్ట్ వేర్” ఒకటి ఏర్పడి, తద్వారా మానసిక ప్రపంచం అనేది ఒకటి సృష్టించబడింది.  మనిషి చేసే “భోంచేయటం”, వంటి చిన్న చిన్న పనుల నుంచీ, పట్టణ అభివృధ్ధి కోసం వేసే ప్లాన్ ల దాకా, ఈ మానసిక ప్రపంచం పరిధి లోనే జరుగుతాయి.నేను గారి జననం తో పాటు మనిషి లో భావోద్వేగాలు పదునెక్కి నిశితమైనాయి. నేను గారు ఏర్పడిన తరువాత కొంత (ఎంత అని అడగకండి) కాలానికి కుటుంబ వ్యవస్థా, వావి వరుసలూ ఏర్పడినాయి. ఎందుకంటే నేను గారికి memory ఉంది. జంతువులలో లా కాకుండా, మనుషులకి, “యాభై యేళ్ళు వచ్చిన కొడుకు కూడా” పిల్ల వాడిలా కనపడటానికి కారణం, “ఈ నేను గారికి ఉన్న మెమొరీ,  భావోద్వేగాలను record చేసి అట్టే పెట్టుకోవటం “.
6. “నేను” ఏర్పడిన తరువాత ఏర్పడిన పరిణామాలన్నీ మనిషి యొక్క స్వార్ధాన్ని బలపరిచే దిశలోనే జరుగుతున్నాయి. అది ఏ వాదమైనా, మనిషి యొక్క వ్యక్తి పరమైన హక్కుల రూపం లో, ఈ “నేను” ని బల పరిచే దిశ లోనే అభివృధ్ధి జరుగుతోంది.ఈ దిశ ని మళ్ళీ వెనుక కు మళ్ళించి, మనిషి ని సహజమైన దిశ వైపుకి మళ్ళించటం అసాధ్యం లా కనిపిస్తుంది.  కాబట్టీ వచ్చే కాలం లో మనిషి తన greediness నడిపించిన దిశలోనే నడుస్తాడని చెప్పవచ్చును.ఏ సిధ్ధాంతాన్నైనా మనుషులు buy చేయాలంటే, దానిలో వారి స్వార్ధానికి ఏదో ఒక స్థాయిలో ఉపయోగపడే అంశం ఉండాలి.
7. ముందు భూస్వామ్య వ్యవస్థా, తరువాత పెట్టుబడి దారీ ఏర్పడటం ఈ క్రమం లోనివే. మార్క్స్ అనే గెడ్డపాయన కూడా, ఏంగెల్స్ అనబడే ఇంకొక గెడ్డపాయన తో కలిసి చెప్పింది ఏమిటంటే, ఈ పరిణామ క్రమం లో తరువాత ఏర్పడబోయేది, సామ్య వాద వ్యవస్థ అని. అయితే, ఈ వ్యవస్థ ఏర్పాటును త్వరితం చేయటానికి “కమ్యూనిస్ట్ పార్టీ” ఏర్పాటు అనేది, విప్లవం రూపం లో “రసాయనిక చర్యను త్వరితం చేయటానికి catalyst ను కలపటం”, లాంటిది.  .
8. కమ్యూనిస్ట్ ల ని వ్యతిరేకించే వారు వారిని నాస్తికత్వం గురించి తరచూ విమర్శిస్తారు. అయితే, నాస్తికత్వం అనేది కమ్యూనిజం కి ఒక central point కాదు.  ఈ సృష్టి కొన్ని సూత్రాల ప్రకారం నడుస్తుంది. ఆ సూత్రాల వెనుక దేవుడు ఉన్నాడా లేడా అనేది, వ్యక్తి గతమైన నమ్మకం. కానీ ఆ సూత్రాలు మాత్రం మారవు. అలానే మనిషి కి తనదైన సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని దేవుడు ఇచ్చాడా లేదా అనేది వేరే విషయం. కాబట్టీ, మనిషి తన సంకల్ప బలాన్ని ఉపయోగించి, ఆ సూత్రబధ్ధమైన ప్రపంచం లో విప్లవాల ద్వారా మార్పు తీసుకొని రావటానికి ప్రయత్నిస్తాడనే, కమ్యూనిజం చెబుతుంది.

ఆస్తికులైనా నాస్తికులైనా తర్కం ద్వారా అన్వేషణ జరిపితే, ఒక తెలియని ప్రాంతాన్ని (realm)  దర్శించాల్సిందే! “ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారు?” అని నాస్తికుడిని అడగండి. “ఇంకా తెలియదు” అని సమాధానం వస్తుంది.
దేవుడిని నిర్వచించండి అని ఒక ఆస్తికుడిని అడగండి, “నిర్వచనాలకి అందని వాడు”, అన్న సమాధానం ఇవ్వకపోతే ఆస్తికుడి వాదం ఆటే నిలవదు.
9. ఇక పోతే, సమాజం గురించి… వ్యక్తులతో కూడిన వ్యవస్థ నే సమాజం అంటాం. ఒక సైకిల్ లో ఉన్న చిన్న చిన్న భాగాలని వ్యక్తులు అనుకొంటే, ఆ భాగాల అమరిక నే సామాజిక వ్యవస్థ అనుకోవచ్చు. సైకిల్ బిగించే వాడు సీట్ బిగించే చోట కారేజీ బిగిస్తే సైకిల్ ఉపయోగ పడకుండా పోతుంది. అలానే, సైకిల్ బిగించే టపుడు బ్రేకులు గాఠ్ఠిగా బిగిస్తే, అవితొందరగ అరిగి పోతాయి. ఇక్కడ మనం చూస్తున్నది, ఒక frame work ఉంటుందనీ, అలానే చిన్న చిన్న భాగాలనే వ్యక్తులు ఉంటారనీ. frame work ని సరి గా అమర్చక పోతే, దాని ప్రభావం component పై పడి అవి త్వరగా అరిగిపోతాయి. అలానే, చెత్త components వేస్తే (చెత్త ట్యూబ్) framework దెబ్బతింటుంది.
కమ్యూనిజం అనేది సామాజికం గా ఒక మెరుగైన frame work కావచ్చు. ఒకప్పటి సామ్యవాద దేశాలలో “మానవాభివృధ్ధి సూచికలూ, తక్కువ గా ఉన్న నేరాల స్థాయీ”, ఈ విషయాన్ని ధృవ పరుస్తాయి. (రష్యా లో మెరుగైన, తక్కువ ఖరీదైన మౌలిక సదుపాయాల గురించి భండారు శ్రీనివాస రావు గారు, transition  లో ఉన్న రష్యా లో నివశించి, తన అనుభవాలను టపాలు గా వేశారు. ఆయన కమ్యూనిస్ట్ కాదు. ఆయన టపాలు చదివిన తరువాత  నా అభిప్రాయలను ధృవ పరచుకొన్నాను. ఇప్పుడు ఆయన తన బ్లాగ్ template మార్చటం వలన ఆ టపా ల కు లింక్ ఇవ్వలేక పోతున్నాను.) ఒకప్పటి సామ్య వాద, గ్రామీణ భారతం లో కూడా ఈ నేరాలు తక్కువ. డబ్బు లేని చోట డబ్బు గురించి జరిగే నేరాలు తక్కువ కదా! అలానే కనీసావసరాలు అన్నీ తీరుతున్నపుడు, వాటి కోసం నేరాలు చేయవలసిన అవసరం ఉండదు.

10. మనుషుల లో అనాది గా వ్యక్తిగత పరమార్ధం కోసం అన్వేషణ ఉంటూనే ఉంది. అలానే మనిషి కోరికలు ఒక పట్టాన తీరేవి కాదు. మనిషి తన సుఖం యొక్క level పైకి జరిగినపుడు మాత్రమే, ఆనందం పొందుతాడు. అంటే మనిషి ఒక విజయం పాతబడిన తరువాత , తరువాతి విజయం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. కొత్త విజయాలు వచ్చినపుడల్లా ఆనందపడుతూనే ఉంటాడు. ఈ cycle కి అంతం లేదు. ఇది మనిషి పరిణామ పరం గా ఏర్పడిన మానసిక వ్యవస్థ (సాఫ్ట్ వేర్) యొక్క పరిమితి. మానసిక వ్యవస్థ లేని జంతువులు ఆకలివేసినపుడు తింటాయి. లేకపోతే లేదు. కానీ మనిషి, ఒక ఆనందాన్ని గుర్తు పెట్టుకొని, దానిని మళ్ళీ మళ్ళీ పొందటానికి ప్రయత్నిస్తాడు.మనిషి లో పక్క వాడి కంటే తాను ముందుండాలనే కోరిక కూడా ఉంటుంది.ఈ లక్షణం మనిషికి జంతువు ల నుంచీ వారసత్వం గా వచ్చింది.

ఈ లక్షణాలనీ పెట్టుబడి దారి వ్యవస్థకి చోదకాలైతే, సామ్యవాద వ్యవస్థ కి ప్రతి బంధకాలు.
మనిషి కి ఉన్న ఈ లక్షణాలు, సామ్యవాద చట్రం పరిఘి లోనివి కావు. కాబట్టీ ఈ లక్షణాలున్న వ్యక్తి (component), చివరికి చట్రాన్ని (framework),  తుప్పు పట్టిస్తాడు. సామ్యవాద వ్యవస్థ లు కొన్ని కూలటానికి  కారణం ఇదే కావచ్చు.
సామ్యవాద వ్యవస్థలు, social engineering ద్వారా నిలబడవేమో!  వ్యక్తులు  కూడా ఆ దిశలో కొంత పరిపక్వత సాధించిన తరువాతే, సామ్యవాద చట్రం నిలబడవచ్చు. సమాజం లోని వ్యక్తులలో అధిక భాగానికి సుందరయ్య, నంబూదిరి వంటి వారికున్న నిస్వార్ధతలో సగం ఉన్నా, సామ్యవాద చట్రం నిలబడుతుందేమో! కానీ ఆ వ్యక్తిగత పరిపక్వత పరిణామం ద్వారానే రావాలి. అది సామ్యవాద చట్రం ఇచ్చేది కాదు. ఒక రకం గా ఈ పరిపక్వత కు కారణం కూడా ఒక enlightened selfishness అనవచ్చు.  నా సిధ్ధాంతం గెలవాలి, నా సమాజం బాగుండాలి, అనే ఒక స్వార్ధం. కానీ అటువంటి స్వార్ధాన్ని ప్రస్థుత పరిస్థుతులలో ఆహ్వానించ వచ్చుననుకొంటా!

అందరూ మహనుభావులైనపుడు ఏ ఆదర్శమైనా పని చేస్తుంది. ఒక సిధ్ధాంతం పని చేయటానికి మనుషుల వ్యక్తిత్వ స్థాయి పెరగాలంటే, ఆ సిధ్ధాంతం, తాను పుట్టిన పరిస్థితులలో విఫలమైనట్లే లెక్క!ఎందుకంటే, సామాజిక సిధ్ధాంతం వ్యవస్థ స్థాయి లో framework ని fix చేయాలి. సిధ్దాంతం యొక్క success మనుషుల వ్యక్తిత్వ ఔన్నత్యం యొక్క దయాదాక్షిణాలపై ఆధారపడ కూడదు.

10.పరిపూర్ణ సమానత్వం అనేది ఒక ” సాధ్యం కాని విషయం”. ఈ నా టపా చూడండి.
స్త్రీ పురుష సమానత్వం లో కొంత డొల్ల తనముంది. ఇంతకుముందు ఈ టపాలో చెప్పాను.

డబ్బు వలన అసమానత్వం పెరుగుతుందనేది కాదనలేని సత్యం. ప్రభుత్వ విధానాలు ఈ అసమానత్వ అగ్నికి ఆజ్యం పోస్తాయి.
డబ్బు లేని సమాజాన్ని ఊహించుకోండి. అప్పుడు డబ్బుని అపరిమితం గా కూడబెట్టటానికి వీలుండదు. వస్తువులూ  ఆహారం మొ. అన్నీ కొంత కాలం తరువాత నశించేవే. భూమిని కూడబెట్టినా దానిని అదుపు చేయటం కష్టం. అలానే జనాల నుంచీ డబ్బుని బొట్టూ బొట్టూ పిండినట్లు వస్తువులని పిండటానికి కుదరదు.  డబ్బు లేక పోతే అనేక రకాలైన ద్రవ్యోల్బణాలు  ఉండవు.
డబ్బు ని ఎలా మానేజ్ చేయటం అనే expertise తెలుసుకొని సంపాదించటం(manipulate చేయటం) అసలే కుదరదు.డబ్బులేక పోతే, ఒక్క గుండు సూది కూడా ఉత్పత్తి చేయని speculative markets కూడా ఉండవు. తద్వారా వాటి దోపిడీ ఉండదు.
కానీ డబ్బు వలన అనేక ఉపయోగాలు కూడా ఉన్నాయి. సులువు గా  కదలటం, వ్యవహారిక మైన సదుపాయాలూ, బ్యాకింగ్ రంగమూ మొ||. కాబట్టీ డబ్బు ని బ్యాన్ చేయటం కుదరదు. దానిని నియంత్రించటమొక్కటే మార్గం.

11. మార్క్సిస్ట్ మేధావులనూ, ఇంకా అనేక ఇజాల(దళిత వాదం, స్త్రీ వాదం, తె. వాదం) మేధావులనూ, కొన్ని సూటి ప్రశ్నలు అడిగినపుడు, ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి ప్రయత్నించకుండా, “నువ్వు కేపిటల్ చదివావా??, లేక అదేదో గ్రంధం చదివావా?”, అంటూ తప్పించుకోచూడటం సరైనది కాదు. పైగా ఇదొక కొత్త వివక్షా కులాన్ని తయారు చేయటం లాంటిది (“గ్రంధాలు అన్నీ చదివిన వాడి కులం” Vs “చదవని వాడి కులం”).

12. మార్క్సిజం శాస్తీయమైనదని, ఆ వాద సమర్ధకులు చేసే ఇంకొక వాదన. శాస్త్రీయమైనదేదైనా, భౌతిక నిరూపణలకు లోబడాలి. సామ్యవాదం ఇప్పటి వరకూ నిరూపించబడలేక పోయింది అనే విషయాన్ని మరువ కూడదు. సామాజిక సిధ్ధాంతాల విషయం లో భౌతిక నిరూపణ చేయటం ఎంత అసంగతమో కూడా మార్క్సిస్టులు ఆలోచించాలి. “సైంటిస్టులకి  సామాజిక స్పృహ లేనంత (అర్ధం కానంత) మాత్రాన వారు సైంటిస్టులు కాకుండా పోరు”, అని నేను నమ్ముతాను.

13. “మార్క్స్ ఏ ఫాక్టరీ లోకీ వెళ్ళి అధ్యయనం చేసి తన సిధ్ధాంతాన్ని ప్రవచించలేదు”, అని చెప్తున్నారు. మార్క్స్ అలాంటి అధ్యయనం చేసి ఉంటే , ఆయన సిధ్ధాంతానికి మరింత విశ్వస నీయత చేకూరేదేమో! కానీ ఆయన ఒక సామాజిక శాస్త్ర వేత్త మాత్రమే. ఐన్-స్టీన్ లాంటి, Theoretical physicists ల్యాబ్ లో ప్రయోగాలు చేయరు. అంతరిక్షం లోకి వెళ్ళరు. కానీ వారిని ఎవరూ, అలా చేయమని అడగరు కదా! అలాంటిదే, మార్క్సిస్ట్ తీరీ కూడా.
మార్క్స్ తన సిధ్ధాంతాలకి విరుధ్ధమైన వ్యక్తిగత ప్రవర్తన కలిగి ఉన్నాడనేది ఇంకొక అభియోగం. ఇది నిజమైన పక్షం లో మనం, “ఎదుటి వారికి చెప్పేటందుకే ఆదర్శాలున్నాయి!”, అనుకోవాల్సిందే!మార్క్స్ వ్యక్తిగతం గా చెడ్డవాడే అనుకొందాం. అతనికి తాను పాటించని ఆదర్శాలు చెప్పే హక్కు లేదు. సరే!కానీ ఆదర్శాలు చెప్పేశాడు. ఆ పని అయిపోయింది.  ఇప్పుడు మనం అతను చెప్పిన విషయాలలోని సత్యాన్ని గ్రహించవచ్చు కదా? ఒక వెధవ చెప్పిన మంచి మాటలలోంచీ మంచిని ఎందుకు గ్రహించకూడదు?

అయితే, వ్యక్తిగత పరిమితుల వలన ఒక సిధ్ధాంతాన్ని పాటించలేని వారికి, సమాజం హితం కోరి సిధ్ధాంతాన్ని చెప్పే హక్కు ఇందుకు మినహాయింపు. (ఒక కాన్సర్ రోగి దీర్ఘ కాలం ఆసుపత్రి లో ఉండవలసి రావచ్చు. అతను వర్గ పోరాటం చేయలేక పోవచ్చు. కానీ ఇతరులను ఉత్తేజ పరచవచ్చు.)
“మార్క్స్ చెప్పాడని ఎవరైనా ఒక విషయాన్ని అంగీకరించ వలసిన అవసరం లేదు”, అనే విషయం మార్క్సిస్టులు గుర్తించాలి. “మార్క్స్ అంతటి వాడు చెప్పిన దానిని ప్రశ్నిస్తావా?”,అనేది సరైన స్పందన కాదు.

కాయలున్న చెట్లకే రాళ్ళ దెబ్బలనట్లు, ఆదర్శాలు చెప్పే వారికే అతిక్రమణల ఆరోపణలు ఎదురౌతాయి. అలా అని ఏ ఆదర్శాలూ చెప్పని వారు ఏ వెధవ పనైనా చేయటానికి లైసెన్స్ ఉందనుకొంటే పొరపాటే!

14. అలానే మార్క్సిస్ట్ ల ను విమర్శించేవారు, …. “పలానా లింక్ లో పలానా చోట మార్క్స్, ఈ నాటి పరిస్థితులకి  సరిపోయే వ్యాఖ్యానం చేశాడు”, అని చెప్తే, ఆ లింక్ ని చూడను కూడా చూడ కుండా,
“ఆ మార్క్సిజం అంతా పిడి వాద మతం!” అని తీసివేయటం కూడా సరి కాదు. అలానే, “ఏది సరైన కమ్యూనిజం, మావోదా?మార్క్స్ దా? CPI, CPM వాళ్ళదా?, మవోయిస్టులదా?”, అని గదమాయించి, అసలు మార్క్సిజం గురించి చదవకుండా తప్పించుకోవటం కూడా మంచిది కాదు.
అవన్నీ అధ్యయనం చేసి, వాటిలో దేని వలన convince అవుతారో, దేని వలన కారో వ్యక్తులు నిర్ణయించుకోవాలి. ఏదీ చదవకుండానే (ఆ టైం , ఓపికా లేక పోతే ఒప్పుకోవచ్చు కదా?) రోడ్డు మీది పిచ్చివాడి మీద, “అందరూ వేస్తున్నారు, మనం కూడా వేసి చూద్దాం”, అన్నట్లు నాలుగు రాళ్ళు వేయటం, గేలి చేయటం అనేది మంచిది కాదు. ఇంటర్నెట్లో దొరికే అవగాహన లేని పిల్లల తో దెబ్బలాటలు పెట్టుకొని, మార్క్సిజం అంటే “అంతా చెత్త”, అనుకోవటం మంచిది కాదు. ఒక వేళ చర్చించటానికి తగిన స్థాయి కల మార్క్సిస్టులు దొరకక పోతే, చర్చలనుంచీ దూరం గా ఉండటం మంచిది.  అన్ని సిధ్ధాంతాలను సమర్ధించే వారి లోనూ, అన్ని రకాల వారూ (తెలివైనవారు, జోకర్లూ, మంచివారూ, చెడ్డవారూ) ఉంటారని మరిచిపో వద్దు.

మార్క్సిస్టులు “అన్నీ మా మార్క్స్ చెప్పాడట,(ఇదొక వ్యక్తి పూజ)” అనటం సహించలేని ప్రత్యర్ధులు, “అన్నీ మన వేదాలలోనే ఉన్నాయిష”, వాదాలను మళ్ళీ నిలబెట్టాలని చూడటాన్ని, “భౌతిక మైన నిరూపణల కంటే, తమ జీవనపధ్ధతుల వలన ఏర్పరచుకొన్న వ్యక్తిగత నమ్మకాలకు మద్దతు కూడగట్టటం ద్వారా పై చేయి సంపాదించాలని ప్రయత్నించటం”, గానే అర్ధం చేసుకోవచ్చు.

15. పెట్టుబడి దారి వ్యవస్థా, సామ్యవాద వ్యవస్థా కూడా మనుగడ కోసం మానవ జీవ సమాజం చెందిన పరిణామం లోని భాగాలే.సామ్యవాదం, పెట్టుబడి దారీ వ్యవస్థలు “వ్యక్తి గత మనుగడనూ మరియూ సమూహం యొక్క మనుగడనూ వివిధ పాళ్ళలో పరిస్థితులను బట్టి మేళవించటం” వలన ఏర్పడతాయి. ఈ రెండు వ్యవస్థల అంతిమ లక్ష్యం మాత్రం “మానవ జీవ జాతి మనుగడ”. సంబంధిత టపా.

16. సామ్యవాద సిధ్ధాంతం పాతబడి పోయిందనేది ఒక వాదన. కానీ, కమ్యూనిస్ట్ మానిఫెస్టో కానీ కాపిటల్ కానీ చదివిన వారికి, ఇప్పటి సమాజ పరిణామాలు చాలా వరకూ ఆ సిధ్ధాంతం పరిధి లోకే వస్తాయనే విషయం అవగతమౌతుంది. కొత్త కొత్త గా వస్తున్న global warming వంటి విషయాలపై సామ్యవాదం యొక్క వైఖరి ఏమిటొ స్పష్తం గా లేదు.  సహజ వనరులు తక్కువ గా ఉన్నపుడూ, త్వరగా తగ్గి పోతున్నపుడూ వాటిని సమానం గా పంచుకోవటం మరీ చెడ్డ విషయం కాదేమో!
global warming ని తగ్గించటానికి మనమందరం మధ్య యుగాలలోని, పచ్చి ఆహారం తినే స్థితికి వెళ్ళటానికి సిధ్ధం గా లేమనేది స్పష్టం. దీనికి, emissions ని క్రమం గా తగ్గిస్తూ, ఒక balanced state కి వెళ్ళటమొక్కటే మార్గం.
అయితే ప్రస్తుతం ఉన్న పెట్టుబడి దారీ వ్యవస్థ పరిధిలోనే దీనికి సమాధానం దొరక వచ్చు. ప్రభుత్వాలు తమ regulations ద్వారా, కాలుష్యాన్ని తగ్గించటాన్ని ఒక లాభ దాయకమైన వ్యాపారం గా మలచాలి. దీని కోసం ప్రభుత్వాలపై ప్రజాస్వామికమైన ఒత్తిడి అవసరం.

17. పెట్టుబడి దారీ వ్యవస్థ అనేక సంక్షోభాలను ఎదుర్కోంటున్న నేటి స్థితి లో, ఏది సరైన పరిష్కారం? ఉత్తర ఐరోపా దేశాల లా , మనుషుల కనీస అవసరాలు తీరేంత వరకూ సామ్యవాద విధానాలూ, తరువాత పెట్టుబడి దారీ పోటీ విధానాలూ అవలంబించటం ఒక సమాధానం.
ఉద్యోగుల యాజమాన్యం ఉన్న కో-ఆపరేటివ్ లు ఇంకొక ప్రత్యామ్నాయం. వినియోగ దారుల కో-ఆపరేటివ్లూ, ఉత్పతి దారుల కోఆపరేటివ్ లూ (మహా రాష్ట్ర లో చక్కెర ఫాక్టరీలూ, మన రాష్ట్రం లో రైతుల కో-ఆపరేటివ్ లూ)  ఇవన్నీ మన దేశం లో ప్రయత్నించి చూసినవే! (ప్రజలందరి కో-ఆపరేటివ్ నే సామ్యవాద సమాజం అంటారనుకోండి. అది మరీ పాత చింతకాయ కదా! అందుకే కొత్త సీసా లో పాత సారా పోద్దామని ఈ కో-ఆపరేటివ్ ల proposal. class less society, withering of state ల కి కొత్త ముసుగేస్తే, ఈ co-operative వాదం వస్తుంది. )

18.వర్గ శత్రువులని అంతమొందించటం నైతికం గా తప్పని నా అభిప్రాయం.(వర్గ శతృవులని అంతమొందించటమే ఆదర్శం గా కల వారు, చర్చల లో మాత్రం తమ తో సున్నితం గా వాదించాలనటం నాకు అంతు చిక్కదు. ) ఎందుకంటే, వర్గ శత్రువు స్థానం లో విప్లవ కారుడు ఉన్నా, అతని లా డబ్బు కూడేసి దోపిడీ చేసేవాడే. (ఒక వేళ అలా చేయక పోయినా, ఎదుటి మనిషి ప్రాణం తీసే హక్కు ఎవరికీ ఉండదు). కమ్యూనిజం లోని హింస నాకు నచ్చలేదు. కానీ సమాజ వ్యవస్థ కూడా హింస ని అమలు చేస్తుంది అనేది కూడా నిజం. అయితే ఈ హింస subtle గానూ, polished and spread out గానూ ఉంటుంది. కమ్యూనిస్టులు సమాజ హింస కి ప్రతి హింస మాత్రమే చేస్తున్నమని చెప్పినా, అది నైతికం గా సమాజ స్థాయి కంటే ఉన్నతమైనది అవ్వదు.(మేము మెరుగైన సమాజం కోసం హింస చేస్తున్నామని కమ్యూనిస్ట్ లు సమర్ధించుకోచూసినా సరే!) తార్కికం గా మాత్రమే హింస కి ప్రతి హింస కి ఒక justification అవ్వ వచ్చు.
మనుషుల నైతిక స్థాయి లో వచ్చే సకారాత్మక పరిణామం వలన  ఒక మనిషి మరొక మనిషిని దోచుకోవటాన్ని స్వఛ్ఛందం గా తగ్గిస్తాడు. కానీ మనిషి కి knowledge పెరిగే కొద్దీ దానిని ఒక పదునైన కత్తిలా స్వార్ధానికే ఉపయోగిస్తున్నాడు. (సబ్-ప్రైం సంక్షోభానికి ఇలాంటి ఫైనన్స్ ప్రొఫెషనల్స్ కూడా ఒక కారణం కదా?). మనిషి నైతిక స్థాయి పెరిగే మార్గం మన విద్యా వ్యవస్థ, నాయకత్వం చేతిలో ఉంటుంది. విద్యా వ్యవస్థ ఉన్నతమైన విలువలు నేర్పితే, రాజకీయ నాయకత్వం ఆ విలువలు పాటించిన వారికి సమాజం లో తగిన రివార్డ్ వచ్చే వ్యవస్థ ని కల్పించాలి. కానీ, ఇక్కడ కూడా, It seems we are fighting a loosing battle.

మనుషుల నైతిక విలువలకి అతీతం గా., as more and more people become aware of their rights and demand their due share, Eqaulity can be ushered in through democratic means also.అందుకనే నాకు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీలు electoral politics లో పాల్గొనటం సరైన నిర్ణయమే అనిపిస్తుంది(Eventhough undiluted marxism does not support this.I feel Indian commy decision is correct here.Once commy parties follow democracy, they need to forget about proletariat dictator ship and all that ensues) కాకపోతే మన సమాజం లోని కుల మతాల మాయనుంచీ ప్రజలను బయటపడేసి, వారిని కన్విన్స్ చేయటం లో మన కమ్యూనిస్ట్ పార్టీలు విఫలమై, మిగిలిన రాజకీయ పార్టీల లానే తయారవుతున్నాయి. అలానే అధికారం లో ఉన్న పార్టీల తో పొత్తుపెట్టుకొనే socalled short term వ్యూహాత్మక నిర్ణయాలు, వాళ్ళను ఎప్పటికీ ఆ తరహా విధానాలకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి.

19. ప్రజల బాధల పట్ల సానుభూతి తో వారితో భుజం కలపటం వేరు,  ప్రజల ఆక్రోశాన్నీ, కోపాన్నీ ఒక ఆయుధం గా వ్యూహాత్మకం గా ఉపయోగించుకొని అధికారం లోకి రావటం వేరు అని మన కమ్మీ పార్టీలు గుర్తించాలి.
అలానే కమ్యూనిస్ట్లు దేనికోసమైతే పోరాడుతున్నారో ఆ ఆదర్శ సమాజం వచ్చేస్తే, తరువాత వారి అస్థిత్వం ఏమిటి? ఆదర్శ సమాజాన్ని రక్షించటమా? ఆదర్శ సమాజం స్థిరపడి పోయింది అనుకొందాం. మరి అప్పుడు కమ్యూనిస్టుల పని ఏమిటి? అప్పుడు పని ఏమీ ఉండదు. కాబట్టీ, ప్రజలు కష్టాలలో ఉంటేనే కమ్యూనిస్టుల ప్రభావానికి మంచిదా?

ఎలా ఉంది నా వాదం? ఆ నీ బొంద లో బొందలపాటి వాదం అంటారా?  OK . Then, have a nice weekend.

ఎవరు (తెలుగు)కథలు రాయకూడదు?..wth some updates..

కథలు రాయాలనే బులపాటం చాలా మందికి ఉంటుంది. అచ్చు లో తమ పేరు చూసుకోవాలనో, పేరు తెచ్చుకోవాలనో, తమ భావాలనూ ఆలోచనలను పంచు కోవాలనో రాస్తారు.
నేనేమీ గొప్ప కథకుడిని కాదు. కనీసం చిన్న కథకుడిని కూడా కాదు. కథలు రాయాలని ఒకప్పుడు ఆశపడిన ఔత్సాహికుడిని మాత్రమే!
కథలు రాసే క్రమం లో నేను తెలుసుకొన్న విషయాలు, నా లాంటి కొత్త ఔత్సాహికులకు ఉపయోగపడతాయని, ఇక్కడ:
1. మీరు మీ అభిప్రాయాలు చెప్పటం కోసం మాత్రమే కథ రాయాలనుకొంటే, మరొక్క సారి ఆలోచించుకోండి. అభిప్రాయాలను వ్యాసాల ద్వారా సూటి గా చాల తక్కువ మాటలలో చెప్పవచ్చు. ఒక ఇరవై పేజీల కథ ద్వారా చెప్పే అభిప్రాయాన్ని , ఓ వాక్యం ద్వారా వ్యాసం లో చెప్పవచ్చు.కథ, రచయిత అభిప్రాయాలను ఏదో ఒక స్థాయి లో ప్రతిబింబిస్తుంది. కానీ అభిప్రాయాలు చెప్పటం కోసం మాత్రమే కథను రాయనవసరం లేదు.
2. కథలు రాయటం చిత్రాలు గీయటం లాంటిది, మట్టి తో బొమ్మలు చేయటం లాంటిది. ఉదాహరణ కి ఒక స్త్రీ బొమ్మ ఎంత నిజమైన స్త్రీలా కనపడితే అంత ఆ బొమ్మ గొప్పది అవుతుంది. అలా అని బొమ్మ నిజం కాదు. బొమ్మ బొమ్మే. అది వాస్తవ భ్రమ ను కలుగజేస్తుంది. ఈ సూత్రం కథలకు కూడా వర్తిస్తుంది.కథ అనేది నిజం లా అనిపించే “అందమైన” అబధ్ధం. దీనినే శిల్పం అంటారు.    కథ రాసే వారికి అందమైన కల్పనలు చేసే ఆసక్తి ఉండాలి. వాస్తవం లో ఉన్న చెత్త అంతా కథల లోకి ఎక్కటం బాగుండదు. కథలు ముఖ్యం గా మనిషి మానసికప్రపంచం లో చోటున్న విషయాల గురించి రాస్తాము. మన మానసిక ప్రపంచం లో ఏ విషయాలకి చోటు ఉంటుంది అనేది మన విలువలూ ప్రాముఖ్యతలూ నిర్ణయిస్తాయి.మన చేతన లో చోటు లేని విషయాలకి అంతశ్చేతన లో చోటుంది. (ఉదా: నిషిధ్ధమైన సెక్స్) .  వాస్తవాన్నే కొలబద్ద గా పెట్టుకొంటే, మన మానసిక ప్రపంచం లో స్థానం లేని అనేక విషయాలు (కాల కృత్యాలు తీర్చుకోవటం లాంటివి) కథలలోకి ప్రవేశిస్తాయి. మనం ఈ వాస్తవ విషయాల ఆధారం గా కథలు రాస్తే అవి మళ్ళీ మన మానసిక ప్రపంచం లోనీ విషయాల గురించే ఏదో ఒక పాయింట్ చెప్పేవై ఉండాలి. వాస్తవ విషయాలను వాటి యధాతధ నిడివి తో కథలలో ప్రస్తావిస్తే అది వాస్తవికత కాజాలదు. ఒక వ్యక్తి పది నిమిషాలు పళ్ళుతోముకొంటే, కథలో ఆ వర్ణన పది నిమిషాల పాటు ఉండజాలదు కదా!

వ్యాసాలు నేరు గా పాఠకుడి ఆలోచనలను ప్రభావితం చేస్తే, కథలు సబ్-కాన్షస్ గా ప్రభావితం చేస్తాయి.
3. కథకు ఒక ఇన్స్పిరేషన్ ఉండవచ్చు. ఆ ఇన్స్పిరేషన్ తో సంఘటనలూ, సన్నివేశాలూ అల్లటం లో కథకుడి ప్రతిభ బహిర్గతమౌతుంది. కథ ద్వారా ఒక భావోద్వేగ పరమైనా, లేక ఆలోచనా పరమైన సత్యాన్ని కథకుడు చెప్పగలగాలి.అంటే కథ చదివే వారి లో భావోద్వేగాలనైనా కలిగించగలగాలి, లేక ఆలోచనలనైనా రేపగలగాలి. సన్నివేశాలు అల్లటం కోసం కష్టపడే వారు, “ఇంకా కథలు అల్లటం నేర్చుకోవాలి” అని అర్ధం.పాత్రలకి “నిజ జీవితం లో వ్యక్తులకి ఉన్న multi-dimesionality”, ఎంత ఎక్కువ గా ఉంటే అవి అంత సజీవం గా కనపడుతాయి
4.పరిభావనల స్థాయి లోనే ఆలోచనలు చిక్కుకు పోయి, వివరాలంటే పడని వారు కథలు రాయటం కష్టం.
5. తమ నిజ జీవిత అనుభవాలను పంచుకోవటానికి కథలు రాయవచ్చు. ఆ అనుభవాలూ, కథకుడి ఆలోచనా సరైనవైతే, పాఠకుడికి ఆ కథ ద్వారా నాణ్యమైన అనుభూతే దొరుకుతుంది. అయితే, నిజ జీవితం లోని సంఘటనల ఆధారం గా కథలల్లటం లో ఉన్న ప్రతిభ, పూర్తి కాల్పనిక కథలల్లటం లో ఉన్న ప్రతిభ కన్నా తక్కువ అనే విషయాన్ని కథకుడు అంగీకరించాల్సిందే!

6. కథలు చదివి ఆనందించే చాల మంది కథలు రాయటానికి ఉత్సాహపడతారు. కానీ రాయటం చదవటం కంటే భిన్నమైన ప్రక్రియ. ఇతరులు రాసిన కథలను చదివేటపుడు,  కథకుడు చెప్పే పరిధిలోని విషయాలు మాత్రమే మన మనో ఫలకం పై ఆడతాయి. కానీ కథ రాసేటపుడు మన అనేక ఇష్టాఇష్టాలు priority ప్రకారం మనో ఫలకం పై ముందుకు వస్తాయి. ఉదాహరణ కు ఇతరులు రాసిన వర్ణనలు చదివి ఆనందించే మనం, రాసేటపుడు వర్ణనలు రాయలేక పోవచ్చు. కారణం వర్ణనలు మనకు ఇష్టమైనప్పటికీ, వాటికంటే మనకు వ్యక్తి గతం గా ముఖ్యమైన పరిభావనలూ మానవ సంబంధాలూ మన మనోఫలకం పైకి రావచ్చు.
మొత్తానికి నేను చెప్పొచ్చేదేమిటంటే, వంట తిని ఆనందించే వాళ్ళందరూ వంట చేయటం ఇష్టపడనవసరం లేదని.చాలా సార్లు కథలు రాయటం లోని ఆనందం కంటే వేరే వాళ్ళు రాసిన కథలు చదవటం లోని ఆనందమే ఎక్కువ గా ఉంటుంది.

7. కథ కి సాంఘిక ప్రయోజనం ఉండాలా వద్దా? అని పెద్ద పెద్ద విషయాలు నేను మాట్లాడను , కానీ, “కథ కు అంత సీన్ ఉందా?” అనేది నా సందేహం. రా.వి శాస్త్రి లాంటి వారు చివరి రోజులలో పెన్ను పక్కన పెట్టి, గన్ను పట్టాలన్నారు.  కొ.కు(కొడవటిగంటి . కుటుంబ రావు) చివరికి కథలు రాయటం అపేశారు. చా.సో(చాగంటి సోమయాజులు) ముందే విరమించారు. ఫ్రెంచ్ విప్లవం నాటి పరిస్థితులు ఈ రోజున లేవు.
తెలుగు సమాజం లో, టాల్ స్టాయ్, హెమింగ్వే ల లా గన్ను పట్టి ఆ పై పెన్ను పట్టిన రచయితలెవరూ లేరు. ప్రముఖ రచయితలందరూ పట్నాలలోని తమ మధ్యతరగతి వాలు కుర్చీలలో సుఖం గా కూర్చొని పెన్ను పట్టి, ఇతరులను గన్నుపట్టమని ప్రోత్సహించినవారే!

శ్రీ శ్రీ మహాప్రస్థానం వంటి సులభమైన కావ్యమే, పాటక జనాలకు అర్ధం కాదు. పేద వారి గురించి రాసే కథలన్నీ, నాకు “పేద వారిని ముడి పదార్ధం గా తీసుకొని మధ్య తరగతి చేసుకొనే రస సృష్టి గా కనిపిస్తాయి.”

8. ఈ రోజుల్లో, తెలుగు కథలు రాసి డబ్బులు చేసుకోవాలనుకోవటం, “తివిరి ఇసుమున తైలమ్ము తీయవచ్చు” అనేదాన్ని గుర్తు చేస్తుంది.  యండమూరులూ, మల్లాదులూ మానేశారంటే పరిస్థితి తీవ్రతని అర్ధం చేసుకోవచ్చు.

9. కథలు ప్రధానం గా మానవ సమాజం లోని సంబంధాల ను చిత్రిస్తాయి. కానీ ఈ పరిధికి ఆవల ఉండే సైన్స్, టెక్నాలజీ, తత్వం, కాస్మాలజీ వంటి అనేక విషయాలపై కథలు చదివి వాటి పై అవగాహన పెంచుకోవటం కంటే, ఆయా విషయాలను నేరు గా చదివి అవగాహన పెంచుకోవటం సులువు.  అందుకే  కథలకు ఉండే ప్రభావం ఈ విషయలలో చాల పరిమితం.జీవితం లో ఉండే సవా లక్ష రంగాలలో, సాహిత్యం అనే ఒక చిన్న రంగం లో, ఒక కొత్త చిన్న ప్రక్రియ మాత్రమే కథ. దానికి ఉన్న పరిమితులు అనేకం.

10. మీకు అందమైన రసన కంటే ఆచరణ ఇష్టమైతే, కథలు రాయటం శుధ్ధ దండుగ.

11. సాహిత్యానికి సమాజం లో ఉండే స్థానాన్ని ఎక్కువగా ఊహించుకోవద్దు. హాయిగా ఇంట్లో కూర్చొని, ఊహలతో రాసిపారేయటం చాలా సులువు. దానికి కావలసింది కథలు రాసే ప్రతిభ మాత్రమే. పీపాడు ఆలోచనల కంటే, చెంచాడు ఆచరణ కొండంత మెరుగు. బయటకు వచ్చి సమాజం తో తలపడి పోరాడి సాధించటం చాలా కష్టం.  వ్యక్తి గతం గా రచయితలు ఆచరించని ఆదర్శాలను ప్రబోధిస్తూ రచనలు చేసే హక్కు, రచయితలకు లేదు కాక లేదు.అత్యున్నత ఆదర్శాలూ, నీతులూ ప్రవచించే రచయితలు, ఏ ఆదర్శాలూ విలువలూ లేని రాజకీయ మీడియా సంస్థలు విసిరే కుక్క బిస్కట్లకూ ఉద్యోగాలకూ ఆశపడటం ఆ రచయితల ఆదర్శాల పైపూతలను తెలియజేస్తోంది. ఒక వేళ పొట్టకూటి కోసం ఆయా సంస్థలకు పనిచేస్తోన్నట్లైతే, ఆ విషయాలను నిజాయితీ గా, బహిరంగం గా  ఒప్పుకోవటం మంచిది(శ్రీ శ్రీ లా).తన దాకా వస్తే గానీ తెలియదంటారు కదా మరి!

రచయిత ఓ ఆదర్శాన్ని పాటించాడని, అలా పాటించని వారిని తప్పుపట్టే హక్కు అతనికి లేదు. ఇతరులకి ఆ ఆదర్శాన్ని పాటించటం “రచయితకి అయినంత convenient” కాక పోవచ్చు. లేక, ఆ ఆదర్శం గురించి ఇతరులు convince అయి ఉండక పోవచ్చు. కాకపోతే ఇతరులకి ఆ ఆదర్శం పట్ల ఆసక్తి ఉండకపోవచ్చు.రచయిత కి ఆ ఆదర్శం పాటించటానికి ఎంత హక్కు ఉందో ఇతరులకి “పాటించక పోవటానికి” అంతే హక్కు ఉంటుంది.

12. మన వ్యక్తి గత గోడునూ, ఉద్వేగాలనూ,అనుభూతులనూ  పంచుకోవటానికి కవిత్వం సరైన సాధనం అనుకొంటా.!

13. అసలు విషయం ఉంటే ఎవరైనా రాస్తారు. విషయం లేనప్పుడు కూడా, కుక్కపిల్లా, అగ్గిపుల్లా వంటి విషయాలపై పేజీలకు పేజీలు రాసి జనాలను మెప్పించటం( జనాలకు వినోదాన్ని పంచటం) ఒక గొప్ప కళే. అలాంటి రాత గాళ్ళకు నా “సెల్యూట్”.

14. భాష పై పట్టు లేని వారు కథలకి దూరం గా ఉండటం మంచిది. కవిత్వం సంగతి చెప్పనవసరం లేదు.

15. గొప్ప రచయితల రచనలు చదివి, వాటి తో స్ఫూర్తిని పొంది రాయాలనుకొని కలం పట్టే వారికి నిరాశ ఎదురవ్వవచ్చు. ఎందుకంటే, గొప్ప రచయితలకు అప్పటికే జీవితం సగం అయిపోయి ఉంటుంది. లేక పూర్తి గా అయిపోయి ఉంటుంది. వారి వ్యక్తిత్వం వారి అనుభవాల సారం గా ఏర్పడి ఉంటుంది. వారి రచనలు వారి వ్యక్తిత్వం లోంచీ పుట్టుకొని వస్తాయి. వారి జీవితం లోని వయసు,దశలను బట్టి వారి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. వారిని చూసి స్ఫూర్తిని పొందిన మన లాంటి వారు వేరే స్థల కాలాల్లో ఉంటాం. అంటే మన వ్యక్తిత్వం వారి కంటే చాలా భిన్నం గా ఉండే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో మెరుగ్గా, ఇంకొన్నిటిలో నాసి గా. కాబట్టీ వారి స్థాయి లో కథలల్లటం కష్టమే. అనుకరణ మాత్రం కుదరవచ్చు.పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవటం అవసరమా?

16.విశాల సమాజం లో లానే రచయితల సమాజం లో కూడా కుల ప్రాంత మతాల కుమ్ములాటలూ, భావజాలపు పీకులాటలూ, రాజకీయాలూ ఉంటాయి.  తస్మాత్ జాగ్రత్త!

17. ఈ రొజుల్లో తెలుగు రచయితకొచ్చే పాపులారిటీ కొన్ని వేల పాఠకుల సంఖ్యను మించకపోవచ్చు. అచ్చు లో మీ పేరు చూసుకోవాలంటే (పుస్తకం వేసుకోవాలంటే),  మీ చేతి చమురు వదలవచ్చు.

18.తెలుగు రచనలకి భవిష్యత్తు లేదు. పీరియడ్. ఇంకో పదేళ్ళ లో, బళ్ళో తెలుగు మీడియం చదివే వారు దాదాపు మృగ్యమవుతారు. ఇంగ్లీష్ మీడియం చదువులు చదివి తెలుగు చదవటం నేర్చుకొన్న వారికి (అసలు నేర్చుకొంటే) తెలుగు చదివే ఫ్లూయెన్సీ చాలా తక్కువ గా ఉంటుంది (కాలేజి వరకూ తెలుగు మీడియం లో చదివిన నాకే, ఇంగ్లీషు మాటలు లేకుండా రాయటం కుదరటం లేదు). ఇక తెలుగు రచనలు చదివేది ఎవరు? చేసేది ఎవరు?తెలుగు లో రాయటం అనేది శిల్ప కళ లా “ఒకప్పుడు విలసిల్లిన కళ”  కావటానికి ఎన్నో రోజులు పట్టదు.

19. కథలు రాయాలంటే వ్యక్తి గత సమయాన్ని వెచ్చించాలి. కాబట్టీ వ్యక్తి గత సంబంధాలు ప్రభావితమౌతాయి. మీరు కథలు రాసే సమయం లో ఇంటి పనులలో సాయ పడాలని మీ భార్య కోరుకోవచ్చు. మీ పిల్లలు పక్క పార్కు కి తీసుకొని వెళ్ళాలని కోరుకోవచ్చు. వారికి మీ భావాల కంటే, తమ వ్యక్తిగత అవసరాలే ముఖ్యమౌతాయి. మీరు ఎప్పుడూ పుస్తకాలలో మునిగి  తేలేటట్లైతే మీ పిల్లల మీద మీ ప్రభావం కంటే మీ భార్య ప్రభావం ఎక్కువ ఉంటుంది (వారి తో ఎక్కువ సమయం గడపటం వలన). శ్రీ శ్రీ గారు తన నాస్తికతను ఆయన ఇద్దరు భార్యలూ కొడుకు చేత కూడా ఆచరింప చేయలేకపోయారు. అలానే అనేక వామపక్ష మేధావుల పిల్లలు ఇప్పుడు అమెరికా లో ఉంటూ, తమ పెద్ద వారివి ఛాదస్తపు ఆలోచనలు గా భావిస్తున్నారు. ఇంట్లోనే మీ భావాలకు గొప్ప విలువ లేని పరిస్థితి దాపురించ వచ్చు. ఇంట్లో వారిని తమ ఆదర్శాల తో ఒప్పించలేని వారి భావాలను సమాజం ఒప్పుకోవాలనుకోవటం అత్యాశ కదా?

20. మీరు రాజకీయ సవ్యత ఉన్న తెలంగాణ వాదం, స్త్రీ వాదం, దళిత వాదం వంటి వాటికి వ్యతిరేకం గా కథలు రాసేటట్లైతే ఇంకొక సారి ఆలోచించుకోండి. పత్రికలు మిమ్మల్ని చూసి జడుసు కొంటాయి. మిమ్మల్ని ఆమడ దూరం లో పెడతాయి. ఎవరి సర్క్యులేషన్ వారికి ముఖ్యం కదా! అలానే పత్రికల పోకడల గురించి వ్యంగ్యం గా రాస్తే వాటిని ప్రచురించేంత విశాల హృదయం పత్రికలకు ఉండదని గుర్తుంచుకోండి.లౌక్యం అనేది కథలు రాసేవారికి కూడా అవసరం మరి.

21. పబ్లిషర్లూ, పత్రికలలో ఉండే ఉద్యోగులతో స్నేహాలూ, నెట్వర్కింగూ లేని వారు,తమ కథలను పబ్లి ష్ చేసుకోవటం గురించి పునరాలోచించుకోవలి.

22. జీవితం లో రచయిత ఉండే మూడ్ ని బట్టీ, జీవిత దశ ని బట్టీ కూడా అతని రచనలు ఉంటాయి. డిప్రెషన్ లో ఉన్న రచయిత హాస్య రచనలు రాయటం కష్టం.అంతర్ముఖుడైన రచయిత సంభాషణలు రాయటానికి కష్టపడవచ్చు. డెబ్బై యేళ్ళ రచయిత రొమాన్స్ రచించటం అరుదు (ఆ రచయిత మనసు కవి ఆత్రేయ లాంటి వాడైతే తప్ప).

పాపులర్ తెలుగు టపాలు రాయటం ఎలా? : కొన్ని సూత్రీకరణలు

ఈ కింది సూత్రీకరణలు మీకు ఇంతకు ముందే తెలిస్తే, ఈ టపా ని skip చేసేయండి. “చదవకుండా ఎలా తెలుస్తాయి?” అంటారా?   తీరా చదివిన తరువాత..”అబ్బే! ఇవన్నీ మాకు ముందే తెలుసు”, అనొద్దు మరి.. .. :-)

1. తెలుగు బ్లాగులను ఒక సీరియస్ సబ్జెక్ట్ లా చదివే వారు చాలా తక్కువ ఉంటారు. “ఆఫీస్ లో బోర్ కొట్టినపుడో, ఇంట్లో ఉబుసు పోకో, బ్లాగులు ఫాలో అవ్వటం అలవాటయ్యో, ఉద్యోగాలలోంచీ రిటైర్ అయ్యో,  ప్రభుత్వోద్యోగాల్లో ఉండో, పెద్దతనం లో తమ పిల్లల తో పాటు అమెరికా చేరో,” ఈ బ్లాగులను చదివే వారే ఎక్కువ. సీరియస్ సబ్జెక్ట్ లు(ఫిలాసఫీ, సైన్సూ, టెక్నాలజీ, ఇంజినీరింగూ, సామాజిక శాస్త్రం, మన్నూమశానం.. ) నేర్చుకోవాలంటే అందుకు కాలేజీలూ, యూనివర్సిటీలూ ఉన్నాయి. బ్లాగులు దానికి వేదిక కాదు. కాబట్టీ, టపాలు సరదా గా వీలైనంత మందిని అలరించేవి గా, లైట్ రీడింగ్ కి ఉపయోగపడేవి గా , కాలక్షేపానికి పనికి వచ్చేవి గా ఉంటే ఎక్కువ మంది చదువుతారు.
ఒక వేళ ఏదైనా సీరియస్ విషయం చెప్పాల్సి వచ్చినా దానిని sugar coated pill లా సరదా గా చెప్పాలి.
2. ఏ భాషా బ్లాగులలో అయినా sex sells. నేరు గా సెక్స్ రాస్తే సంకలినులు బ్లాగులను పీకేస్తాయి. కాబట్టీ, ఇండైరెక్ట్ గా సెక్స్ “గురించి” రాసిన ఏ టపా ని అయినా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది.
3. controversial విషయాల గురించి రాస్తే ఎక్కువ మంది చదువుతారు. తెలుగు సమాజం లో caste అనేది ఒక incendiary thing. అలానే తెలంగాణా, రిజర్వేషన్లూ, హిందూత్వ ల గురించి రాస్తే ఎక్కువ మంది చదువుతారు.
4. నలుగురి imagination లోనూ నానుతున్న current event గురించి కూడా చదువుతారు. ఉదా: డర్టీ పిక్చర్.
5. ఎక్కువ మంది పాఠకుల కి సంబంధించిన విషయాలని కూడా పాఠకులు చూస్తారు. స్త్రీ పురుష సంబంధాలు సమాజం లో దాదాపు నూరు శాతం జనాలని కవర్ చేస్తాయి. కాబట్టీ వీటిని గురించి కూడా చదువుతారు.

6. పాపులర్ బ్లాగర్ గా పేరు తెచ్చుకొన్న వారి టపాలకి minimum guarantee ఉంటుంది, సూపర్ స్టార్ ల సినిమాల కి మినిమం కలెక్షన్లు వచ్చినట్లు గా (సూపర్ స్టార్ బ్లాగర్ ల కి , ఈ టపా లో చెప్పిన మెజారిటీ విషయాలను పాటించటం వలన ఆ స్టార్-డం వస్తుంది.)

7.తెలుగు బ్లాగ్లోకం అసలు తెలుగు లోకానికి ఒక sample లాంటిది. ఐతే, ఇక్కడ చదువు కొన్నవారు ఎక్కువ.  కాబట్టీ, అసలు తెలుగు లోకం లో జనాదరణ ఉన్న చాలా విషయాలకి బ్లాగ్ లోకం లో కూడా జనాదరణ ఉండే అవకాశం ఎక్కువ.  ఉదహరణకి సినిమా గాసిప్పులూ, క్రికెట్ కబుర్లూ,రాజకీయాలు. కాకపోతే, కొంచెం క్లాస్ సినిమాలూ, క్రికెట్ గురించి కొంచెంలోతైన విశ్లేషణలూ.

8. అసలు విషయం ఉన్న కథలూ, టపాలకి కూడా ఆదరణ ఎక్కువ.

9. రేటింగ్స్ ఎక్కువ వచ్చిన టపా కి కామెంట్సూ, హిట్సూ ఎక్కువ వస్తాయని చెప్పనవసరం లేదు కదా?

10. అమ్మాయిల బ్లాగులకి (వయసు మళ్ళిన అమ్మాయిలు కాదండీ) అబ్బాయిల బ్లాగుల కన్నా కొంచెం రద్దీ ఎక్కువ. ఎందుకో చెప్పనవసరం లేదు.

11. నాలా “వేసినటపానే జనాలు చదివే వరకూ మళ్ళీ వేయటం” వలన వాటిని ఎక్కువ మంది చదివే అవకాశం ఎక్కువ.

12. తెలుగు బ్లాగులు చదివే వారిలో చాలా మంది తమ సొంత బ్లాగులు కూడా నడుపుతారు. దీనిలో నాకు కొంత conflict of interest కనపడుతుంది. దీని వలన పక్కవాడి టపా బాగున్నపటికినీ, మన మొదటి అభినందన కొంత ఆలశ్యం అవ్వవచ్చు.

13. పై పాయింట్ వలన, ఒక్క సారి పక్కవాడి టపా ని మెచ్చుకొంటే, తరువాత అతను మన టపా ని మెచ్చుకొంటాడు. ఈ రకం గా పరస్పర గోకుడు ఎక్కువై వీళ్ళు గ్రూప్ లు గా ఏర్పడతారు. ఇక సామాజిక వర్గాల పరం గా, అభిప్రాయాలూ, సిధ్ధాంతాల పరం గా,లింగపరం గా, ప్రాంతపరం గా,ఊరి పరం గా,వయసు పరం గా ఏర్పడే గ్రూప్ ల సంగతి చెప్పనవసరం లేదు. ఈ గ్రూపుల్లో ఉంటే కామెంట్స్ వలన బ్లాగ్ పాపులారిటీ పెరుగుతుంది.

14.టపా వేసే టైం ని బట్టి కూడా టపా కి స్పందనలు ఉంటాయి. ఏ అర్ధ రాత్రో, సంకురాత్రి రోజో వేసే టపా ని ఎవరు చదువుతారు, చెప్పండి?

ఇక కామెంట్లూ, హిట్స్ విషయానికి వద్దాం.
1.టపా పేరు ఆసక్తికరం గా ఉంటే, హిట్స్ ఎక్కువగా ఉంటాయి.
2. టపా లో జనాలను ఆకట్టుకొనే విషయం ఉంటే కామెంట్స్ ఎక్కువ ఉంటాయి.
3. వారాంతాలలో కామెంట్స్ ఎక్కువ గా ఉండే అవకాశం ఉంది. పాఠకులకి తీరిక ఎక్కువ గా ఉండటం వలన అనుకొంటా!

4. ఇతరుల టపాలకి కామెంట్స్ పెట్టని వాళ్ళ టపాలకి కామెంట్స్ వచ్చే అవకాశం తక్కువ కదా!

5. కామెంట్స్ ఎక్కువ వచ్చిన టపాకి ఇంకా ఎక్కువ కామెంట్సూ, హిట్సూ వస్తాయి (courtesy: maalika,koodali comments section), హిట్ టాక్ వచ్చిన సినిమాకే ప్రేక్షకులు వెళ్ళినట్లు. (కాకి రెట్టేసినట్లు “good”, “interesting” అని కామెంటేసి మళ్ళీ తిరిగి చూడని వారి కామెంట్లు దీనికి మినహాయింపు.)
6. కొన్ని niche బ్లాగులు చదవటానికి ఆయా విషయాలలో పాండిత్యం అవసరం. వాటికి, సత్యజిత్ రే, సినిమాలకి ఉన్నట్లు, niche రీడర్స్ ఉంటారు.

7. కామెంట్లు రాసిన వారికి కొంచెం మర్యాద చేస్తే వాళ్ళు మళ్ళీ కామెంటుతారు.  మీరు సెలబ్రిటీ బ్లాగ్ ల కు కామెంటే వారైతే, అది బ్లాక్ హోల్ లో పడిన కాంతి అని గుర్తుంచుకోండి. దానికి response రాదు. ఎందు కంటారు? బడుగు జీవుల మాటలను ఎవరైనా పట్టించుకొంటారా?

పైన చెప్పిన సూత్రాలు కాకుండా మీకు ఏమైనా తోస్తే, కామెంటండేం? పైన చెప్పిన విషయాలు తప్పయ్యే అవకాశం కూడా ఉంది. మీరు అలా భావిస్తే నిర్మొహమాటం గా చెప్పేయండి.

PS: బ్లాగు చర్చల్లోని అభిప్రాయాలనూ, వాదాలనూ, రాతలనూ, ఆవేశ కావేశాలనూ సీరియస్ గా తీసుకొను వాడు “దున్నపోతై పుట్టున్!”. ఎందుకంటారా? చూడుడు: ఈ టపా లో మొదటి పాయింట్.బ్లాగర్లకు రాజకీయ నాయకులకు ఉన్నంత విశ్వసనీయత కూడా ఉండదు.రాజకీయ నాయకులైతే వారి పేర్లు తెలుస్తాయి. వారి  ఊరు ఏమిటో తెలుస్తుంది. దీని వలన వారు కొంచెం (చాలా కొంచెం)బాధ్యత గా ఉండాల్సి వస్తుంది. మారు పేర్ల వెనుక దాకునే ఊరు లేని బ్లాగర్లకి ఈ మాత్రం విశ్వసనీయత కూడా ఉండదు.

విశ్లేషణలు అక్కరలేని సందర్భాలు..

మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పిచ్చాపాటీ మాట్లాడుతూ కూర్చొన్నాం.
హఠాత్తుగా మా స్నేహితుడి నాలుగేళ్ళ చిన్న క్యూట్ పాప “షేం, షేం” అంది.
తల తిప్పి చూస్తే ఆ పాప తన చూపుడు వేలూ మధ్య వేలూ కలిపి టీవీ వైపు చూపిస్తూ మళ్ళీ అంది, “షేం షేం”.
టీవీ లో ఏమి వస్తుందా అని చూస్తే అక్కడ ఒక న్యూస్ చానల్ లో డర్టీ పిక్చర్ గురించి విద్యా బాలన్ ఎక్స్-పోజింగ్ చూపించే ప్రోగ్రాం నడుస్తోంది.
 ఏది సభ్యత, ఏది అసభ్యత,అసభ్యత చూసే వాళ్ళ కళ్ళలో ఉందా? చేసే వాళ్ళ చేష్టలలో ఉందా? అని పెద్ద పెద్ద విశ్లేషణలు అవసరమా? 
************

నా చిన్నపుడు..మా పల్లెటూరి స్కూల్ కి ఫర్నీచర్ సప్లై చేయటానికి హైదరాబాద్ నుంచీ ఓ ఇద్దరు వచ్చారు. ఒకాయన పూల పూల చొక్కా వేసుకొని, దాని మీదకి చిల్లులు ఉన్న జీన్స్ వేసుకొన్నాడు. నల్ల కళ్ళద్దాలు పెట్టుకొన్నాడు. పిల్లి గడ్డం కూడా ఉంది. .
అతనిని చూసి,”ఏందబ్బా పగటి వేషగాడిలా ఉన్నాడు. మన ఊరి కుక్కలు చూస్తే వెంటబడతాయి”, అన్నాడు  నా ఫ్రెండ్.
అది ఆ సాయంత్రానికి కన్-ఫం అయింది. మా ఊరి ధర్మాసుపత్రికి కుక్క కాటు వైద్యం కోసం ఆ “ఒకాయన” వచ్చాడని అక్కడ పని చేసే ఆ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ద్వారా తెలిసింది. 

********************

ఆ రోజుల్లో ఉత్తర భారతం లోని ఒక కాలేజీ హాస్టల్లో ఉండే వాళ్ళం. హాస్టల్ మెస్ లో రోటీలు పెట్టేవారు. ఆ రోటీలు చాలా చెత్తగా ఉంటున్నాయనీ. మెస్ సెక్రటరీ వార్డెనూ కలిసి డబ్బులు మింగి కల్తీ రొట్టెలు పెడుతున్నారనీ విద్యార్ధులందరం సమ్మె చేశాం.
వార్డెన్ మా అందరినీ చర్చలకు పిలిచాడు.

“రోటీల క్వాలిటీ బాగోలేదని ఎలా చెప్పగలరు? మనం ఏవిషయాన్నైనా సాపేక్షం గా చూడాలి. ఒక కోణం నుంచీ చూస్తే అవి చాలా మంచి రొట్టెలు. ఈ రొట్టెలు లేకే దేశం లో చాలా మంది బాధ పడుతున్నారు”, అని తన “చాతుర్రిం” చూపటం మొదలు పెట్టాడు వార్డెన్. చర్చల సందర్భం లొ మాటా మాటా పెరిగి మా లో ఒకతను “మెస్ లో పెట్టే రొట్టె లను కుక్కలు కూడా ముట్టవు “, అన్నాడు.దానికి మెస్ సెక్రటరీ ఆవేశం గా, “మరీ అన్యాయం గా మాట్లాడుతున్నారు. ఇప్పుడే కుక్కలకు రొట్టెలు వేసి చూద్దాం”, అన్నాడు.
సరే అంటే సరే అన్నారంతా. మెస్ కుర్రాడిని పిలిపించి, మా క్యాంపస్ లో విరివి గా ఉండే కుక్కల చెట్టుకింది కుక్కలకి ఆ ఉదయం చేసిన రొటీ లు వేయించారు. అవి, ఆ రోటీలను మూచూసి, వెనక్కి తిరిగి, వెనక కాళ్ళ తో ఆ రొట్టెల పై కి దుమ్ము చిమ్మి కప్పి పెట్టాయి. దానితో వాదనలు బంద్! రోటీలు మాత్రం మెరుగయ్యాయి.

**********

చట్ట సభలలో ప్రభుత్వాలు అనేక పధకాల గురించిన చర్చలు చేస్తాయి. విశ్లేషణలూ వాదోపవాదాలకు కొదవ లేదు. రాజు గారికి బట్టలు లేవని ఒక చిన్న పిల్ల వాడు చెప్పవలసి వచ్చింది.
మన నాయకులూ,అధికారులూ రచించే పధకాలు ఉపయోగ పడ్డాయా లేదా అనేది, “విశ్లేషణలూ, మేధావిత్వాలూ లేని సామాన్య మానవుడు”, “తన రిపేరు కి నోచుకోని ఏ సైకిల్నో” చూపించి క్షణం లో తేల్చేస్తాడు, నాయకుల హామీలకి సంబంధించిన బట్టలు అసలు లేనే లేవని. ఈ లోపు మేతావులూ, నాయకులూ మల్ల గుల్లాలు పడుతూనే ఉంటారు “మనం వెనక్కి పోతున్నామా.., ముందుకు పోతున్నామా?”, అని.

అసభ్యతా, మన సమాజం యొక్క average tolerance

డీ జీ పీ దినేష్ రెడ్డి, “స్త్రీల అసభ్య వస్త్ర ధారణ వలన రేప్ లు పెరుగుతున్నాయని”,  కామెంట్ చేసి, మళ్ళీ నా బుర్రలోని విశ్లేషణ సాఫ్ట్వేర్ ని activate చేశాడు. యధావిధి గా మన short sighted మీడియా మళ్ళీ గగ్గోలు మొదలు పెట్టింది.
మనిషి ఆది మానవుడిగా ఉన్న రోజులలో బట్టలు కట్టే వాడు కాదు. తరువాత ఎండా చలి నుంచీ అవి ఇచ్చే రక్షణ గురించి తెలిసిన తరువాత ఆకులతో, నారలతో బట్టలు కుట్టి వేసుకోవటం మొదలు పెట్టాడు.
సభ్యత అంటే సభ్యుడు కావటానికి తగిన ప్రవర్తన. ఒక గుంపు లొ సమాజం లో సభ్యుడు కావటానికి తగిన ప్రవర్తన. అంటే ఆ గుంపూ లేక సమూహానికి అప్పటికి ఉన్న విలువలను ఆమోదించి వాటికి conform అయేటట్లు ప్రవర్తించటం.
మనుషులు ఆది మానవులు గా ఉన్నపుడు, మొట్టమొదట బట్టలు వేసుకొన్న వాడి ప్రవర్తన మిగిలిన వారికి చాలా అసభ్యం గా కనిపించి ఉంటుంది. కానీ తరువాత బట్టలు వేసుకోవటం లోని లాభాలను గుర్తించి మిగిలిన వారు కూడా బట్టలు వేసుకోవటం మొదలు పెట్టి ఉంటారు.
బట్టలు వేసుకోవటం లో అప్పటి మనుషులకి అందాన్ని ఇనుమడించే గుణం కూడా కనపడి ఉండవచ్చు.
ఇక సమాజం లో కుటుంబ వ్యవస్థా, వావి వరుసలూ ఏర్పడిన తరువాత, మనిషి కి ఉండే అనేక ఆలోచనలను బహిరంగ పరచటం నిషిధ్ధమైంది. మన మనసులోని ఆలోచనలను మన మొహం తరువాత ఎక్కువ గా బహిరంగ పరిచే అవయవమేదో అందరికీ తెలుసు. పక్క వాడి భార్య పై కలిగిన కామోద్రేకాన్ని మొహం లో కనపడనీయకుండా దాచవచ్చు. కానీ ఆ అవయవం జనాలను మోసం చేయదు.
కొన్నాళ్ళకి కామ సంబంధమైన భావాలే నిషిధ్ధమైన అంశాలైనాయి. అప్పుడు కామోద్రేకం, తన భార్య లేక భర్త మీద కలిగినదైనా, బహిరంగ పరచటం నిషిధ్ధమైంది. (ఆడం, ఈవ్, యాపిల్ కథ ని కాసేపు పక్కన పెడదాం)
ఇలా కొన్నాళ్ళు గడిచిన తరువాత శరీరాన్ని కొంచెం చూపించీ, కొంచెం చూపించకుండానూ ఉండటం లో ఆకర్షణ ఉందని జనాలు గుర్తించారు. అసలు బట్టలు వేసుకోని ఆదిమానవుడికి ఈ ఆకర్షణ అర్ధం కాదు. ఈ ఆకర్షణ బట్టలు వేసుకొనే స్టేజీ నుంచీ వచ్చిందే.
ఈ కొంచెం చూపించటం లో, అన్ని విషయాలలో లానే, పాశ్చాత్య దేశాలు ముందున్నాయి. అక్కడ కూడా ఏ క్రికెట్ మాచ్ లోనో, రోడ్ పైనో ఎవరైనా బట్టలు అసలు వేసుకోకుండా కనపడితే వాళ్ళను జైల్లో పెట్టి public nudity కింద కేసు బుక్ చేస్తారు. మరి కొన్నాళ్ళకి అక్కడ మళ్ళీ ఆది మానవుల స్థాయి నగ్నత్వానికి వెళ్తారేమో తెలియదు. ఇప్పటికే, nudist society లు అక్కడ కొన్ని ఉంటాయి.
మొత్తం మీద పదిమందీ ఆమోదించే స్థాయి కి భిన్నం గా ఉన్న వస్త్ర ధారణే  “అసభ్య వస్త్ర ధారణ”.
ఇంకా మన పల్లెల లోని స్త్రీలు కాలి పిక్కలు కనపడే వస్త్రాలను కూడా వేసుకొనే స్థాయి లో లేరు. అంటే మన సమాజం యొక్క యావరేజ్ tolerance limit అనేది కొంచెం conservative గా ఉంటుంది. అయితే ఈ లిమిట్, కొంచెం ధైర్యం గా ఎక్స్-పోజింగ్ చేసే వారి వలన రోజు రోజు కీ రిలాక్స్ వుతోందనేది నిజం.
ఒక పల్లెటూరి నుంచీ వచ్చే వాడికి, ఒంట్లో సగం కనపడేటట్లు బట్టలు వేసుకొన్న స్త్రీ సెక్స్ కి ఆహ్వానించి నట్లు గా కనపడటం లో ఆశ్చర్యం లేదు.అలా అని పల్లెటూరి నుంచీ వచ్చిన ప్రతి ఒకడూ రేప్ లు చేస్తాడని కాదు.
ఇక్కడే సెక్స్ ని చూపించి డబ్బు చేసుకొనే మీడియా, అలా చూపించటం లో ఆనందం పొందే వారూ అనేక సంబంధం లేని ప్రశ్నలు వేస్తారు.
-ఒక పదేళ్ళ పాప రేప్ కి గురయింది. మరి ఇక్కడ అసభ్యత లేదు కదా?
obviously దినేష్ రెడ్డి మాట్లాడుతుంది ఇలాంటి కేస్ ల గురించి కాదు.
-సంప్రదాయకం గా డ్రెస్ చేసుకొన్న వారు రేప్ కి గురి కావటం లేదా?
అవుతున్నారు. again, ఆయన ఈ కేస్ గురించి మాట్లాడటం లేదు.
- పాశ్చాత్య దేశాలలో నాలుగో వంతే బట్టలు వేసుకొన్నా, అక్కడ రేప్ లు జరగవు. ఇక్కడ ఎందుకు రేప్లు జరుగుతున్నాయి?
మన సమాజం యొక్క average tolerance ఇంకా ఆ స్థాయి కి చేర లేదు. ప్రస్థుతం ఎక్స్పోజింగ్ చేసే వారు , ఇంకా చాలా మందిని inspire చేస్తే, త్వరలోనే మనమూ ఆ స్టేజ్ కి చేరతాం.
- స్త్రీల ఎక్స్పోజింగ్ పై బాధ్యతను తోసివేయటం ద్వారా, పోలీసులు మీ బాధ్యతను తప్పించుకొంటున్నారు.

పోలీసులు రేప్ ని సమర్ధించటం లేదు. చేసినవాడిని పట్టుకొని కటకటాల వెనుకకి పంపాల్సిందే! కానీ పోలీసులు ఒక preventive measure చెప్తున్నారు.modest గా dress చేసుకొంటే మంచిదని. అత్యచారాలు జరగటం లో ఎక్స్పోజింగ్ బాధ్యత అసలు లేదనటం, స్త్రీలు తమ బాధ్యత నుంచీ తప్పించుకోవటానికి చేసే బుకాయింపు మాత్రమే!
- మా ఇష్టమైన బట్టలు మేము వేసుకొంటాం. అది అసభ్యత ఎలా అవుతుంది?
అసలు బట్టలు వేసుకోకుండా ఉన్నా మాకు పరవా లేదు. western countries లో కూడా అలాంటి వారి పై ఓ దుప్పటి కప్పి లాకప్ సెల్ లో పడేస్తారు.  నలుగురు ఆడవాళ్ళు ఉన్న చోట ఒక మగ వాడు బూతు మాట అంటేనే అది immodesty కిందికి వస్తుంది. మరి, రోడ్ మీదా, పబ్లిక్ ప్లేసుల్లోనూ మన సమాజ పధ్ధతి ప్రకారం దాచుకోవలసిన శరీర భాగాలను బయటకు చూపించటం immodesty కదా? మీకు ఇష్టమైన బట్టలు మీరు వేసుకొంటే, మగ వారికి ఇష్టమైన “మిర్రి చూపులూ, తమలో తాము చేసుకొనే కామెంట్లూ”, ఆపటానికి మీరెవరు?

మొత్తం మీద దినేష్ రెడ్డి చెబుతున్నది, “సగం బట్టలు వేసుకొని, ఆ విధం గా మగ వాళ్ళ నుంచీ వచ్చే అటెన్షన్ ని ఎంజాయ్ చేస్తూ, వాళ్ళతో కలిసి ఏ ఫాం హౌస్ కో మందు పార్టీలకి పోయి, అక్కడ మద్యం మత్తులో ఎవడొ ఒక మగ వాడు శృతి మీరితే, దానిని గురించి అమాయకం గా వాపోయే వారిని గురించి”, మాత్రమే!

మా కాలేజీ రోజులు- ఒక కథ కాని కథ

అవి మా కాలేజీ రోజులు. ఊహలు మబ్బులలో తేలే రోజులు. కాళ్ళు భూమి మీదకి ఇంకా రాని రోజులు.  ఆలోచనలు జీవిత వాస్తవపు మురికి గుంటలో ఇంకిపోని రోజులు. ఏమీ ఆశించకుండా మంచి చేసిన రోజులు. మంచి చేసి మరచిపోయిన రోజులు.భావోన్నతుల రోజులు.’శరీర పరీవృతులైన ‘ రోజులు.
అపోహలలో సంతోషం గా గడిపిన రోజులు. అందమైన అమ్మాయి నవ్వితే “నన్నే ఇష్టపడిందనుకొనే”, రోజులు. అసలు పాటల వెనుక లేని బూతు పాటలను కనిపెట్టే రోజులు.పొగరు గా, పచ్చి గా మాట్లాడుకొనే రోజులు.అనుకోకుండా అమ్మాయిల మనసు కష్టపెట్టి, తరువాత సారీలు చెప్పే రోజులు. ఇష్టం లేని వాడిని కసి తీరా తిట్టుకొని , లేని వెధవాయిత్వాన్ని వాడికి ఆపాదించి తృప్తి పడే రోజులు. ఆత్మ విమర్శకు నిర్దయత్వం రాని రోజులు. ఆ నిర్దయత్వం కూడా స్వార్ధం కోసమేనన్న అవగాహన రాని రోజులు. ఆలోచనలు భౌతికత బాట పట్టని రోజులు. రోగం, రొష్టూ, డబ్బూ దస్కం, వ్యవహారం, సంభవం, అసంభవం గురించి ఆలోచించని రోజులు. ఆదర్శాలతో బతికేయ వచ్చనుకొనే రోజులు. ప్రపంచం లోని అన్ని విషయాల మీదా పందాలు వేసుకొనే రోజులు. స్నేహితుల హృదయాల మధ్య “డైరెక్ట్ ఆన్-లైన్ ట్రాన్స్-ఫర్ ఏదో” జరుగుతుండే రోజులు. జీవితపు విశ్లేషణ లు ఇంకా మేలుకోని రోజులు. ఒక్క ముక్కలో చెప్పాలంటే జీవితాన్ని జీవించే రోజులవి.
ఆ రోజుల్లో మా రూం మేట్లు ఇద్దరు,  గర్ల్స్ హాస్టల్ కి కి వెళ్ళి,  అమ్మాయిలను కలుసుకొని,  తిరిగి రూం కి వచ్చి , అక్కడి కబుర్లు మొదలెట్టే వారు. వాళ్ళను సోది మొదలెట్టారంటూనే, మిగిలిన వాళ్ళము కూడా వాళ్ళతో కలిసి సోది కి రాగం కలిపే వాళ్ళం.అందరూ రూం లోని పరుపుల మీద పడుకొని తన్మయత్వం తో సోది కబుర్లలో తేలియాడే వాళ్ళం.  అమ్మాయిలు ఏమి మాటలాడుతున్నారో, ఆ మాటల వెనుక మర్మాలేమిటో ఉన్నవీ లేనివీ ఊహించుకొని మాట్లాడేవాళ్ళం. కాలేజీ లో ఎవరు ఎవరికి లైన్లు వేస్తున్నారో, ఎవరి మధ్య ఏమి నడుస్తున్నదో ఉన్నదీ లేనిదీ కూడా సృజించేవాళ్ళం.

సోదంతా ఐపోయిన తరువాత, “అరే,   టైం అంతా వేస్ట్ అయిపోయిందే, ప్రతి రోజూ ఇలానే చేస్తున్నాం. ఇవాళ స్టడీస్ మొత్తం చంకనాకిపోయాయి”, అన్నాడు సురేష్ .
దానికి కీట్స్ అనబడే కృష్ణా రావు గాడు,  “ఈ సోది కబుర్లు ఎందుకు రా బాబు. ఈ అమ్మాయిల  గురించి మన టైమంతా వేస్ట్ అవుతోంది.వాళ్ళ గురించి చొంగ కార్చటం మానేయండి.  ఈ టైం లో నేను ఓ రెండు కవితలు రాసేవాడిని కదా..!”, అన్నాడు. కీట్స్ గాడు అమ్మాయిల గురించి అందమైన కవితలల్లుతాడు.
“ఒరేయ్, మేము మాటలు చెప్పుకొని చొంగ కారిస్తే, నువ్వు కవితలు రాసి, అలా కూడా చొంగ కారుస్తున్నావు. అయినా, సోది మనం కొట్టుకొని, వాళ్ళను అంటే ఎలా రా ? అసలు అమ్మాయిలూ అబ్బాయిలూ కలిసి ఒకే హాస్టల్లో రూం షేరింగ్ చేసుకొంటూ ఉంటే బాగుంటుంది. అమెరికా లో అలానే ఉంటుందట!”సురేష్ అన్నాడు.
“అవును అమ్మాయిలూ అబ్బాయిలూ కలిసి ఉంటే అన్ని ముచ్చట్లూ అయిపోతాయి. ముచ్చట్లు తీరిన తరువాత, ఇక హస్కు కొట్టుకోవలసిన అవసరం ఏముంది? అప్పుడు స్టడీస్ మీద ఫోకస్ చేయవచ్చు,” అన్నాన్నేను.

“ఆగండి” , అన్నాడు అప్పటి దాకా కళ్ళు మూసుకొని నిశ్శబ్దం గా మా మాటలు వింటున్న జంగ్ గాడు. వాడి అసలు పేరు జంగయ్య. కానీ వాడు జనాల సైకాలజీ ఎక్కువ వి”శ్లేషించటం” వలన వాడికి జంగ్ అని పేరు పెట్టాము.లైబ్రరీ లో ఎప్పుడు చూసినా ఎవో పుస్తకాలు చదువుతూనే ఉంటాడు.
జంగ్ గాడు చెంపకి అరిచెయ్యి ఆనించి, మో చేతిని కిందికి ఆనించి, “పామ్మీద విస్ణు మూర్తి”లా పడుకొని,  మొదలు పెట్టాడు. “అరే, మనమంతా పడవలేసుకొని ఒక ఉధృతం గా ప్రవహించే నదిలో పోతున్నాం రా. మన సంఘమూ పెద్దాళ్ళూ ఆ నదికి కట్టుబాట్లనే ఒక ఆనకట్ట కట్టారు. మనకి ఆనకట్ట కొన్ని మైళ్ళ దూరం లో ఉండగానే మనలో కొంత మంది నది కి ఉండే మురికి కాలువల లోకి ఎదురు పోతున్నారు. వాళ్ళని వదిలేద్దాం. మురికి కాలువ ఉధృతం గా ఉండదు. కానీ మనం ఉన్న నది కి భావోద్వేగాల,కోరికల ఉధృతి ఎక్కువ.  మనం డ్యాం రిజర్వాయర్ లో నిలకడ గా ఉన్న నీటిలో ఉన్నంత వరకూ పరవాలేదు. ఒక్కోసారి డ్యాం గేట్లు సగం తెరచుకొంటాయి.  కాకతాళీయం గా మన పడవ ఆ గేట్ దగ్గరికి వెళ్తే, మన పడవ డాం కిందికి బోల్తా కొడుతుంది. అంటే బై చాన్స్ మనం లవ్ లో పడితే మన చదువు కొన్నాళ్ళైనా బోల్తా పడుతుంది. మన పక్క రూం భాస్కర్ గాడిని చూడటం లా. వాడు ఆ ‘శిశిర’ తో లవ్ లో పడిన తరువాత, వాడి పర్సెంటేజీ తగ్గిపోయింది కదా! ఒక్కోసారి డాం కిందికి పడిన పడవ లోని మనిషి బతికి బట్ట కట్టడు. కిందటి సంవత్సరం మెకానికల్ లో శివ అనే వాడు మెడికల్ కాలేజీ అమ్మాయి రిజెక్ట్ చేసిందని ఆత్మ హత్య చేసుకొన్నాడు. లా కాలేజీ వాడొకడు తనను తిరస్కరించిన అమ్మాయి మీద యాసిడ్ పోయబోయాడు. వాడి మీద కేసు బుక్ అయింది. వాడి జీవితం నాశనం అయినట్లే! ఇవన్నీ మరిచిపోయారా? ….అలా అన్న మాట. కాబట్టీ మనమందర మన పెద్ద వాళ్ళు పెళ్ళి  అనే లీవర్ ద్వారా డాం లోని నీటిని క్రమం గా సేఫ్ లెవల్ కి తెచ్చేదాకా ఆగి అప్పుడు డాం అవతలిపైపుకి వెళ్ళ వచ్చు. అదీ సంగతి!”, అన్నాడు జంగ్.

జంగ్ గాడి వాదన లో నాకొక లొసుగు కనిపించింది. ” అసలు ఆనకట్టే లేక పోతే, మనకు ఈ తిప్పలు ఉండవు కదా?”, అన్నాను.
“ఆనకట్టలేక పోయినా మన కుర్రతనపు నదిప్రవాహం ఉధృతం గా ఉంది. ప్రవాహం లో మన పడవ బోల్తాపడక తప్పదు. కాబట్టీ, అప్పుడప్పుడూ ఇలా అమ్మాయిల గురించి సొల్లు కబుర్లు చెప్పుకొంటూ, స్థిరమైన రిజర్వాయర్ లో తెడ్డేసుకొంటూ తిరగటమే మేలు”, జంగ్ నవ్వాడు.
“పెద్ద వాళ్ళు కట్టిన ఆనకట్ట గేట్లు ఈ మధ్య చాలానే ఊడిపోతున్నాయి. అమెరికాలో లా ఇంకా ఆనకట్టే కొట్టుకొనిపోలేదనుకోండి. ఒక వేళ ఆనకట్ట లేకపోయినా, ప్రవాహ ఉధృతి లో పడవ బోల్తా పడుతుంది.”

“అరే జంగ్ గా, ప్రవాహమూ ఉధృతీ డామూ అంటూ ఇంకో సోది మొదలెట్టావు. అర్ధమై చావట్లేదు. అసలు విషయం చెప్పరా!”
” పాశ్చాత్య దేశాలలో టీనేజీ సెక్స్ గురించి  పరిశోధనలు జరిగాయి. . అక్కడ “కో-ఎడ్యుకేషన్” కాలేజీ ల కంటే, అబ్బాయిలకు మాత్రమే పరిమితమైన కాలేజీల లో అబ్బాయిలు మంచి ఫలితాలు సాధించారు .  మన పూర్వపు గురుకులాల మాదిరి. సంఘం పరిపూర్ణం గా నిషేధించి, పూర్తిగా సాధ్యం కాని ఏ అంశం మీదికైనా మన ఆలోచన పోదు. అప్పుడు మనసు పక్క దారి పట్టక, చదివే అంశం మీద మనసు లగ్నం చేయవచ్చు. సంఘం విధించే నిషేధం, “డాం కి ఉన్న పుచ్చిపోయిన తలుపుల లా”, ఉంటే, వ్యక్తుల మనసులు అటూఇటూ కాకుండా ఊగిసలాడి మనసు లగ్నం కాదు.అలానే, టీనేక్ సెక్స్ వలన “మెదడు అభివృధ్ధి చెందటం ఆగిపోయే అవకాశం ఉంది”, అని కూడా ఈ పరిశోధనలు చెబుతున్నాయి. అయితే సెక్స్ ఎడ్యుకేషన్ వలన మాత్రం యువకుల చదువులకి నష్టం లేదు!”.

“సరేరా జంగ్, ఇంతకీ ప్రేమ గురించి నీ అభిప్రాయమేమిటి రా?”

“ప్రేమించటం అనేది కోర్ట్ కేసు లాంటిది. ఓడిపోయిన వాడు కోర్ట్-లో ఏడిస్తే, గెలిచిన వాడు ఇంటికెళ్ళి ఏడుస్తాడంట.  అలానే, ప్రేమ విఫలమైన వాడు గుండె పగిలి ఏడిస్తే, ప్రేమ సఫలమైన వాడు పెళ్ళయిన తరువాత భ్రమలు విడిపోయి ఏడుస్తాడంట! అసలు ప్రేమ లో పడనివాడిదేనోయ్ జల్సా అంతా!”

దేవుడూ హేతువాదుల సంవాదం

సుందరం కళ్ళు తెరిచాడు. చిమ్మ చీకటి. కళ్ళు మూశాడు. ఏమీ కనపడటం లేదు.
ఆరు నెలలు గా గుండె జబ్బు తో తీసుకొంటున్నాడు. రాత్రి నిద్రపోయి మళ్ళీ ఇప్పుడే లేచాడు.
చేతులు విదిలించాడు.అరే చేతులు ఉన్నట్లే లేవే..! కాళ్ళు ఆడించాడు. ఊహూ.. కాళ్ళు కదల లేదు.
“నేను బతికే ఉన్నానా?”
“ఊహు.., నిన్న రాత్రే చనిపోయావు”, ఎక్కడి నుంచో సమాధానం వచ్చింది.

“అరే.., ఎంత ఘోరం జరిగింది..నా పెళ్ళాం పిల్లలు ఎలా బతుకుతారు?…. ఇంతకీ, నువ్వెవరు?”
“నీ భాషలో దేవుడు అంటారు”

“నేను నమ్మను.నాకు జీవితం లో దేవుడెప్పుడూ కనపడలేదు. నేను నాస్తికుడిని,రచయితని ..పైగా హేతు వాదిని…తెలుసా?”
“కనపడితే ఇంకా నమ్మేదేముంది గానీ, ప్రస్తుతం నువ్వు ఎవరి తో మాట్లాడుతున్నట్లో?”

“నమ్మను గాక నమ్మను! మనిషి బుర్రకి బయట, “తెలివిగానీ, ‘తెలివి లో ఉన్న వస్తువు గానీ ,” ఏదీ లేదని మా నాస్తికుల విశ్వాసం”.
“మనిషి తెలివీ చేతనా, నా తెలివీ చేతనా ఒకేవిధం గా ఉంటాయని నీకెవరు చెప్పారు?”

“మా శాస్త్రవేత్తలు ఈ విశ్వం పని చేసే నియమాలను కొన్ని ఎప్పుడో కనిపెట్టేశారు. ఇంకొన్నిటిని కనిపెడుతూ ఉన్నారు.క్వాంటం తీరీ, స్ట్రింగ్ తీరీ మొదలైన వాటిని గురించి నువ్వు ఇంకా వినలేదా?”
“ఆ నియమాలను పెట్టింది ఎవరు? వారికి కనిపెట్టే శక్తిని ఇచ్చింది ఎవరు?”

“అంటే ఆ నియమాలను నువ్వే పెట్టానంటావ్. అయినా సరే నేను నిన్ను నమ్మను. నువ్వు నన్నేం చేసినా సరే..!”
“నన్ను నమ్మని వాళ్ళని దండించటానికి నేనేమైనా నియంతనా..? నన్ను నమ్మిన దుర్మార్గులని నెత్తిన పెట్టుకోవటానికి నేనేమైనా ముఖప్రీతి మనిషినా?”

“సరే..నా మీద కోపం లేదన్న మాట”
“రాగ ద్వేషాలకతీతం గా నా నియమాలప్రకారం పని జరిగిపోతుంది. మీరూ నా నియమాల ప్రకారమే ప్రవర్తిస్తారు.కోపం పెంచుకోవటానికి నేనేమైనా మనిషినా..?. “

“నువ్వు ఈ లోకం నడిచే భౌతిక నియమాలని ఎందుకు మార్చవు? దీనివలన హాకింగ్ వంటి శాస్త్రవేత్తలు,స్థిరం గా ఉండే భౌతిక నియమాలను తెలుసుకొంటే చాలు,  నిన్ను తెలుసుకొనకపోయినా వచ్చే ప్రమాదమేమీలేదంటున్నారు కదా? “
“నువ్వు రచయితవి కదా? నీకు శిల్పం యొక్క ప్రాముఖ్యత తెలిసేఉండాలి. లోక నియమాలని మారిస్తే నా లోక రచన లో శిల్పం దెబ్బతింటుంది. నా శిల్పం మీకు అర్ధం కాదులే . అది “అధిభౌతిక శిల్పం”. శిల్పాన్ని దెబ్బతీయటం ఉచితం కాదు కదా? “

“నీ ఉనికిని మా శాస్త్ర వేత్తలు ఎప్పటికైనా నిరూపించగలరా ?”
“సిధ్ధాంతపరం గా నిరూపించవచ్చు. కానీ నేనుండే లోకం వేరు.నా కొలతలు వేరు. మీకు నా లోకం లోకి ప్రవేశం లేదు. నా లోకం, మీ లోకం లోని నియమాల ప్రకారం పని చేయదు. మీ లోకం నా పరిధి లోని ఒక చిన్న నలుసు మాత్రమే! నా ఉనికిని మీ లోకం లోని నిజ జీవితం లోని దృగ్విషయాలాతో నిరూపించటం అయ్యేపనేనా? “

దేవుడు నన్ను మళ్ళీ బ్రతికిస్తాడేమో.నమ్మితే పోయిందేముంది. ఆయన తో  మంచి గా మాట్లాడదాం….అనుకొన్నాడు సుందరం లోలోపల.  దేవుడికి సుందరం మనసులోని  మాటలు వినపడుతూనే ఉన్నాయి.

“స్వామీ, మమ్మల్ని సృష్టించింది నువ్వే కదా..అంటే, మేము చేసే చెడ్డ పనులకి నీకు కూడా బాధ్యత ఉంటుంది కదా..?”
“నువ్వు నెమ్మది గా ఆస్తికుడివై పోతున్నావనుకొంటా..మీకు స్వేఛ్ఛా సంకల్పం ఇచ్చాను కదా?దానిని పరిస్థితులకి అతీతం గా ఉంచుకోవాల్సిన బాధ్యత మీది కాదా?”

“అంటే, మంచి తో పాటు చెడు చేసే స్వేఛ్ఛ కూడా నువ్వే ఇచ్చావన్నమాట!అసలు మనిషి చెడు చేసే ఆస్కారం నువ్వు కలిగించకుండా ఉంటే పోయేది కదా..? ఆ..అయినా, నువ్విచ్చిన స్వేఛ్ఛా సంకల్పం లో ని స్వేఛ్ఛ నేతి బీరకాయ లోని నెయ్యి లాంటిది లే స్వామీ, అవునూ, ఎప్పటినుంచో నువ్వు కనపడితే అడగాలనుకొంటాను స్వామీ. జనాలకి ఇంత  బాధలను ఎందుకు పెడతావు. ప్రళయాలూ, ప్రమాదాలూ ఎందుకు సృష్టిస్తావు? నువ్వు చెడ్డ వాడివా, మంచి వాడివా?”
“నేను మాత్రం కావాలని చేస్తానా?మంచి చెడులు మానవ సమాజాలు సృష్టించినవి. అనిర్వచనీయుడనైన నాకు మీ మంచి చెడులను ఎందుకు వర్తింప చేస్తున్నారు?

“కావాలని చేయవా..? అంటే నీ మీదా ఈ ప్రపంచం మీదా నీకు అదుపు లేదా స్వామీ..?”
“అదుపు అనేది, నియంత్రించటం అనేది మనుషుల లక్షణం కాదా? మీ లక్షణాలని నాకు ఆపాదిస్తే ఎలా?”

“సరే..మరి నిన్ను ఎవరైనా అదుపు చేస్తున్నారా? ఎవరైనా సృష్టించారా?”
“నన్నెవరూ సృష్టించలేదు. నాకు కారణం లేదు.నాకు మొదలు లేదు.చివర లేదు. నేనే అన్నిటినీ సృష్టించాను. అన్నిటిలోంచీ నేను వచ్చాను. అన్నీ నేనే. నేనే అన్నీ. కార్య కారణ సంబంధం మీ ప్రపంచం లోది కదా?”

ఈయనకు మొదలు లేదు, చివర లేదంట. నేనడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వకుండా భలే తప్పించుకొంటున్నాడే! అనుకొని, సుందరం, “నీకు మొదలే లేదా? నేను నమ్మను..అదెలా సాధ్యం స్వామీ?”అన్నాడు.
వెంటనే సుందరం కళ్ళముందు వెలుగుతో ఒక వృత్తం ప్రత్యక్షమైంది.
“ఈ వృత్తం చుట్టూ పోతే ఏది మొదలు? ఏది చివర? ప్రతి ప్రదేశమూ మొదలే. ప్రతిదీ చివరే. నీవు ఏది మొదలు అనుకొంటే అదే మొదలు కాదా?”

“నీ ఉదాహరణ ప్రకారం, ప్రతి విషయానికీ ముందు వేరొక విషయం ఆదిగా ఉంది కదా స్వామీ?”
“నా లోకం లో కార్యమూ కారణమూ ఒకే సమయం లో జరుగుతాయి. ఒకే బిందు సమానమైన సమయం లో కాలాలన్నీ ఉంటాయి. ఒక ప్రదేశం లోనే అనేక వస్తువులు ఉంటాయి. “

 ”ఏంటో! మా క్వాంటం తీరీలూ, స్ట్రింగ్ తీరీలూ చెప్పినట్లు గా నువ్వు మాట్లాడుతున్నావు. ఇంతకీ, నువ్వు ఏ కాలం లో ఉన్నావు స్వామీ?”
“అన్ని కాలాలలోనూ ఉన్నాను. కొండమీది నుంచీ చుట్టుపక్కల చెట్లన్నీ కనపడినట్లే, నాకు కాలాలన్నీ ఒక్క క్షణం లోనే కనపడుతాయి. ఏ కాలాన్నైనా నేను స్పృశించగలను. అన్ని కాలాలలోనూ నేను ప్రవేశించగలను. కాలాన్ని నేను ఆపగలనూ, పరుగులు పెట్టించగలను. అయితే, నా కాలం మీ కాలం కంటే భిన్నమైనది కదా?”
“ఏమిటో స్వామీ, నన్ను గందర గోళం లోకి నెట్టేశారు. నేను మీలా  నిన్నటి వస్తువునీ రేపటి వస్తువునీ ప్రస్తుతం ఎందుకు స్పృశించలేను స్వామీ?”
“నీ లోకం లో కార్యమూ కారణమూ వేర్వేరు గా ఉన్నపుడు, “కార్యమైన నీ ప్రస్తుత లోకం లో ఉన్న నీవు కారణమైన నిన్నటిని ఎలా స్పృశించగలుగుతావు?”
 

“మీరు మాడైమన్షన్లో ఉన్నట్లు అగుపడటంలా.. ఏ ఆరో డైమన్షన్లోనో..ఏడో డైమన్షన్లోనో ఉన్నారా?  ఏదేమైనా, కాలాన్నే అదుపు చేయగల మీరు సామాన్యులు కారు”

“ఇందులో మనుషులు చేసినట్లు గా అదుపు ఏమీ లేదు. కాలమూ, లోకమూ, నేనూ వేరు వేరు కాదు. అంతా ఒక్కటే కాదా?”

“మీరు ఎవరైనా నాకు  చేతులు జోడించాలనిపిస్తోంది. ఒక్క సారి నాకు కనపడండి స్వామీ!”
“నేను నిర్గుణుడను, నిరాకారుడను, అనిర్వచనీయుడను, అమేయుడను.  నన్ను నీవు చూడలేవు. భక్తి అనేది అమిత బలవంతుడైన ఇష్టుడిని చూసినపుడు మనుషులలో కలిగే ఇష్టం తో కూడిన భయం.  దీనికీ మనుషుల మనుగడకీ సంబంధం ఉంది.  నీ భక్తి కీ నా ప్రత్యక్షానికీ సంబంధం ఏమీ లేదు.నీ చర్మ చక్షువుల తో నన్ను గ్రహించలేవు. దివ్య చక్షువులివ్వటానికి భక్తి ఒక్కటే సరిపోతుందా?”

“సరే స్వామీ, నా ప్రశ్నలన్నిటికీ మీ ప్రశ్నలతో బ్రహ్మాండం గా సమాధానం చెప్పారు. ఒక్క సారి నన్ను మళ్ళీ  బతికించండి స్వామీ!. అరే! ఏదీ సమాధానం రాదే? ఆ దేవుడా పాడా. లేనే లేదు.. లేక పోతే నా ప్రశ్నకు సమాధానం ఎందుకు చెప్పడు?”

కురచదైపోతున్న కాలం

నాకు ఒక ఏడెనిమిదేళ్ళ వయసున్నపుడు, నేను మా చుట్టాల ఊర్లో పెరిగాను. తరువాత మా ఊరు వచ్చేశాను.
 నేను పెరిగి డిగ్రీ లోకి వచ్చిన తరువాత దాదాపు పదిహేనేళ్ళ కి మళ్ళీ మా చుట్టాల ఊరుకి వెళ్ళాను.
అక్కడ ఒక గమ్మత్తైన విషయం గమనించాను. అక్కడి పెరటి గోడలన్నీ  కురచవైపోయాయి. నా చిన్నప్పుడు దూరం గా ఉన్న ప్రదేశాలు దగ్గరగా జరిగాయి.
ఇదేంటబ్బా అని ఆలోచిస్తూ ఉండగానే నాకు విషయం అర్ధమైపోయింది. పెరటి గోడలు పొట్టివవ్వ లేదు, నేనే బారు పెరిగాను. దూరాలు దగ్గరవ్వలేదు నా కాలే బారు సాగింది.
 మనపై కాలం కూడా ఇలాంటి కనికట్టునే చేస్తుంది.

నేను ఎనిమిదో తరగతి లో ఉన్నపుడు, మా నాన్న ని దీపావళి కి బారు లాగూ (పాంటు) కొనిపెట్టమని అడిగాను. దానికాయన,”అప్పుడే వీడికి పాంటు కావలసి వచ్చిందంట, వచ్చేదీపావళి కి కొనిపెడతాలేరా!”, అని విసుక్కొన్నాడు.
నేను, “అమ్మో! పాంటు కోసం ఏకం గా సంవత్సరం ఆగాలా నాన్నా?” అన్నాను.
ఆయన, ” సంవత్సరం ఎంత సేపట్లో వస్తుంది. ఇలా చూస్తూ ఉండగానే గిరుక్కున తిరి వస్తుంది”, అన్నారు.
చిన్నప్పుడు ఎంతో బారు గా అనిపించిన సంవత్సరం ఇప్పుడు నాకు కూడా చాలా కురచ అయిపోయింది. ఎందుకంటే, చిన్నపుడు పన్నెండు సంవత్సరాలు ఉన్న నా మనసు ఎత్తు ఇప్పుడు పెరిగి పోయింది. అది ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాల ఎత్తుకు పెరిగింది. ఈ ఎత్తు ముందు,  సంవత్సరం అనే పెరటి గోడ కుంచించుకొని పిట్టగోడ లా అయిపోయింది.. ఇక నేను యాభై లలోకి అడుగు పెట్టటానికి.నా చిన్నప్పటి లెక్కలో చెబితే…, ఇంకా ఓక సంవత్సరం వ్యవధి కూడా లేదు. త్వరపడాలి లేక పోతే చూస్తూ ఉండగానే వార్ధక్యం లోకి అడుగుపెడతాను.

డర్టీ పిక్చర్, సిల్క్ స్మిత జీవితం,స్త్రీ వాదం, ..కొన్ని ప్రశ్నలూ సమాధానాలు

ఆడవారి అందాలను కమర్షియలైజ్ చేసి అమ్ముకోవటం ఇప్పటిది కాదు. అది మానవ జాతి అంత పాతది.కాకపోతే మన సినిమా వాళ్ళు దానిని మన పాపులర్ కల్చర్ తో మేళవించి మనకు స్లో పాయిజన్ లా ఎక్కిస్తున్నారు.
నేను నా ఫ్రెండ్ ఒకతనిని తో సినిమాల లో సెక్స్ గురించి వాపోతుంటే, అతను “మనం చేసే టప్పుడు లేని తప్పు ఎవరో చూపిస్తుంటే ఏమిటి? ఇది హిపోక్రసీ నే కదా?”, అన్నాడు.
అతని వాదన నాకు మరీ సింప్లిస్టిక్ గా అనిపించి, “హిపోక్రసీ అనేది సామాజిక విలువల కి  మాత్రమే వర్తిస్తుంది. మనం నాలుగు గోడల మధ్యా చేసే  పనులకి కాదు”, అని చెప్పబోయాను కానీ నా వాదన కి నేనే కన్విన్స్ కాలేదు.
“నెట్లో బూతు సినిమాలు చూసి ఆనందించే ప్రేక్షక సామాన్యానికి సినిమాల లో ని బూతు ని గురించి ఫిర్యాదు చేసే హక్కు ఎక్కడిది?”, అని కూడా అతను అన్నాడు.
నేను, “నిర్మాతలు ప్రేక్షకుల బలహీనతలను క్యాష్ చేసుకొంటున్నారు..”, అన్నాను.
“నెట్లో ఇవన్నీ ఫ్రీగానే వస్తాయి..అయినా నువ్వు నీ అభిమాన హీరో చేసే డాన్సులూ, ఫైట్లూ చూసి ఆనందిస్తావు. ఎవరైనా అది నీ బలహీనత అంటే నువ్వు ఒప్పుకొంటావా? నీ అభిమాన దర్శకుడు తీసిన సినిమా ని నువ్వు ఆనందిస్తావు.అది నీ బలహీనత కాదు. అలానే నీ అభిమాన తార గుడ్డలిప్పి చూపిస్తే నువ్వు ఆనందిస్తావు. ఇది కూడా నీ బలహీనత కాదు”,అన్నాడు.

ఈ మధ్యే ఏదో హిందీ సినిమా లో ఒంటిమీద నూలు పోగు లేకుండా నటించిన నగ్న కళా విదుషీమణి ని ఒక బుధ్ధిలేని విలేఖరి, “మీ సినిమా లో అసభ్యత ఎక్కువయింది అంటున్నారు..?”, అని ప్రశ్నిస్తే ఆమె, “అసభ్యత అనేది చూసే వారి కళ్ళలోనే ఉంటుంది”, అని దబాయించింది.

కొంత మంది నటీమణులు పాత్రస్వభావాన్ని బట్టి ఎక్స్-పోజింగ్ చేస్తున్నామనీ, తాము నిజజీవితం లో పతివ్రతలమనీ చెబుతారు!నిజ జీవితం లో, “లో దుస్తులు” బయటికి కనపడితేనే సిగ్గుతో చితికిపోయే వారు, పాత్రాపరం గా ఎక్స్-పోజింగ్ ఎలా చేయగలరు?ఒక పాత్ర ఎక్స్-పోజింగ్ చేయాలంటే దానిని పోషించే అసలు మనిషి కూడా ఎక్స్-పోజింగ్ చేయాలి కదా!అలానే ఆ వ్యక్తి ఎక్స్-పోజింగ్ ని సినిమా సెట్లోని ఇతర పాత్రల వెనుక ఉండే అసలు మనుషులూ,, టెక్నీషియన్లూ చివరికి ప్రేక్షకుల వెనుక ఉండే అసలు మనుషులూ చూస్తారు కదా?  ఒక్క డబ్బు కోసం పాత్రా పరమైన వెధవపనులు చేస్తున్నారంటే, వారు నిజ జీవితం లో కూడా ఇతర ప్రలోభాలకు లొంగి అలాంటి పనులు చేయగలరన్న మాట! ఒక పాత్ర యొక్క దుష్ట స్వభావాన్ని  ఆవాహన చేసుకొని నటించటం వేరు. దానికోసం అసలు మనిషి దుష్టుడు గా మారనవసరం లేదు. నిజ జీవితం లో చెడు పనులు చేయనవసరం లేదు. రావు గోపాల రావు,సూర్యకాంతం వంటి వారు సినిమాలలో దుష్ట పాత్రలు వేసినప్పటికినీ నిజ జీవితం లో సాత్వికులుగానే ప్రసిధ్ధి చెందారు. 

మానసిక స్థాయి లో అంతర్గతం గా మనలో ప్రతి ఒక్కరి లోనూ అనేక మంచీ చెడూ పాత్రలు ఉంటాయి. నటుడు సందర్భాను సారం గా తన లోని ఈ పాత్రలను ముందుకు తీసుకొని వచ్చి అభినయిస్తాడు.
అంతర్గతంగా ఉన్న మంచి పాత్రను బాహ్యం గా నిజ జీవితం లో మనం పోషించలేక పోవచ్చు, మన వ్యక్తిగత మనుగడ వంటి విషయాలు అడ్డు రావటం వలన. అలానే ,అంతర్గతం గా ఉన్న చెడు పాత్రని నిజ జీవితం లో మనం పోషించలేము. అలా పోషిస్తే పక్క వాడు మనకి దేహశుధ్ధి చేసి పోలీస్ కేస్ పెడతాడు కాబట్టీ. నిజ జీవితం లో మన బాహ్య వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దటం లో మన ఆచరణ ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఎక్స్-పోజింగ్ అనే భౌతిక మైన పని నిజం గానూ, పాత్రాపరం గానూ ఒకేసారి జరిగిపోతుంది. రెండిటినీ వేరు చేసి చూడలేము. కానీ వ్యక్తిత్వాన్ని అభినయించటం మానసికమైన పరిధిలోనిది. వేరే వ్యక్తిత్వాన్ని అభినయించి, మళ్ళీ కాసేపటికి తన నిజ జీవితం లో అసలు వ్యక్తి గా అవ్వవచ్చు.
మా  చుట్టాలలో ని ఒక ఫెమినిస్టు గారిని, “ఈ  అర్ధ నగ్న ప్రదర్శనలు చేసే వారూ ఆడవారే కదా?” అని అడిగాను.
దానికి ఆమె నామీద ఇంతెత్తున లేచి, ” మీ మగాళ్ళే పేద స్త్రీల బలహీనతను ఆసరాగా తీసుకొని వారి చేత ఇలాంటి పనులు చేయిస్తున్నారు”, అంది.

ఎందుకనో నాకు, ” తరతరాల నట వారసులైనటువంటి కరీనా కపూర్లూ, ఇంగ్లాండ్ నుంచీ ఊడిపడే కట్రీనా కైఫ్లూ పేదవారనుకోవటానికి మనసొప్పలా..! కాకపోతే సరదాగా ఖర్చు పెట్టుకోవటానికి ఓ రెండు మూడు కోట్ల పాకెట్ మనీ కోసం ఎక్స్-పోజింగ్ చేస్తే తప్పేమిటి?”, అనిపించింది. 
ఇక అసలు విషయానికి వచ్చేద్దాం, ఈ మధ్యే డర్టీ పిక్చర్ ని  నిర్మించిన బాలాజీ పిక్చర్స్ అధినేత్రి ఏక్తా కపూర్ కూడా ఒక స్త్రీనే కదా..?! ఆమె కూటికి గతి లేని పేద రాలు కాదు. కొన్ని వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి రాణి. మధ్య తరగతి విలువలను మనం ఆమె కు అంటగట్ట రాదు.ఆమె ఎగువ తరగతి కి చెందిన ప్రభావవంతమైన స్త్రీ.  ఆమె విలువలు డబ్బు చేతా, ప్రాక్టికల్ గా ఉండే సాధ్యాసాధ్యాల చేతా, న్యాయ వ్యవస్థ చేతా , ఆ పై ఆమె వ్యక్తిగత ఇష్టాఇష్టాల చేతా నిర్ణయింపబడతాయి. 
ఇక సిల్క్ స్మిత అమలాపురం దగ్గర ఒక పల్లె నుంచీ పొట్టచేత పట్టుకొని మద్రాస్ చేరి, సినిమాలలో శృంగార పాత్రలు వేసి గడుపుకొంది. పాపం, ఏ కష్టమొచ్చిందో ఏమో, ఆత్మహత్య చేసుకొంది. ఆమె శృంగార పాత్రలు తన అవసరాన్ని బట్టి వేసి ఉండవచ్చు. తన కడుపు కోసంకొన్ని అక్రమ సంబంధాలలో ఇన్వాల్వ్ అయి ఉండవచ్చు. కానీ ఆమె జీవితం లో కనిపించేది దయనీయత మాత్రమే. శృంగారం ఏ మాత్రం కాదు.

 అటువంటి సిల్క్ స్మిత జీవితం లోకి శృంగారాన్ని జొప్పించి డబ్బు చేసుకోవాలనుకొనే ఏక్తా కపూర్ కూడా ఒక స్త్రీనే. కాబట్టీ ధన జాఢ్యానికి లింగ వివక్ష లేదు. ఇది అన్ని తరగతులకీ సమానం గా వర్తిస్తుంది.
మధ్య తరగతినే తీసుకొందాం.టీ వీ ల లో అసభ్య దృశ్యాలు వచ్చినపుడు, “ఛీ.. ఛీ.. వీళ్ళకి అసలు విలువలే లేవు” అనుకోవటం చాలా సులువు. కానీ మన విలువలు వదిలి పెడితే మనకు డబ్బు వచ్చిపడుతున్నపుడు, మనం ఈ విలువల వలువలను వదిలి డబ్బు ఇచ్చిన కొత్త వలువలు వేసుకోవటానికి ఏమాత్రం సందేహించం.  ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో విప్పి చూపించిన విద్యా బాలన్ గారు మధ్య తరగతి నుంచే వచ్చారు.  ఈమె స్టూడియో లో చేసిన ఎక్స్పోజింగ్ చూడలేక ఈమె నాన్న గారు స్టూడియో బయటికి వచ్చి కారులో కూర్చొన్నారంట. ఆహా…! ఏమి మధ్య తరగతి విలువలూ ఎంత హిపోక్రసీ..? హిపోక్రసీ లేనిది ఒకటే ..అది డబ్బు..కాసుకు లోకం దాసోహం.. !

మొత్తానికి..తీసే వాళ్ళు తీస్తున్నారు, చేసే వాళ్ళు చేస్తున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు, మధ్య లో మనకెందుకు బాధ? ప్రతి విషయం లోనూ మంచిని చూడాలంటారు..కాబట్టీ ఈ విషయం లో కూడా అలా చూడటానికి ప్రయత్నిద్దాం! పోనీలే.., సిల్క్ స్మిత జీవితం ఏదైనా, ఈ సినిమా వలన బాలాజీ పిక్చర్స్ లో పని చేసే వారికి కొంత కాలం కడుపైనా నిండుతుంది అని సరి పెట్టుకొందాం!

నేరమూ శిక్షా, చట్టాల పరిధులూ పరిమితులూ

అప్పట్లో న్యాయస్థానం రాజీవ్ గాంధీ హంతకులకు శిక్షలు విధించింది. గుంటూరు  శేషేంద్ర శర్మ గారు,”భగవద్గీతను ఉటంకిస్తూ, భగవంతుని ప్రమేయం లేకుండా ఏమీ జరుగదు. రాజీవ్ హంతకులు కూడా భగవంతుని ప్రమేయం తోనే హత్య చేసి ఉంటారు. కాబట్టీ ఆ హత్య లో వారు దోషులు కారు. వారిని శిక్షించ కూడదు.”, అని వాదిస్తూ ఒక వ్యాసం రాశారు. దానికి ఆయనను చాలా మంది విమర్శించారు.
అప్పట్లో నాకు ఆయన వాదన నిజమే కదా! అనిపించింది. ఇప్పుడు ఆలోచిస్తే దానికి కౌంటర్ గా ఇలా వాదించవచ్చు అనిపిస్తుంది. “న్యాయస్థానాలు కూడా భగవంతుడు సృష్టించిన జీవ కోటి నుంచీ పుట్టిన మానవ సమాజం లోనివే. భగవంతుని ఇఛ్ఛానుసారమే ఆ వ్యవస్థ కూడా నేరస్థులను అదుపులో పెట్టటానికి శిక్షలను అమలు చేస్తాయి. కాబట్టీ, ఆశిక్షలు కూడా భగవంతునికి వ్యతిరేకం కాదు.”

భగవంతుని విషయాన్ని కొంచెం సేపు పక్కన పెట్టి ఆలోచిద్దాం.
న్యాయాన్ని మానవ సమాజం తన దీర్ఘకాలిక మనుగద కోసం, సమాజం లో ఒక క్రమ పధ్ధతీ శాంతీ ఉండటం కోసం ఏర్పాటు చేసుకొంది.  అయితే ఈ న్యాయస్థానాలు నైతికమైన విషయాలలో  తీర్పులు ఇస్తాయి. ఒక సమాజం లో అనేక నీతులు ఉంటాయి.  నీతి ఒక్కోసారి వ్యక్తిగతం గా ఉంటుంది. మనిషి మనిషి కీ మారుతుంటుంది. మరి న్యాయస్థానాలు అమలు పరిచే నీతి ఎవరి నీతి?  అది అధిక సంఖ్యాకుల నీతి. ఒక్కోసారి అది బలవంతుల నీతి. ఒక సమాజం “ఒక్కరు కంటే ఎక్కువ భార్యలను కలిగి ఉండటం” నేరం అంటుంది.అదే సమాజం లో పెరిగిన వ్యక్తికి ఈ నియమం తెలుసు కాబట్టీ, అతను ఎప్పుడైనా వివాహేతర సంబంధానికి దగ్గరగా వచ్చినపుడు, గిల్టీ గా ఫీలవుతాడు.అంటే ఇక్కడ, అతని అంతరాత్మ యొక్క నీతీ, సమాజం నీతీ, న్యాయపరమైన నీతీ ఒక్కటే.తరువాత అతనిని న్యాయస్థానం శిక్షించినా, అది సబబే అని అతనికి అనిపిస్తుంది.

ఇస్లామిక్ దేశాలలో ఒకరు కంటే ఎక్కువ భార్యలను కలిగి ఉండటం నేరం కాదు. అక్కడ పెరిగిన వ్యక్తి  ముగ్గురిని పెళ్ళి చేసుకొని కూడా గిల్టీ గా ఫీలవడు. అతనిని  అమెరికా చట్టం ప్రకారం శిక్షిస్తే, ఆ చట్టం చేసింది సరి అయినది అని అతను ఫీలవకపోవచ్చు. అలానే, ఆదిమ, పురాణ పురుషులను ఇప్పటి సమాజ, న్యాయ విలువల తో తూచటం సరి కాదు. శ్రీకృష్ణుడు తన అనేక భార్యల గురించి గిల్టీ గా ఫీలవాలనుకోవటం సరి కాదు కదా!
“మనం మన విలువల తోనే అంచనా వేస్తాం! ఇంకెవరి విలువల తోనో మనం ఎలా అంచనా వేస్తాం?”, అని ఎవరైనా అడగవచ్చు.
మన కాలానికీ ఆ కాలానికీ ఉమ్మడిగా కొన్ని సార్వజనీనమైన మానవ విలువలు ఉంటాయి. ఆ విలువల ప్రకారం వారిని అర్ధం చేసుకోవాలి.తన బాణం వేటుకి ఒంటరైన పక్షిని చూసి బోయవాడైన వాల్మీకి శోకించటం ఇలాంటి సార్వజనీనమైన మానవ విలువే!

 సమాజం లోని కట్టుబాట్లూ విలువలూ తగ్గుతూ ఉంటే జనాలు న్యాయస్థానాల దగ్గరికి పరుగులు తీయటం ఎక్కువౌతుంది. ఇంకా సమాజ విలువలు కొద్దో గొప్పో ఉన్న మన గ్రామాలలో జనాలు కోర్టులకి వెళ్ళటం తక్కువ గా కనపడుతుంది. అలానే మానవీయ విలువలు తగ్గిన సమాజం లో  కట్టుబాట్లు దురాచారాల రూపం లో బిగుసుకొనిపోతాయి. అప్పుడే మానవీయ విలువలు ఉన్న సంఘ సంస్కర్తలు సమాజ నీతిని ఎదిరించైనా ఒక మార్పు తీసుకొని రావటానికి ప్రయత్నిస్తారు. ఈ సంస్కర్తలు చేసే పనులు మొదట సమాజం దృష్టి లో న్యాయ వ్యవస్థ దృష్టిలో నేరాలౌతాయి (రాజా రామ మోహన రాయల వంటి వారు మొదట సమాజం ఆక్షేపణ కు గురైనవారే). కానీ వీరి విలువలు సమాజ, న్యాయ విలువల కన్నా ఉన్నతమైనవి. వారికి తమ మానవ విలువల లో ఉన్న నమ్మకం కూడా అచంచలమైనది.క్రమం గా సమాజమూ, న్యాయమూ తమ తప్పు తెలుసుకొని సంస్కర్తల విలువలను అంగీకరిస్తాయి. తరువాత వీరి విలువలే సమాజ, న్యాయ విలువలు గా మారుతాయి. కాలం చలన శీలమైనది. కాలచక్ర గమనం తో పాటు ఈ సంస్కర్తలు తెచ్చిన విలువలు కూడా బూజుపట్టి ప్రగతి నిరోధకాలై, మళ్ళీ కొత్త విలువలకు వేదిక తయారు చేస్తాయి. ఈ చక్ర భ్రమణం అనంతం.

ఒక్కోసారి మన వ్యక్తి గత విలువలు సమాజ విలువలకి విరుధ్ధం గా ఉండవచ్చు. అప్పుడు మనం సమాజ విలువలను అంగీకరించం. ఆ విలువలను ప్రశ్నిస్తాం. అలా అని మన వ్యక్తిగత విలువలు సమాజ విలువల కంటే ఉన్నతమైనవని చెప్పలేం.  ఈ సందర్భం లో సమాజ విలువలకి వ్యతిరేకం గా ఆలోచించటానికి  మనం గిల్టీ గా ఫీల్ కాము.  చలం తన పెద నాన్న కూతురిని పెళ్ళి చేసుకోవటానికి శృంగేరి పీఠాధిపతి అనుమతి కోరటం ఈ కోవలోకే వస్తుంది. 
మన వ్యక్తి గత విలువలు న్యాయస్థానాల విలువల తో విబేధించినా, మన విలువలు న్యాయస్థానాల విలువల కనా ఉన్నతమైనవి అయినా కూడా చివరికి మనం న్యాయస్థానాల విలువలనే అంగీకరించాలి. లేకపోతే న్యాయస్థానం మనలని శిక్షిస్తుంది. న్యాయస్థానాలు నిరంకుశమైనవి మరి. మనకి “లా” ఏమి చెబుతోందో తెలియక పోయినా, దానిని ఉల్లంఘించినట్లైతే అది మనని శిక్షిస్తుంది. చూడండి న్యాయస్థానాల అన్యాయం!ఈ మాట పై కి అంటే, మళ్ళీ మనని  contempt of court కింద శిక్షిస్తాయి :-( . ఎంచక్కా మన పెజాస్వామ్యం లో రాజకీయ నాయకులనైతే నోరారా తిట్టుకోవచ్చు. అప్పుడప్పుడూ చెంపదెబ్బలు కూడా కొట్టుకోవచ్చు :-) . (మనం వోట్ వేయం. వేసేవాళ్ళు డబ్బు తీసుకొని వేస్తారు. చివరికి తిట్టటానికి మాత్రం రా.నా. లను తిట్టుకోవచ్చు..ఎంచక్కా..)

  కానీ, ప్రతి వాడూ తన సొంత విలువలను ప్రతిపాదిస్తే ఇక న్యాయస్థానాల మాట వినేవాడెవడు? అందుకే న్యాయస్థానాలు నిరంకుశం గా ఉండక తప్పదనుకొంటా! అలానే, న్యాయస్థానాలు “లా” తెలియని వారిని క్షమించేటట్లైతే, నేరస్తులు “లా” తెలిసినా, అది ఏం చెబుతోందో తనకు తెలియదని శిక్ష తప్పించుకొంటారు కదా! అప్పుడు న్యాయవాదులతో పనే ఉండదు.”లా” తెలుసుకోని వారికి శిక్ష నుంచీ exemption ఇస్తే, అందరూ “లా” ని తెలుసుకోకుండా ఉండేందుకు పోటీ పడతారనుకొంటా! :-(

న్యాయ స్థానాల తీర్పులను ఫిర్యాదీలు విమర్శించటం మొదలు పెడితే వాటి తీర్పులను ఎవరూ నమ్మరు. తరువాత వాటి దగ్గరికి న్యాయం కోసం ఎవరూ వెళ్ళరు. న్యాయస్థానాన్ని విమర్శించటం అంటే, న్యాయస్థానం చెప్పే తీర్పుని అంగీకరించకపోవటం. అటువంటి వారు న్యాయం దొరుకుతుందన్న నమ్మకం తో మొదట న్యాయస్థానాన్ని ఎందుకు ఆశ్రయించారన్న ప్రశ్న వస్తుంది. తనకు అనుకూలం గా తీర్పు వస్తేనే తీర్పును అంగీకరిస్తాననటం సరి కాదు. తీర్పు తమకు అనుకూలం గా వచ్చినపుడు కూడా ఆ తీర్పును విమర్శించేవారు ఉండరు కదా? కాబట్టీ న్యాయస్థానాన్ని విమర్శించటానికి ముఖ్య కారణం తీర్పు వలన తమకు వచ్చిన నష్టం అయి ఉంటుంది. న్యాయస్థానం యొక్క పక్షపాతం అయ్యే అవకాశం తక్కువ. న్యాయస్థానాలు అన్నివేళల్లోనూ నిష్పాక్షికం గా వ్యవహరించవనుకోండి. వాటికి ఉండే biases, ప్రలోభాలు వాటికి ఉంటాయి.  అది వేరే విషయం.అప్పుడు పై న్యాయస్థానాలకు అప్పీలు చేసుకొంటూ సుప్రీం కోర్ట్ దాకా వెళ్ళవచ్చు. కానీ సుప్రీం కోర్ట్ మీద ఎవరికి అప్పీలు చేయాలి?  
క్రిమినల్ కేసుల్లో కేసు ఓడిపోయిన వ్యక్తి యొక్క న్యాయవాది అబధ్ధాలు చెప్పినట్లు కదా!(ఇదే లాజిక్ ప్రకారం  ఎగువ కోర్ట్ లో వేరే గా తీర్పు వస్తే దిగువ కోర్ట్ జడ్జ్ గారు అబధ్ధం ఆడినట్లా? ) మరి ఆ న్యాయవాదిని ఎందుకు న్యాయస్థానం శిక్షించదు? అబధ్ధాలు చెప్పటం అతని “వృత్తి” కాబట్టీ నా? లేక అతను చెప్పిన అబధ్ధాల వల్లే సత్యం వెలుగులోకి వచ్చిందనా? ఒక న్యాయవాదిని జైల్లో  పెడితే, తరువాత ఎవరూ కేసులు వాదించరనా?  

ఇప్పుడు ఊరి నిండా న్యాయవాదులు ఉన్నా వారికి ఫీజు చెల్లించలేని మామూలు జనానికి వారి వలన ఏమి లాభం. కాబట్టీ పరిస్థితి ఇప్పుడు కూడా న్యాయవాదులు లేనట్లు గానే ఉండి. న్యాయ వ్యవస్థ ఖరీదైనదవ్వటం వలన మెజారిటీ జనాలకు అది అందుబాటులో లేదు. అంటే జనసామాన్యానికి అది ఉన్నా లేనట్లే. అది వారి కోసం రూల్స్ పెట్టటం మినహా, వారికి అవసరమైనపుడు అందుబాటు లో ఉండదు.  దాని వలన వారికి మేలు జరుగదు.  డబ్బు ఖర్చు పెట్టగల వారికి మన నత్త నడక న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగే సమయమూ, ఓపికా ఉండవు.

న్యాయస్థానాలు పిచ్చి వారూ, మానసిక వ్యాధి గ్రస్తులూ చేసిన నేరాలకు వారిని ఎందుకు శిక్షించవు? వారి నేరాల వలన కూడా ఇతరులు ఇబ్బంది పడతారు కదా? న్యాయ స్థానాలు ముందు “నేరం చేసే ఉద్దేశాన్ని(మోటివ్) చూస్తాయి. ఆ ఉద్దేశం ఉన్న వారిని శిక్షించటం ద్వారా ఇక ముందు వారి నేరం చేయాలనే కోరిక ను తగ్గిస్తాయి. అప్పుడప్పుడూ మనిషి నేర ఇఛ్ఛ కు కారణాలూ పరిస్థితులను పరిగణన లోకి తీసుకొంటాయి . కానీ ఈ కారణాలూ పరిస్థితులూన్యాయస్థానాల పరిధిలోనివి కాదు.న్యాయ స్థానాలు ఆ పరిస్థితులను మార్చలేవు. వాటిని గురించిన కొన్ని పరిశీలనలను తమ తీర్పులో పొందుపరచటం మినహా ఏమీ చేయలేవు.  మొత్తానికి మనిషి నేర ఇఛ్ఛకి పరిస్థితులు కారణం అయినా, లేక దేవుడు ప్రసాదించిన స్వేఛ్ఛా సంకల్పం( ఫ్రీ విల్) కారణం అయినా, లేక పరోక్షం గా దేవుడే కారణం అయినా న్యాయస్థానాలు  నేరం చేసే ఉద్దేశం నిరూపించబడినపుడు అసలే శిక్ష వేయకుండా ఉండవు. ఇది మామూలు వ్యక్తుల విషయం.
ఇక పిచ్చివాళ్ళ, మానసిక వ్యాధి గ్రస్తుల విషయానికి వస్తే,..వారి ఉద్దేశాలకీ, వారి వ్యక్తిత్వానికీ మధ్య సంబంధం అసాధారణం గా, అస్పష్టం గా ఉంటుంది.  ఉదాహరణకి obsessive compulsive disorder ఉన్నవాళ్ళు సరిగ్గా తమ కోరిక కి విరుధ్ధం గా ప్రవర్తిస్తారు. వారికి అలా ప్రవర్తించే విషయం లో స్వేఛ్ఛ ఏమాత్రం ఉండదు. They are compelled to behave in that way. . అలానే schizophrenia ఉన్న వారు violent గా ప్రవర్తించే అవకాశం ఉంది. అలా ప్రవర్తించకుండా నిగ్రహించుకొనే సంకల్పం వారి మెదడులోకానీ, శరీరం లో కానీ ఉండదు. కాబట్టీ వారి ప్రవర్తనకు నేరం వారి రోగానిది. కుంటి వారి వైకల్యం పైకి కనపడుతుంది. కానీ వీరి వైకల్యం పైకి కనపడదు.కోర్ట్లు , అలాంటి వారిని శిక్షించటం ద్వారా, వారు తరువాత నేరాలను చేయటాన్ని తగ్గించటం కుదరదు.వ్యాధి ఉన్నంత వరకూ వారు నేరాలు చేయటానికే అవకాశం ఉంటుంది.  అందుకే వారిని ఏ శరణాలయాలలోనో చేర్చమని న్యాయస్థానాలు సలహా ఇస్తాయి.

అవినీతిపై మంచుపల్లకీ గారి టపా-కొన్ని ఆలోచనలు

రాత్రి తెలుగు బ్లాగ్-సాగరం లో పడి ఈదుతూ ఉంటే మంచు పల్లకీ గారు అవినీతి గురించి రాసిన టపా కనపడింది. ఆ టపా లో ఆయన “మనమందరం మన పరిధులలో అవినీతిపరులమేనంటూ, ప్రక్షాళణ మన నుంచీ మొదలు కావాలని చెప్పారు.”
దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నా బుర్రలో ఈ ఆలోచనలు కూడా వచ్చాయి…
అవినీతీ, పర్యావరణం మొదలైనవి మానవాళి మొత్తం ముందున్న సమస్యలు. వీటికి ఒక పౌరుడి గా మనవంతు బాధ్యత తప్పనిసరి గా ఉంటుంది. అయితే సమాజం లోని అందరికీ సమాన బాధ్యత ఉంటుందా?
ఒక వ్యవస్థ లో మనిషి అధికారమూ హోదా పెరిగితే అదే స్థాయి లో బాధ్యతలు పెరగాలి. మన రాజకీయ నాయకులకు మనకంటే ఎక్కువ హోదా, అధికారం ఉంటాయి. కాబట్టీ వారికి అదే స్థాయి లో ఈ సమస్యల పట్ల మనకంటే బాధ్యతకూడా ఎక్కువ గా ఉండాలి. కానీ, వారి బాధ్యత వారు నిర్వర్తిస్తున్నారా? చాలా వరకూ నిర్వర్తించకపోవటమే కాక, ఒక్కోసారి అసలు సమస్యనే వారు మొదలుపెడుతున్నారు.
మన ఆఫీస్ లో మనకు మన హోదాలో అనేక బాధ్యతలు ఉంటాయి. వాటిని నిర్వర్తించకపోతే మనకు అప్రైజల్ టైం లో మూడుతుందని తెలుసు. కాబట్టీ, మనం మన బాధ్యతలను నిర్వర్తించటానికే మొగ్గు చూపుతాం…మరి రాజకీయ నాయకుల అప్రైజల్ ఎవరు చేస్తారు? మనకున్న ప్రజాస్వామ్య వ్యవస్థ లో ప్రజలే ప్రభువులు. రాజకీయ నాయకుల అప్రైజల్ చేయటమే కాకుండా వారిని అపాయింట్ చేసేది కూడా ప్రజలే! కాబట్టీ మన వ్యవస్థ లో ప్రజలకు నాయకులను ఎన్నుకొనే హక్కుతో పాటు వారు వారి బాధ్యతలను సరిగా నిర్వర్తించేటట్లు చూసే బాధ్యత కూడా ఉంటుంది. రాజకీయ నాయకులు అవినీతి చేస్తే వారిని తరువాతి ఎన్నికలలో శిక్షించాల్సిన బాధ్యత ప్రజలదే! అలానే అవినీతి చేయని నాయకుడిని గెలిపించాల్సిన బాధ్యత కూడా ప్రజలదే!(ప్రజాస్వామ్యం లో ప్రజలకి బాధ్యతలు చాలా ఎక్కువ మరి! అధికారం ఉనంచోట ఎక్కదైనా బాధ్యతలూ కూడా ఎక్కువగానే ఉంటాయి కదా! )
కానీ ఈ బాధ్యత ఏ ఒక్కరిదో కాదు. ప్రజలందరి సమిష్టి బాధ్యత.
మనం మన వ్యక్తి గత పరిధి లో అవినీతి పనులు తగ్గించుకొనే నిర్ణయం తో పాటు, మన సమిష్టి బాధ్యత అయిన వోటు హక్కుని వ్యక్తిగత పరిధిలో విజ్ఞత తో ఉపయోగించుకొనే నిర్ణయం కూడా తీసుకోవాలి. వోటు వేయటం ఒక అధికారమూ బాధ్యతా కూడాను. వోటు హక్కుని సరిగా వినియోగించుకోవటానికి సరిపడా రాజకీయ జ్ఞానం సంపాదించటం, వీలయితే మన పరిధిలో నలుగురిని దీనిని గురించి చైతన్య పరచటం కూడా మన బాధ్యతే! ఉన్న నాయకులతో మనకు తృప్తిలేక పోతే, మన వ్యక్తిగత జీవితాలు ఆవిరికానంతవరకూ, రాజకీయ ప్రత్యామ్నాయాల కోసం కూడా ప్రయత్నించాలి. అందరూ అరవింద్ కేజ్రీవాల్ లు కాక పోయినా కిరణ్ బేడీ స్థాయి లోనైనా కొంత మన వంతు బాధ్యత నిర్వర్తించాలి.

ఈ ఆలోచనల తరువాత నేను ఇంతకు ముందు రాజకీయ నాయకులను సమర్ధిస్తూ రాసిన టపా లోని నా అభిప్రాయాలను కొంతవరకూ సవరించుకోవలసిన అవసరం కనపడింది.

ఈ నాటి ఆర్ధిక వ్యవస్థ లో కుల వ్యవస్థ వలన లాభం

కుల వ్యవస్థ ఆచరణ లోని లోపాలూ నష్టాలగురించి  అభ్యుదయ వాదులను కానీ, దళిత వాదులను కానీ అడిగితే వారు దానిలోని వివక్ష గురించీ, మానవత్వ లేమి గురించీ చెబుతారు. వారు చెప్పేవి చాలావరకూ సమంజసమైనవే కూడా! కానీ, ఈ నాటి మన ఆర్ధిక వ్యవస్థను చూస్తుంటే నాకు కుల వ్యవస్థ లో ఒక మంచి లక్షణం కూడా కనిపించింది.
ఈ రోజుల్లో సమయాన్ని బట్టి  మొదట ఏదో ఒక ఉద్యోగానికి మంచి గిరాకీ ఉంటుంది. ఉదాహరణ కు “ఐ టీ”,లేక పోతే “ఐ టీ లో SAP”. ఎందుకంటే ఆ ఉద్యోగం లో డబ్బులు బాగా వస్తాయి. ఇక దానితో సమాజం లోని అన్ని వర్గాలవారూ, అన్ని చదువుల వారూ పోలో మని ఐటీ ఉద్యోగాల కోసం ఎగబడతారు. డిమాండ్ సప్లై సూత్రం ప్రకారం, ఆ ఉద్యోగాలకోసం వచ్చేవారి సంఖ్య ఎక్కువ అవటం తో సప్లై ఎక్కువ అవుతుంది. సప్లై ఎక్కువ అయిన వస్తువు ధర (ఉద్యోగి జీతం) తగ్గిపోతుంది.లేక పోతే ధర కొన్నేళ్ళ పాటు నిలకడ గా ఉంటుంది. ద్రవ్యోల్బణం ని లెక్క లోకి తీసుకొంటే ఇది వారి జీతం తగ్గటం తో సమానం.  ఆ విధం గా ఆయా ఉద్యోగాలలోని జీతాలు తగ్గు ముఖం పడతాయి. ఉద్యోగాలు పరిమిత సంఖ్య లో ఉంటాయి. కానీ అభ్యర్ధులు అపరిమితం గా ఉంటారు. అంటే కొందరు అభ్యర్ధులకు ఎప్పటికీ ఉద్యోగాలు రావు.  కానీ ఇతర రంగాలను వదిలి పెట్టి  ఈ రంగానికి వచ్చిన ఆ అభ్యర్ధులు దీపం చుట్టూ పురుగుల్లా ఈ ఉద్యోగాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వ్యక్తిత్వ వికాసం అంటూ కోచింగ్ సెంటర్ లు పుట్టుకు వస్తాయి అందరూ వాటిలో చేరి గొప్ప వ్యక్తిత్వం సాధిస్తే, ఎవరికీ మిగిలిన వారి మీద ఆధిక్యత ఉండదు. మళ్ళీ అందరూ సమానమే! కానీ ఉద్యోగాల సంఖ్య పరిమితం. ఈ విధం గా నిరుద్యోగం పెరిగిపోతుంది. మిగిలిన రంగాలు విద్యా, వైద్యం వంటివి, నిర్లక్ష్యానికి గురవుతాయి. మళ్ళీ కొంత కాలానికి ఆ రంగాలలో జనాల కొరత కారణం గా మంచి రోజులు వస్తాయి. ఈ మొత్తం సైకిల్ మళ్ళీ ఆయా రంగాలలో రిపీట్ అవుతుంది.ఈ మధ్య నిర్మాణ రంగం లో సివిల్ ఇంజనీర్లకి గిరాకీ పెరిగినట్లు.

వ్యవసాయం వంటి రంగాల నుంచీ ఐటీ వంటి ఉద్యోగాలకు వచ్చిన వారు ఉంటారు. కొన్నేళ్ళకి వ్యవసాయం చేసే వారు ఎవరూ లేక మళ్ళీ ఆ రంగం గిట్టుబాటు కావటం మొదలౌతుంది. కానీ, అప్పటికి కార్పొరేట్లు భూములన్నీ కొనేసి ఆ లాభాన్ని తన్నుకొని పోతాయి.
డబ్బుకోసం పెట్టే ఈ పరుగులో మొత్తానికి నష్టపోయేది మధ్యతరగతి కుటుంబ రావులే!
కుల వ్యవస్థ ఉన్నపుడు, సమాజం లోని వివిధ కులాల వారు వంశపారంపర్యం గా తమ కుల వృత్తినే చేయ వలసి వచ్చేది. డిమాండ్ ని బట్టీ, డబ్బుని బట్టీ వేరే రంగానికి పరుగులు తీసే అవకాశం ఉండేది కాదు. కాబట్టీ సమాజానికి అవసరమైన అన్ని రంగాల్లోనూ నైపుణ్యాల కొరత, (లేక అధికమైన సప్లై) ఉండేది కాదు. డిమాండ్ కీ సప్లై కీ మధ్య సమతూకం ఉండేది.
అలానే, ఒకప్పుడు అమలు లో ఉన్న వస్తుమార్పిడి విధానం లో కూడా, డబ్బులా వస్తువులను అపరిమితం గా కూడబెట్టటానికి అవకాశం ఉండేది కాదు. కొంతవరకూ భూమిని కూడబెట్టే వారు. కానీ భూమిని ఎంతవరకూ కూడబెట్టగలరు?ఎంతవరకూ నిలువ బెట్టవచ్చు? డబ్బు ని అంతులేకుండా కూడబెట్టవచ్చు.దాయవచ్చు. నిలువబెట్టవచ్చు. డబ్బు మొదలయిన నాటి నుంచీ అసమానతలు విపరీతం గా పెరిగిపోయాయి.

ఈ ఆధునికకాలం లో కొత్త కులాలు ఉంటే బాగుంటుందనిపిస్తుంది. సమాజానికి అవసరమైన అన్ని వృత్తులూ..ఉదాహరణ కి ఇంజినీర్ల కులం, వైద్యుల కులం, పోలీసుల కులం, న్యాయవాదుల కులం ఇలా..
ఏ కులమూ ఇతర కులాల కంటే ఎక్కువ కాదు. అలానే అందరి జీతాలూ, ఆర్ధిక వ్యవస్థ లోని డిమాండ్ మీద ఆధార పడకుండా, సమానమైన స్కేళ్ళలో ఉంటే బాగుంటుంది. ఒక కులం లోకి ప్రవేశించాలంటే, ఆ వృత్తి పై ఉన్న ఆసక్తే (వృత్తిలోని డబ్బు పైన కాదు) అర్హత కావాలి. ఎలా ఉందంటారు నా కుల తత్వం..?

కొన్ని కులాల ప్రాధమిక విలువలు..

నేను “ఒక అమెరికా వాడి రైలు బండి ప్రయాణం” కథ రాసిన తరువాత నాలో update అయిన అవగాహన ఇది.
మానవ సమూహాలన్నిటికీ ఉన్నట్లే, కులాలకు కూడా ప్రాధమిక విలువలు(primary values) ఉంటాయి. ఐరోపా ఖండం లో యూదులను “చాలా ప్రతిభ కల వారి గానూ”,” జిత్తుల మారి వారి” గానూ చూసేవారు. ఇది ఒక మూస గుద్దుడు వ్యవహారం (stereo type) కావచ్చు. కానీ ఈ మూస లో కూడా కొంత సత్యం ఉంటుంది. నిప్పులేనిదే పొగ రాదని అంటారు కదా!
మానవ సమూహాలనంటికీ ఉన్నట్లు గానే, కులాలకీ ప్రాధమిక విలువలు ఉంటాయి. ఒక కులానికి సంబంధించిన ప్రాధమిక విలువ  ఆ కులం లోని ప్రసిధ్ధులూ, పెద్దల ప్రవర్తన పై ఆధారపడి ఉంటుంది. ఈ విలువలు ఆ కులం వారి వృత్తి మీద కూడా ఆధాపడి ఉంటాయి. ఆయా కులాలకు మిగిలిన విలువలు ఉండవని కాదు. వారి మిగిలిన విలువలనన్నిటినీ కూడా చివరికి ఈ ప్రాధమిక విలువలలోకి convert చేయవలసిందే! వారికి మిగిలిన విలువలని వారి ప్రాధమిక విలువలోకి మార్చి చెప్తేనే వారు దానిని మెరుగ్గా appreciate చేయగలరు.ఒక కులం లోని అందరు వ్యక్తులకీ ఈ ప్రాధమిక విలువలు వర్తించక పోవచ్చు.

ఈ ప్రాధమిక విలువలు ఆయా కులాలలో కూడా స్థలాన్ని బట్టీ , కాలాన్ని బట్టీ మారుతూ ఉంటాయి. అలానే ఒకే కులం లోని దిగువ తరగతి వారి విలువలూ , ఎగువ తరగతి వారి విలువలూ ఒకే విధం గా ఉండవు.

మనం మధ్య తరగతిని మాత్రమే పరిశీలిద్దాం. మీరు పెళ్ళి కుమారుడి తరపున ఒక పెళ్ళి సంబంధం మాట్లాడటానికి వెళ్ళారనుకోండి. మీ కులం ఏ కులం వ్యక్తి తో మాట్లాడేటపుడు ఆ కులం గా ఊహించుకోండి.

ఒక బ్రాహ్మణ కులం కి చెందిన వ్యక్తి తో మీరు “పలానా వాళ్ళ అబ్బాయి కి పది లక్షల సంపాదన ఉందట ” అన్నారనుకోండి, అప్పుడు అతను, “అలానా! ఆ అబ్బాయి ఏమి చదివాడు? ఏ ఉద్యోగం చేస్తున్నాడు” అని అడిగే అవకాశం ఉంది.    దీని వలన మనకు ఈ కులం ప్రాధమిక విలువ “విద్య, ఉద్యోగం” అని అర్ధమౌతుంది.
ఒక కమ్మ కులం కి చెందిన వ్యక్తి తో, “పలాన కుర్రాడికి పలానా పెద్ద qualification ఉందట”, అంటే,  “మంచిది, ఎంత సంపాదిస్తాడంటాడు?” అనే ప్రశ్న తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ప్రాధమిక విలువ డబ్బు అని చెప్పనక్కరలేదు కదా!

అలానే ఒక రెడ్డి గారి ముందు, కుర్రవాడి డబ్బు ప్రస్తావన తెస్తే, “అతని హోదా (rank) గురించి” అడిగే అవకాశం ఉంది. ఇక్కడ ప్రాధమిక విలువ సమాజం లోని rank.

గోదావరి జిల్లాల నాయుడు గారు కట్నం గురించిమాట్లాడేటపుడు, “ఎన్ని ఎకరాల కొబ్బరి తోట లేక వరి పొలం?”, అని మాట్లాడే అవకాశం ఉంది. ప్రాధమిక విలువ “భూమి”.

ఒక S.C వర్గానికి చెందిన వ్యక్తి పెళ్ళి కుమారుడి చుట్టాల లో ఎవరు పెద్ద ప్రభుత్వ అధికారులో తెలుసుకొని సంతోషించే చాన్స్ ఉంది. ప్రాధమిక విలువ,”వ్యవస్థీకృత అధికారం”

వైశ్యులు, “కుర్రవాడు నేర్పుగా జాగ్రత్త గా ఉండి, పొదుపు స్వభావం కలవాడా?” అనే విషయం చూడవచ్చు. కుర్ర వాడు ఉద్యోగి అయితే, అతనికి ఎంత మిగులుతుంది అని చూడవచ్చు. “నికర లాభం”, ప్రాధమిక విలువ.

ఈ ప్రాధమిక విలువలు అన్ని కాలాలలోనూ ఒకే విధం గా ఉండవు. ఒకప్పుడు “పెద్ద ప్రభుత్వోద్యోగులై ఉండటం” అనేది, బ్రాహ్మణ వర్గం లో ఒక విలువ. నేడు ఆ విలువ SC వర్గానికి బదిలీ అవుతున్నట్లున్నది.

ఈ ప్రాధమిక విలువల లో ఏ కులం విలువా ఇతర కులాల విలువల కంటే గొప్పదీ కాదు, తక్కువా కాదు. కాక పోతే ఒక వర్గానికి చెందిన విలువ ఇంకొక వర్గానికి నచ్చదు. ఏ వర్గానికి చెందిన విలువ ఆ వర్గానికి సరైనది గా కనిపించవచ్చు. ఇతర వర్గాలపై మన అయిష్టాన్ని వ్యక్తం చేయటానికి ఆ వర్గం విలువలను తప్పుపడతాం.మన కులం గురించి ఆత్మ విమర్శ చేసుకొనేటపుడు, మన కులపు ప్రాధమిక విలువ చెడ్డది గా కనపడటం కూడా జరుగుతుందనుకోండి!ఈ ఆత్మ విమర్శ చేసుకొనేటపుడు, వెరే కులాలలో మనం నిరసించిన విలువని, మన వర్గం మాత్రం సాధించాలని వాదించటం కూడా కద్దు.

ఇంతకు ముందు ఓ టపా లో చెప్పినట్లు, పైన చెప్పినవి “కేవలం నా అభిప్రాయాలే“, మీ అభిప్రాయాలు భిన్నం గా ఉండవచ్చు.

చదువుల వలన సృజనాత్మకత తగ్గుతుందా?

ఈ మధ్య పత్రికలలో ఒక విషయాన్ని పదే పదే చెప్తున్నారు….. బిల్ గేట్స్ చదువుకోలేదు, న్యూటన్, ఎడిసన్ వంటి శాస్త్రవేత్తలకు చదువు (formal education) లేదు. వికీ లీక్స్ సృష్టికర్త అసాంజ్ కి కూడా చదువు లేదు. కాబట్టీ చదువులు చదవని వారి సృజనాత్మకత ఎక్కువ…. ఈ దృష్టాంతాలను చూపించి మామూలు చదువుల ఉపయోగాన్నీ, ఉత్పాదకతనీ కొందరు పాత్రికేయులు ప్రశ్నిస్తున్నారు. సంచలనాల కోసం చూసే మాధ్యమాలకి దీనివలన కొంచెం మేత దొరక వచ్చు గానీ, దీనిని ఇంకొంచెం దగ్గర గా మనం పరిశీలిద్దాం..

మనలో చాలా మంది పల్లెల లో మూలాలు ఉన్న వారే. మన తో పాటు చిన్నప్పటి స్నేహితులలో కొంత మంది బడి ఎగ్గొట్టి పొలాల వెంబడీ, కాలువలూ చెట్లూ పుట్టలూ పట్టుకొని తిరిగిన వారు ఉంటారు. వారు తరువాత జీవితం లో సృజనాత్మక ఆవిష్కరణలు ఏమాత్రం చేస్తారో మనం ఎరిగిన విషయమే.వారు ఏ గొడ్ల కాపరులు గానో మారుతారు. కాబట్టీ మామూలు చదువులు చదవని వారంతా సృజనాత్మకులైపోరు. చదువులు చదవనంత మాత్రాన సృజనాత్మకత ఉట్టిపడదు. వారు వ్యవస్థీకృత విద్య వలన ప్రభావితం కాక పోయి ఉండవచ్చు. అయినా అందులో సృజనాత్మకత ఏమీ లేదు. చదువుకొంటే కనీసం వారు మామూలు ఉద్యోగాలు అయినా చేసుకొనేవారు.
ఒక ప్రతిభావంతుడైన వ్యక్తి, చదువు లేకుండా పరిశోధన మొదలు పెడితే, ఈ రోజులలో “గురుత్వాకర్షణ సిధ్ధాంతాన్ని”, మళ్ళీ కనిపెడతాడు. ఎందుకంటే, చదువుకోక పోవటం వలన, అతనికి  ఆ సిధ్ధాంతం ఇప్పటికే కనిపట్టబడింది అనే విషయం తెలియదు. చదువు వలన ఇప్పటికే సమాధానం దొరికిన సమస్యల గురించి తెలుస్తుంది.
వ్యవస్థీకృత విద్య వలన మనుషుల ఆలోచనా ధోరణులు (thought patterns ) ప్రభావితం(condition) అయ్యే మాట నిజమే! ఏదైనా ఒక కొత్త విషయాన్ని అన్వేషిస్తూ పరిశోధన జరిగినపుడు ,అనేకమైన పరిష్కార మార్గాలను పరిగణించాలి.  అవి ఇప్పటికే ప్రయత్నించబడనివి అయి ఉండాలి. కానీ ఈ పరిష్కార మార్గాలలో ఇప్పటికే శాస్త్రపరిజ్ఞానం కొట్టి పారేసినవీ, పని చేయనివీ చాలావరకూ ఉంటాయి.కొన్ని పరిష్కారాలు అప్పటికే వ్యవస్తీకృత విద్యకు తెలిసినవై ఉంటాయి.  కొన్ని మాత్రం పని చేసే సరి కొత్త పరిష్కారాలు ఉంటాయి. ఈ కొన్ని పరిష్కారాల విషయం లో వ్యవస్థీకృత విద్య అర్జించిన వారి అలోచనా ధోరణి, అప్పటికే ఉన్న వ్యవస్థ (అప్పటికే ఉన్న పరిష్కారాల) వలన ప్రభావితమై ఉంటుంది. దరిమిలా, వారి ఆలోచనలకు ఈ కొత్త విషయాలలో ఉండే స్వేఛ్ఛ (degree of freedom) తక్కువ గా ఉండే అవకాశం ఉంటుంది.  వారు ఈ ప్రభావాల నుండీ బయట పడి(unlearning), స్వేఛ్ఛ గా ఆలోచించటం వీరి ముందున్న ఒక సవాల్.  అయితే, రిచర్డ్ ఫేన్మాన్ వంటి చాలా మంది శాస్త్ర వేత్తలు వివిధ రంగాలలో పని చేయటం ద్వారా ఈ పరిమితిని అధిగమించటానికి ప్రయత్నించారు. దీని వలన ఒక రంగం లోఉన్న పరిభావన (concept) ను వేరొక రంగం లో అన్వయించటానికి కుదురుతుంది.

ఇక చదువు లేని కొందరి లో, వారి ఆలోచనా విధానం వ్యవస్థీకృత విద్య వలన ప్రభావితం కాకపోవటం వలన, కొత్త పరిష్కారాలను అన్వేషించటానికి వారికి ఉండే స్వేఛ్ఛ పెరుగుతుందనటం లో సందేహంలేదు. (రాజు గారికి బట్టలు లేవని చిన్న పిల్ల వాడు చెప్పినట్లు).

మనం చిన్న పిల్లల ఆలోచనలలో ఈ వైవిధ్యాన్ని చూడవచ్చు. ఉదాహరణ కి ఒక మొబైల్ ఫోన్ ఒక చిన్న పిల్లవాడికిస్తే వాడు దానిలో మనం అన్వేషించని అనేక విషయాలను ప్రయత్నించి చివరికి దానిని మనకి అర్ధం కాని ఏదో ఒక స్థితికి తీసుకొని వెళ్తాడు. ఈ వైవిధ్యమైన ఆలోచనలలో అన్నీ పనికి రాకపోయినా, కొన్నిటివలన ఉపయోగం ఉంటుంది.అలానే, చదువుకోని వారి కి కూడా ఇటువంటి స్వేఛ్ఛ ఉంటుంది. కానీ అన్ని సమయాలలోనూ ఇటువంటి స్వేఛ్ఛ వలన ఉపయోగం ఉండకపోవచ్చు. ఉపయోగం ఉండే స్థాయిలో ఫలితాలను ఇవ్వగల మేధావులు చాలా అరుదు గానే ఉంటారు.
చదువు వలన ఆలోచనల స్వేఛ్ఛ కొంతవరకూ తగ్గినా, ఆలోచనలకు పదును పెట్టే అనేక పరికరాలు(tools) అప్పటికే ఉన్న సిధ్ధాంతాల, ఆవిష్కరణల రూపం లో దొరుకుతాయి. కాబట్టీ, పిల్లలను చదువులకు  దూరం గా ఉంచటం కాక, చదువుకుంటూనే వారు తమ open mindedness ని కోల్పోకుండా ఉంచటం అనేది ఒక చాలెంజ్.   వ్యవస్థీకృత విద్య పొందిన అనేక మంది కూడా సృజనాత్మక ఆవిష్కరణలు ఎన్నో చేశారు కదా!

భావోద్వేగాలు ఎన్నిరకాలు?

భావోద్వేగాల గురించి నెట్ లో వెతుకుతూ ఉంటే, నాకు కనపడిన ఒక interesting document(English) కింద నుంచీ దించుకోండి. .
నేను శోధించిన ప్రశ్న: “భావోద్వేగాలు మన జ్ఞాపకాల(memory)లో స్టోర్ అవుతాయా?”
సమాధానం: కావు. భావోద్వేగాలు వర్తమానం లోని సంఘటనలకి మన మనస్సూ శరీరం చేసే ప్రతిక్రియ మాత్రమే. అయితే భావోద్వేగాలకు సంబంధించిన సమాచారం (information) మాత్రం మన జ్ఞాపకాలలో నిక్షిప్తం(store) అవుతుంది.  అంటే అది ఏ రకమైన భావోద్వేగం..కోపమా, భయమా, సిగ్గా మొదలైన గుర్తులు (symbols) మాత్రం మన మెమరీ లో ఉంటాయి. భావోద్వేగాలు కూడా మన జ్ఞాపకం లో భాగమైతే అప్పుడు జరిగిన సంఘటనల గురించి మన మానసిక అనుభవం(జ్ఞాపకం తెచ్చుకోవటం) “వీడియో ప్లే బ్యాక్” లా ఉంటుంది. అంటే ఆటే సమాచారం మిస్ కాదు. మళ్ళీ మనకు పాత అనుభవం మానసికం గా యధాతధం గా అవుతుంది.

theoriginofemotions

ఇతరుల అభిప్రాయాలను ఎందుకు గౌరవించాలి?

తెలుగు అంతర్జాలం లో తెలంగాణా, స్త్రీ వాదం , కులం వంటి అనేక విషయాల మీద వాదోప వాదాలూ, చర్చలూ జరుగుతుంటాయి. ఈ చర్చలలో తరచూ అభిప్రాయాలే వాస్తవాలు గా చెలామణి అవుతున్నట్లని పిస్తుంది. ఎదుటి వారి అబిప్రాయాలను గౌరవించేవారి సంఖ్య చాలా తక్కువ.
స్టాటిస్టిక్స్ లో sampling theory అని ఒక సిధ్ధాంతం ఉంది. దానిని ఇక్కడ వివరిస్తాను కొంచెం ఓపిక పట్టండి.
ఒక పెద్ద బుట్టలో నాలుగు రంగుల గోళీలు , ఒక్కో రంగు గోళీలూ 1000 సంఖ్యలో ఉన్నాయనుకొందాం.బుట్టలోని ఈ అన్ని రంగుల గోళీలనూ కలగాపులగం గా కలిపేశామనుకొందాం. ఈ బుట్ట మన సమాజం వాస్తవం గా ఉన్న స్థితిని ప్రతిబింబిస్తుంది.గోళీల రంగులు సమాజం యొక్క లక్షణాలైన సమానతా, అధికారం, అభివృధ్ధీ మొదలైన లక్షణాలను ప్రతిబింబిస్తాయనుకొందాం.
మనం ఈ బుట్టలోంచీ ఒక గుప్పెడు గోళీలు తీస్తే ఆ గోళీలలో ఎరుపు రంగు గోళీలు ఎక్కువ ఉండవచ్చు. దీనిని మనం ఒక biased sample అంటాం.బుట్టలో అన్ని రంగుల గోళీలూ సమాన సంఖ్యలో ఉన్నప్పటికినీ మనం తీసిన గోళీలలో ఎరుపు రంగు గోళీలు ఎక్కువ ఉన్నాయి. మన గుప్పెడు గోళీలూ మన వ్యక్తి గత అనుభవాన్ని సూచిస్తాయి.అయితే ఈ అనుభవం లో కూడా patterns ఉంటాయి.నల్ల గోళీల బరువు మిగిలిన రంగు గోలీల బరువు కన్నా ఎక్కువ అనుకొందాం.  బుట్ట కిందికి నల్ల గోళీలు ఎక్కువ చేరుతాయి. తరువాత అక్కడ (బుట్ట అడుగు) నుంచీ తీసిన sample లో నల్ల గోళీలే ఎక్కువ ఉంటాయి. ఉదాహరణ కి, ఒక గ్రామీణ దళితుడి అనుభవం లో ‘కుల వివక్ష’ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మన పక్క వ్యక్తిని ఇంకో గుప్పెడు గోళీలు తీయమంటే అతని గుప్పెటకి తెలుపు రంగు గోళీలు ఎక్కువ రావచ్చు. అలానే ఒక పెద్ద గిన్నె తో గోళీలను తీసినట్లైతే ఆ గిన్నెలోని వివిధ రంగుల గోళీల సంఖ్య మధ్య అంతరం తగ్గుతుంది. అంటే sample పెద్దదయిన కొద్దీ అది వాస్తవ పరిస్థితికి దగ్గరవుతుందన్నమాట.  అంటే ఒక విషయం లో మన వ్యక్తిగత అనుభవం పెరిగే కొద్దీ, ఆ విషయం పై మనం వాస్తవానికి చేరువవుతున్నామన్నమాట.అయితే, ఒక attitude తొ మొదలుపెట్టి దానికి విరుధ్ధమైన విషయాలను తమ మది లోకి రాకుండా తిరస్కరిచే వారు, అ విరుధ్ధమైన విషయాలలో ముందుకు సాగరు. ఆ విషయాలలో వారికి అనుభవం ఉన్నా , ఆ విషయాలలో వారు ఎదగరు.

గుప్పెట తో గోళీల sample తీసెటపుడు, మనం తెలివిని ఉపయోగించనవసరం లేదు. కానీ అభిప్రాయాలను ఏర్పరచుకోవటానికి మన అనుభవాలను తెలివితో విశ్లేషించి more objective అభిప్రాయాలను ఏర్పరచుకోవచ్చు.

ఇక అంతర్జాల చర్చల విషయానికి వస్తే, అనేక మంది రాగద్వేషాలతో చర్చలు చేస్తుంటారు. విషయాన్ని అన్వేషిద్దాం అని కాక తమ వాదనే గెలవాలి అని వాదిస్తుంటారు.. ఒక విషయం పై ఎవరి అనుభవం ఎంతో మనకు తెలియదు. కొంతమంది wishful tinking తొ మాట్లాడుతారు.ఆదర్శాల , సిధ్ధాంతాల రంగు కళ్ళజోడులు పెట్టుకొని మాట్లాడుతారు.అనామకం గా దుర్బుధ్ధి తో దుర్భాషలాడతారు,వారి భౌతిక మనుగడ కి ముప్పు లేదు కా బట్టీ! వారి వారి వ్యక్తిత్వం, ఇష్టాఇష్టాలు బట్టి మాట్లాడుతారు.ఇంకొందరు వారికున్న ఇతరేతర లాభ నష్టాలను(vested interests) బట్టి, చర్చలలో వాదాలు లేవ నెత్తుతారు. ఒక మనిషికున్న ఇటువంటి బలహీనతలన్నిటినీ పక్కన పెడితే, మన అభిప్రాయం అనేది మన అనుభవం అనే biased sample నుండీ పుడుతుంది. అలానే ఎదుటి వారి అభిప్రాయాలు కూడా biased అయి ఉంటాయి. ఈ అభిప్రాయాలు వాస్తవాన్ని ఎంతవరకూ ప్రతిబింబిస్తాయి అనేదానికి ఒక కొలబద్ద లేదు.

కాబట్టీ, ఒక విషయం లో మన అభిప్రాయం ఎంత కరక్టో, ఎదుటి వారి అభిప్రాయం కూడా అంతే కరక్ట్.
శాస్త్రీయ పరిశోధనలు మాత్రమే కొంత వాస్తవానికి దగ్గరగా రాగలవు. శాస్త్రం కూడా తన పరిశోధనల ఫలితాలలో కొంత bias ను అంగీకరిస్తుంది. అది వేరే విషయం.
అందుకే మనకు మన అభిప్రాయం మాత్రమే కరక్ట్ అనిపించినా, అది కేవలం మన “అభిప్రాయం” మాత్రమే అని గుర్తెరిగి, ఇతరుల అభిప్రాయాన్ని కూడా గౌరవించటం మంచిది.
ఈ పైన చెప్పింది నా అభిప్రాయం మాత్రమే :-) . మరి మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండేం..?

సమాజ సేవా? కుటుంబ సేవా? స్వార్ధమా? సమానత్వమా?

మన లో చాలా మందికి సమాజానికి మంచి చేయాలన్న  మంచి ఉద్దేశం ఉంటుంది. కానీ మనకు అనేక పరిమితులు ఉంటాయి. ఒక పారిశ్రామిక వేత్త,  “ముందు నన్ను ఓ 500 కోట్లు సంపాదించనియ్, తరువాత ఇక సమాజ సేవ లో కి దూకేస్తాను,” అంటాడు.
ఇంకొక రాజకీయుడు “పలానా పదవి వస్తే, తరువాత నా శేష జీవితాన్ని సమాజ సేవ లో ప్రశాంతం గా గడుపుతాను” అంటాడు,
ఇంకో మధ్య తరగతి జీవి, “నాకు ఓ భద్రమైన ఉద్యోగం కుదిరితే, నా ఫ్రీ టైం అంతా సమాజ సేవ కే ” అనవచ్చు.
పైన చెప్పిన అన్ని కేసుల్లోనూ సేవ చేయాలనే కోరికకీ వ్యక్తిగత లక్ష్యాలకీ ఉన్న స్పర్ధ ని గమనించ వచ్చు.
కాబట్టీ సమాజ సేవ కోసం వ్యక్తి గత లక్ష్యాలను కొన్నిటిని వదులుకోవాలా? అలా వదులుకొంటే ఎంతవరకూ వదులు కో వచ్చు? ఎంత వరకూ వ్యక్తి గత లక్ష్యాలను వదులుకోవచ్చు అనేది చాలా వరకూ subjective decision. కానీ సమాజ సేవ అనేది negative terrain లోకి వెళ్ళే కొన్ని బోర్డర్ కేసులు ఉంటాయి. అంటే ఒక పరిధికి మించి లోక సేవ చేయటం మంచిది కాదు. అది వ్యక్తి గతమైన బలహీనతో, లేక మానసిక రోగమో అవుతుంది.
ఒక వ్యక్తి బాల కార్మిక సమస్య కి వ్యతిరేకం గా పోరాడుతున్నాడనుకొందాం. అతను ఆ పని లో నిద్రాహారాలు మాని, అనేక వత్తిడులకి లోనయి తే, నిస్సందేహం గా అతని సమాజ సేవ ఒక ప్రమాద కరమైన (బలహీనత/అడిక్షన్/అబ్సెషన్/మానసిక రోగం) స్థాయికి చేరుకున్నదనటానికి ఒక సంకేతం గా భావించవలసి వస్తుంది.  అతని సేవా కార్యక్రమం వలన ముందు అతని ఆరోగ్యం దెబ్బతింటుంది.అతని కుటుంబ జీవితానికి సమయం తగ్గి కుటుంబం లో కలతలు వచ్చే అవకాశం కూడా లేక పోలేదు. తద్వారా అతని సేవా కార్యక్రమం కూడా ఆగిపోతుంది కదా! అదే , అతను తన గురించీ, తన కుటుంబం గురించీ తగు శ్రధ్ధపెడితే తన సేవా కార్యక్రమాన్ని దీర్ఘకాలం నాణ్యమైన పనితీరు తో నడిపించవచ్చు.
విమానాలలో ప్రయాణించే టప్పుడు, ఆక్సిజన్ మాస్క్ వేసు కోవటానికి సూచనలు ఇస్తారు. “ఏదైనా ప్రమాదం జరిగి మాస్క్ వాడవలసి వస్తే, మీ పక్కన ఉండే పిల్లలకు కాక, ముందు మీరు మాస్క్ వేసుకోవాలి”, అని చెప్తారు. మీరే మాస్క్ వేసుకొనక పోతే, పిల్లలను రక్షించలేరు కదా! కాబట్టీ, అదండీ మన వ్యక్తి గత జీవితానికీ సమాజ సేవా జీవితానికీ మనం పాటించవలసిన సమతూకం! ఇక సమానత్వం సంగతి అంటారా..ఇక్కడ సమానత్వం వలన నష్టం వస్తుంది, గమనించారా! మనమూ మన పక్క కూర్చొన్న చిన్న పిల్లా సమానమని భావించి ఇద్దరికీ ఒకే సమయం లో మాస్కులు తొడిగితే, చివరికి ఎవరికీ మాస్కులు తొడగలేక అసలుకే మోసం వస్తుంది.
“ఆ బోడి చెప్పొచ్చావులే, ఈ కాలం లో సమాజ సేవ చేయాలని ఎవరికి ఉంటుంది అంటారా?”, కరక్టే నండీ..నా బ్లాగు ద్వారా ఏదో ఒకటి వాగటం నా బలహీనత అనుకొంటా..! ఇక ఉంటా..బై!

మేధావులూ వారి ఆదర్శ సమాజ సిధ్ధాంతాల పనికిరానితనం

సమాజం లోని మధ్య తరగతి మేధావులు కొంతమంది సమాజ తత్వం తో విసిగి, దానిని ఎదిరించలేక, కొత్త ఆదర్శ వాద సిధ్ధాంతాలను (సమ సమాజం వంటివి) లేవనెత్తుతారు. కానీ ఈ ఆదర్శాలనూ విలువలనూ వారే పాటించలేరు.(ఉదాహరణ కు వారు ఏ మార్క్సిస్టు లో అయి ఉంటారు. కానీ పచ్చి పెట్టుబడిదారు విదిల్చే పదికో పరక కో తమ సిధ్ధాంత రచనలు అమ్ముకొంటారు. కాపిటల్ కే వ్యతిరేకమైన వీరు తమ రచనలకు నాలుగు రాళ్ళు రావటంలేదని మూలుగుతారు)  చలం లాంటి వారు ఎక్కడో ఒకరు దీనికి అతీతులు. ఆయన తను ప్రతిపాదించిన విలువల ప్రకారం జీవించటానికి ప్రయత్నించారు. భౌతిక కారణాలకీ, సహజ స్వభావానికీ విరుధ్ధమైన ఏ ఆదర్శమైనా కొంత కాలం తరువాత వీగిపోతుంది.
ఈ మేధావుల స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ వీరి ఆదర్శాలకి విలువనిచ్చినట్లు కనిపించదు (వీరి కుటుంబ సభ్యులు, పిల్లలు ఏ అమెరికా లోనో ఉండి అప్పుడప్పుడూ బ్లాగుల్లో బావురు మంటుంటారు. సదరు ఎర్ర మేధావిని కదిలిస్తే, అలా శతృ దేశంలో ఉండటం వారి వ్యక్తి గతం అంటాడు. లేక పోతే తాను అమెరికా ప్రజలకి వ్యతిరేకం కాదనీ, అక్కడి పెట్టుబడిదారి వ్యవస్థ కి వ్యతిరేకమనీ, తన పిల్లలు చదువుకోసం మాత్రమే అమెరికా వెళ్ళారనీ ఏవో సాకులు చెప్పి తప్పించుకోచూస్తాడు..అక్కడికి చదువుకొన్న తరువాత ఆ పిల్లలు అక్కడి పెట్టుబడిదారి సంస్థలలో ఉద్యోగాలు చేయనట్లు, అక్కడి విశ్వవిద్యాలయాలలో అక్కడి పెట్టుబడిదారి కంపెనీల జోక్యం లేనట్లు..).అంటే ఈ మేధావులు తమ చుట్టూ ఉండే వారిని కూడా ప్రభావితం చేయలేక పోయారన్న మాట. దీనిని గురించి వారిని ప్రశ్నిస్తే, “సిధ్ధాంతం ప్రతిపాదించిన వాడి వ్యక్తిగత జీవితం అప్రస్తుతం, అతని ఆలోచనలూ సిధ్ధాంతం మాత్రమే ముఖ్యం”, అంటారు.  ఈ వాదన చూడటానికి బాగానే ఉన్నట్లు కనపడినా, దీనిలో ఒక లోపం ఉంది.

ఏవరైనా ఒక గడియారం తయారు చేశారనుకొందాం. అతను ఆ గడియారాన్ని అమ్ముదామనుకొంటున్నాడు. “ఈ గడియారం నా చేతికి పెట్టుకొంటే పని చేయదు, కానీ నీ చేతికి పని చేయ వచ్చు”, అని అమ్మే వ్యక్తి చెబితే , కొనే వ్యక్తి కొంటాడా? తనకే పని చేయని గడియారాన్ని ఇతరులు ఎందుకు కొనాలి?

చాలా సందర్భాలలో గడియారం వారి చేతికి పనిచేసినా కొన్న వారి చేతిలో పని చేయక పోవచ్చు.

కానీ ఈ మేధావులు ఇంట్లో పడక కుర్చీలో కూర్చొని సమాజం మీదికి విసిరేసిన సిధ్ధాంతాలను పట్టుకొని వాటి సాధనకోసం నా నా ఇబ్బందులూ పడి తమ జీవితాలని నాశనం చేసుకొన్న వారు, ఉన్నారు, ఉంటారు. అటువంటి సిధ్ధాంతాల గురించి “తస్మాత్ జాగ్రత్త..!”.

ఇందుమూలం గా సకల మహాజనులకూ సవినయం గా తెలియజేయునదేమనగా…

ఇందుమూలం గా సకల మహాజనులకూ సవినయం గా తెలియజేయునదేమనగా…
నా “ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ” ఇప్పుడు కినిగె లో మీకు దొరుకుతుందహో…!   http://kinige.com/kbook.php?id=456

సమానత్వం : తాత్విక దృష్టి కోణం

Disclaimer: ఈ టపా సమాజం లో ఉండే అనేక రకాల వివక్షలను సమర్దించటానికి కాదు.

“అహం బ్రహ్మాస్మి, తత్వమసి” అని మన పెద్దలు చెప్పారు. (ఈ సూక్తి మన వేదాలలో ఉందా, ఉపనిషత్తులలో ఉందా, శంకరుడు చెప్పాడా, లేక పురాణాలలో ఉందా అనేది నాకు తెలియదు. తెలిసిన వారు కొంచెం చెప్తారా?).
మనలో చాలా మంది మొదటి దైన “అహం బ్రహ్మాస్మి” అనే దానిని అమలు లో పెడతారు (In an egotistic way :-)  ). మిగిలిన భాగం అమలు లో పెట్టటం చాలా కష్టం.
మనలో విద్యా వంతులైన వారు ఎదుటి మనిషి మన వంటి వాడే అనే విషయాన్ని బుధ్ధిపరం గా అర్ధం చేసుకోగలరు. కానీ practical గా అమలు చేయం.భావోద్వేగ పరం గా ఇతరుల భావోద్వేగాలు మన భావోద్వేగాలకి ఎప్పటికీ సమానం కావు. భావోద్వేగం అనేదే మన అస్థిత్వం నుంచీ పుడుతుంది. మన ఆలోచనలన్నీ మన లాభ నష్టాల చుట్టూనే తిరుగుతాయి. మన శారీరక భౌతిక అవసరాలు మనవి. ఎదిటి వాడి ఆకలి మనకు వేయదు కదా! ఎదుటి వాడి రోగం మనం ఫీలవ్వం. ఎదుటి వాడి ముసలితనం వాడిదే! మానసికం గా “నేను” అనే వస్తువే గతకాలపు జ్ఞాపకాల, ఆలోచనల , అనుభవాల సమాహారం.ఈ నేను కి ఎదురైన పరిస్థితులు దానిని మారుస్తూ ఉంటాయి.ఇతరులకి ఎదురైన పరిస్థితులు , నాకు ఎదురైన పరిస్థితులకు పూర్తి గా భిన్నమైనవి కావచ్చు. అలాంటి నేను ఎదుటి మనిషి తో ఆలోచనా పరం గా, భావోద్వేగ పరం గా, వ్యవహార పరం గా సమానత్వాన్ని ఎలా సాధిస్తుంది?తమ తమ అభిప్రాయాలకీ, భావోద్వేగాలకీ, ఆలోచనలకీ ప్రాముఖ్యతని ఇచ్చుకోని వ్యక్తులను మనమెక్కడైనా చూస్తామా? మన శరీరం కార్చే అనేక శరీర ద్రవాలూ మలినాలు అంటే మనకి అసహ్యం ఉండదు. అదే ఇతరుల ద్రవాలంటే మనకు జుగుప్స ఉంటుంది.
మన అస్థిత్వమే మన మనుగడ (survival) నుంచీ ఆవిర్భవించింది. కాబట్టీ, సర్వ మానవ సమానత్వం అనేది మన నుంచీ మొదలవ్వాలి. కానీ, ఒక్క మేధో పరం గా కాకుండా, ఏ ఇతర ప్లేన్ లో ( emotional, survival, practical, physical,psycological and thoughts) చూసినా మనం మనకు ఇచ్చుకున్న ప్రాముఖ్యతను ప్రపంచం లో వేరే ఎవరికీ ఇవ్వం.
ఇతరుల ఆలోచనలకీ , వారి అనుభవాలకీ మనకు access లేదు. వారి మానసిక ప్రపంచానికి వారికే access ఉంది. అందరి మనుషులకీ ఉమ్మడి గా ఉండే కొన్ని అనుభూతుల ద్వారానే మనం వారితో communicate చేయగలం. మనతో మసలే మన స్నేహితులూ, బంధువుల ఆలోచనలకి మనకు కొంతవరకూ access ఉంటుంది. కాబట్టీ మనం వారికిచ్చే weightage/priority లోకం లో ఇతరులకి ఇచ్చే విలువ కంటే ఎక్కువగా ఉంటుంది.

ఇలాంటప్పుడు ఇతరులంటే మనకు కొంత మానవీయమైన సహానుభూతి ఉండవచ్చు, కానీ మానసిక మైన సమానత్వం మాత్రం రాదు. అది ఒక ఆచరణ లో పెట్టలేని ఆదర్శం మాత్రమే అనిపిస్తుంది.   We all are similar, but we are not identical  .

సర్వ మానవ సమానత్వమే ఇలా ఉంటే, ఇక సర్వ జీవ సమానత్వం సంగతి ఆలోచించాల్సిందే!

మనమంతా ఒకే శక్తితో, ఒకే ఎలక్ట్రాన్లూ, అణువులూ వగైరాలతో చేయబడి, ఒకే శూన్య మూలాల నుంచీ, భౌతిక-అధిభౌతిక కారణాలవలన వచ్చినప్పటికీ, వాస్తవం గా ఈ అసమానత్వం తప్పేటట్లు లేదు.

మన శరీరమూ,  మనసూ, రోబో ల తరహా లోమాస్ ప్రొడ్యూస్ అయితే తప్ప,  మనమందరం సమానం కామేమో! మాస్ ప్రొడ్యూస్ అయిన రోబో ల లో కూడా వాటి సామర్ధ్యాలలో తేడాలు ఉంటాయి!

సమానత్వం (స్త్రీ పురుష) : కొన్ని నా ర్యాండం థాట్స్

సమానత్వం గురించి (ముఖ్యం గా స్త్రీ పురుష సమానత్వం) కొన్ని నా ర్యాండం థాట్స్:

ఇండియా లో స్త్రీలు పాత విలువల వ్యవస్థ నుంచీ కొత్త విలువల వ్యవస్థ కి అయ్యే transition సమయం లో ఉన్నారు. మగ వారి కోణం నుంచీ విషాదమేమిటంటే, స్త్రీలకు కొత్త వ్యవస్థ లోని హక్కులూ సమానత్వమూ కావాలి, పాత వ్యవస్థలోని care రక్షణా కావాలి. కాబట్టీ మగవారు తమ హక్కులను వదులుకోవాలి. కానీ పాత వ్యవస్థ ప్రకారం వచ్చే బాధ్యతలను (కుటుంబ రక్షణ, ఆడ వారి care) మోయాలి. మన స్త్రీలు మగవారే తమ ట్రాన్స్ఫర్ లంటి వ్యవహారాలను, రికమండేషన్లను తేవటం వంటి వ్యవహారాలను చూడాలనుకొంటారు. అదే సమయం లో మగవాడితో సమానత్వం విషయం లో ఏ మాత్రమూ వెనుకకు తగ్గరు. తమ జీతం తమదే! మగవాడి జీతం కుటుంబం అంతటిదీ! ఒక పాత సామెత గుర్తుకొస్తుంది..”దున్నేటప్పుడు దూడలలోనూ, మేసేటప్పుడు దున్నలలోనూ కట్టెయటం”. చాలా మంది మగవారు ఈ బేధాలను కనిపెట్టకుండా గానుగెద్దులలా అన్నిటినీ కోల్పోతూ పని చేస్తున్నారు!
వెస్టర్న్ దేశాలలో ఆడవారు తమ జీవిత బాధ్యతను తామే తీసుకొంటారు, అలానే సమానత్వమూ ఉంటుంది. ఏడెనిమిది నెలల గర్భం తో ఉన్న వారు కూడా తమ కారు తమే నడుపుతూ ఆఫీసు కు వస్తారు. మన ఆడ వారిని అలా చేయమంటే మగవారి పై ఎన్ని అభాండాలు వేస్తారో ఊహించండి.

మన వ్యవస్థ లో అనాది గా అసమానత్వానికి కొన్ని కారణాలు…..
1.బలవంతుడెప్పుడూ బలహీన వర్గాన్ని ఆక్రమించి వాళ్ళకు బండ పనులూ, అశుభ్రమైన పనులూ, ప్రమాదకరమైన పనులూ ఇస్తాడు. ఆ పనులు చేసే వారు లేకపోతే సమాజానికి చాలా నష్టం. కానీ అణిచిపెట్టబడ్డ వారికి, అణచివేత వల్లా, పొట్టకూటి కోసం ఆ పనులు చేయక తప్పదు, ఈ రోజుల్లో మధ్య తరగతి తమ కంపెనీలను తిట్టుకొంటూ కూడా పొట్ట కూటి కోసం ఉద్యోగాలు చేస్తున్నట్లు.
2. సమాజం మరియూ వ్యక్తుల అవసరాలను బట్టి కొన్ని పనులకి ఎక్కువ విలువ ఉంటుంది. మూఢనమ్మకాలున్న సమాజం లో కుహనా మత పెద్దలకి విలువ ఉంటుంది. ప్రాణాంతక వ్యాధులున్న పాత సమాజం లో వైద్యుడికి ఉన్న విలువ మంగలికి ఉండదు.

సమానత్వాన్ని ఒక ఆదర్శం  గా తీసుకొంటే, అనేక రకాల సమానతలున్నాయి.

అమెరికన్ కంపెనీలలో “సీ ఈ ఓ” ని మరుగుదొడ్డికడిగేవాడు కూడా పేరుపెట్టి ఏకవచనం తో పిలవ వచ్చు. ఈ సమానత్వం కేవలం formality మాత్రమే! “సీ ఈ ఓ” జీతం మిగిలిన ఉద్యోగుల జీతం కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టీ ఇక్కడ సమానమైన విలువ లేదు. సమాన విలువ లేనప్పుడు సమాన సంబోధనకు పెద్ద ఉపయోగం లేదు.
2.ఒకప్పటి రష్యా వంటి దేశాలలో factory లలో పై అధికారులూ , కింది అధికారులూ, పని వారూ ఉండేవారు. కానీ అందరికీ సమాన విలువ ఉండేది. ఇది అసలైన సమానత్వం. వాళ్ళ జీతం స్కేల్స్, కాపిటలిస్ట్ దేశాలలో లా సంస్థ కు వచ్చే లాభాలకు వారి contribution ని బట్టి కాక, వారు చేసే పనిని బట్టి ఉండేవి. ఒక కార్మికుడు రోజుకు నలభై వస్తువులు ఎక్కువ తయారు చేస్తే అతనికి బోనస్ ఉంటే, ఒక జెనరల్ మేనేజర్ స్థాయి వ్యక్తి నలభై truck loads of goods ఎక్కువ ఉత్పత్తి చేయిస్తే అతనికి అంతే బోనస్ ఉంటుంది. అలానే ఒక క్వాలిటీ నిపుణుదు, క్వాలిటీ ని పెంచిన దానిని బట్టి అతనికి సమానమైన amounts లో బోనస్ ఉంటుంది. ఇది అసలైన సమానత్వం.
3. ఈ అసలైన సమానత్వం లో కూడా functional equality (చేసే పని లో సమానత్వం)అనేది సాధ్యం కాదు. మానేజర్ లెవల్ లో ని వారు నిర్ణయాలు తీసుకొనవలసి వస్తుంది, కార్మికులు అమలు పరచ వలసి వస్తుంది. మానేజర్ నిర్ణయాలు తీసుకొంటాడు కదా అని అతనికి ఎక్కువ విలువ ఏమీ ఉండదు. ఎందుకంటే అతని పని అతను చేస్తున్నాడు. కార్మికుని పని కార్మికుడు చేస్తున్నాడు.కానీ నిర్ణయాలు తీసుకొనటం అనేది అమలు పరచటం కంటే మేధోపరం గా ఎక్కువ స్థాయి పని. మొదట్లో ఈ రెండు పనులనూ కృత్రిమం గా ఒకే స్తాయిలో పెట్టినా, కొన్నాళ్ళకి నిర్ణయాలు తీసుకొనేవారి ఆధిపత్యాన్ని ఆపటం కష్టం అవుతుంది.
సోషలిస్ట్ వ్యవస్థ ఏవరికి ఆసక్తి ఉన్న ఉద్యోగం వారు చేసుకొనేటట్లు గా వ్యవస్థ ఇద్దరికీ పుట్టుక నుంచీ సమాన అవకాశాలను కల్పించింది. కాపిటలిస్ట్ వ్యవస్థ లో లా “ఒక పని చేసే వారు తక్కువ ఉన్నారు కాబట్టీ,ఆ పని నేర్చుకొని, ఆ చదువులు చదివిన వారికి ఎక్కువ జీతం ఉండదు”.
సామ్యవాద వ్యవస్థ లో కూడా అన్ని పనులూ సమానం కాలేవు. ఒక శాస్త్రవేత్త అవ్వటానికి కి కొన్ని సంవత్సరాల విద్యా శిక్షణా కావాలి. దానికి మేధోపరమైన స్థాయి కావాలి. శ్రమ చేయాలి. శాస్త్రవేత్త అయిన తరువాత ఉండే పని కూడా ఎక్కువ గానే ఉంటుంది. ఐతే ఈ శ్రమ మేధోపరమైన శ్రమ. అదే ఒక రిసెప్షనిస్ట్ పని తేలిక గా ఉంటుంది. దానిని పెద్ద training లేకుండానే ఎవరైనా తేలిక గా చేయగలరు. అటువంటప్పుడు సామ్యవాద రష్యాలోనైనా శాస్త్ర వేత్తకి ఎక్కువ విలువ ఉంటుంది. అతనికి ఎక్కువ ప్రతిఫలం ఉండాల్సిందే! అలానే ఎక్కువ కష్టపడే వారినీ తక్కువ కష్టపడె వారినీ సామ్యవాద వ్యవస్థ అయినా సమానం గా చూడలేదుకదా! సోమరిపోతుతనానికి కారణాలు అన్ని వ్యవస్థలలోనూ ఉంటాయి.

స్త్రీ వాదులతో వచ్చిన చిక్కేమిటంటే వారు functional equality ని ఆశిస్తారు. సమానత్వమంటే functional equality అనుకొంటారు. కానీ  functional equality తో వ్యవస్థ పని చేయదు. కొన్నాళ్ళకి అది కుప్ప కూలుతుంది.
ప్రకృతి అసమానత ని సపోర్ట్ చేస్తుంది. మన సమాజమూ, సం స్కృతీ సమానత్వం అనే ఆదర్శాన్ని ప్రతిపాదిస్తాయి. ఈ సమానత్వ సిధ్ధాంతానికి మూలం మన లోకం లో ఉన్న అసమానతలో ఉంది. fundamental గా ప్రకృతి సపోర్ట్ చేయని ఏ ఆదర్శమైనా కొంత కాలం తరువాత వీగిపోతుంది. సమాజమూ, సంస్కృతీ ప్రతిపాదించే ఆదర్శాలు ప్రకృతి విరుధ్ధమైనవైతే అవి కూడా కొంత కాలానికి failఅవుతాయి.ప్రకృతి మద్దతు ఉన్న వావి వరుసలూ మొదలైన కుటుంబ విలువలు  కాల పరీక్షకి నిలబడ్డాయి.కుటుంబ వ్యవస్థ లో (సమాజం లో కూడా) కాల పరీక్షకి నిలబడలేని విలువ “సమానత్వం”.
ఏదైనా ఒక electronic system ని master and slave అనే components ఉంటాయి. మాస్టర్ నిర్ణయాలు తీసుకొంటుంది. స్లేవ్ అమలు పరుస్తుంది.  ఒక system  లొ అన్ని కాంపొనెంట్సూ మాస్టర్లైతే, ఆ సిస్టం ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు నిర్ణయాలను అమలుపరిచే components ఉండవు. అన్ని components  స్లేవ్స్ అయినా సిస్టెం పని చేయదు. అలానే ప్రజాస్వామ్యం లో అందరూ సమానమే అయినప్పటికీ, అందరూ కలిసి నిర్ణయాలు తీసుకొనే ఒక పాలకుడిని ఎన్నుకొంటారు. కాబట్టీ ఇక్కడ కూడా మాస్టర్, స్లేవ్ విధానం ఉంది. అందరూ సమానమనే సామ్యవాదం దానిని ఆచరణ లో చూపించలేక కూలిపోయింది. కుటుంబం లో కూడా మాస్టర్ అండ్ స్లేవ్ లు తప్పని సరి. ఒక్కో కాలం లో , వ్యవస్థ లో ఆడవారు మాస్టర్స్ గా ఉంటే (మాతృస్వామ్యం), వేరే కాలాలలో మగవారు మాస్టర్స్ గా ఉన్నారు. కానీ ఆధునిక కుటుంబ వ్యవస్థ ఆడా మగా సమానమంటుంది.  కానీ దీనివలన నిర్ణయాలు తీసుకోవటం లో స్పర్ధలు వస్తాయి. వ్యవస్థ ముందుకు పోదు. కొన్ని విషయాలలో భర్త మాస్టర్ అనుకొని, ఇంకొన్ని విషయాలలో భార్య మాస్టర్ అనుకొన్నా, ఏ విషయం లో ఎవరు మాస్టరో చెప్పేది ఎవరు? ఒకే విషయం లో భార్యా భర్తా మాస్టర్ కావాలనుకొంటే దానిని పరిష్కరించేది ఎవరు, ముఖ్యం గా పెద్దల మాట వినని ఈ కాలం లో? కాబట్టీ సమానత్వ ఆదర్శం కుటుంబ వ్యవస్థ యొక్క executive efficiency  ని దెబ్బ తీస్తోంది. చివరికి ఇది కుటుంబ వ్యవస్థ క్షీణించిపోవటానికి దారి తీస్తుంది.  సమానత్వం కాకుండా మళ్ళీ మాతృస్వామ్యం వస్తే, మగవాళ్ళు ఏడ్చినా, ప్రస్థుత కుటుంబ వ్యవస్థ ఆయుర్ధాయం కొంత పెరగవచ్చు.

సమాజం లో విప్లవాలు రాత్రికి రాత్రి రావు. సమాజ స్థూల పరిస్థితుల (శాస్తవిజ్ఞానాభివృధ్ధీ, సాంకేతికతా, విద్యా మొదలైనవి) లోని పరిణామం వలన ఒకానొక దశలో ఇవి వెల్లువెత్తుతాయి.
పూర్తిగా అణిచివేయబడిన వర్గానికి మొదట్లో తాము అణిచివేయబడ్డామనే స్పృహ కూడా ఉండదు. వారి లో కొందరు అణచివేత పరిస్థితులలోంచీ దూరం గా వేళ్ళటం వలనో, లేదా వారి ఆలోచనలు మిగిలిన వారికంటే ముందుకు వెళ్ళటం వలననో అణచివేతని ప్రశ్నించటం ప్రారంభమౌతుంది. ముందు గా అణచివేసే వర్గం లోని కొందరు మానవత్వం కలవారు అణిచివేయబడిన వర్గాన్ని సమభావం(మానవ ప్రేమ) తో జాగృతం చేయటం వలన కూడా అణిచివేయబడిన వర్గం లోని చైతన్యానికి కారణమౌతుంది.
ఐతే ఈ విప్లవాల వలన సమానత ఏర్పడుతుంది అనుకోలేం. అసమానతలు తారు మారవుతాయి.అధికార బదిలీ జరుగుతుంది. అంతకు ముందు పాలకులు గా ఉన్న వారు పాలితులవుతారు, పాలితులు పాలకులౌతారు. సమాజం లోని కొత్త  స్థూల పరిస్థితుల ఆధారం గా సరి కొత్త అసమ సమాజం బయలుదేరుతుంది.

అధికారాలను కోల్పోవటం అలా కోల్పోయే వారికి ఒక బాధాకరమైన ప్రక్రియ.ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు((చిన్నపిల్లలు) ఉన్నారనుకొందాం. వాళ్ళ అమ్మ నాలుగు చాక్లెట్స్ కొని ఫ్రిజ్ లొ పెట్టారనుకొందాం. పెద్ద వాడు ముందు వెళ్ళి ఆ నాలుగు చాక్లెట్లూ తీసేసుకొంటే, చిన్న వాడు ఏడుస్తాడు. వాళ్ళ అమ్మ వచ్చి చెప్పినా రెండు చాక్లెట్స్ ఇవ్వటం పెద్ద వాడికి బాధాకరం గానే ఉంటుంది. అప్పుడు పెద్దవాడికి వాళ్ళ అమ్మ నాలుగు చాక్లెట్లూ కబ్జా చేయటం ఎందుకు చెడ్డ విషయమో, చిన్న వాడికి రెండు చాక్లెట్స్ ఇవ్వటం ఎందుకు మంచి విషయమో చెప్పాలి. చిన్న వాడికి చాక్లెట్స్ ఇచ్చినపుడు పెద్ద వాడిని మెచ్చుకోవాలి.చిన్న వాడి చేత థాంక్స్ చెప్పించాలి.కానీ, మన సమాజం లో అమ్మ లా పెద్దవాడి మంచి ప్రవర్తన ని మెచ్చుకొనే వారూ లేరు…చిన్నవాడి చేత థాంక్స్ చెప్పించేవారూ లేరు. చిన్న వాడు, అన్న దగ్గర ఉన్న నాలుగు చాక్లెట్సూ నాకు కావాలి అని పట్టుపట్టవచ్చు. అప్పుడు చిన్నవాడికి కూడా వాళ్ళ అమ్మ పెద్ద వాడికి చెప్పినట్లే చెప్పాలి. ఇక్కడ అమ్మ పాత్రని ఒకప్పుడు మన సమాజం లో పెద్ద వారు పోషించేవారు. వారు పూర్తిగా నిష్పక్షపాతం గా లేకపోయినా, వారి presence ఒక stabilizing influence ని కలిగి ఉండేది. పెద్ద వారిని పట్టించు కోని ఈ కాలం లో వారి మధ్యవర్తిత్వాన్ని ఆమోదించేదెవరు?
మనం రాబోయే నాలుగువందల సంవత్సరాలలో మానవ జాతి సరైన దిశలో ఉండే నిర్ణయాలు తీసుకోవాలంటే,ఒక నాలుగైదు తరాలవారిని ఒక చోట కూర్చోబెట్టి పరిష్కరిస్తే గానీ ఆ సమస్యలు విడిపోవు. కానీ నాలుగైదు తరాల పాటు బ్రతికి ఉండే వ్యక్తి ఏవరు?కాబట్టీ సమాజం long term లో ఒక అదుపు లేకుండా, మనుషులు ఒక జీవిత కాలం లో చేసే short term పనులతో గజి బిజి గా సాగుతూనే ఉంటుంది. ఒక తరానికి నేర్పబడిన పాఠాలు, మరొక తరానికి మళ్ళీ నేర్పాల్సి వస్తుంది. తప్పులు పునరావృతమౌతాయి. మన ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు ఈ long term continuity ని కొంత కాలం నిలబెట్టగలిగినా, ఇప్పుడు పరిస్థితి చేయిదాటి పోయింది.

సమానత్వమే అత్యున్నత విలువా? కానే కాదు. కుటుంబం యొక్కా, తద్వారా సమాజం యొక్క greater good కి సమానత్వాన్ని త్యాగం చేయవచ్చు. స్త్రీలైనా, పురుషులైనా కుటుంబం కోసం తక్కువ స్థాయిని ఆమోదించటం లో తప్పేమీ లేదు.తద్వారా ముందు కొంత తక్కువతనాన్ని అనుభవించినా, కుటుంబం యొక్క ఆరోగ్యం, తద్వారా వచ్చే ఆనందం ద్వారా దానిని పూడ్చుకోవచ్చు. పురుషులు దీనికి ఈ మధ్యే అలవాటుపడుతున్నారు. స్త్రీలు కొత్తగా దొరికిన కొబ్బరి చిప్పైన సమానత్వాన్ని అంత తొందరగా వదిలే సూచనలు కనపడటం లేదు.

సెక్స్ యొక్క వ్యాపారీకరణ లో కుటుంబ వ్యవస్థ పాత్ర

యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ఒక నవలలో హీరో ఒక క్యాపిటలిస్టు. అతను మొదట “మీసాలూ గడ్డాలూ పర్మనంట్ గా తీసేసే ఒక లోషన్ ని మార్కెట్ లోకి వదిలి ఉచితం గా అమ్ముతాడు. అదే సమయం లో ఓ వందమంది కుర్రాళ్ళ తో ఆ లోషన్ వాడకుండా ఎగ్రీమెంట్ రాయించుకొంటాడు.
ఉచితం కాబట్టీ ఊళ్ళో కుర్రాళ్ళందరూ ఆ లోషన్ వాడి గడ్డాలూ మీసాలూ ఊడగొట్టుకొంటారు. కొత్త కాబట్టీ వాళ్ళకి అది ఒక ఫాషన్ గా అనిపిస్తుంది. ఊళ్ళో కుర్రాళ్ళందరూ మొహం మీద వెంట్రుకలు కోల్పోయిన తరువాత కొన్ని సంవత్సరాలకి, తాను ఎగ్రీమెంట్ రాయించుకొన్న మీసాలూ గడ్డాలూ ఉన్న కుర్రవాళ్ళని ఊళ్ళో తిప్పుతాడు హీరో.
మిగిలిన కుర్రాళ్ళకి కూడా ఈ ఎగ్రిమెంట్ కుర్రాళ్ళ లా గడ్డాలూ మీసాలూ కావాలనిపిస్తుంది. అప్పుడు హీరో ఊళ్ళో కుర్రాళ్ళ మీదకి వెంట్రుకలు మొలిపించే లోషన్ ఒకటి వదులుతాడు. వాళ్ళ దాన్ని హాట్ కేకుల్లాగా కొనుక్కొంటారు.
ఇక్కడ హీరో వ్యాపార రహస్యమేమంటే, “కొరత ఉన్న వస్తువుకి డిమాండ్ ఉంటుంది”. కాబట్టీ మంచి వ్యాపారి కొరతని కృత్రిమంగా నైనా సృష్టించి సొమ్ము చేసుకొంటాడు.
కుటుంబ వ్యవస్థ లేని పాత మంచి రోజులలో, గాలీ నీరు లానే సెక్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ , ఎప్పుడుపడితే అప్పుడు దొరికేది.సెక్స్ చేసేటప్పుడు తప్పితే జనాలు దానిని గురించి పట్టించుకొనవలసిన అవసరం ఉండేది కాదు.

కుటుంబ వ్యవస్థ రావటం తో సెక్స్ కి ఈ వ్యవస్థ బయట కొరత ఏర్పడింది. వ్యవస్థ లో కొంత కాలం ఉండి బోర్ కొట్టిన వాళ్ళకీ, వ్యవస్థ తో అసంతృప్తులకీ ఒక సేఫ్టీ వాల్వ్ లా దేవదాసీ సిస్టమూ, భోగం వాళ్ళూ బయలు దేరారు. మనిషికి కావల్సిన, కొరత ఉన్న, ఏ వస్తువుకైనా ఒక రేటు ఉంటుంది. అలానే వీరికీ ఒక రేటు ఉంది. ఈ విధం గా చాలా తక్కువ స్థాయి లో వ్యాపారమైన సెక్స్, పాశ్చాత్యుల రాక తో, వారి విలువల తో మరీ రోడ్ సైడ్ బిజినెస్ గా మారింది.
కుటుంబ వ్యవస్థా, కుల వ్యవస్థా కలిపి 90% ప్రేమలు విఫలమయ్యేటట్లు చేశాయి. మన సమాజం లో అధిక భాగం ఒకానొక సమయం లో unrequitted love తో బాధ పడిన వారేననటం లో అతిశయోక్తి లేదు.  సెక్స్ అందకుండా పోవటం వలన దానికి ఒక ఊరించే స్వభావం వచ్చి, యువత తన సమయాన్ని దాని గురించి ఆలోచించటంలోనే వృధా చేసుకొంటోంది. కొంత మంది యువకులు చేసే యాసిడ్ దాడులలో ఈ “సెక్స్ కొరత” పాత్ర కాదనలేనిది.
అమెరికా, జపాన్ లాంటి దేశాలలో కొన్ని బార్స్ లో అమ్మాయి కబుర్లు చెబితే ఒక రేటు, మందుపోస్తే ఒక రేటు, ముట్టుకోనిస్తే ఒక రేటు ఉంటాయి. ఫోన్ లో మాట్లాడితే వేరొక రేటు. మొత్తానికి, “గాలిపీల్చటం లా, నిద్రపోవటం లా ఎంతో సహజమైన సెక్స్”, ని ఒక మ్యూజియం లో వస్తువు లా చేసి దానికి రుసుము వసూలు చేస్తున్నారన్న మాట. ఇక వ్యాపార ప్రకటనల లో సెక్స్ ఉపయోగించే సంగతి అందరికీ తెలిసిందే.
సినిమాలూ, నెట్టూ, టీవీ ల లో సెక్స్ అమ్మకం సంగతి చెప్పనక్కరలేదు.సినిమాలలో నటీమణులు పిక్క చూపించటానికో రేటు, జబ్బ చూపించటానికింకో రేటు, సంపదలు చూపించటానికిక్నో రేటు. శరీరసౌష్టవం ఉన్న కొంత మంది తారలు, తాము అంతా చూపించటానికి ఇంత రేటు అని అంటారు, పశువుల మార్కెట్లో పొదుగుని బట్టి గేదే ని కొన్నట్లు. వర్తమానం లోనే కాక వారి అంగాలకి భవిష్యత్తులో కూడా రేటు కట్టే ఇన్స్యూరెన్సులు పశువుల మార్కెట్ కి కూడా అందనంత నీచం గా ఉంటాయి.

సెక్స్ బొమ్మలూ, ఉపకరణాలూ మొదలైన వాటి మార్కెట్ కొన్ని బిలియన్ డాలర్లలో ఉంటుంది. పరిస్థితి ఎంత దాకా వెళ్ళిందంటే, పడమట్లో కొందరు కుర్రాళ్ళూ పెళ్ళి కంటే ఈ చూసే సెక్సే బాగుందని పెళ్ళి చేసుకోరంట!
జీవకోటి కి దేవుడి వరమైన, ఎంతో సహజమైన, సెక్స్, మనిషి పెట్టుకొన్న వ్యవస్థల వలన ఇప్పుడు మనిషిని ఒక ఆట బొమ్మను చేసి ఆడిస్తోందన్న మాట!  ఒకప్పుడు మనిషి ఆలోచనలలో చాలా తక్కువ చోటు ఉన్న సెక్స్ కి ఇప్పుడు మనిషి ప్రతి పది నిముషాలకీ (?) దానిని గురించి ఆలోచించకుండా ఉండ లేనంత ప్రాముఖ్యత(?) వచ్చింది.

జంతువులు సెక్స్ గురించీ, సెక్స్ సామర్ధ్యం గురించీ టెన్షన్ పడతాయంటేనె మనకి నవ్వు వస్తుంది. కానీ మనిషి తన సామర్ధ్యం గురించి పడే టెన్షన్ అంతా ఇంతా కాదు . ప్రధానం గా దీనిని సొమ్ము చేసుకొనేటందుకు సెక్సాలజిస్టులు బయలుదేరారు. సెక్స్ సామర్ధ్యం గురించి జనాలలో “బెంచ్ మార్క్స్” సృష్టించి వారిలో “నేను ఆనందించటం లేదేమో :-( !” అనే అనుమానాలను రేకెత్తించి, మళ్ళీ పోగొట్టటం మొదలెట్టారు :-) . అనుమానం రేకెత్తించేటప్పుడూ డబ్బు చేసుకోవచ్చు..పోగొట్టేటప్పుడూ డబ్బు చేసుకోవచ్చు.జబ్బుల పేరుతో డబ్బులు గుంజవచ్చు.

పాత తరాల లో ఒక వయసు అయిన తరువాత వారు graceful గా తమ వయసును అంగీకరించి ఆధ్యాత్మిక విషయాలపై మనసు మరల్చే వారు. ముసలివారు అవటం చాలా సహజ మైన విషయం కదా! కానీ వ్యాపారం దాన్ని కూడా సొమ్ముచేసుకొంటుంది. ఇప్పుడు, వయాగరాల వంటి మాత్రలు మనుషులు తమ పై బడ్డ వయసును అంగీకరిచకుండా చేస్తున్నాయి. ఎంత కాలమైనా పడుచువాడిగా ఉండి, తమ మగతనానికి కూడా, “తలకి హయిర్ డై వేసినట్లు”, పూతలు పూస్తున్నారు!మహిళల సౌందర్య సాధనాల పిచ్చి కూడా ఈ పరిధిలోకే వస్తుంది.

మానవ సంబంధాల లో కూడా సెక్స్ పరోక్షం గా కమర్షియలైజ్ అయింది. ఒకతని గర్ల్ ఫ్రెండ్ ఆమెకి ఖరీదైన గిఫ్ట్ లు  ఇస్తే కానీ సంతోషం గా ఉండదు. ఆమె సంతోషపడితే గానీ ఆమెపక్కకి చేరి మురిపెం తీర్చొకోవటానికి కుదరదు.

మొత్తానికి కుటుంబ వ్యవస్థా, వ్యాపారమూ కలిసి, ఎక్కడ చూసినా అందమైన అమ్మాయిలూ అబ్బాయిలూ ఉన్న మన సమాజాన్ని,నడి సముద్రం లోని నావికుని లా, “water water everywhere, but no drop to drink” అని అనిపించేటట్లు చేశారు!
అయితే ఈ సెక్స్ యొక్క వ్యాపారీకరణ కు పరిష్కారమేమిటి అంటారా? చాలా సింపుల్…మనం అర్జంట్ గా ఆది మానవులు గా మారిపోవటమే! :-)   :-(

ఈ నాటి కుటుంబ వ్యవస్థ మగవాళ్ళ కి వరమా? శాపమా?

కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడాలంటే దాని మూలాల లోకి పోవాలి. కాబట్టీ కొంచెం ఓపిక పట్టండి..
మనిషి ప్రాచీన కాలం లో జంతువులాగానే జీవించే వాడు. మందలు మందలు గా ఉండే జంతువుల లా నే మనుషులు కూడా గుంపులు గుంపులు గా జీవించే వారు.మనిషి కోతి జాతినుంచీ పరిణామం చెందాడనేది జీవ పరిణామ సిధ్ధాంతం ప్రకారం తెలిసిన విషయం. జంతువు ల లో స్త్రీ పురుష సంబంధాలు many to many గా ఉండేవి. ఒక ఆడ జంతువు అనేక మగ జంతువు ల తో మైధునం జరిపేది. అలానే ఒక మగ జంతువు అనేక ఆడ జంతువుల తో! వాటికి వావి వరుసలు ఉండేవి కాదు. క్షీరదాలన్నీ తమకు పుట్టిన జంతువులతో మైధునం జరుపుతాయి. అలానే ఒకే జంతువు కి పుట్టిన ఆడ మగా జంతువుల మధ్య కూడా మైధునం జరిగేది. మైధునం విషయం లో ఆడ మగా మధ్య ఒక తేడా ఉండేది. ఆడ జంతువు కొన్ని కాలాల లో మాత్రమే పరిమితమైన మగ జంతువుల తో మైధునం జరిపేది. దానికి అండం విడుదల ఆ కాలం లో మాత్రమే జరిగేది. కాబట్టీ, అది తన అండాన్ని, మగ జంతువులలో తనకోసం పోటీ పడి గెలిచిన జంతువు కి సమర్పించుకోవలసి వచ్చేది. అంటే మగ జంతువులలో powerful జంతువు మాత్రమే మైధునానికి అర్హత పొందేది. ఈ ప్రవర్తన క్రమం గా జన్యువులలో నిక్షిప్తమై rule of attraction గా తయారయింది. మనుషులలో కూడా ఆడవారు హోదా డబ్బూ ఉన్న వారిని ఇష్టపడటం మనం చూస్తూనే ఉన్నాం!
మనిషి homosepian గా మారే దశ లో రెండు ముఖ్యమైన జన్యు మార్పులు జరిగాయి. ఒకటి మనిషిలో selfish gene ఏర్పడటం. దీని వలన మనిషికి “ఆలోచనలూ, జ్ఞాపకమూ, అంతరాత్మ ” ల తో కూడిన ఒక centre ఏర్పడింది. ఈ centre నే నేను లేక అహం అన్నారు. రెండవ జన్యు మార్పు “మనిషి లో ఇతర మనుషుల తో భావోద్వేగ సంబంధాలను పటిష్టపరిచే భావోద్వేగ సున్నితత్వం” ఏర్పడటం.

ఈ రెండు మార్పుల వలనా మానవ సంబంధాలలో తీవ్రమైన మార్పులు వచ్చాయి. ఒక జంతువు తనకు పుట్టిన పిల్ల జంతువు ని maternal instinct తో సాకుతుంది. కానీ ఆ పిల్ల జంతువు పెద్దదైన తరువాత, దాని తల్లికీ , దానికీ ఏ విధమైన మాతృత్వ సంబంధమూ ఉండదు. ఆ రెండూ మైధునం కూడా చేస్తాయి.  జంతువు ల లో మాతృత్వం అనేది ఎక్కువ గా instinct గానూ, తక్కువ గా భావోద్వేగపరం గానూ ఉంటుంది. పై పెచ్చు వాటి లో జ్ఞాపకమూ, ఆలోచన, చేతనా, అంతరత్మా లేక నేను అనేవి ఉండవు. కాబట్టీ పిల్ల జంతువు పెద్దది అయినపుడు దానిలో దాని తల్లి జంతువు కి వేరొక, “వయసు లో ఉన్న జంతువే” కనపడుతుంది కానీ, తన మాతృత్వపు భావోద్వేగపరమైన బిడ్డ కనిపించదు..
కానీ మనిషి లో బిడ్డను పెంచిన చిన్నప్పటి తీవ్రమైన మాతృత్వపు భావోద్వేగాలు జ్ఞాపకం లో భాగమౌతాయి. తద్వారా మనిషి యొక్క “నేను” లోనూ, మనిషి వ్యక్తిత్వం లోనూ భాగమౌతాయి. మనిషి ఈ భావోద్వేగాలనుండీ బయటపడి తన బిడ్డను, వేరొక వయసొచ్చిన మనిషి గా చూడలేదు. దీని వలన మనిషి తన వారసులనూ, బిడ్డలనూ పెద్దయిన తరువాత కూడా బిడ్డలు గా పెంచటం నేర్చుకొన్నాడు.
గుంపులు గా కలిసి ఉన్న మనుషులలో ఈ విధం గా వారసులను పెంచటం మొదలవ్వటమే కాక వారిని తమ ఉనికికీ, తమ జాతికీ extensions గా గుర్తించటం మొదలయింది. ఇదే సమయం లో స్త్రీల రుతు చక్రం దాని seasonality ని కోల్పోయి periodic గా మారింది. దీని వలన స్త్రీలకి జంతువు ల లో కంటే మగవారి తో సంబంధాల విషయం లో degree of freedom పెరిగింది.

బిడ్డల విషయం లో జంతువుల నుంచీ మనిషి వరకూ జరిగిన పరిణామమే, ఒకేతల్లి బిడ్డల విషయం లోనూ జరిగింది. ఈ విధం గా పెద్ద వారికీ బిడ్డలకీ, ఒకే తల్లి బిడ్డలకీ మధ్య దాంపత్య సంబంధాలు నిషిధ్ధమయ్యాయి. “జన్యుపరం గా ఒకే రక్తం లో సంబంధాలు నాసి రకమైన పిల్లలను కలిగించటం వలనకూడా ఈ దాంపత్య సంబంధాలను వివిధ సంస్కృతులు నిషేధించాయి”, అనే వాదన ఒకటి ఉంది.  కానీ సంస్కృతులు “జన్యు పరం గా నష్ట దాయక మైన మేనరికం”, మొదలైన సంబంధాలను ఆమోదించాయి. కాబట్టీ ప్రాచీన సంస్కృతికి, “ఈ నష్టాలను దృష్టి లోఉంచుకొని, ఆయా సంబంధాలను నిషేధించే విజ్ఞానం ఉంది” అనిపించదు.
మొదట ఒక్కో ఆడదీ అనేక మగవారికి బిడ్డలను కనేది. మగవారు తమ బిడ్డలు ఎవరో కూడా పట్టించుకొనే స్థితి ఉండేది కాదు. అమ్మ యొక్క అన్న కానీ తమ్ముడు కానీ బిడ్డలను సాకేవాడు. ఎందుకంటే ఒక ఆడ దానికి అనేక మగవాళ్ళు బిడ్డలను కనే వారు. అదే మగవాళ్ళు మిగిలిన ఆడవారికి కూడా బిడ్డలను కనే వారు. అందుకే anthropology ప్రకారం “మేన మామ” అనేది నాన్న అనే దానికన్నా పురాతన మైన సంబంధం.
మనుషుల అంతశ్చేతన ఏర్పడి “తన” అన్న భావన కలగటం మొదలుపెట్టిన తరువాత, మనిషి “తన” పిల్లలను కూడా గుర్తించటం మొదలు పెట్టాడు. అయితే ఒక్కోసారి తన పిల్లలను కూడా  గుర్తు పట్టటం కష్టం కావచ్చు. పిల్లల పోలికలన్నీ తల్లివే అయి ఉండవచ్చు. దీని వలన వేరే మగ వాడి పిల్లలను కూడా తన పిల్లలే అనే భ్రమ లో ఉండవచ్చు. పైగా తన పిల్లలను మిగిలిన పిల్లలతో కలిపి ఆదది పెంచటం వలన వారి మనుగడ కి నష్టం ఉండవచ్చు. వీటన్నిటి దృష్ట్యా మగవాడు ఆడ దానితో కలిసి కుటుంబం అనే ఒక వ్యవస్థ ని ప్రారంభించాడు.

ఆడ వారు ప్రకృతి స్వభావ రీత్యా తమ అండాన్ని ఒక short listed mate తోనే పంచుకోవాలి. కాబట్టీ ఆడవారు ఒకే సమయం లో అనేక సంబంధాలు కలిగి ఉండే వారు కాదు. కానీ మగవాడికి ఉన్న అపరిమితమైన వీర్య కణాల దృష్ట్యా అతను కుటుంబం లోనే ఉంటూ అనేక ఆడ వారి తో సంబంధాలు కలిగి ఉండేవాడు.
సమాజం లోని అధికార సంబంధాలకు (power equations) అతీతం గా ఇది జరిగేది. కాలమాన పరిస్థితులని బట్టి మానవ సమాజాల్లో ‘మాతృస్వామ్యం’ లేదా ‘పితృ స్వామ్యం’ ఉంటూ ఉండేది. సాధారణం గా యుధ్ధాలు లేని స్థిరమైన సమాజాలలో మగవాడి అవసరం అంతగా ఉండేది కాదు. అలాంటి సమాజాలలో,  పిల్లలను కనటానికి ఉండే ప్రాముఖ్యత దృష్ట్యా మాతృస్వామ్యం అమలు లో ఉండేది. యుధ్ధాలు ఉండే అస్థిర సమాజం లో మగ వారి దేహ దార్ఢ్యానికి ఉండే ప్రాముఖ్యత దృష్ట్యా, ఆడు వారికి ఉండే రుతు చక్రం, గర్భదారణలనే పరిమితుల దృష్ట్యా పితృస్వామ్యం అమలులో ఉండేది.
వ్యవస్థ మాతృస్వామ్యమైనా, పితృస్వామ్యమైనా మగవారు ఒకే సమయం లో అనేక ఆడ వాళ్ళ తో సంబంధాలు కలిగిఉండే వారు.ఆడవారు ఒకే సమయం లో ఒకే సంబంధం కలిగి ఉండే వారు. ఇది ఆడ మగా ప్రకృతులలోని వైరుధ్యం వలన జరిగేది. ఒకప్పటి కేరళ వంటి మాతృస్వామ్య సమాజం లో కూడా మగ వారు బహు భార్యత్వం కలిగి ఉండేవారు.

పాతకాలం లో ఆడవారిలో మైధున ప్రక్రియ కీ గర్భధారణకీ విడదీయ రాని సంబంధం ఉండేది. ఇక ఆధునిక కాలానికి వస్తే contraceptives వలన మైధునానికీ, గర్భధారణకీ ఉన్న సంబంధం తెగిపోయింది. దీని వలన ఆడ వారు sensual pleasure ని కొత్త కోణం నుంచీ కొత్త attitude తో చూసే అవకాశం మొదలయింది. పాత కాలం నుంచీ ఆడవారి లో సెక్స్ కీ భావోద్వేగ అవసరాలకూ ఉన్న లంకె క్రమం గా తెగిపోతోంది. ఆధునిక ఉద్యోగాలలో ఆడవారు కూడా మగవారికి ధీటుగా మనగలగటం వలన, ఆడ వారికి ఉండే  dependency లాంటి లక్షణాలు తగ్గి, తద్వారా కూడా సెక్స్ కీ భావోద్వేగానికీ ఉన్న లింక్ నెమ్మదిగా బలహీన పడుతోంది. మనం పాశ్చాత్య దేశాలలో ఈ trend ని బాగా చూడ వచ్చు. మన దేశం లో కూడా ఈ trend అనతి కాలం లోనే వస్తుంది.అయితే  మగా ఆడా నైజాలలో ఉన్న జన్యుపరమైన తేడాలు మాత్రం మార లేదు. ఉదాహరణ కి మగవారి సెక్సువాలిటీ ఎక్కువ గా దృశ్య సంబంధమైనది. ఆడ వారి సెక్సువాలిటీ దృశ్యసంబంధమైనది గా ఇంకా మారలేదు. అలా మారాలంటే, ఆడవారి లో యాదృచ్చిక జన్యు మార్పులు జరగాలి.

సెక్స్ డ్రైవ్ లో ఆడ వారికీ మగ వారికీ తేడాలు ఉన్నాయి. ఇందుకు ముఖ్య కారణం టెస్టోస్తిరాన్, ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ లూ, తద్వారా బ్రెయిన్ కెమికల్స్ లో వచ్చే మార్పులూ. ఈ రెండు కారణాలే ఆడ వారిలో ఎక్కువ భావోద్వేగానికి కారణమౌతాయి. 

ఇక మన చట్టాల విషయానికి వస్తే, భారత దేశం లో, సమతూకం ఉన్న, అన్ని  nuances  నీ పరిగణన లోకి తీసుకొని చేసే, చట్టాలు చాలా తక్కువ. దుర్వినియోగ పరచటానికి అవకాశం ఉన్న చట్టాలు ఎక్కువ.  మన బండ చట్టాల వలన స్త్రీలకి రిజర్వేషన్ లతో పాటు, నిరంకుశమైన చట్టాల అండ దొరుకుతోంది. గృహ హింస లాంటి చట్టాల వలన భార్య తో సఖ్యత లేని మగాడు బిక్కు బిక్కు మంటూ బతక వలసిన పరిస్థితి
రాబోయే రోజులలో స్త్రీ లు కేంద్రం గా ఒక ఆధిపత్య వర్గం ఏర్పడబోతోంది. ఇక ఆఫీసులలో sexual harrasment rules గురించి చెప్పనవసరం లేదు.
మన న్యాయ వ్యవస్థ ఆడది వివాహేతర సంబంధం కలిగి ఉంటే, దాని బాధ్యత ను మగవాడి సమర్ధత మీదకి తోస్తుంది. అదే మగ వాడు వివాహేతర సంబంధం కలిగి ఉంటే విడాకులివ్వ వచ్చునంటుంది!
ఒకప్పుడూ ధైర్యమూ, సాహసమూ ఆభరణాలు గా కల మగవాడు, ఇప్పుడు ఇంటికీ, నౌకరీకీ పరిమితమవ్వాల్సి వస్తోంది. అనేక సంబంధాలు కలిగి ఉండటం అనేది మగాడి ప్రకృతి సిధ్ధమైన లక్షణం. కుటుంబ వ్యవస్థ ఆ లక్షణాన్ని అణగదొక్కి మగ వాడిని కుడేలయ్యేటట్లు చేసింది. నేటి కుటుంబ వ్యవస్థ లోని ఏక పత్నీత్వం లాంటి రూల్స్ పూర్తిగా ఆడవారి స్వభావానికి అనుకూలమైనవే! అదేమంటే “ఆడ వారూ వేరే మగ వాళ్ళ తొ తిరిగితే?” అనే ప్రశ్న వస్తుంది. కానీ ఈ ప్రశ్న రావటానికి మూల కారణం ఆడా మగా సమానత్వం అన్న ఊహ. ఆడ వారి నైజమూ మగవారి నైజమూ ఒకటి కావు. కాబట్టీ ప్రవర్తన లో ఇద్దరి మధ్య సమానత్వాన్ని ఆశించకూడదు. ప్లేటొ చెప్పినట్లు,” సహజం గా సమానత్వం లేని చోట దానిని రుద్దటమే అన్నిటికన్న పెద్దదైన అసమానత్వం”. అయితే, దీని అర్ధం “సమాజం ఆడా మగా ఇద్దరికీ సమానమైన గౌరవం ఇవ్వకూడదని కాదు”.సెక్స్ పట్ల మారుతున్న స్త్రీల attitude కి అనుగునం గా వారు కూడా భావోద్వేగ ఝంజాటం లేని అనేక సంబంధాలను (no strings attached relations) కోరుకోవచ్చు. అడ్డు చెప్పటానికి ఎవరికీ అధికారం లేదు.

ప్రకృతి అసమానత ని సపోర్ట్ చేస్తుంది. మన సమాజమూ, సం స్కృతీ సమానత్వం అనే ఆదర్శాన్ని ప్రతిపాదిస్తాయి. ఈ సమానత్వ సిధ్ధాంతానికి మూలం మన లోకం లో ఉన్న అసమానతలో ఉంది. fundamental గా ప్రకృతి సపోర్ట్ చేయని ఏ ఆదర్శమైనా కొంత కాలం తరువాత వీగిపోతుంది. సమాజమూ, సంస్కృతీ ప్రతిపాదించే ఆదర్శాలు ప్రకృతి విరుధ్ధమైనవైతే అవి కూడా కొంత కాలానికి fail అవుతాయి.ప్రకృతి మద్దతు ఉన్న వావి వరుసలూ మొదలైన కుటుంబ విలువలు (ఈ వావి వరుసలు ప్రకృతి పరం గా ఎలా ఏర్పడ్డాయో ఈ వ్యాసం లో ముందు చర్చించాం) కాల పరీక్షకి నిలబడ్డాయి.కుటుంబ వ్యవస్థ లో (సమాజం లో కూడా) కాల పరీక్షకి నిలబడలేని విలువ “సమానత్వం”.
ఏదైనా ఒక electronic system ని తీసుకొంటే master and slave అనే components ఉంటాయి. మాస్టర్ నిర్ణయాలు తీసుకొంటుంది. స్లేవ్ అమలు పరుస్తుంది.  ఒక system లొ అన్ని కాంపొనెంట్సూ మాస్టర్లైతే, ఆ సిస్టం ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు నిర్ణయాలను అమలుపరిచే components ఉండవు. అన్ని components స్లేవ్స్ అయినా సిస్టెం పని చేయదు. అలానే ప్రజాస్వామ్యం లో అందరూ సమానమే అయినప్పటికీ, అందరూ కలిసి నిర్ణయాలు తీసుకొనే ఒక పాలకుడిని ఎన్నుకొంటారు. కాబట్టీ ఇక్కడ కూడా మాస్టర్, స్లేవ్ విధానం ఉంది. అందరూ సమానమనే సామ్యవాదం దానిని ఆచరణ లో చూపించలేక కూలిపోయింది. కుటుంబం లో కూడా మాస్టర్ అండ్ స్లేవ్ లు తప్పని సరి. ఒక్కో కాలం లో , వ్యవస్థ లో ఆడవారు మాస్టర్స్ గా ఉంటే (మాతృస్వామ్యం), వేరే కాలాలలో మగవారు మాస్టర్స్ గా ఉన్నారు. కానీ ఆధునిక కుటుంబ వ్యవస్థ ఆడా మగా సమానమంటుంది.  కానీ దీనివలన నిర్ణయాలు తీసుకోవటం లో స్పర్ధలు వస్తాయి. వ్యవస్థ ముందుకు పోదు. కొన్ని విషయాలలో భర్త మాస్టర్ అనుకొని, ఇంకొన్ని విషయాలలో భార్య మాస్టర్ అనుకొన్నా, ఏ విషయం లో ఎవరు మాస్టరో చెప్పేది ఎవరు? ఒకే విషయం లో భార్యా భర్తా మాస్టర్ కావాలనుకొంటే దానిని పరిష్కరించేది ఎవరు, ముఖ్యం గా పెద్దల మాట వినని ఈ కాలం లో? కాబట్టీ సమానత్వ ఆదర్శం కుటుంబ వ్యవస్థ యొక్క executive efficiency ని దెబ్బ తీస్తోంది. చివరికి ఇది కుటుంబ వ్యవస్థ క్షీణించిపోవటానికి దారి తీస్తుంది.  సమానత్వం కాకుండా మళ్ళీ మాతృస్వామ్యం వస్తే, మగవాళ్ళు ఏడ్చినా, కుటుంబ వ్యవస్థ ఆయుర్ధాయం కొంత పెరగవచ్చు.

ఒక పెళ్ళాం, ఒకరో ఇద్దరో పిల్లలూ. సంసారం లోని ఆనందం తగ్గినతరువాత కూడా మగవారు అందులోనే కునారిల్ల వలసి రావటం వలన కుటుంబాలు నిరాసక్తం గా నిస్సారం గా తయారయ్యాయి. ఈ కుటుంబ వ్యవస్థ మగ వారి సహజ స్వభావాని కి విరుధ్ధమైన అనేక డిమాంద్స్ ని చేస్తోందీనాడు. ఇంటిపనీ, బయటి పనీ అన్నీ మగవాడే చూసుకోవలసిన పరిస్థితి! అన్ని పనులూ చేసినా ఇంట్లో గౌరవం లేని దుస్థితి. “నేనూ ఉద్యోగాలు చేసి సాధించగలను”, అనే ఆడవాళ్ళ ego కి మగవాళ్ళు బలికావలసి వస్తోంది. ఆడవాళ్ళ మధ్య ఉద్యోగాల విషయం లో ఉండే peer pressure కి మగ వాళ్ళు మూల్యం చెల్లించాలి! పిల్లలను తాత, బామ్మల దగ్గర వదిలేయటం, creche ల లో పారేయటం వంటి మాతృత్వ స్వభావ విరుధ్ధమైన అనేక పనులను ఈ రోజు ఆడవారు చేస్తున్నారు! పైగా కుటుంబ జీవితానికీ, ఉద్యోగానికీ తెగ న్యాయం చేస్తూ రెండింటినీ తెగ balance చేస్తున్నామంటూ ఫోజులు!
కానీ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా మగవాడే సర్దుకుపోవలసి వస్తోంది.
పాశ్చాత్య దేశాలలో లా అనేక విడాకులూ అనేక పెళ్ళిల్లూ (ఏక కాలం లో కాదు) చేసుకొనటం వలన సమస్య పెద్దవాళ్ళ స్థాయి లో తగ్గవచ్చేమో కానీ, పిల్లలు అన్యాయమైపోతారు. ఒకే కుటుంబం లో ఉంటూనే భార్యా భర్తా ఎవరి సంబంధాలు వారు వెతుక్కోవటం ఉంది. కానీ దీనిలోనూ అనేక భావోద్వేగ పరమైన సమస్యలూ, అసూయా ద్వేషాలూ ఉన్నాయని పడమటి దేశాల అనుభవాలు తెలుపుతున్నాయి. కుటుంబమే లేక పోతే పిల్లల మనుగడా, తద్వారా మానవ జాతి మనుగడా ప్రశ్నార్ధకం.అలా అని,( మనిషికి పెరిగిన నాగరికతా, ఆలోచనల దృష్ట్యా,) కుటుంబాలు లేని ఆది మానవుల స్థితికి వెనక్కి వెళ్ళటమూ అసంభవమే!
పెళ్ళి చేసుకోని వ్యక్తుల జీవితాలలోని ఒంటరి తనం తెలిసిందే!

ఏదేమైనా రాబోయే తరాలలో ని మగ వారికి నేనిచ్చే సలహా పెళ్ళి చేసుకోవద్దనే. దానికంటే చాలా స్వేచ్చకలిగి ఉండి, అడపా దడపా ఉండే ఒంటరి తనాన్ని మేనేజ్ చేయటం చాల ఈజీ! వారసులు లేరనే బెంగ మాటంటారా? కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగి పోతోంది! పెట్టుబడి దారీ వ్యవస్థ మరణ శయ్య మీద ఉన్నా, ఆ వ్యవస్థ కి ప్రత్యామ్నాయం కనుచూపు మేర లో కనపడటం లేదు.అంటే ఈ వ్యవస్థ ఖర్చులను ఇలానే పెంచుతూ పోతుంది. ప్రపంచం లో పర్యావరణం దెబ్బ తింటోంది. అంటే, కొన్నేళ్ళ తరువాత గ్రీన్ టాక్సుల వడ్డన మొదలౌతుంది. మన ఇండియాలాంటి దేశాలలో ఉన్న బండ చట్టాల వలన ఆడ మహారాజులూ, ఆడ ఆధిపత్య వర్గాలూ ఏర్పడతాయి.  రా బోయే తరాల మధ్యతరగతి వారు పిల్లలని కని, తద్వారా వారిని సరిగా పోషించలేని దిగువ తరగతులలోకి దిగజారే అవకాశాలు స్పష్టం గా కనపడుతున్నాయి.  అలాంటి దుస్థితి కి పిల్లలని గురి చేసే కంటే,  పెళ్ళి చేసుకొనక పోవటమే మంచిది.ఇలాంటి పరిస్థితి పడమటి దేశాలలోఆల్రెడీ ఉంది. నాకు తెలిసిన ఒక తెల్లామె ఆమె బాయ్ ఫ్రెండ్ కి ఉన్న కమిట్మెంట్ ఫోబియా గురించి తెగ వాపోతుంది! కమిట్ కాక పోతే మగాడు అనేక అందాలను ఆస్వాదించే తన సహజ గుణాన్ని వదులుకోవలసిన అవసరం ఉండదు.ఇక ముసలి వాళ్ళమైనాక ఎలా అంటారా? come on! మన తరమే పెద్ద వాళ్ళను నానా ఇబ్బందులూ పెడుతోంది. ఇక మన పిల్లల తరం మనని చూస్తుందా?(అందుట్లోనూ మనతో creche ల లో పెట్టించుకొని మన నిరాదరణ కు గురైన తరం). సోలో గా ఉంటే కాసిన్ని డబ్బులు మిగుల్చుకొని, వయసైనాక ఆ డబ్బులతో హాయిగా ఏ వృధ్ధాశ్రమం లోనో చేర వచ్చు. అందుకే,”సోలో బతుకే సో బెటరూ!”

మానవ జాతి పయనం ఎటు వైపుకి?

ఒక పది సంవత్సరాల కిందటి కంటే ఇప్పుడు అవినీతి పెరిగిపోయింది. సమాజం లో స్వార్ధం ఎక్కువయ్యింది. కళలలో వ్యాపారీకరణ ప్రబలి పోయింది. విద్యా వైద్యం మొదలుకొని అనేక రంగాలలో డబ్బే పరమావధి గా మారిపోయి, సమాజం గుల్లబారిపోతోంది. మనిషి లో మానవత్వ విలువలు తగ్గి, బోలు గా మారాడు.స్వార్థం పెరిగిపొతోంది.
ఈ మార్పులన్నీ రాబోయే రోజులలో, ఇదే దిశ లో మరింత వేగవంతమౌతాయి. ఇవి మెరుగయ్యే పరిస్థితి కనపడటం లేదు. మనిషి పర్యావరణాన్ని దెబ్బతీసి, తన తోటి జీవులకు ఒక పెను ముప్పు గా మారాడు. ఇవన్నీ ఆలోచించినప్పుడు, “అసలు మానవ జాతి మనుగడ ఏమిటి?” అన్న ప్రశ్న మనసు లో తలెత్తటం సహజం.
ప్రస్తుత పరిజ్ఞానం ప్రకారం, “బిగ్ బ్యాంగ్” విస్ఫోటనం తో మొదలైన విశ్వం లో మనిషి ఒక అణు మాత్రుడు. విశ్వం లో జరిగే పరిణామాల వలనో, ఏదో ఒక ఖగోళ ప్రమాదం వలననో (ఏ తోక చుక్కో భూమిని ఢీ కొట్టటం) కూడా మానవ జాతి అంతరించి పోవచ్చు. అలాంటి సందర్భం లో మనిషి చేతి లో ఉన్నది చాలా తక్కువ. ప్రస్తుతం, “శాస్త్రజ్ఞులు అంతరిక్షం లో జరిగే ప్రమాదాలను ఎన్ని సంవత్సరాల ముందు పసిగట్ట గలరు?” అనే ప్రశ్న కు సరైన సమాధానం లేదు.
ఇక మానవ సమాజం విషయానికి వస్తే..
జీవ పరిణామ క్రమం లో ఆలోచనా శక్తి గల మానవుడు పుట్టాడు. జీవులలో కాకతాళీయం గా కలిగే జన్యు మార్పులు, పరిసరాలలో కలిగే మార్పులను తట్టుకోగలిగేందుకు ఉపకరించినప్పుడు, ఆ జాతి వృధ్ధి చెందుతుంది. మనిషి తో పాటు చింపాంజీ లాంటి జంతువులకి కూడా ఆలోచనా శక్తి ఉన్నట్లు కనుగొన్నారు. అయితే మనిషిలో చేతన (కాన్షస్-నెస్) ఏర్పడి, తన ఆలోచనలను తానే చూసుకోగల ఒక అంతరాత్మ ఏర్పడటం అనేది జరిగింది. ఇతర జంతువులలో ఇది జరగలేదు. ఇలాంటి చేతన వలన మనిషి లో “నేను” అనే ఒక మానసిక కేంద్రం ఏర్పడింది.
ఈ “నేను” మనిషి యొక్క వ్యక్తి గత మనుగడ కి చాలా మేలు చేసిందనే చెప్పాలి. మనిషి తన ఆలోచనా శక్తి తోనూ, తన చేతన తోనూ, భవిష్యత్తు గురించి ఆలోచించి, దానికి తగ్గట్లు ఆహారాన్ని ముందే సమకూర్చుకోవటం, ముందు రోజులలో తన జీవిత భద్రత గురించి ఆలోచించటం చేస్తున్నాడు. అదే సమయం లో నేను అనేది స్వార్ధం గా కూడా పరిణమించింది.

ఈ చేతన వలన మానవ సమాజమే అనేక పరిణామాలను చవి చూసింది. రాజకీయం గా …
రాజరికాలు,భూస్వామ్య వ్యవస్థా పోయి  ప్రజాస్వామ్యం వచ్చింది. సామాజికం గా..కుటుంబ వ్యవస్థా, వావి వరసలూ ఏర్పడ్డాయి. ఆర్ధికం గా… బానిస వ్యవస్థా, భూస్వామ్య వ్యవస్థా పోయి, పెట్టుబడిదారీ వ్యవస్థ బలం గా వేళ్ళూనుకొంది. చాలా మంది పెట్టుబడిదారి వ్యవస్థ లోని పోటీ తత్వాన్ని(కాంపిటిషన్ ని), జీవ పరిణామ సిధ్ధాంతం లోని “మనుగడ కోసం పోరాటం” తో పోలుస్తారు. అయితే,పెట్టుబదీ దారి వ్యవస్థ లో ఉండే కాంపిటిషన్ కీ, జీవ జాతుల పరిణామం లోని “మనుగడ కోసం పోరాటం” కీ సంబంధం లేదు.
జీవ పరిణామం లో జీవులలో జన్యు మార్పులు యాదృచ్చికం గా జరుగుతాయి. ఈ మార్పులు ఎవరో కావాలని రూపకల్పన చేసినవి కావు. అవి పరిసరాల లోని మార్పులను తట్టుకొనేవైతే ఆ జీవులు మనుగడ సాగిస్తాయి. పెట్టుబడి దారి వ్యవస్థలో, వ్యక్తులూ సంస్థలూ గెలవటానికి తగిన మెలకువలను నేర్చుకొంటారు. విజయాలకు పధకాలను వేసి, ప్రణాళికా రూపకల్పన చేస్తారు.
పెట్టుబడి దారి వ్యవస్థా, సామ్యవాద వ్యవస్థా కూడా మనుగడ కోసం మానవ జీవ సమాజం చెందిన పరిణామం లోని భాగాలే.
ఈ విషయం లో శకుని కథ గుర్తుకొస్తుంది. శకునిని అతని అన్నలనూ కౌరవులు ఒక చెరసాలలో బంధించి, వారికి రోజూ ఒక్క మనిషికి సరిపోయే ఆహారం మాత్రం ఇస్తారు. కౌరవుల మీద ఎలా ఐనా ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్న శకుని సోదరులు, తమ భాగం ఆహారాన్ని కూడా శకుని కి ఇచ్చి, తమ పగ తీర్చమని చెప్తారు. ఇక్కడ మనుగడ కోసం ఒక్కరికే ఆహారం దక్కేటట్లు చూడటం, పెట్టుబడిదారీ పధ్ధతి కి దగ్గర గా ఉన్నట్లు అనిపిస్తుంది. పరిస్థితులని బట్టి, సామ్య వాద పధ్ధతి నో, పెట్టుబడి దారీ పధ్ధతి నో మానవ జాతి తన మనుగడ కోసం అవలంబించాల్సి రావచ్చు. నలుగురికి సరిపడే ఆహారం ఉన్న చోట్ల, ఒక్క బలవంతుడే మిగిలిన వారి దగ్గర ఆహారాన్ని లాక్కొని తిన్నట్లైతే, మిగిలిన వారు చనిపోతారు. కొన్నాళ్ళకి ఆ బలవంతుడు ఒక్కడే మిగులుతాడు. కానీ తన సమాజం అంతరించిపోయినప్పుడు, ఆ బలవంతుని వ్యక్తి గత మనుగడ కూడా ప్రమాదం లో పడుతుంది (గాలివాన కి కొట్టుకు పోయిన తన ఇల్లు మళ్ళీ కట్టుకోవటానికి అతనికి ఇతరుల సహాయం కావాలి కదా?) సామ్యవాదం, పెట్టుబడి దారీ వ్యవస్థలు “వ్యక్తి గత మనుగడనూ మరియూ సమూహం యొక్క మనుగడనూ వివిధ పాళ్ళలో పరిస్థితులను బట్టి మేళవించటం” వలన ఏర్పడతాయి. ఈ రెండు వ్యవస్థల అంతిమ లక్ష్యం మాత్రం “మానవ జీవ జాతి మనుగడ”.

ఏదైనా జీవ జాతి ఎక్కువ కాలం మనుగడ సాగించటానికి, ఆ జాతి లో వైవిధ్యం ఉండటం చాలా ముఖ్యం. ఉదాహరణ కు, అడవులలో పెరిగే లేళ్ళలో మూడు జాతులు ఉన్నాయనుకొందాం. మొదటి ‘లేడి జాతి’  లోని లేళ్ళు అన్నీ కరువు పరిస్థితులను తట్టుకోలేదు అనుకొందాం. కరువు వస్తే ఆ జాతి మొత్తం తుడిచి పెట్టుకొని పోతుంది. ‘రెండో లేడి జాతి’ లోని లేళ్ళు అన్నీచలిని తట్టుకొనలేవనుకొంటే, బాగా చలి పెరిగిన సంవత్సరం లో ఆ జాతి మొత్తం చనిపోతుంది. అలా కాకుండా, మూడవ లేడి జాతి లో సగం చలిని తట్టుకొన లేని లేళ్ళూ, సగం కరువును తట్టుకొనలేని లేళ్ళూ ఉన్నాయనుకొంటే, కరువు వచ్చినప్పుడు, చలి లేళ్ళు బతుకుతాయి. మంచు పడినప్పుడు కరువు లేళ్ళు బతుకుతాయి. మొత్తానికి మూడవ జాతి మిగిలిన రెండు జాతుల కంటే ఎక్కువ కాలం మనగలుగుతుంది.
మానవజాతి లో కూడా ఈ వైవిధ్యం ముఖ్యం. ఒక సమాజం లో అందరూ త్యాగమూర్తులే ఉంటే, ఆ సమాజం లో వ్యక్తి గత స్థాయి లో అందరూ నష్ట పోతారు..చివరికి చనిపోతారు. అప్పుడు మొత్తం సమాజమే నాశనమైపోతుంది. శకునికి ఇచ్చిన ఆహారాన్ని శకుని కూడా త్యాగం చేసి, అతని అన్న దమ్ములలో ఎవరూ ఆ ఆహారాన్ని ముట్టకుండా ఉంటే, శకుని వంశం మొత్తం నాశనమయ్యేది. అన్ని జీవజాతులలోనూ ఈ రకం త్యాగ మూర్తులు ఉంటాయి. ఉదాహరణ కి దుప్పులలో కొన్ని దుప్పులు, పులి వెంటపడి నప్పుడు, గుంపులోని మిగిలిన దుప్పుల కంటే కావాలని వెనకపడి, పులి నోట పడి, త్యాగం చేస్తాయి.
అలానే ఒక సమాజం లో అందరూ తమ వ్యక్తి గత స్వార్ధం చూసుకొనే వారైతే, ఆ సమాజం నాశనమైపోతుంది. తరువాత సమాజం లేని వ్యక్తి కూడా అంతరిస్తాడు.
కాబట్టీ, మానవ జీవ జాతి మనుగడకి, స్వార్థ పరులతో పాటు, త్యాగ జీవులు కూడా సమపాళ్ళలో కావాలి. కానీ, మనిషి లో ఏర్పడిన చేతన లేక నేను అనే కేంద్రం వలన, వ్యక్తి గత మనుగడ చూసుకొనే వారు ఎక్కువైతే, మానవజాతి అంతరించిపోతుంది. అంటే మనిషి లో ఈ అంతశ్చేతనను ఏర్పరిచిన జన్యు మార్పు, తాతకాలికం గా అతని వ్యక్తి గత మనుగడ కు ఉపయోగ పడినా, దీర్ఘ కాలం లో అతని సామూహిక మనుగడకి చేటు తెచ్చినట్లు భావించాలి. మనిషి అత్యాశ వలన మానవ జాతి మనుగడకే కాక, ఇతర జీవ జాతుల మనుగడకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. సమాజం లేని వ్యక్తి లేనట్లే, ఇతర జీవ జాతులు లేని మానవ జాతి కూడా ఇంకా వేగం గా అంతరించి పోతుంది.
మానవ జాతి కష్టాలన్నీ మనిషి చేసే కృత్రిమమైన పనుల వలననే అనే ఒక వాదం ఉంది. కానీ మనిషి ప్రకృతి లో ఒక భాగం. మానవ జాతి పుట్టమూ, అంతరించటమూ కూడా ఈ విశ్వ పరిణామం లో ఒక భాగమే.విశ్వ పరిణామం లో భాగమైనదంతా సహజమైనదే! కాబట్టీ మానవ జాతి అంతం కూడా సహజమైనదే (రాక్షస బల్లుల అంతం సహజమైనది కాదా?) మనిషి ఆలోచనలన్నీ సహజమైనవే. వాటిలో కొన్నిటి వలన వినాశనం కలగవచ్చు. జీవ పరిణామ క్రమంలో, పక్షులు ఏర్పడక ముందు, జీవులు ఎగిరేవి కావు. పక్షులు ఏర్పడిన తరువాత, అప్పట్లో జీవులు ఎగరటం అసహజం గా అనిపించి ఉండవచ్చు. కానీ, ఈరోజు, ఎగిరే పక్షులు సహజమైనవే. అలానే,ఇప్పటి వరకూ మరే జీవీ చేయనట్లు, తన స్వార్థం కోసం నిత్యం ఆలోచించే మానవుడూ సహజమైనవాడే! అతను ఎంత కాలం మనుగడ సాగిస్తాడనేది వేరే ప్రశ్న.

మనిషి వ్యక్తిగత మనుగడ, సమాజం యొక్క దీర్ఘ కాలిక మనుగడ ను బలపరిచే దిశ లో ఉండాలి. అలానే, సమాజం మనుగడ, మనిషి వ్యక్తిగత మనుగడను వృధ్ధి చేసేది గా ఉండాలి. ఈ రెండు రకాల మనుగడలు పరస్పర విరుధ్ధమైన దిశలలో ఉన్న నాడు మానవ జీవ సమాజం అంతరిచే దిశలో పయనిస్తుందనుకోవాలి.   మొత్తం మీద, సమాజ మనుగడా, వ్యక్తి గత మనుగడా కూడా మానవ జీవ జాతి మనుగడ కి దోహదం చేసే విధం గా తగు పాళ్ళలో లేని నాడు (ఈ లోపు మనిషిలో ఏవైన సకారాత్మకమైన జన్యు మార్పులు జరిగితే తప్ప) మానవజాతి అంతరిస్తుంది.మనిషి సాంకేతికం గా ఎంత అభివృధ్ధి చెందినా, చివరికి తన జాతి శ్రేయస్సును దృష్టి లో పెట్టుకొనక పోతే అంతరించిపోవటానికి సిధ్ధం గా ఉండాలి. రాకెట్లూ, రోబొట్లూ మొదలైన మనిషి చేసుకొన్న ఆట బొమ్మలేవీ చివరికి అతనిని రక్షించలేవు. ఈ సందర్భం లో “ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు” అనే మహాకవి పలుకులను  గుర్తు చేసుకోవటం మంచిది.

మగ వారి ఫిర్యాదులు..కొన్ని సరదాగా..కొన్ని నిజంగా..

ఈ ఫిర్యాదులు అందరి మగవారివీ కావండీ. నాలాంటి మధ్య తరగతి,లేక ఎగువ మధ్య తరగతి కుటుంబ రావులవీ, అందులోనూ పట్టణాలలో ఉండే వారివీ..

1.కుటుంబ రావు ఈ మధ్యే ఉద్యోగం మారాడు. హాఫ్ హ్యండ్స్ షర్ట్ వేసుకొని,మొదటి రోజు కొత్త గా మారిన ఆఫీసులోకి ఎంటరవబోయాడు. సెక్యూరిటీ వాడు కు.రా ని ఆపి “డ్రెస్ కోడ్ వయొలేషన్”, అని ఒక పుస్తకం లో కు.రా, చేత సంతకం చేయించాడు. కు. రా జీతం లోంచీ అప్పుడే కొంత కోత పడిపోయింది. పక్కనుంచే స్లీవ్-లెస్ లు వేసుకొన్న అమ్మాయిలు తమ లో తాము జోకులేసుకొంటూ నిరాటంకం గా ఆఫీసు లోకి వెళ్తున్నారు.

2.కుటుంబ రావు ని ఆఫీసులో బాసు పిలిచాడు. కుటుంబ రావు తో పాటు అతని సహోద్యోగిని అయిన వనిత ను కూడా పిలిచాడు.బాసు కి ఇద్దరి తోనూ పెద్ద చనువు లేదు. కుటుంబ రావు తో,” ఆ ప్రాజెక్ట్ పని ఎంతవరకూ వచ్చిందోయ్ కుటుంబ రావ్?”, అన్నాడు. అదే వనిత తో మాత్రం, “ఆ చెప్పండి “మేడం”, స్టేటస్ ఏమిటి?”, అన్నాడు. …మగ పురుషులారా, ఈ వివక్షని ఖండించండి. ఆడ స్త్రీలు కూడా ఖండిస్తే సంతోషిస్తాం.

3.కుటుంబ రావ్ సాయంత్రం ఇంటికి వచ్చి తెలుగు పేపర్ తిరగవేయటం మొదలుపెట్టాడు.”రేప్ చేసిన మగ పశువు”, హెడింగ్.
యాసిడ్ పోసిన, “మృగాడు”.  రాసిన రిపోర్టర్ మగాడే… పేరు..రామా రావు.
పేజీ తిప్పాడు కుటుంబ రావు. ఒకామె తన ప్రియుడి తో కలిసి తన భర్త ని హత మార్చింది. ఆమె పేరుని శోభా దేవి గానే రాశాడు సదరు రిపోర్టర్. “ఆడ *%$” అని రాయలేదు.

4.కు.రా కొడుకు యశ్వంత్ గదిలోంచీ బయట కి రావటం లేదు. కు.రా తెలుసుకొంటే తేలిందేమంటే,”వారం రోజుల కిందటి ఎంసెట్ సీట్ రాని షాక్ నుంచీ వాడింకా తేరుకోలేదు.” కు.రావు గది లోకి వెళ్ళి కొడుకు తో అన్నాడు, “ఎంసెట్ రాక పోతే ఎడ్-సెట్ రాద్దువు గాని లే!”.
దానికి వాడు,” కిందటి సంవత్సరం అక్క కి నాకంటే నాలుగు వేలు పైన నాసి రాంకు వచ్చింది.మరి అక్కకెందుకు సీట్ వచ్చింది?”.
కు.రా తన కి తెలిసి చదివించటం లో కూతురి పట్ల ఎన్నడూ వివక్ష చూపించలేదు.పై గా కురా కి సహజం గా తండ్రి కి కూతురి పట్ల ఉండే ప్రేమ ఎక్కువ.

5.కు.రావు స్నేహితుడి కూతురు కి అమెరికా సంబంధం కుదిరి, పెళ్ళయాక డిపెండెంట్ వీసా మీద టెక్సాస్ వెళ్ళిపోయింది. భర్త ఆఫీసు కి వెళ్తే, తను ఇండియా లో తల్లితండ్రుల తో ఫోన్ లో కబుర్లు చెబుతూ, ఇంటర్నెట్లో ఫ్రెండ్స్ తో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసేది.భర్త కి ఏదో ఓ మాదిరి కంపెనీ లో కాంట్రక్టర్ గా ఉద్యోగం. అక్కడికి వెళ్ళిన నెలరోజుల నుంచీ జంట మధ్య తేడాలు మొదలయ్యాయి. కు.రావు ఫ్రెండు వాళ్ళింటికెళ్ళినపుడు, ఫ్రెండూ భార్యా జరిగిన కథ చెప్పటం మొదలుపట్టారు.”ఆ అబ్బాయి ఒట్టి పీనాసి వాడండీ. రెస్టారెంట్ కి తీసుకెళ్ళడంట. ఇంట్లోనే వండమంటాడంట!”
“అమెరికా లో ప్రతి రోజూ రెస్టారెంటంటే చాలా ఖర్చవుతుంది అనుకొంటా..ఇంట్లో వండక తప్పదేమో!”, అన్నాడు సందేహం గా కు రావు.
“అమ్మాయికి వంట రాదు. కాలేజీ రోజుల్లో హాస్టల్లోనే ఉండేది. ఇంకా మా చిన్నూ గాడైనా చదువుకొనే తపుడు రూముల్లో ఉండి చెయ్యి కాల్చుకొన్నాడు, కానీ అమ్మాయికి అసలు అలవాటు లేదు. మా ఆవిడ కూడా దాని చేత ఎప్పుడూ వంట చేయించలేదు”, అన్నాడు కు.రా. మిత్రుడు.
కురా కి ఏమి సలహా ఇవాలో అర్ధం కాక ఉండిపోయాడు.

6.కురావు పక్కింటాయన బాల్కనీ లో కూర్చొని పేపర్ ముందేసుకొని ఆవేశం తో ఊగి పోతున్నాడు, ” ఈ జంతువులని ఉరి తీసేయాలి. వీళ్ళకి కోర్ట్లూ, విచారణా అనవసరం!”.
“మీరు ఢిల్లీ రేపిస్టుల గురించి ఆవేశపడుతున్నారనుకొంటా!?”, అన్నాడు, కు రా.
“అలాంటి వెధవలు లక్షల్లో ఒకరు ఉంటారు. ఇలాంటి దుస్సంఘటనలు జరిగినపుడల్లా మగవాళ్ళ కి వ్యతిరేకం గా వ్యవస్థీకృతమైన చట్టాల పదును పెంచుతూ పోతే, నా లాంటి అమాయకుల కి ముందు ముందు ఏమౌతుందో. ఓ రకం గా,టెర్రరిస్ట్ దాడులు జరిగినపుడల్లా పాకిస్తాన్ అనే కర్ర తో ఇండియన్ ముస్లిం ల ని కొడుతున్నారు. అలానే హై ప్రొఫైల్ అత్యాచారాలు జరిగినపుడల్లా, వాటిని సాకు గా చూపించి ఇండియన్ మేల్ ని చట్టాలనే కర్ర తో కొడుతున్నారు.”, అనుకొన్నాడు కు.రావు.

7.కురావు కుర్రాడిగా ఉన్నపుడు గృహ హింస గురించీ, వరకంట్న చావు ల గురించీ పత్రిక ల కి వ్యాసాలు ఆవేశం గా రాసేవాడు. కానీ ఈ మధ్య కురావు అనుభవం లోనే ఆ రెండు చట్టాలూ దుర్వినియోగం మూడు సార్లు తటస్థించింది.ఒక కేసు లో బంధువు ల అబ్బాయి జెయిలుకి పోవలసి వస్తే, ఇంకో కేసు లో సహోద్యోగి ని అరెస్ట్ చేయటానికి పోలీసులు ఆఫీస్ కే నేరు గా వచ్చారు. ఇంకో కేసు స్నేహితుడి బంధువుది. మూడు కేసులూ తప్పుడు కేసులేనని కు.రావు కి ఖచ్చితం గా తెలుసు. మూడు కేసులలోనూ డబ్బు గుంజటం అనేది ప్రధాన ఉద్దేశం. కురావు పేపరు చదవటం తగ్గించి, మారిన సమాజాన్ని అనుమానం గా చూడటం మొదలు పెట్టాదు.

8.కురావూ అతని భార్యా ఇద్దరూ ఉద్యోగస్తులే. కు.రావు భార్య, ఫెమినాలూ గట్రా చదివి ఈకెండు బయటే ఒటేళ్ళలో తిందామని మొరాయించింది. ఈక్-డేస్ ఎలానూ కర్రీ పాయింట్ల కర్రీల తో కడుపు చెడి పో ఉన్న కు.రా.,
తను కూడా మొరాయించాడు, “ఈకెండ్లలో డ్రైవింగ్ చేయననీ, వెచ్చాలు పట్రాననీ, బిల్లులు కట్టననీ”.
కొన్నాళ్ళ కి కురా భార్య కి వేరే ఊరు ట్రాన్స్-ఫర్ అయింది, కురా స్నేహితులు “పలానా మంత్రి గారిని కలవక పోయావా? ట్రాన్స్-ఫర్ ఆపుతారు.”, అని ఉచిత సలహాలు పారేయటం మొదలు పెట్టారు.
కురా,” ఎవరి ట్రాన్స్-ఫర్ వారే ఆపుకోవాలి”, అన్నాడు.
స్నేహితులు, “అదేమిటి? మగ వాళ్ళ పని ఆడ వాళ్ళు ఎలా చేస్తారు?”, అన్నారు.
“పనులలో ఆడ పనులనీ, మగ పనులనీ ఉండవు”, అన్నాడు కురా.

9. సిటీ లో పోష్ ఏరియాలో ఫ్రెండ్ తో కలిసి రోడ్డు పై నడుస్తూంటే, “పక్కనే ఓ యాభై యేళ్ళావిడ బట్టలు తక్కువ గానూ, లిప్-స్టిక్ ఎక్కువ గానూ నడుస్తోంది. కురా గుడ్లు మిటకరించి ఆమె వైపుకి చూశాడు. కురా ఫ్రెండ్, “అలా చూస్తావేమిటి? సంస్కారం లేకుండా!”, అన్నాడు.”
“సంస్కారం లేకుండా బట్టలు వేసుకొంటే లేదు గానీ, చూస్తే తప్పా!”, అన్నాడు కురా.

10.పిల్లలు బయటికి వెళ్ళిన సమయం చూసి, ఇంట్లో ఫ్యాషన్ టీవీ పెట్టాడు కురా. పక్క గది లో,చీరలూనగలూ,అప్పటికే ఎన్నో సార్లు మురిపెం గా ధరించి చూసుకొన్న తన నగలని బీరువా లో పెట్టి, హాల్ లోకి వచ్చింది కురా భార్య.
కురా ఫ్యాషన్ టీవీ చూడటం గమనించి, “చీ, చాలా వల్గర్ గా ఉంది, చానల్ మార్చు”, అంది కురా భార్య.
“ఇప్పటి దాకా నీకు ఇష్టమైన పని నీవు చేశావు, నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నాను, తప్పేమిటి?”, అన్నాదు కురా.
“ఇంట్లో ఇలాంటివి చేస్తారా ఎక్కడైనా?” అందామె.
“ఎవరికి నచ్చింది వారు  చేయకూడదంటే, ఇంటి విలువలలోనే పక్షపాతముందన్న మాట!”, అన్నాడు కురా.

11.  కురా కంటే అతని భార్యకే జీతం ఎక్కువ వస్తుంది. వారికి ఏ ఇతర ఆస్తులూ పెద్ద గా లేవు.ఓ సుముహూర్తాన కురా ఉద్యోగం ఊడింది. అప్పటి నుంచీ భార్యాభర్త ల మధ్య కీచులాటలు ఎక్కువయాయి. అప్పటిదాకా కురా ఫ్యామిలీ కోసం పెట్టిన ఖర్చును తను పెట్టటానికి కురా భార్య నిరాకరించింది. చిలికి చిలికి గాలి వాన అయినట్లు, ఇరువురూ విడాకుల వైపుకి ఆలోచించటం మొదలుపట్టారు. ఈలోపు కురా మళ్ళీ ఓ చిన్న ఉద్యోగం లో మునుపటి కంటే బాగా తక్కువ జీతానికి కుదురుకొన్నాడు.విడాకుల గురించి కురా ఓ లాయర్ ని సంప్రదిస్తే, “భార్య కి భరణం ఎంత ఇవ్వాలో చెప్పాడు”, లాయర్. “ఓరి నాయనా, మూలిగే నక్క మీద తాటి పండు పడింది!”

12. కురా కొడుకు కి ఓ గర్ల్-ఫ్రెండ్ ఉంది. ఆమె వాడిని చేతుల తో సున్నితం గా కొడుతూ మురిపెం గా, “స్టుపిడ్”, అని పిలుస్తుంది. ఓ రోజు వాళ్ళిద్దరూ పోట్లాడుకొన్నారు. అదేసమయం లో వాడి మగ ఫ్రెండ్స్ కొందరు వచ్చారు. వారి లో ఒకడు, “ఏంట్రా మూడ్ బాగున్నట్లు లేదు, నిన్ను మళ్ళీ మూడ్లోకి తెస్తా చూడు!”, అని ఓ “Off the color jOke”, చెప్పాడు. కొంచెం దూరం లో ఉండి ఆ జోక్ విన్న ఉన్న వాడి గర్ల్-ఫ్రెండ్ ప్రిన్సిపాల్ కి కంప్లెయింట్ చేసింది, “వాడూ వాడి , మిత్ర బృందం తనను హరాస్ చేస్తున్నారని”. ప్రిన్సిపాల్ ఓ సీరియస్ వార్నింగ్ ఇచ్చి వాళ్ళని వదిలేశాడు.

13.కురా అక్క కొడుకు ఈ మధ్యే పెళ్ళి అయింది.అతనూ, అతని భార్య ఫామిలీ ప్లానింగ్ కొంతకాలం పాటించి తరువాత పిల్లలను కనాలని నిర్ణయించుకొన్నారు. అతని భార్య కి మూడో నెల ఉన్నపుడు అతని తో గొడవ పడింది. తరువాత అతని తో చెప్పకుండా అబార్షన్ చేయించుకొంది.అతని బాధ కి అవధులు లేవు. తాళాలు ఎవరి దగ్గర ఉంటే వారే గదిని మూస్తారు. గర్భధారణ ప్రకృతి ఇచ్చిన ఓ కష్టమైన విషయమైనా, ఆధునిక వైద్యం వలన అది ఓ ఆడవారికే పరిమితమైన హక్కుగా మారింది.

Previous Older Entries

Follow

Get every new post delivered to your Inbox.

Join 97 other followers